Record
-
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది. -
విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్లో కొత్త రికార్డు నమోదైంది. బుధవారం ఉదయం 7.55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు పెరిగింది. ఈనెల 10న ఏర్పడిన 15,998 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డును తాజాగా రాష్ట్రం అధిగమించింది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లను దాటడం ఇదే తొలిసారి. వేసవి ప్రారంభంలోనే విదుŠయ్త్ డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
‘రికార్డు’ స్థాయి నాట్యం
శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): మూడు వేల మంది చిన్నారులు.. నర్తించిన వివిధ నృత్య రూపకాలు నాలుగు రికార్డులను నమోదు చేశాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతాస్ఫూర్తి కేంద్రం ఇందుకు వేదిక గా మారింది. సమతాకుంభ్–2025 తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘంటసాల పవన్కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం చే సిన నాట్యం ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల చిన్నారులు వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య గోల్డెన్ స్టార్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి చిన్నారులకు మంగళశాసనాలు అందజేశారు. -
Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు
ప్రయాగ్రాజ్: యూపీలోని తీర్థరాజం ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో ఇప్పుడు కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసినవారి సంఖ్య 50 కోట్లు దాటింది. గతంలో కుంభమేళా స్నానాలపై ఉన్న అంచనాలను ఈ రికార్డు దాటేసింది.అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అందించిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ (జనాభా 34,20,34,432), ఇండోనేషియా (జనాభా 28,35,87,097), పాకిస్తాన్ (జనాభా 25,70,47,044), నైజీరియా (జనాభా 24,27,94,751), బ్రెజిల్ (జనాభా 22,13,59,387), బంగ్లాదేశ్ (జనాభా 17,01,83,916), రష్యా (జనాభా 14,01,34,279), మెక్సికో (జనాభా 13,17,41,347)లలోని జనాభాను దాటినంతమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు.మహా కుంభమేళకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించిన అంచనాలను మించిన రీతిలో కుంభమేళాలో సరికొత్త రికార్డు నమోదయ్యింది. ప్రారంభంలో 45 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తారనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి 11 నాటికి ఆ అంచనా నిజమని రుజువైంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) నాటికి ఈ సంఖ్య 50 కోట్లను దాటింది. మహా కుంభమేళాలో ఇంకా 12 రోజులు మాత్రమే మిగిలివున్నాయి. మరొక స్నాన ఉత్సవం ఫిబ్రవరి 26న శివరాత్ర సందర్భంగా ఉంది. అప్పటికి పుణ్యస్నానాలు చేసే వారి సంఖ్య 55 నుంచి 60 కోట్లు దాటవచ్చనే కొత్త అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటివరకు స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్యను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు గరిష్టంగా 8 కోట్లు మంది భక్తులు స్నానం చేయగా, మకర సంక్రాంతినాడు 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానం చేశారు. ఫిబ్రవరి ఒకటి, జనవరి 30 తేదీలలో రెండు కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్య పూర్ణిమ నాడు 1.7 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వసంత పంచమి నాడు 2.57 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. మాఘ పూర్ణిమ నాడు కూడా రెండు కోట్లకు పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరించారు.ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' టీజర్.. కొన్ని గంటల్లోనే రికార్డ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీడీ12 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా టీజర్తో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.అయితే ఈ మూవీ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. యూట్యూబ్లో 10 మిలియన్స్ వ్యూస్తో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ విజయ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను ఊపేస్తున్నాయి. ఈ టీజర్కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్కు మరింత హైప్ను క్రియేట్ చేసింది. దీంతో కింగ్డమ్ వ్యూస్ పరంగా మరింత వేగంగా దూసుకెళ్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. #Kingdom Teaser delivers all the emotions with KING SIZED MOMENTS! 💥💥💥10M+ views and standing tall! ❤️🔥❤️🔥▶️ https://t.co/rHwYoKCDgI#VD12 #Saamraajya @TheDeverakonda @anirudhofficial @gowtam19 @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla… pic.twitter.com/HpHNpmxWZi— Sithara Entertainments (@SitharaEnts) February 12, 2025 -
రూ. 2.20 కోట్ల జీతం.. ప్లేస్మెంట్ రికార్డ్
క్యాంపస్ ప్లేస్మెంట్లలో (Campus Placement) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT BHU) తన రికార్డును తానే బద్దలుకొట్టింది. ఈ ఏడాది అత్యధిక వార్షిక వేతనం (Salary Package) రూ. 2.20 కోట్లుగా నమోదైంది. మునుపటి రికార్డు 2021 సంవత్సరంలో రూ. 2.15 కోట్లు ఉండేది. ఇప్పుడు నమోదైన అత్యధిక వేతనంతో గత పదేళ్లలో ఐఐటీ బీహెచ్యూ సాధించిన అత్యుత్తమ పనితీరు ఇదేనని భావిస్తున్నారు.దీంతో పాటు 1128 మంది విద్యార్థులు మంచి ఉద్యోగాలు సాధించారు. మరో 424 మంది ఇంటర్న్షిప్లను పొందారు. ఈసారి సగటు ప్యాకేజీ కూడా పెరిగింది. ఈ సంవత్సరం సగటు వార్షిక ప్యాకేజీ రూ. 22.80 లక్షలకు చేరుకుంది. తమ విద్యార్థుల ప్రతిభ, విద్యా, పరిశోధనా నైపుణ్యం పట్ల సంస్థ నిబద్ధత అగ్రశ్రేణి రిక్రూటర్లను ఆకర్షిస్తూనే ఉన్నాయని ఐఐటీ బీహెచ్యూ డైరెక్టర్ పేర్కొన్నారు.క్యాంపస్లో జరిగిన నియామకాల్లో పరిశ్రమ దిగ్గజ సంస్థలు పాల్గొన్నాయి. ఐటీ కంపెనీలు, కన్సల్టింగ్ ఫైనాన్స్, కోర్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన కంపెనీలు ప్లేస్మెంట్ డ్రైవ్ హాజరై విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టాటా స్టీల్, అమెజాన్, డేటా బ్రిక్స్, ఐటీసీ, శామ్సంగ్, ఒరాకిల్, వాల్మార్ట్, క్వాల్కామ్తో సహా దాదాపు 350 కంపెనీలు 2024 ప్లేస్మెంట్ డ్రైవ్ను కవర్ చేశాయి.రికార్డు ప్యాకేజీలుఐఐటీ బీహెచ్యూలో ఏటా జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు రికార్డుస్థాయిలో అత్యధిక వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2024-25లో అత్యధిక వేతనం రూ.2.20 కోట్లు కాగా, 2023-24లో రూ.1.68 కోట్లు, 2022-23లో రూ.1,20 కోట్లు, 2021-22లో రూ.2.15 కోట్ల ప్యాకేజీలు అత్యధిక వేతనాలుగా రికార్డు సృష్టించాయి. 11 మంది విద్యార్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ప్యాకేజీతో ప్లేస్మెంట్ను పొందారు. -
Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..
ప్రయాగ్రాజ్: యూపీలోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు. ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకూ 91,690 మంది విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు, ముంబైకి ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్? -
స్టీల్ స్మిత్...
లెగ్ స్పిన్నర్గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్లకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్పై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడా విభాగం టెక్నిక్లో విరాట్ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్ని తలపించకపోయినా... క్లాసిక్ షాట్లలో కేన్ విలియమ్సన్తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్ స్మిత్ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. ఆధునిక క్రికెట్లో ‘ఫ్యాబ్–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ సారథి రూట్ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ (10,103) ఈ క్లబ్లో చేరాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్పైనే స్మిత్ ఈ మార్క్ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 55 కంటే ఎక్కువ సగటుతో... మ్యాచ్ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. బ్రియాన్ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్ల పరంగా స్మిత్ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్లు), సచిన్ టెండూల్కర్ (195 ఇన్నింగ్స్లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్లు), రికీ పాంటింగ్ (196 ఇన్నింగ్స్లు) ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్ (58.72), టెండూల్కర్ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్స్పిన్నర్గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా 78వ టెస్టు మ్యాచ్లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేసిన తొలి ప్లేయర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. గోడకు కొట్టిన బంతిలా... అటు ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్, ఇటు భారత్తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్ల్లోనూ స్మిత్ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్న స్మిత్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. ఆసీస్ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్... దక్షిణాఫ్రికా సిరీస్లో ‘బాల్ ట్యాంపరింగ్’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ స్మిత్ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! -
పుష్ప 2 సెలబ్రేషన్స్ కు దూరంగా పుష్ప టీమ్
-
14,505 బంతులతో...
ముంబై: సాధారణంగా క్రికెట్లో భారీ స్కోర్లు, భాగస్వామ్యాలు, పరుగులు, శతకాల మోత, వికెట్ల కూతతో అంతర్జాతీయ రికార్డులు నమోదు కావడం సహజం. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆట (మ్యాచ్)తో సంబంధం లేకుండా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) విన్నూత్నమైన రికార్డులోకి ఎక్కడం... అది కూడా ప్రపంచ రికార్డులకే జేజమ్మలాంటి ‘గిన్నిస్ బుక్’లో ఎక్కితే పెద్ద విశేషం కదా! ఇక అసలు సంగతికి వచ్చేద్దాం... ఎంసీఏకు చెందిన వాంఖెడే స్టేడియంలో అత్యధిక బంతులతో 50 వసంతాలకు సంబంధించిన ఆంగ్ల అక్షర తోరణాన్ని వేదికపై పరిచింది. రెడ్ (ఎరుపు టెస్టులకు వాడే బంతి), వైట్ (తెలుపు వన్డే, టి20లకు వాడే బంతి) ఈ రెండు కలిపి మొత్తం 14, 505 బంతులతో ‘ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖెడే స్టేడియం’ అని గోల్డెన్ జూబ్లీకి సంబంధించిన అక్షరమాలను రాశారు. గావస్కర్, సచిన్లాంటి ఎందరో దిగ్గజాలకు పుట్టిల్లు (సొంతగడ్డ)లాంటి వేదిక 50 వసంతాల వేడుకకు ముస్తాబైంది. ఇక్కడ 1975వ ఏడాది జనవరి 23 నుంచి 29 వరకు తొలి మ్యాచ్ జరిగింది. గురువారం (2025, జనవరి 23)తో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎంసీఏ సిబ్బంది వేల సంఖ్యలో ఎరుపు, తెలుపు క్రికెట్ బంతులతో వాంఖెడే మైదానాన్ని తీర్చిదిద్దింది. ఈ వేదికపైనే 2011లో ధోని సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ను గెలిచింది. తొలి ప్రపంచకప్ను కపిల్ సేన 1983లో లార్డ్స్ (ఇంగ్లండ్)లో నెగ్గింది. అత్యధిక బంతుల వినియోగంతో తాజాగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ఎక్కడంపై ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ టి20ల్లో కూడా రెండు ప్రపంచకప్లను గెలుచుకుంది. సఫారీలో 2007లో మొదలైన ఆరంభ టి20 ప్రపంచకప్ను ధోని నేతృత్వంలో గెలిస్తే... గతేడాది కరీబియన్లో జరిగిన టి20 ప్రపంచకప్ను రోహిత్ శర్మ బృందం నెగ్గుకొచ్చింది. -
మొండిఘటం మరో చరిత్ర!
వివాదాలు. విమర్శలు. అభిశంసనలు. కోర్టు కేసులు. రుజువైన క్రిమినల్ నేరాలు. సొంత పార్టిలోనే విమర్శలు. మొత్తంగా రాజకీయ భవితవ్యంపైనే నీలినీడలు. హత్యాయత్నాలు. ప్రత్యర్థుల ప్రచార హోరు. వీటన్నింటినీ తట్టుకుంటూ 78 ఏళ్ల వయసులోనూ మరోసారి అమెరికా అధ్యక్షునిగా గెలిచి చూపించిన మొండి ఘటం డొనాల్డ్ ట్రంప్. ఆ ఘనత సాధించిన అత్యంత వృద్ధునిగా రికార్డు సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించారు. రెండుసార్లూ ట్రంప్ ఓడించిన డెమొక్రాట్ ప్రత్యర్థులు మహిళలే కావడం విశేషం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ను ఓడించగా ఈసారి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ఆయన ఘనవిజయం సాధించారు. కష్టకాలాన్ని దాటి... నిజానికి గత నాలుగేళ్లూ ట్రంప్కు కష్టకాలంగానే గడిచాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమితో ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఓటమిని ఒప్పుకోకపోవడమే గాక బైడెన్కు అధికార పగ్గాలు అప్పగించేందుకు కూడా ట్రంప్ నిరాకరించారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు 2021 జనవరి 6న కాంగ్రెస్ సంయుక్త భేటీ జరుగుతున్న క్యాపిటల్ హిల్పైకి మద్దతుదారులను దాడికి ఉసిగొల్పి ప్రపంచాన్నే నివ్వెరపరిచారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న హింసాకాండ ఇటీవలి దాకా కేసుల రూపంలో ట్రంప్ను వెన్నాడింది. తర్వాత హష్ మనీ ఉదంతంలో క్రిమినల్ కేసును ఎదుర్కొన్నారు. న్యాయ విచారణకు హాజరైన ఏకైక మాజీ అధ్యక్షునిగా చెత్త రికార్డునూ మూటగట్టుకున్నారు. హష్ మనీ కేసులో దోషిగానూ రుజువయ్యారు. అలా నేరస్తునిగా ముద్రపడ్డాక అధ్యక్షుడైన తొలి నేతగా కూడా నిలిచారు! డెమొక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని కమలా హారిస్ తెరపైకి రావడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమంటూ అంచనాలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టే ఆమెతో జరిగిన ఏకైక అధ్యక్ష డిబేట్లో ట్రంప్ పూర్తిగా తేలిపోయారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అభిమానుల తిరుగులేని మద్దతు ఆయనకు పెట్టనికోటగా నిలిచింది. ప్రచార క్రమంలో పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది. దుండగుని తూటా ఆయన చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లడంతో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. అలాంటి సమయంలోనూ పిడికిలి బిగించి ‘ఫైట్, ఫైట్’అని నినదిస్తూ ట్రంప్ ప్రదర్శించిన మొక్కవోని ధైర్యం అమెరికన్లను ఆకట్టుకుంది. ఆయన అమెరికా ఫస్ట్ నినాదం ఓటర్లను మరోసారి ప్రభావితం చేసింది. వలసలపై ఉక్కుపాదం మోపుతానని, ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దుతానని, చైనాకు ముకుతాడు వేస్తానని, యుద్ధాలకు తెర దించుతానని, మొత్తంగా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిముందు హారిస్ ఆఫ్రో ఆసియన్ మూలాలు, ప్రచార వ్యూహాల వంటివేవీ పని చేయలేదు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఏకపక్ష విజయం సాధించారు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా మారితే మేలనడం, చైనాపై టారిఫ్లు తప్పవని హెచ్చరించడం, గ్రీన్లాండ్ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ప్రకటించడం ద్వారా తన పాలన ఎలా ఉండనుందో సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్షునిగా రెండో విడతలో ట్రంప్ ఏమేం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఆది నుంచీ... ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్లో మేరీ ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఐదుగురు సంతానంలో నాలుగోవాడు. పెన్సిల్వేనియా వర్సిటీలో ఫైనాన్స్లో డిగ్రీ చేశారు. 1971లో తండ్రి నుంచి రియల్టీ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణంతో పాటు క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు తదితరాల్లోకీ విస్తరించారు. రియాలిటీ టీవీ షో ద్వారా దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. ట్రంప్కు మూడు పెళ్లిళ్లయ్యాయి. మోడల్, క్రీడాకారిణి ఇవానా జెలింకోవాకు 1990లో విడాకులిచ్చారు. వారికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ జన్మించారు. 1993లో మార్లా మేపుల్స్ను పెళ్లాడి టిఫానీకి జన్మనిచ్చారు. 1999లో ఆమెకు విడాకులిచ్చి 2005లో స్లొవేనియా మోడల్ మెలానియాను పెళ్లాడారు. వారి సంతానం బారన్ విలియం ట్రంప్.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీమామ కెరీర్లోనే ఆల్టైమ్ రికార్డ్
వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'పండగకి వచ్చారు.. పండగని తెచ్చారు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)'సంక్రాంతికి వస్తున్నాం' కథేంటంటే..డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. పండగకి వచ్చారు ~ పండగని తెచ్చారు ❤️🔥❤️🔥❤️🔥#SankranthikiVasthunam grosses 45CRORE+ Worldwide on its first day at the box office🔥Victory @VenkyMama’s ALL TIME CAREER HIGHEST OPENING EVER 💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶@anilravipudi @aishu_dil… pic.twitter.com/V8A7Tha5lE— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025 -
ఢిల్లీలో కొత్త రికార్డు..వందేళ్ల తర్వాత అంతటి వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు -
'పుష్ప 2'తో రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ రష్మిక (ఫొటోలు)
-
వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!
బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!) -
మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు. -
సునీల్ ఛెత్రి హ్యాట్రిక్
బెంగళూరు: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి (8వ, 73వ, 90+8వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ ఏడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు జట్టు 4–2 గోల్స్తో కేరళ బ్లాస్టర్స్పై గెలుపొందింది. భారత మాజీ కెపె్టన్ ఛెత్రి ఐఎస్ఎల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన పెద్ద వయసు్కడి (40 ఏళ్ల 126 రోజులు)గా రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో ఓగ్బచే (38 ఏళ్ల 96 రోజుల్లో) పేరిట ఉన్న ఈ రికార్డును ఛెత్రి తిరగరాశాడు. ర్యాన్ విలియమ్స్ (38వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. కేరళ బ్లాస్టర్స్ తరఫున జీసెస్ జిమెన్జ్ (56వ నిమిషంలో), ఫ్రెడ్డీ (67వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో ప్రత్యర్థి గోల్పోస్ట్పై ఐదుసార్లు దాడి చేసి అందులో నాలుగు గోల్స్ సాధించగా.. కేరళ బ్లాస్టర్స్ ఏడుసార్లు ప్రయతి్నంచి అందులో రెండు సార్లు మాత్రమే సఫలమైంది. ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఫుట్బాల్ క్లబ్ 7 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కేరళ జట్టు 11 పాయింట్లతో పట్టిక పదో స్థానంలో నిలిచింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ 2–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్సీపై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున విష్ణు (54వ నిమిషంలో), జాక్సన్ సింగ్ (84వ నిమిషంలో) చెరో గోల్తో సత్తా చాటారు. -
ఆల్టైమ్ రికార్డ్ కొట్టేసిన బిట్కాయిన్
ప్రముఖ క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన బిట్కాయిన్ ఆల్టైమ్ హై రికార్డ్ను కొట్టేసింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన పరిపాలన క్రిప్టోకరెన్సీలకు స్నేహపూర్వక నియంత్రణ వాతావరణాన్ని సృష్టిస్తుందనే అంచనాల క్రమంలో గురువారం మొదటిసారిగా బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లకు పైగా పెరిగింది.బిట్కాయిన్ విలువ ఈ ఏడాదిలో రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఇక ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన ఈ నాలుగు వారాల్లోనే దాదాపు 45 శాతం ఎగిసింది. "మనం ఒక నమూనా మార్పును చూస్తున్నాం. నాలుగు సంవత్సరాల రాజకీయ ప్రక్షాళన తర్వాత, బిట్కాయిన్తోపాటు మొత్తం డిజిటల్ అసెట్ ఎకోసిస్టమ్ ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి ప్రవేశించే అంచున ఉన్నాయి" అని యూఎస్ క్రిప్టో సంస్థ గెలాక్సీ డిజిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో మైక్ నోవోగ్రాట్జ్ అన్నారు."బిట్కాయిన్ విలువ లక్ష డాలర్లు దాటడం కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. ఫైనాన్స్, టెక్నాలజీ, జియోపాలిటిక్స్లో మారుతున్న ఆటుపోట్లకు ఇది నిదర్శనం" అని హాంకాంగ్కు చెందిన స్వతంత్ర క్రిప్టో విశ్లేషకుడు జస్టిన్ డి'అనేతన్ అన్నారు. చాలా కాలం క్రితం ఫాంటసీగా కొట్టేసిన ఈ ఫిగర్ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందన్నారు.ట్రంప్ తన ప్రచార సమయంలో డిజిటల్ అసెట్స్ను ప్రోత్సహిస్తామని, యునైటెడ్ స్టేట్స్ను "క్రిప్టో రాజధాని"గా చేస్తానని వాగ్దానం చేశారు. దీంతో క్రిప్టో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. కాగా ప్రస్తుతం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చైర్మన్గా ఉన్న గ్యారీ జెన్స్లర్.. ట్రంప్ అధికారం చేపట్టాక జనవరిలో పదవీవిరమణ చేస్తానని గత వారం చెప్పారు. ఈ పదవికి ఎస్ఈసీ మాజీ కమిషనర్ పాల్ అట్కిన్స్ను నామినేట్ చేయనున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. -
ఓటీటీలో సంచలన రికార్డు సాధించిన 'దేవర’
-
పుష్ప 2 మరో రికార్డ్.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. ఇప్పటికే యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పుష్ప మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది.తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్లో ఇప్పటికే ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్నా మరోసారి అలరించనుంది. 𝐓𝐡𝐞 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐭𝐨 𝐡𝐢𝐭 $𝟏𝐌+ 𝐏𝐫𝐞-𝐒𝐚𝐥𝐞𝐬 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐔𝐒 𝐁𝐨𝐱 𝐎𝐟𝐟𝐢𝐜𝐞 💥💥PUSHPA RAJ’s dominance is redefining the BOX OFFICE with a NEW DIMENSION 💥🪓 #Pushpa2TheRule pic.twitter.com/lzGvlwTeqr— Pushpa (@PushpaMovie) November 19, 2024 -
మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్
'పుష్ప 2' ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఏమో గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెగ చూసేస్తున్నారు. ఎంతలా అంటే ఇప్పటివరకు టాలీవుడ్లో మహేశ్ బాబు, ప్రభాస్ సినిమాల ట్రైలర్స్ వ్యూస్ పరంగా టాప్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని అల్లు అర్జున్ ఇంకా సమయం ఉండగానే దాటేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లలో 24 గంటల్లో ఎక్కుమంది చూసింది అయితే మహేశ్ 'గుంటూరు కారం' ట్రైలర్నే. 37.68 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తర్వాత ప్లేస్లో ప్రభాస్ సలార్ 32.58 మిలియన్ వ్యూస్తో ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కేవలం 15 గంటల్లో అల్లు అర్జున్ దాటేశాడు. 'పుష్ప 2' తెలుగు వెర్షన్ ట్రైలర్ ఈ స్టోరీ రాసేటప్పటికే అంటే 15-16 గంటల్లోనే 42 మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి?ఇక ట్రైలర్ విషయానికొస్తే కథనేం పెద్దగా రివీల్ చేయలేదు. కానీ జాతర ఎపిసోడ్, పుష్పరాజ్కి ఎలివేషన్స్, భన్వర్ సింగ్ షెకావత్ సీన్లు చాలానే చూపించారు. పక్కా కమర్షియల్గా ట్రైలర్ కట్ చేశారు. 2:48 నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ వైల్డ్ ఫైర్ అనేలా ఉంది. డిసెంబరు 5న థియేటర్లలో బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?) -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
ఎక్కేద్దాం... ఎగిరిపోదాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే 2.6 శాతం ప్రయాణికులు అధికంగా ప్రయాణించడం విశేషం.నవరాత్రి, దసరా, దుర్గా పూజ ముగిసిన తర్వాత తొలి పనిదినం కావడంతో ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా నమోదైంది. అక్టోబర్ 14న మొత్తం 6,435 విమాన సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందించాయి. భారత్లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దూసుకుపోతుండడంతో విమానయాన సంస్థల మధ్య పోటీ వేడి మీద ఉంది. ఈ ఏడాది ఆగస్ట్తో పోలిస్తే సెప్టెంబర్లో ఇండిగో మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు, ఎయిర్ ఇండియా 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. స్పైస్జెట్ 30 బేసిస్ పాయింట్లు, ఆకాశ ఎయిర్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించాయి. సెప్టెంబర్లో ఇలా.. ఈ ఏడాది సెప్టెంబర్లో 1.30 కోట్ల మంది దేశీయంగా విమాన ప్రయాణం సాగించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం 2023 సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ల సంఖ్య 6.4 శాతం దూసుకెళ్లింది. వాస్తవానికి నాలుగు నెలలుగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో క్షీణత నమోదవుతోంది. 2024 మే నెలలో 1.38 కోట్ల మంది రాకపోకలు సాగించారు. ప్యాసింజర్ల సంఖ్య జూన్ నుంచి వరుసగా 1.32 కోట్లు, 1.29 కోట్లు, 1.31 కోట్లుగా ఉంది. రద్దు అయిన విమాన సర్వీసుల సంఖ్య 0.85 శాతం ఉంది. మే నెలలో ఇది 1.7 శాతంగా నమోదైంది.ఫ్లైబిగ్ ఎయిర్ అత్యధికంగా 17.97 శాతం క్యాన్సలేషన్ రేటుతో మొదట నిలుస్తోంది. 4.74 శాతం వాటాతో అలయన్స్ ఎయిర్, 4.12 శాతం వాటాతో స్పైస్జెట్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. క్యాన్సలేషన్ రేటు అతి తక్కువగా ఎయిర్ ఇండియా 0.13 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 0.27, ఇండిగో 0.62, విస్తారా 0.88 శాతం నమోదైంది. విమానాల రద్దు ప్రభావం గత నెలలో 48,222 మంది ప్రయాణికులపై పడింది. పరిహారం, సౌకర్యాలకు విమానయాన సంస్థలు రూ.88.14 లక్షలు ఖర్చు చేశాయి. సర్వీసులు ఆలస్యం కావడంతో 2,16,484 మందికి అసౌకర్యం కలిగింది. నష్టపరిహారంగా విమానయాన సంస్థలు రూ.2.41 కోట్లు చెల్లించాయి. గత నెలలో మొత్తం 765 ఫిర్యాదులు అందాయి. 10,000 మంది ప్రయాణికులకు ఫిర్యాదుల శాతం 0.59 ఉంది. మార్కెట్ లీడర్గా ఇండిగో.. సమయానికి విమాన సర్వీసులు అందించడంలో దేశంలో తొలి స్థానంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిలిచింది. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండిగో మార్కెట్ వాటా ఏకంగా 63 శాతానికి ఎగసింది. సెప్టెంబర్ నెలలో ఈ సంస్థ 82.12 లక్షల మందికి సేవలు అందించింది. రెండవ స్థానంలో ఉన్న ఎయిర్ ఇండియా 15 శాతం వాటాతో 19.69 లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చింది.13.08 లక్షల మంది ప్రయాణికులతో విస్తారా 10 శాతం, ఏఐఎక్స్ కనెక్ట్ 5.35 లక్షల మంది ప్రయాణికులతో 4.1 శాతం వాటా సొంతం చేసుకుంది. 2022 ఫిబ్రవరిలో 10.7 శాతం మార్కెట్ వాటా కైవసం చేసుకున్న స్పైస్జెట్ గత నెలలో 2 శాతం వాటాకు పరిమితమైంది. సెప్టెంబర్లో ఈ సంస్థ 2,61,000 మందికి సేవలు అందించింది. ఆక్యుపెన్సీ రేషియో స్పైస్జెట్ 80.4 శాతం, విస్తారా 90.9, ఇండిగో 82.6, ఎయిర్ ఇండియా 80.1, ఏఐఎక్స్ కనెక్ట్ 81.6 శాతం నమోదైంది. -
18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ
కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులోఅధిరోహించిన వ్యక్తిగా నేపాల్కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్ థౌజెండర్స్’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జని్మంచిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెపె్టంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి. -
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
తొలి ఆసియానటిగా చరిత్ర సృష్టించిన అన్నా: భావోద్వేగం
ప్రతిష్టాత్మక 76వ ప్రైమ్టైమ్ ఎమ్మీ అవార్డ్స్లో నటి అన్నా సవాయ్ చరిత్ర సృష్టించారు, ఉత్తమ నాటక నటిగా ఎమ్మీ అవార్డ్ గెల్చుకున్న తొలి ఆసియా సంతతి నటిగా చరిత్రకెక్కారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రతిష్టాత్మక అవార్డును తీసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అందరికీ ఆదర్శంగా ఉండే మహిళలందరికీ తన అవార్డు అంకితమని పేర్కొనడం అక్కడున్న వారినందర్నీ ఆకర్షించింది.పాపులర్ సిరీస్ షోగన్ మొత్తం 18 ఎమ్మీలను గెలుచుకోగా ఈ ఏడాది అత్యధిక నామినేషన్లు (25) అందుకున్న సిరీస్ కూడా 'షోగన్' కావడం విశేషం.షోగన్లో తన పాత్రకు అన్నా సవాయ్ నాటకంలో ఉత్తమ నటిగా ఎమ్మీని గెలుచుకుంది. భాగంగా షోగన్లో లేడీ మారికో పాత్రకు ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని దక్కించుకుంది. దీనిపై అన్నా సంతోషంగా వ్యక్తం చేసింది. షోగన్ బృందానికి ప్రతి ఒక్క సిబ్బందికి నటీనటులకు ధన్యవాదాలు చెప్పింది. ముఖ్యంగా సహనటుడు హిరోయుకి సనదాకు కృతజ్ఞతలు తెలిపింది. తన తల్లికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. View this post on Instagram A post shared by Emmys / Television Academy (@televisionacad) కాగా న్యూజిలాండ్లో జన్మించిన అన్నా 10వ ఏట తన కుటుంబంతో కలిసి జపాన్కు వెళ్లింది. 2004లో నిప్పాన్ టీవీ ప్రొడక్షన్ అన్నీలో టైటిల్ క్యారెక్టర్గా 11 ఏళ్ల వయసులో బుల్లితెరపై నట జీవితాన్ని ప్రారంభించింది.ఈ తర్వాత జేమ్స్ మెక్టీగ్ 2009 మార్షల్ ఆర్ట్స్ చిత్రం నింజా అస్సాస్సిన్లో కిరికోగా తన సినీ రంగ ప్రవేశం చేసింది. -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
అమర్నాథ్ యాత్ర రికార్డులు బద్దలు!
అమర్నాథ్ యాత్రికులు గత రికార్డులను బద్దలుకొట్టారు. యాత్ర ప్రారంభమైన తొలిరోజు నుంచే అమర్నాథ్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. యాత్ర ముగియడానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే అమర్నాథ్ సందర్శకుల సంఖ్య గత 12 సంవత్సరాల రికార్డును అధిగమించింది.జూన్ 29 నుండి ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 5.10 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర గుహను సందర్శించారు. 2011లో యాత్రా సమయంలో మొత్తం 6.34 లక్షల మంది భక్తులు, 2012లో 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని సందర్శించుకున్నారు. ఈసారి యాత్ర ఆగస్ట్ 19న రక్షాబంధన్ రోజున ముగియనుంది.అమర్నాథ్ను ఇప్పటి వరకు సందర్శించిన భక్తుల సంఖ్య 5,11,813 దాటింది. వర్షం కారణంగా పహల్గామ్, బాల్తాల్ మార్గంలో యాత్ర ఒక్కసారి మాత్రమే వాయిదా పడింది. గత ఏడాది జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నాలుగుసార్లు వాయిదా పడింది. యాత్ర సాగే రెండు మార్గాల్లో 125 లంగర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు ఆహారానికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. జమ్మూలోని యాత్రి నివాస్, చంద్రకోట్ యాత్రి నివాస్, శ్రీనగర్లోని పాంథా చౌక్లలో తాత్కాలిక శిబిరంలో యాత్రికులకు వసతి, వైద్య సదుపాయాలు కల్పించారు. గత 12 ఏళ్లలో అమర్నాథ్ను సందర్శించుకున్న భక్తుల సంఖ్య ఇలా ఉంది.సంవత్సరం యాత్రికుల సంఖ్య2011 6.34 లక్షలు2012 6.22 లక్షలు2013 3.53 లక్షలు2014 3.73 లక్షలు2015 3.52 లక్షలు2016 2.20 లక్షలు2017 2.60 లక్షలు2018 2.85 లక్షలు2019 3.42 లక్షలు2020, 2021లలో కరోనా కారణంగా యాత్ర జరగలేదు.2022 3.04 లక్షలు2023 4.50 లక్షలు2024 ఇప్పటివరకు 5.10 లక్షలు -
పారిస్ ఒలింపిక్స్లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్కు పేరు తీసుకువచ్చింది. -
వర్షాల ఎఫెక్ట్.. గాలి నాణ్యతలో ఢిల్లీ సరికొత్త రికార్డు
ఢిల్లీ: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీకి ఉపశమనం లభించింది. గురువారం(ఆగస్టు 8) రాజధానివాసులు గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో పెరిగి ఆగస్టు 8న సాయంత్రం 4 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో 53గా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎమ్) ఒక ట్వీట్లో తెలిపింది. భారీ వర్షాల కారణంగానే ఢిల్లీలో గాలి నాణ్యత పెరిగినట్లు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 0 నుంచి 50 మధ్య ఉంటే గుడ్, 50 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరం, 101 నుంచి 200 ఉండే ఓ మోస్తరు, 201 నుంచి 300 ఉంటే పూర్, 301నుంచి 400 ఉంటే వెరీ పూర్గా పరిగణిస్తారు. -
వయనాడ్ విలయం: మేజర్ సీతాషెల్కేకు హ్యాట్సాఫ్! (ఫొటోలు)
-
ఈపీఎఫ్వో రికార్డ్.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.మే నెలలో ఈపీఎఫ్వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్ఫోర్స్లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది. -
81,000 దాటిన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. అధిక వెయిటేజీ టీసీఎస్(3%), ఇన్ఫోసిస్(2%), రిలయన్స్(1%), ఐసీఐసీఐ బ్యాంక్(1%) చొప్పున రాణించి సూచీల రికార్డు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు సెపె్టంబర్ నుంచి ప్రారంభం కావచ్చొనే అంచనాలూ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 81,343 వద్ద ముగిసింది. నిఫ్టీ 188 పాయింట్లు పెరిగి 24,801 వద్ద నిలిచింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డులు కావడం విశేషం. ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్ధమంతా బలహీనంగా ట్రేడయ్యాయి. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ లాభాల బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 806 పాయింట్లు బలపడి 81,523 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు ఎగసి 24,838 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. → ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్న జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. సెపె్టంబర్లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఈ రంగ షేర్లకు మరింత డిమాండ్ పెంచాయి. ఎల్టీఐఎం 3.50%, టీసీఎస్ 3%, విప్రో 2.50%, ఇన్ఫోసిస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్, టెక్ మహీంద్రా 2% రాణించాయి. ఎంఫసీస్లు ఒకశాతం లాభపడ్డాయి. రూపాయి రికార్డ్ కనిష్టం @ 83.63 దేశీ కరెన్సీ డాలరుతో మారకంలో చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 5 పైసలు నీరసించి 83.63 వద్ద ముగిసింది. రూపాయి 83.57 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 83.66 వరకూ క్షీణించింది. -
ప్రధాని మోదీ రికార్డు.. 10 కోట్లకు చేరిన ‘ఎక్స్’ ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ఎక్స్(ట్విటర్)లో ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రధాని మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు.‘ఎక్స్’లో ఆయన ఫాలోవర్ల సంఖ్య ఆదివారం (జులై 14) 100 మిలియన్ల మార్కు (10 కోట్లు)ను దాటారు.దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లు దాటడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.‘ఎక్స్లో ఉండటం, ఈ వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు, నిర్మాణాత్మక విమర్శలు లభిస్తుండటం సంతోషంగా ఉంది’ అని మోదీ పోస్ట్ చేశారు.A hundred million on @X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more. Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5— Narendra Modi (@narendramodi) July 14, 2024 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ట్విటర్ లో ఖాతా ప్రారంభించారు. 2010కే ఆయన లక్ష మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరో ఏడాదికి ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 2020 జులై 19 నాటికి 6 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా గడిచిన నాలుగేళ్లలో 4 కోట్ల మంది ఫాలోవర్లు పెరిగారు.ప్రపంచ నేతల్లో ఎవరికీ దక్కని రికార్డు..ప్రస్తుత ప్రపంచ నేతల్లో ఎవరికీ ప్రధాని మోదీ స్థాయిలో ఫాలోయింగ్ లేదు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ‘ఎక్స్’లో 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను 27.5 మిలియన్ల మంది, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 26.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్షిప్లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో బెడ్రెస్ట్లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్లో విస్తారమైన ఎస్టేట్ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు.. ఏ ప్రాంతాన్నీ వదలని ప్రధాని?
పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా ప్రధాని మోదీ ఈ ఏడాది ఏకంగా 22 ర్యాలీలు నిర్వహించారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏ ప్రధాని కూడా ఇన్ని ర్యాలీలు చేపట్టలేదు.పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ప్రధాని మోదీ తాను చేపట్టే ర్యాలీలతో పశ్చిమ బెంగాల్లోని ప్రతీ ప్రాంతాన్నీ కవర్చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పెద్దఎత్తున కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడ ర్యాలీలు చేపట్టకపోవడం విశేషం. మార్చి 16న ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బెంగాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. నేడు (బుధవారం) నిర్వహించే రెండు ర్యాలీలతో మోదీ పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది మొత్తం 22 ర్యాలీలు నిర్వహించినట్లవుతుంది.2021 అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ బెంగాల్పై దృష్టి సారించింది. రాష్ట్రంలోని అవినీతి, బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు తదితర అంశాలతో ప్రధాని మోదీ అధికార తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో సీఏఏపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. సందేశ్ఖాలీలోని మహిళల అణచివేతపై దుమ్మెత్తిపోశారు. సందేశ్ఖాలీ ప్రాంతంలోని మహిళలకు న్యాయం చేసే విధంగా ఆ ప్రాంతానికి చెందిన రేఖా పాత్రకు టికెట్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాని మోదీ మహిళలకు బీజేపీ అండగా ఉంటుందనే సందేశాన్ని అందించారు. -
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది టైటిట్ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్ల మహిళల T20 సిరీస్లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్లో వికెట్ కీపర్ అయిన బార్టన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గణితంలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. -
రూ. 2.1 లక్షల కోట్లు.. ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డ్ డివిడెండ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్గా రూ. 2.1 లక్షల కోట్లను అత్యధిక మిగులును చెల్లించనుంది. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి బదిలీ చేసిన రూ.87,420 కోట్లతో పోలిస్తే ఈసారి రెండితలు కన్నా అధికం. రికార్డ్ మొత్తంలో ఆర్బీఐ చెల్లించనున్న డివిడెండ్ ప్రభుత్వం తన బడ్జెట్ లోటు లక్ష్యమైన 5.1 శాతం జీడీపీని చేరుకోవడంలో సహాయపడుతుంది.ఆర్బీఐ చెల్లించనున్న డివిడెంట్తో కొత్తగా అధికారం చేపట్టే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చనుంది. దీంతో ప్రభుత్వం వివిధ అంశాలల్లో గణనీయమైన ఖర్చు చేసేందుకు మరింత సౌలభ్యం కలగనుంది. పెట్టుబడులపై వచ్చే మిగులు ఆదాయం, కరెన్సీ ముద్రణ కోసం తీసుకునే రుసుము, తమ వద్ద డాలర్ల విలువలో హెచ్చుతగ్గులపై వచ్చే ఆదాయం నుంచి ఆర్బీఐ ఏటా డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుంది. -
రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనగర్, బారాముల్లా ఓటర్లు
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్లో జమ్మూకశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదయ్యింది.సోమవారం జరిగిన పోలింగ్లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.దీనికి ముందు నాలుగో దశ లోక్సభ ఎన్నికల్లో శ్రీనగర్లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. -
శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ లోక్సభ స్థానంలో సోమవారం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. 38 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం. నాడు జమ్మూకశ్మీర్లోని ఈ స్థానంలో దాదాపు 41 శాతం ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు శ్రీనగర్ నియోజకవర్గంలో జరిగాయి.సోమవారం రాత్రి 11 గంటల వరకు శ్రీనగర్లో 38 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారిని ప్రశంసించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వలన జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి యువతకు ప్రయోజనం చేకూరుతున్నదన్నారు.ఓటింగ్లో పాల్గొన్న శ్రీనగర్ నియోజకవర్గ ప్రజలకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పలు రాజకీయ పార్టీలు అభినందనలు తెలిపాయి. శ్రీనగర్ నియోజకవర్గం పరిధిలోని శ్రీనగర్, గండేర్బల్, పుల్వామా జిల్లాలు, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని 2,135 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఓటింగ్ జరిగింది.ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం గత 34 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 1996లో పోలింగ్ నమోదైంది. నాడు దాదాపు 41 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 14.43 శాతం ఓట్లు పోలయ్యాయని, అంతకుముందు పార్లమెంటు ఎన్నికల్లో అంటే 2014లో 25.86 శాతం 2009లో 25.55 శాతం, 2004లో 18.57 శాతం, 1999లో 11.93 శాతం, 1986లో 30.086 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది. Would especially like to applaud the people of Srinagar Parliamentary constituency for the encouraging turnout, significantly better than before. The abrogation of Article 370 has enabled the potential and aspirations of the people to find full expression. Happening at the… https://t.co/2DvSCnXFKR— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
29వ సారి ఎవరెస్ట్ను అధిరోహించిన కమీ రీటా షెర్పా
నేపాల్కు చెందిన 10 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో విజయం సాధించారు. ఈ సీజన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి యాత్ర బృందం ఇదే. డెండి షెర్పా నేతృత్వంలోని పర్వాతారోహకుల బృందం శుక్రవారం రాత్రి 8.15 గంటలకు 8,848.86 మీటర్ల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. ఈ విషయాన్ని ఈ పర్వతారోహణ యాత్ర నిర్వహణ సంస్థ ‘సెవెన్ సమ్మిట్ ట్రాక్’ ప్రతినిధి థాని గుర్గైన్ మీడియాకు తెలిపారు.ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సాధించని ఘనతను పర్వతారోహకురాలు కమీ రీటా షెర్పా చేసి చూపారు. ఆమె 29వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. షెర్పా తన 28వ ఎవరెస్ట్ అధిరోహణ రికార్డును తానే బద్దలు కొట్టారు. కమీ రీటా షెర్పాకు 54 ఏళ్లు. ఆమె 1994 నుండి పర్వతాలను అధిరోహిస్తున్నారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ముందు కమీ రీటా షెర్పా మీడియాతో మాట్లాడుతూ తనకు మరో వ్యాపకం లేదని, పర్వతారోహణే తన లక్ష్యమని అన్నారు. 29వ సారి కూడా ఎవరెస్ట్ అధిరోహిస్తానని తెలిపారు. కాగా కమీ రీటా షెర్పాతో పాటు టెన్జింగ్ గ్యాల్జెన్ షెర్పా, పెంబా తాషి షెర్పా, లక్పా షెర్పా, దావా రింజి షెర్పా, పామ్ సోర్జీ షెర్పా, సుక్ బహదూర్ తమాంగ్, నామ్గ్యాల్ డోర్జే తమాంగ్, లక్పా రింజీ షెర్పా తదిరులు పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం 414 మంది అధిరోహకులు ఈ సీజన్లో ఎవరెస్ట్ను అధిరోహించేందుకు అనుమతి పొందారు. Nepali Sherpa climber Kami Rita Sherpa climbs Everest for record 29th time breaking his own previous record of 28 ascends. He is the sole person to climb the World’s tallest peak for a record 29 times: Government officials(file pic) pic.twitter.com/6gp6QaKWdz— ANI (@ANI) May 12, 2024 -
World Migration Report 2024: భారత్కు మనవాళ్ల డబ్బేడబ్బు
ఐక్యరాజ్యసమితి: విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు స్వదేశానికి తమ సంపాదనను పంపడంలో (రెమిటెన్స్) రికార్డు సృష్టించారు. భారత్కు ఈ తరహా నిధులు 2022లో 111.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. దీనితో ఇంత భారీ స్థాయిని అందుకున్న తొలి దేశంగా భారత్ రికార్డులకు ఎక్కింది. నిజానికి రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లు దాటిన తొలి దేశంగా కూడా భారత్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ మేరకు విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... » రెమిటెన్సులకు సంబంధించి భారత్ తరువాతి నాలుగు స్థానాల్లో మెక్సికో(61 బిలియన్ డాలర్లు), చైనా (51 బిలియన్ డాలర్లు), ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్ నిలిచాయి. 2021లో చైనా స్థానాన్ని 2022లో మెక్సికో అధిగమించింది. » దక్షిణాసియా నుంచి చాలా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నందున ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతోంది. దక్షిణాసియాలో భారత్తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు రెమిటెన్సులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ 30 బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ 21.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో నిలుస్తోంది. » 44.8 లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. » విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా (8,33,000) ఉంది. తరువాతి స్థానాల్లో బ్రిటన్ (దాదాపు 6,01,000), ఆస్ట్రేలియా (దాదాపు 3,78,000), జర్మనీ (3,76,000 పైగా), కెనడా (దాదాపు 3,18,000) ఉన్నాయి.భారత్ పయనమిలా... (అంకెలు బిలియన్ డాలర్లలో) 2010 53.48 2015 68.91 2020 83.15 2022 111.22 -
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
తొలిదశకు ముందే రికార్డ్! రోజుకు రూ.100 కోట్లు..
న్యూఢిల్లీ, సాక్షి: ఈసారి సార్వత్రిక ఎన్నికలు తొలిదశకు ముందే రికార్డ్ సృష్టించాయి. 18వ లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్ల విలువైన నగదు, బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయని భారత ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 45 శాతం విలువ మాదక ద్రవ్యాలదే కావడం గమనార్హం. ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం 2019 లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్ల కంటే ఎక్కువ. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. సమగ్ర ప్రణాళిక, సహకారం, ఏజెన్సీల నుంచి ఏకీకృత నిరోధక చర్యలు, చురుకైన ప్రజల భాగస్వామ్యంతోపాటు ఆధునిక టెక్నాలజీని సమర్థంగా వినియోగించడంతోనే రికార్డ్ స్థాయిలో నగదు, ఇతర వస్తువులు పట్టుకోవడం సాధ్యమైందని ఎలక్షన్ కమిషన్ వివరించింది. -
ఇది కదా...‘తగ్గేదేలే’ అంటే .. సలాం డాక్టర్!
తనశారీరక వైకల్యాన్ని వెక్కిరించినా పట్టువీడలేదు. కోర్టుకు వెళ్లి మరీ తన కల నెరవేర్చుకున్నాడు. సంకల్పం ఉంటే కాదేదీ అసాధ్యం అని నిరూపించాడు గుజరాత్కు చెందిన ఒక యువ వైద్యుడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా ప్రపంచ రికార్డుకు అర్హత సాధించాడు. ఇంతకీ ఎవరా వైద్యుడు? ఏమా కథ. అత్యంత స్ఫూర్తి దాయకమైన ఈ స్టోరీ తెలుసుకుందాం రండి..! గుజరాత్, గోరఖి గ్రామానికి చెందిన గణేష్ బరయ్యకు పుట్టుకతోనే ఒక సమస్య ఉంది. 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధ పడుతున్నాడు. అందుకే 23 ఏళ్లు వచ్చినా తగినంత ఎత్తు, బరువూ పెరగలేదు. ప్రస్తుతం అతని ఎత్తు 3 అడుగులు. బరువు 18 కేజీలు మాత్రమే. చిన్నతనంలో కూడా తన పరిస్థితి గురించి బాధపడుతూ కూర్చోలేదు. తొలుత 10వ తరగతి , తర్వాత ఇంటర్ విద్యను కంప్లీట్ చేశాడు.. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో 233 మార్కులు సాధించాడు. ఇక్కడే ఆయన జీవితంలో అనుకోని పరిణామం ఎదురైంది. తన పరిస్థితే తన కలలకు, కరియర్కు అడ్డంకిగా మారుతుందని అస్సలు ఊహించలేదు. #WATCH | Dr Ganesh Baraiya says, " The committee of Medical Council of India had rejected me saying that my height is 3 feet and I won't be able to handle emergency cases...with the direction of Bhavnagar collector, I went to Gujarat HC...after 2 months, we lost the case...we… https://t.co/ALEjkaaZsk pic.twitter.com/zjMfZQE7pz — ANI (@ANI) March 6, 2024 అసమానతలను ధిక్కరించి, MBBS ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, ప్రవేశపరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా, కేవలం ఎత్తు కారణంగా ఎంబీబీఎస్లో ప్రవేశానికి నిరాకరించారు. ఎత్తు కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. అత్యవసర కేసులను నిర్వహించలేవంటూ భారత వైద్య మండలి కమిటీ తిరస్కరించింది. #WATCH | Gujarat: 3-foot tall Ganesh Baraiya defies the odds, becomes a doctor at Bhavnagar Government hospital (06/03) pic.twitter.com/37op1R2X1t — ANI (@ANI) March 6, 2024 కానీ దృఢ సంకల్పంతో భావ్నగర్ కలెక్టర్ సలహా మేరకు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ ఈ కేసు ఓడిపోయాడు. అయినా ఏమాత్రం నిరాశచెందకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆయనకు వైద్య కళాశాలలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో 2019లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవచ్చని సుప్రీం సూచించింది. మెడికల్ విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్ డాక్టర్గా సేవలందిస్తూ, తిరుగులేని నిబద్ధతతతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాడు. ఒక సాధారణ రైతు కొడుకు గణేష్కి ఎనిమిది మంది తోబుట్టువులు. వారంతా 10వ తరగతితోనే చదువు ఆపేశారు.వారి కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన తొలి వ్యక్తిగా, ఇపుడు తొలిడాక్టర్గా చరిత్ర సృష్టించారు. మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ టైటిల్కు అర్హత సాధించడం విశేషం. తనకు సాయం చేసిన, ధైర్యం చెప్పిన అందరికీ గణేష్ కృతజ్ఞతలు తెలిపాడు గణేష్. -
కొనసాగిన బుల్ రికార్డులు
ముంబై: పరిమిత శ్రేణి ట్రేడింగ్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైనప్పటికీ.., స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ సోమవారమూ కొనసాగింది. ఆకర్షణీయ స్థూల ఆర్థిక డేటా నమోదు కారణంగా అంతర్జాతీ య రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది. మూడీస్ అప్గ్రేడ్ రేటింగ్తో బ్యాంకింగ్, ఇంధన, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్ద తు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 243 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 66 పాయింట్ల లాభంతో 73,872 వద్ద ముగిసింది. ఒక దశలో 184 పాయింట్లు బలపడి 73,990 వద్ద ఆల్టైం హైని అందుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 22,441 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 27 పాయింట్లు లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలకు ముగింపు స్థాయిలు సరికొత్త రికార్డుతో పాటు వరుసగా నాలుగో రోజూ లాభాల ముగింపు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.564 కోట్ల షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,543 కోట్ల షేర్లు కొన్నారు. ► డిజిట్ ఐపీవోకు గ్రీన్ సిగ్నల్ ► డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ఇష్యూ కింద రూ. 1,250 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 10.94 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. పబ్లిక్ ఇష్యూకి బ్లాక్బక్ లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్బక్ వినియోగించుకోనుంది. బ్లాక్బక్ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్లో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి. -
కాదేదీ రికార్డుకనర్హం! కనుకే అగ్గిపుల్లలతో సరికొత్త రికార్డు..
'జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు తారసపడుతూంటాయి. కొందరి జీవతంలో వారే వింతగా ఏదేదో సాధిస్తూంటారు. అలా చేసేదాకా వారికి అదే ధ్యాసనో, లేక అదే ప్రపంచమో..! ఇలాగే డెన్మార్క్లోని ఓ వ్యక్తి చేసిన రికార్డును చూస్తే.. వ్హా అనక తప్పదు. ఇక ఆ రికార్డు ఏంటో తెలుసుకందాం.' ‘అగ్గిపుల్లా సబ్బుబిళ్లా కుక్కపిల్లా కాదేదీ కవితకనర్హం’ అన్నాడు శ్రీశ్రీ. పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్ అనే ఈ డేనిష్ పెద్దమనిషి మాత్రం కాదేదీ రికార్డుకనర్హం అనుకుని, ఏకంగా అగ్గిపుల్లలతో రికార్డు సృష్టించాడు. రెండు ముక్కురంధ్రాల్లోనూ 68 అగ్గిపుల్లలను దట్టించుకుని, అత్యధిక సంఖ్యలో అగ్గిపుల్లలను ముక్కులో దట్టించుకున్న వ్యక్తిగా కొత్త రికార్డును నెలకొల్పాడు. డెన్మార్క్లోని ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తున్న పీటర్, త్వరలోనే ఉపాధ్యాయ వృత్తిలోకి మారాలనుకుంటున్నాడు. తన చర్మానికి సాగే గుణం సాధారణం కంటే కొంత ఎక్కువని, అందువల్లనే సునాయాసంగా ఈ రికార్డును సాధించగలిగానని అతడు చెప్పాడు. ఇదివరకు ఒక వ్యక్తి ముక్కురంధ్రాల్లో 44 అగ్గిపుల్లలను దట్టించుకుని రికార్డు నెలకొల్పాడు. పీటర్ ఆ రికార్డును సునాయాసంగా అధిగమించడం విశేషం. ఇవి చదవండి: పరీక్షల పద్ధతిని ప్రవేశ పెటిందెవరో మీకు తెలుసా..! -
Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?!
భారతదేశం వందలాది బిలియనీర్లకు నిలయం. అంతేకాదు ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా. కొత్త పరిశ్రమలకు, ప్రతిభావంతులకు కొదవ లేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు చాలామందే ఉన్నారు. అయితే 27 ఏళ్ల యువకుడి సక్సెస్ విశేషంగా నిలుస్తోంది.వ్యాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది. బిలియనీర్లు అనగానే తక్షణమే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, టాటా లాంటి వ్యాపార దిగ్గజాలు గుర్తొస్తారు. వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతోపాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ స్థాయికి ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా చిన్న వయస్సులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడో యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యాడు పెరల్ కపూర్. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన పేరును లిఖించుకున్నాడు. గుజరాత్కు చెందిన పెరల్ కపూర్ Zyber 365 అనే కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90 శాతం. అలాగే స్రామ్ & మ్రామ్ గ్రూప్ 8.3 శాతం పెట్టుబడి పెట్టింది. తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా 100 మిలియన్ డాలర్లను సంపాదించింది. అలా ఇండియా యునికార్న్ ర్యాంకింగ్లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మే నెలలో ఆవిర్భవించిన ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే రూ. 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 , AI-ఆధారిత OS స్టార్ట్-అప్. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన కంపెనీని యునికార్న్ అంటారు. కేవలం మూడు నెలల్లో యునికార్న్గా ఆవిర్భవించింది. లండన్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైన యునికార్న్గా ప్రశంసలందుకుంటోంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తోంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి MSC ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (CFA పాత్వే) గ్రాడ్యుయేట్ అయిన కపూర్, Web3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. జైబర్ 365కి ముందు, కపూర్ AMPM స్టోర్లో ఆర్థిక సలహాదారుగా, యాంటీయర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగానూ పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్న అతని బలమైన కోరిక 2022, ఫిబ్రవరిలో బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి నాంది పలికింది. అలా మొదలైన ప్రయాణం స్టార్టప్ Zyber 365, బిలియనీర్ హొదా దాకా ఎదిగింది. -
ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..
ఓ క్రీడాకారుడు ధరించిన షూ వేలంటో కనివినీ ఎరుగుని రీతీలో ధర పలికాయి. ఆ షూతోనే ఆ క్రీడాకారుడు టైటిళ్లను గెలిచుకున్నాడు. ఆ షూలు ప్రముఖ బ్రాండ్వి కావడం ఒక విశేషం అయితే క్రీడాకారుడి గెలుపులో పాత్ర షోషించడం మరో స్పెషల్టీ. దీంతో అవి వేలంలో మంచి క్రేజ్ రావడంతో వేలంలో ఇంతలా ధర పలికి అందర్నీ షాక్ గురి చేసింది. ఎవరా క్రీడాకారుడు? ఏంటా బ్రాండ్ అంటే.. బాస్కెట్ బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ ప్రసిద్ధ బ్రాండ్కి చెందిన ఆరు షూల జతను ధరించి ప్రతిష్టాత్మకమైన ఆరు ఎన్బీఏ ఛాంపియన్షిప్లను గెలుచుకున్నారు. అవి ప్రమఖ ఎయిర్ జోర్డాన్ బ్రాండ్కి చెందినవి. సాధారణంగానే ఆ బ్రాండ్ షూలు అత్యంత ఖరీదైనవి. ఇక ఆ క్రీడాకారుడు విజయంలో పాత్ర పోషించిన ఆ షూలకు ఒక ప్రత్యేక కథ కూడా ఉంది. తొలిసారిగా 1991లో ఎన్బీఏ ఫైనల్స్లో పోటీ పడుతున్న సమయంలో మైఖేల్ని పీఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిమ్ హాలండ్ జట్టు విజయం సాధిస్తే తాను ధరించిన ఎయిర్ జోర్డాన్ బ్రాండ్ షూ జతను తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మైకేల్ విజయం సాధించిన తదనంతరం అతడి కోరికను తీర్చాడు. ఆ షూను హాలండ్కు బహుమతిగా ఇచ్చే ముందుకు దానిపై సంతకం చేసి మరీ ఇచ్చాడు. ఇలా ఐదు ఛాంపియన్షిప్లో అతడు ఆ సంప్రదాయన్ని కొనసాగించాడు. ఇలా చేస్తే గెలుస్తానని మైఖేల్ సెంటిమెంట్గా ఫీలయ్యాడో ఏమో గానీ అలా హాలండ్ వద్ద ఆరు జతల షూలు ఉండటం జరిగింది. ఆయన సాధించిన ఆరు చాంపియన్ షిప్ల్లో పాత్ర వహించిన ఆ ఆరు ఎయిర్ జోర్డాన్ షూల జతను ప్రముఖ వేలం సంస్థ సోథెబిన్ శుక్రవారం వేలం వేయగా ఆ బ్రాండ్కి తగ్గ రేంజ్లోనే రికార్డు స్థాయిలో ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ బ్రాండ్కి ఎప్పటికీ అత్యంత విలువైందని ఫ్రూవ్ చేసుకుందని పలువురు ప్రశంసించారు. ఇలా మైఖేల్ ధరించిన షూలు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో ఇలానే ఎయిర్ జోర్డాన్ 13 షూ, అలాగే 1988లో ఎన్బీఏ ఛాంపియన్ గేమ్లో విజయాన్ని తెచ్చిన అదే బ్రాండ్కి చెందిన మరో రకం షూ వేలంలో రూ 18 కోట్ల ధర పలికింది. అలాగే అక్టోబర్లో నవంబర్ 1, 1984లో రూకీ సీజన్లో ఐదవ ఎన్బీఏ చాంఫీయన్ షిప్ను గెలుచుకున్నప్పుడూ ధరించిన రెడ్ అండ్ వైట్ ఎయిర్ షూ జత ఏకంగా రూ. 12 కోట్లు పలికింది. ఇప్పుడూ ఏకంగా వాటన్నింటిని తలదన్నేలా ఆ బ్రాండ్కి తగ్గట్లుగా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 66 కోట్లు పలకడం విశేషం. (చదవండి: అఖండ హీరోయిన్ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!) -
జేఈఈ మెయిన్కు రికార్డు స్థాయిలో హాజరు
సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్–1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్–2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు. 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు.. ఈ ఏడాది జేఈఈ మెయిన్కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్–1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు. రెండో సెషన్ తేదీల్లో మార్పు.. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్ను ఎన్టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్దరాత్రి 11.50 గంటల వరకు సెషన్–2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు. -
12 ఏళ్ల రికార్డులను దాటేసిన జనవరి చలి
దేశ రాజధాని ఢిల్లీలో గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి ప్రస్తుత జనవరిలో నమోదైంది. ఈ నెల మొత్తంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదుకాగా, కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. ఈసారి చలిగాలుల ప్రభావం ఢిల్లీలో గరిష్టంగా ఐదు రోజుల పాటు కనిపించింది. జనవరి 30 వరకు నమోదైన డేటా ప్రకారం ఢిల్లీలో గత 12 ఏళ్లలో సగటున ఈ నెలలోనే చలి అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారి ఆర్కే జెనామణి తెలిపారు. జనవరిలో గరిష్ట ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యింది. 2012 నుంచి 2024 వరకు ఢిల్లీలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత ఎన్నడూ నమోదు కాలేదు. అయితే కనిష్ట సగటు ఉష్ణోగ్రత 6.2 డిగ్రీలుగా నమోదయ్యింది. అంతకుముందు జనవరి 2013లో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 6.1 డిగ్రీలుగా నమోదైంది. 2015లో గరిష్ట సగటు ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు కాగా, 2022లో 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మంగళవారం దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్ముకుంది. కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఉదయం 9 గంటలకు గాలి నాణ్యత సూచిక 364 (చాలా పేలవమైన విభాగంలో) నమోదైంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో నేటి ఉదయం పొగమంచు కమ్మేయనుంది. బుధవారం నుండి ఫిబ్రవరి 4 వరకు లడఖ్, జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు. టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. -
ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్ మరో రికార్డు!
అయోధ్యలోని నూతన రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ ఈ రికార్డులలో అగ్రస్థానంలో నిలిచింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది. రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుకను నరేంద్ర మోదీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా తొమ్మిది మిలియన్ల మంది అంటే 90 లక్షల మందికి పైగా జనం ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని యూట్యూబ్ ఛానళ్ల లైవ్ స్ట్రీమ్ వీక్షణలలో ఇదే అత్యధిక రికార్డ్గా నిలిచింది. నరేంద్ర మోదీ ఛానెల్లో రామ మందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక ‘PM Modi LIVE | Ayodhya Ram Mandir LIVE | Shri Ram Lalla Pran Pratishtha’ and ‘Shri Ram Lalla Pran Pratishtha LIVE’ టైటిల్స్తో ప్రత్యక్ష ప్రసారమైంది. నరేంద్రమోదీ ఛానెల్లోని ఈ లైవ్కి ఇప్పటివరకు మొత్తం ఒక కోటి వ్యూస్ వచ్చాయి. అంతకుముందు ఇదే ఛానల్లో ప్రసారమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని 80 లక్షల మందికి పైగా జనం వీక్షించారు. ఈ రికార్డులలో మూడవ స్థానంలో ఫిఫా వరల్డ్ కప్ 2023 మ్యాచ్, నాలుగవ స్థానంలో యాపిల్ లాంచ్ ఈవెంట్ నిలిచాయి. నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇప్పటివరకూ ఈ ఛానల్లో మొత్తం 23,750 వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ వీడియోల మొత్తం వీక్షణలు 472 కోట్లు. యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లను దక్కించుకున్న ప్రపంచంలోని మొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. -
ప్రభాస్, చరణ్ రికార్డు బద్దలు..కొట్టిన తేజ..
-
17, 18 తేదీల్లో ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి వస్తుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపో తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. బుధ,గురువారాల్లో రికార్డు స్థాయిలో 101 శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఈ రెండు రోజుల్లో టీఎస్ఆర్టీసీకి రూ.45.1 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 33.93 లక్షల కి.మీ.మేర తిరిగి 48.94 లక్షలమంది ప్రయాణికులను గమ్యం చేర్చాయి. ఆ రోజు 101.62 శాతం ఓఆర్తో రూ.22.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 18వ తేదీన 34.18 లక్షల కి.మీ.మేర బస్సులు తిరిగ్గా 50.60 లక్షలమంది ప్రయాణికులు గమ్యం చేరారు. 101.92 శాతం ఓఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ట శాతం కావటం విశేషం. ఆ రోజు రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక రోజులో ఇంత ఆదాయం నమోదు కావటం కూడా ఇదే తొలిసారి కాగా, గతేడాది జనవరి నెలలో 17వ తేదీనాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి రూ.92 కోట్లు ఎక్కువ నమోదు కావటం విశేషం. -
‘మాచ్ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్లో 69.54, అక్టోబర్లో 86.58, నవంబర్లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
లక్ష ఎకరాలు సస్యశ్యామలం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసుల వందేళ్ల స్వప్నం నెల్లూరు బ్యారేజీ సాకారం కావడంతో దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లు అందుతున్నాయి. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ చేపట్టిన నెల్లూరు బ్యారేజీ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో పూర్తి చేశారు. 2022 సెపె్టంబరు 6న బ్యారేజీని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి వరుసగా మూడేళ్లుగా సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల కింద సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని ముత్తుకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, ఇందుకూరుపేట, నెల్లూరు మండలాల్లోని 77 గ్రామాల్లో 99,525 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు అందడంతో విస్తారంగా పంటలు సాగు అవుతున్నాయి. నెల్లూరు బ్యారేజీలో ఏడాది పొడవునా 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా నెల్లూరుతోపాటు 77 గ్రామాల్లో తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. నెల్లూరుతోపాటు బ్యారేజీ దిగువ గ్రామాలను ముంపు నుంచి కాపాడారు. నెల్లూరు బ్యారేజీ కమ్ రెండు వరసల రోడ్డు బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రవాణా సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారని నెల్లూరు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి శిథిలమైన ఆనకట్ట స్థానంలో బ్యారేజీ.. నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదికి అడ్డంగా 1854–55లో 481.89 మీటర్ల వెడల్పుతో ఆనకట్టను నిర్మించిన బ్రిటిష్ సర్కార్ అరకొరగా ఆయకట్టుకు నీళ్లందిస్తూ వచ్చి ంది. పెన్నా నదికి 1862లో వచ్చి న భారీ వరదలకు ఆనకట్ట దెబ్బతినడంతో 621.79 మీటర్ల వెడల్పుతో 0.7 మీటర్ల ఎత్తుతో కొత్త ఆనకట్టను నిర్మించారు. పూడిక పేరుకుపోవడం, శిథిలమవడంతో ఆయకట్టుకు నీళ్లందించడం 1904 నాటికే సవాల్గా మారింది. నెల్లూరు తాగునీటి కోసం తల్లడిల్లింది. ఈ ఆనకట్టకు దిగువన ఉన్న రోడ్డు ద్వారా నెల్లూరు–కోవూరు మధ్య రాకపోకలు సాగించేవారు. పెన్నా నదికి కాస్త వరద వచ్చినా నెల్లూరు–కోవూరుల మధ్య రాకపోకలు స్థంభించిపోయేవి. ఆనకట్ట వల్ల వరద వెనక్కి ఎగదన్ని నెల్లూరు నగరాన్ని ముంచెత్తేది. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జిని నిర్మించాలని 1904 నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2004 వరకూ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. జలయజ్ఞంలో భాగంగా నెల్లూరు బ్యారేజ్ కమ్ రోడ్ బ్రిడ్జి నిర్మాణాన్ని రూ.147.20 కోట్లతో దివంగత వైఎస్సార్ 2008 ఏప్రిల్ 24న చేపట్టారు. బ్యారేజీ పనుల కోసం రూ.85.82 కోట్లు ఖర్చు చేశారు. ఆయన హఠాన్మరణం నెల్లూరు బ్యారేజీకు శాపంగా మారింది. కరోనా.. భారీ వరదల్లోనూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెల్లూరు బ్యారేజీని ప్రాధాన్యతగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. కరోనా ప్రతికూల పరిస్థితులు, పెన్నా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వరుసగా మూడేళ్లు భారీ వరదలు ఆటంకాలు సృష్టించినా బ్యారేజీలో రెండు మీటర్ల మందంతో 57 పియర్లను ప్రభుత్వం పూర్తి చేసింది. 51 గేట్లను, ఎలక్ట్రిక్ విధానంలో హాయిస్ట్ను ఏర్పాటు చేసింది. రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని నిర్మించారు. సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్ను పూర్తి చేశారు. 0.4 టీఎంసీలను నిల్వ చేయడానికి వీలుగా బ్యారేజ్కు కుడి, ఎడమ వైపు కరకట్టలను పటిష్టం చేశారు. ఈ పనులకు రూ.88 కోట్లు ఖర్చు చేశారు. కాలయాపన.. కమీషన్లు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ నెల్లూరు బ్యారేజ్ పనులను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. పాత ఆనకట్టను పూర్తిగా తొలగించి బ్యారేజీ నిరి్మస్తున్న ప్రాంతానికి 20 మీటర్ల ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించి ఆయకట్టుకు నీళ్లందిస్తూ బ్యారేజ్ నిర్మించాలని 2014లో ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ంది. 2016 వరకూ టీడీపీ సర్కార్ దీన్ని కనీసం పరిశీలించలేదు. ఆ తరువాత అంచనా వ్యయాన్ని రూ.274.83 కోట్లకు సవరించి కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు అధికంగా రాబట్టుకోవడానికి సులభంగా చేసే పనులకే ప్రాధాన్యం ఇచ్చి ంది. 2019 మే 29 వరకూ రూ.60.19 కోట్లను ఖర్చు చేసి బ్యారేజీలో 57 ఫియర్లను (కాంక్రీట్ దిమ్మెలు) పునాది కంటే ఒక మీటర్ ఎత్తు వరకు మాత్రమే చేయగలిగింది. ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు కరోనా, పెన్నా వరదలు లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రాధాన్యతగా చేపట్టి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశాం. ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నాం. బ్యారేజీలో నిత్యం 0.4 టీఎంసీలను నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుంది. సాగు, తాగునీటి సమస్యను సీఎం జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ ఆయకట్టు సస్యశ్యామలం.. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ నెల్లూరు బ్యారేజ్ను సీఎం జగన్ రికార్డు సమయంలో పూర్తి చేశారు. బ్యారేజీ పూర్తయ్యాక ఆయకట్టంతంటికీ సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. 2022 నుంచి ఏటా రెండు పంటలు పండిస్తూ ఏడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. మంచి దిగుబడులు వస్తున్నాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడంతో ప్రయోజనం పొందుతున్నాం. బ్యారేజీ మీదుగా నెల్లూరుకు సులభంగా వెళ్లి వస్తున్నాం. – తన్నీరు అనిల్, రైతు, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా నాడు కల.. నేడు నిజం నెల్లూరు బ్యారేజీ ఒక కల. ఈ పనులను మహానేత వైఎస్ ప్రారంభిస్తే సీఎం జగన్ పూర్తి చేశారు. బ్యారేజ్ పూర్తికాక ముందు ఆయకట్టుకు నీళ్లందకపోవడంతో 3.5 ఎకరాల్లోనే పంటలు సాగు చేశా. ఇప్పుడు సొంత పొలంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. – వాకాటి మహేష్, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా నెల్లూరు బ్యారేజీ స్వరూపం ఇదీ.. ఎక్కడ?: నెల్లూరు నగరానికి సమీపంలో పెన్నా నదిపై (మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీకి 20 కి.మీ. దిగువన) పరీవాహక ప్రాంతం: 51,800 చదరపు కిలోమీటర్లు బ్యారేజీ పొడవు: 640 మీటర్లు (బ్యారేజీకి అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు: 51 (పది మీటర్లు ఎత్తు, 3 మీటర్ల వెడల్పుతో 43 గేట్లు.. 10 మీటర్లు ఎత్తు, 4.3 మీటర్ల ఎత్తుతో 8 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుకు సిద్ధం చేసిన స్టాఫ్లాగ్ గేట్లు: 6 గేట్ల నిర్వహణ: వర్టికల్ లిఫ్ట్ గరిష్ట నీటి మట్టం: 14.3 మీటర్లు గరిష్ట వరద విడుదల సామర్థ్యం: 10,90,000 క్యూసెక్కులు ఆయకట్టు: 99,525 ఎకరాలు గరిష్ట నీటి నిల్వ: 0.4 టీఎంసీలు అంచనా వ్యయం: రూ.274.83 కోట్లు వైఎస్సార్ హయాంలో చేసిన వ్యయం: రూ.85.82 కోట్లు కనీస నీటి మట్టం: 11.3 మీటర్లు టీడీపీ హయాంలో వ్యయం: రూ.60.19 కోట్లు (కాంట్రాక్టర్ నుంచి అధికంగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి సులభమైన పనులను మాత్రమే చేపట్టారు) వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం: రూ.88 కోట్లు -
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త ఏడాదికి కిక్కేకిక్కు
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదికి లిక్కర్ కిక్కు బాగానే ఎక్కింది. కొత్త సంవత్సర వేడుకల ప్రారంభమయ్యే రోజుతోపాటు రెండు రోజుల ముందు నుంచీ ఏకంగా రూ.620 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్షాపులకు చేరింది. డిసెంబర్ 31న ఆదివారం సెలవుదినం అయినా, మద్యం డిపోలు తెరచి ఉంచగా, రూ.127 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. డిసెంబర్ 30న రూ.313 కోట్లు, డిసెంబర్ 29న రూ.180 కోట్ల మద్యం డిపోల నుంచి వెళ్లిందని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొత్తగా ప్రారంభమైన షాపుల్లో అమ్మకాల కోసం ఈ నెల మొదట్లోనే పెద్ద ఎత్తున లిక్కర్ చేరిందని, ఈ నేపథ్యంలో కొంత తగ్గుదల కనిపిస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ 31న కొంత తగ్గినా, 30న రూ.59 కోట్లు, 29న రూ.21 కోట్ల మేర ఎక్కువ అమ్ముడయిందని చెబుతున్నారు. ఇక, కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఒక్క డిసెంబర్ 31నే 6లక్షల కేసుల లిక్కర్, 6.5లక్షల కేసుల బీర్లు వైన్షాపుల నుంచి అమ్ముడుపోయి ఉంటాయని, అంతకంటే ముందు రెండు రోజులు, జనవరి 1న కూడా ఇదే స్థాయిలో లిక్కర్ అమ్ముడవుతుందని అంటున్నారు. ఈ డిసెంబర్లో రూ.4,274 కోట్లు ఇక, గత ఏడాది డిసెంబర్ నెల మద్యం అమ్మకా లను పరిశీలిస్తే అంతకుముందు ఏడాది కంటే 27 శాతం పెరిగాయి. ►2022 డిసెంబర్లో రూ.3,377 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, 2023 డిసెంబర్లో అది రూ.4,274 కోట్లకు చేరింది. ►లిక్కర్ కేసులు 2022 డిసెంబర్లో 32.50లక్షలు అమ్ముడుపోగా, 2023లో 43.40లక్షలు అమ్ముడయ్యాయి. ►బీర్లు 2022 డిసెంబర్లో 39.56 లక్షల కేసులు అమ్ముడవగా, 2023 డిసెంబర్లో 46.10లక్షల కేసులు అమ్ముడయినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. ►2022 డిసెంబర్తో పోలిస్తే 2023 డిసెంబర్లో లిక్కర్ అమ్మకాలు 33 శాతం, బీర్లు 16 శాతం పెరగడం గమనార్హం. -
భారీగా పెరిగిన ట్యాక్స్ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్లు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్మెంట్ ఇయర్ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో 8.18 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది. అసెస్మెంట్ ఇయర్ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి. -
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది నవంబర్లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్లో 11.57 మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసింది. దీని ద్వారా రూ.1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ. కొత్త క్లైంట్లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యోగులు, ఇతర సిబ్బందిని జోన్ జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు. -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్లోని ఫాంటైన్బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి
ఆ అమ్మాయి వయొలిన్ సాధన చేస్తుంటే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. కాని ఇప్పుడు మొత్తం కేరళ ఆ అమ్మాయిని చూసి గర్విస్తోంది. 14 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ వారి ఫెలోషిప్కు ఎంపికై రికార్డు సృష్టించింది మార్టినా.ఈ వయసులో ఈ ఫెలోషిప్ సాధించిన వారు దేశంలో లేరు.ఏ వయసు వారైనా కేరళలో లేరు.సంగీతంతో ఆరోహణ దిశలో పయనిస్తోంది మార్టినా. సుప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు రాసిన ‘వాయులీనం’ కథలో భార్య తీవ్రంగా జబ్బు పడితే ఆమెను కాపాడుకోవడానికి భర్త ఆమె ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న వయొలిన్ని అమ్మేస్తాడు. ఆమె బతుకుతుంది. అమ్మకానికి వెళ్లిపోయిన వయొలిన్ని తలుచుకుని, మిగిలిన డబ్బుతో భర్త కొన్న చీరను చూస్తూ ‘పోనీలేండి జ్ఞాపకంగా పడి ఉంటుంది’ అంటుంది వేదనగా. జీవితంలో కళాసాధన, కళాసాధనకు ఎదురు నిలిచే జీవితం గురించి చెప్పిన కథ ఇది.మార్టినా జీవితంలో తండ్రి కూడా ఇలాంటి త్యాగమే చేశాడు. మొదలైన ప్రయాణం 14 ఏళ్ల మార్టినా ఇప్పుడు వయొలిన్లో గొప్ప పేరు సంపాదించి ‘ట్రినిటీ కాలేజ్ లండన్’ ఫెలోషిప్ పోందిందిగాని ఇక్కడి వరకూ చేరడానికి ఆమె తండ్రి పడిన కష్టం ఉంది. మార్టినాది కన్నూరు జిల్లాలోని పెరవూర్. తండ్రి చార్లెస్కు బాల్యంలో గొప్ప మ్యుజీషియన్ కావాలని ఉండేది కాని ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొద్దోగొప్పో నేర్చుకున్న కీబోర్డుతో చర్చ్లో సంగీతం వాయించేవాడు. ఆ డబ్బు సరిపోక మిగిలిన సమయాల్లో ఆటో నడిపేవాడు. భార్య షైనీ గృహిణిగా ఉన్నంతలో సంసారాన్ని లాక్కువచ్చేది. అయితే ఐదారేళ్ల వయసు నుంచే కూతురు మార్టినా సంగీతంలో విశేష ప్రతిభ చూపడం వారికి ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆందోళన కలిగించాయి. ఆనందం కూతురికి సంగీతం వచ్చినందుకు, ఆందోళన అందుకు తగ్గట్టుగా నేర్పేందుకు వనరులు లేనందుకు. ఎనిమిదవ తరగతి వరకూ పెరవూర్లోనే చదువుకున్న మార్టినా అక్కడే ఉన్న ‘రాగం స్కూల్ ఆఫ్ మ్యూజిక్’లో వయొలిన్ నేర్చుకుంది. కానీ తర్వాతి స్థాయి వయొలిన్ నేర్చుకోవాలంటే త్రిశూర్లో చేరాలి. అంటే కుటుంబం మొత్తం త్రిశూర్కు మారాలి. అక్కడ మొదలైంది సమస్య. ఆటో అమ్మేసిన తండ్రి ఉంటున్న పెరవూర్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిశూర్కు కాపురం మారాలంటే చాలా ఖర్చు. సాధనకు వీలైన ఇల్లు తీసుకోవాలి. ముఖ్యంగా కనీసం లక్ష రూపాయల విలువైన కొత్త వయొలిన్ కొనాలి. ఇవన్నీ ఆలోచించి తండ్రి ఆటో అమ్మేశాడు. అంతేకాదు తమ చిన్నపాటి ఇంటిని కూడా అమ్మేద్దామనుకున్నాడు. కాని బంధువులకు సంగతి తెలిసి వారు తలా ఒక చేయి వేశారు. 2019లో త్రిశూర్కు షిఫ్ట్ అయినప్పటి నుంచి మార్టినా సాధన పెంచింది. ఉదయం ఐదు గంటలకు లేచి స్కూల్ సమయం అయ్యే వరకు సాధన చేసేది. అయితే ఇరుగు పోరుగు వారు ఇల్లు ఖాళీ చేయమని గోల చేశారు. దాంతో మరో ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఏమైనా సరే కూతురిని గొప్ప వయొలినిస్ట్ చేయాలని చార్లెస్ సంకల్పం బూనాడు. జాతీయ విజేత త్రిశూర్లో, కొచ్చిలో గొప్ప గొప్ప గురువుల దగ్గర సాధన చేసి వయొలిన్ నేర్చుకుంది మార్టినా. తీగలను మీటి మీటి ఆమె చేతి వేలికొసలు రక్తాన్ని చిమ్మేవి. మెడ మీద వయొలిన్ ఉంచి ఉంచి కదుములు కట్టేవి. అయినా సరే మార్టినా తన సాధన మానలేదు. ఫలితం? ఆల్ ఇండియా వయొలిన్ కాంటెస్ట్ 2022, 2023... రెండు సంవత్సరాలూ ఆమే విజేతగా నిలిచింది. 100 మంది వయొలినిస్ట్లను ఓడించి మరీ! ఆ తర్వాత ‘సౌత్ ఏసియన్ సింఫనీ’లో సభ్యురాలు కాగలిగింది. ఈ సింఫనీ కోసం 11 దేశాల వయొలినిస్ట్లు పోటీ పడుతుంటారు. చివరగా ప్రతిష్ఠాత్మక ట్రినిటీ కాలేజ్ లండన్ ఫెలోషిప్ పోందింది. 14 ఏళ్ల వయసులో ఈ ఫెలోషిప్ను పోందిన వారు లేదు. చార్లెస్, షైనీల ఆనందానికి అవధులు లేవు.ఈ గొప్ప కళాకారిణి సంగీతానికి కొత్త శోభను తేవాలని కోరుకుందాం. -
దిగుబడి వరిస్తోంది
సాక్షి అమలాపురం: వర్షాభావ పరిస్థితులు.. గోదావరి నదిలో అరకొరగా వచ్చిన ప్రవాహ జలాలు గోదావరి డెల్టాల్లో ఖరీఫ్కు కలిసొచ్చింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తోంది. వర్షాలు లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం గోదావరి కాలువలకు సంవృద్ధిగా సాగునీరు అందించడంతో డెల్టాల్లో ప్రాంతాన్ని బట్టి 34 బస్తాలు (బస్తా 75 కేజీలు) నుంచి 48 బస్తాల వరకు దిగుబడి లభిస్తోంది. ఇప్పటికే కోతలు మొదలైన తూర్పు డెల్టాలోని రాయవరం, మండపేట, పశ్చిమ డెల్టా పరిధిలోని నిడదవోలు వంటి మండలాల్లో కొన్నిచోట్ల 48 బస్తాల వరకు దిగుబడిగా వస్తుండటంతో రైతులు సాగుపై ఆశలు పెట్టుకున్నారు. ఈశాన్యం వల్ల భారీ వర్షాలు, వాయుగుండాలు, తుపానులు రాకుండా ఉంటే ఈ ఖరీఫ్లో లాభాలు కళ్లజూస్తామని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ‘తూర్పు’లో 3.90 లక్షల ఎకరాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రస్తుతం 3.90 లక్షల ఎకరాల్లో వరి ఆయకట్టు ఉంది. కోనసీమ జిల్లాలో 1.58 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. అధికారుల అంచనా ప్రకారం ఇక్కడ 3.80 లక్షల టన్నులు. వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం డెల్టాలో ఖరీఫ్ దిగుబడి సగటున 28 బస్తాలు. కానీ.. కోనసీమ జిల్లాలో ఇక్కడ ఎకరాకు సగటున 32.50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అధికారుల చెబుతున్నారు. వాస్తవానికి ఈ జిల్లా పరిధిలో అంచనాలకు మించి దిగుబడి వస్తోంది. జిల్లాలోని ఆత్రేయపురంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఎకరాకు సగటు 34 బస్తాల దిగుబడిగా తేలింది. రాయవరం మండలంలో వరి కోతలు ప్రారంభం కాగా.. ఇక్కడ 42 నుంచి 46 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో 32 బస్తాల నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తుందని అంచనా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పరిధిలో వరి కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సగటున 35 బస్తాల దిగుబడిగా వస్తుండగా.. పశ్చిమ డెల్టా పరిధిలోని పెరవలి మండలంలో 38 నుంచి 42 బస్తాల వరకు దిగుబడి వస్తోంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం పరిధిలో ప్రాంతాన్ని బట్టి 32 నుంచి 40 బస్తాల వరకు పండింది. గత కొన్నేళ్లుగా ఖరీఫ్ సాగు అనుకున్న స్థాయిలో దిగుబడి రావడం లేదు. పంట కోతకు వచ్చే సమయంలో భారీ వర్షాలు రైతులను ముంచేస్తున్నాయి. పంట పండినా దిగుబడి రావడం లేదు. కోనసీమ జిల్లాలో గత ఖరీఫ్ కొన్ని ప్రాంతాల్లో 24 బస్తాలు మించి పండలేదు. వర్షాభావం కలిసొచ్చింది ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం వల్ల డెల్టాలో మంచి దిగుబడి వస్తోంది. ఎండల వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగటం దిగుబడి పెరగడానికి కారణమైంది. మండపేట, రాయవరం వంటి మండలాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాలలో సగటు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. – బోసుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
ఒకే రోజు రూ.78 కోట్ల జప్తు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రికార్డు స్థాయిలో రూ.78.03 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.243.76 కోట్లకు పెరిగిపోయింది. కాగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ.87.92 కోట్లు. ఒక్క రోజు 6వేల లీటర్ల మద్యం జప్తు తాజాగా రూ.1.21 కోట్లు విలువ చేసే 6132 లీటర్ల మద్యం జప్తు చేశారు. దీంతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం మద్యం 65,223 లీటర్లు కాగా, దీని విలువ రూ.10.21 కోట్లు. గురువారం రూ.16.77లక్షలు విలువ చేసే 103.165 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న గంజాయి 2950 కిలోలకు పెరిగింది. దీని విలువ రూ.7.72 కోట్లు. ఇప్పటి వరకు మరో రూ.7.72 కోట్లు విలువ చేసే ఇతర మత్తు పదార్థాలను జప్తు చేశారు. గురువారం రూ.57.67 కోట్లు విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులు పట్టుకున్నారు. 83కిలోల బంగారం పట్టివేత అందులో 83.046 కిలోల బంగారం, 212 కిలోల వెండి, 112.195 క్యారట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం ఉంది. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువుల విలువ రూ.120.40 కోట్లకు ఎగబాకింది. ఇందులో 181 కిలోల బంగారం, 693కిలోల వెండి, 154.45 క్యారెట్ల వజ్రాలున్నాయి. గురువారం రూ.8.84 కోట్లు విలువ చేసే ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి తదితర వస్తువులను పట్టుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పట్టుబడిన ఇలాంటి వస్తువుల విలువ రూ.17.84 కోట్లకు చేరింది. హైవేపై రూ.750 కోట్ల నగదు కలకలం అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దులోని 44వ జాతీయ రహదారిపై ఏకంగా రూ.750 కోట్ల నగదు పట్టుబడినట్లు సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ అయింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. ’’రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కేరళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హైదరాబాద్ యూబీఐకి నగదును బదిలీ చేస్తున్నట్టు మంగళవారం రాత్రి సమాచారం వచ్చింది. ఈ మేరకు జిల్లా నుంచి ఆర్డీఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, డీఎస్పీ అధికారులు విచారణ చేసేందుకు స్పాట్కు వెళ్లి, నగదుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ ఎస్కార్ట్తో నగదును హైదరాబాద్లోని యూబీఐకి చేరినట్లు నిర్ధారణ చేసుకున్నాము’’’ అని క్రాంతి ఆ ప్రకటనలో వివరించారు. అయితే ఎంత మేరకు నగదు ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
CWC 2023 SA VS SL: 48 ఏళ్ల వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి ఇలా..!
శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య నిన్న జరిగిన వరల్డ్కప్ మ్యాచ్కు సంబంధించిన రికార్డులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వరల్డ్కప్లో హయ్యెస్ట్ టీమ్ స్కోర్ (సౌతాఫ్రికా, 428) రికార్డు, వరల్డ్కప్లో తొలిసారిగా ఓఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీలు చేయడం, వరల్డ్కప్ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (మార్క్రమ్, 49 బంతుల్లో) రికార్డు, వరల్డ్కప్లో అత్యధిక మ్యాచ్ స్కోర్ (సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు కలిపి 754 పరుగులు చేశాయి) రికార్డు, వరల్డ్కప్లో 200 సెంచరీలు పూర్తి చేసుకున్న రికార్డు (వరల్డ్కప్లో 200వ సెంచరీ, మార్క్రమ్), వరల్డ్కప్లో తొలిసారి ఓ ఇన్నింగ్స్లో నలుగురు బౌలర్లు 80 అంతకంటే ఎక్కువ పరుగులు, ఇద్దరు బౌలర్లు 90 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు (శ్రీలంక).. ఇలా ఈ మ్యాచ్ పలు ఆసక్తికర వరల్డ్కప్ రికార్డులు నమోదయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్కు సంబంధించి మరో రికార్డు వెలుగుచూసింది. వరల్డ్కప్ టోర్నీల్లో తొలిసారి ఓ మ్యాచ్లో 100 కంటే ఎక్కువ బౌండరీలు నమోదు కావడం. నిన్నటి మ్యాచ్లో రికార్డు స్థాయిలో 105 బౌండరీలు (సౌతాఫ్రికా 45 ఫోర్లు, 14 సిక్సర్లు, శ్రీలంక 29 ఫోర్లు, 17 సిక్సర్లు) నమోదయ్యాయి. 48 ఏళ్ల వరల్డ్కప్ హిస్టరీలో ఈ స్థాయిలో బౌండరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేయగా.. శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వాన్ డర్ డసెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 2 సిక్స్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్స్లు), క్వింటన్ డి కాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలతో విరుచుకుపడగా.. లంక ఇన్నింగ్స్లో చరిత్ అసలంక (65 బంతుల్లో 79; 8 ఫోర్లు, 4 సిక్స్లు), కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్స్లు), దసున్ షనక (62 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్ధసెంచరీలు నమోదు చేశారు. -
యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్! క్యాష్ అస్సలు తీసేట్టులేరుగా..
UPI Transactions Cross 10 Billion Mark: దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపుల్లో మళ్లీ రికార్డ్ నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు వరుసగా రెండో సారి 10 బిలియన్ లావాదేవీల మార్క్ను దాటాయి. గడిచిన ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీలు మొదటిసారిగా 10 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. మళ్లీ సెప్టెంబర్ నెలలో రెండో సారి 10 బిలియన్ లావాదేదీలు జరిగాయి. సెప్టెంబర్ 30 వరకు 10.55 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 'X' (ట్విటర్)లో పేర్కొంది. చెల్లింపు వ్యవస్థల గణాంకాలను షేర్ చేసింది. అయితే ఆగస్టులో నమోదైన 10.58 బిలియన్ల లావాదేవీలతో పోల్చితే సెప్టెంబర్లో జరిగిన లావాదేవీలు కాస్త తక్కవగా ఉన్నాయి. కానీ ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 6.78 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే 55 శాతం పెరిగాయి. రూ. 15.79 లక్షల కోట్లు యూపీఐ లావాదేవీల మొత్తం విలువను పరిశీలిస్తే ఆగస్టు నెలలో రూ. 15.76 లక్షల కోట్ల నుంచి సెప్టెంబర్లో రూ. 15.79 లక్షల కోట్లకు చేరింది. 2022 సెప్టెంబర్లో జరిగిన లావాదేవీల విలువ రూ. 11.16 లక్షల కోట్లు. వరల్డ్లైన్ డేటా ప్రకారం.. యూపీఐ లావాదేవీల సంఖ్య 2018 జనవరిలో 151 మిలియన్లు ఉండగా 2023 జూన్ నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంది. 30th SEPTEMBER 2023: DAILY PAYMENTS STATISTICS #BHIMUPI #IMPS #NETC pic.twitter.com/hvh1UyEjMe — NPCI (@NPCI_NPCI) October 1, 2023 -
యూపీఐ లావాదేవీలు 1,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ రంగంలో దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2023 ఆగస్ట్లో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏకంగా 1,000 కోట్ల మార్కును దాటి 1,024.17 కోట్లకు చేరుకుంది. వీటి విలువ రూ.1518456.40 కోట్లు. 2022 ఆగస్ట్లో లావాదేవీల సంఖ్య 658.19 కోట్లు కాగా, విలువ రూ.10,73,162 కోట్లు నమోదైంది. ఈ ఏడాది ఆగస్ట్లో వ్యక్తుల నుంచి వ్యక్తులకు 74.79 శాతం వాటాతో రూ.11,79,095.6 కోట్ల విలువైన 438.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. అలాగే వ్యక్తుల నుంచి వర్తకులకు 25.21 శాతం వాటాతో రూ.3,97,440.9 కోట్ల విలువైన 619.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్షణాల్లో చెల్లింపులు జరిపే వీలుండడంతో యూపీఐ యాప్స్కు ఊహించనంతగా ఆదరణ పెరుగుతోంది. భారత్లో యూపీఐ సేవలను 484 బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సంస్థలు అందిస్తున్నాయి. యూపీఐ యాప్స్లో టాప్–5లో వరుసగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. చిన్న మొత్తాలే అధికం.. పరిమాణం పరంగా వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 లోపు విలువ చేసే లావాదేవీల సంఖ్య ఏకంగా 84.5 శాతం వాటాతో 523.7 కోట్లు జరిగాయి. రూ.501–2,000 మధ్య 10.8 శాతం వాటాతో 67 కోట్లు, రూ.2,000లపైన 4.67 శాతం వాటాతో 28.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు విలువ చేసేవి 55.6 శాతం వాటాతో 244 కోట్లు, రూ.501–2,000 విలువ కలిగినవి 22 శాతం వాటాతో 96.6 కోట్లు, రూ.2,000లపైన విలువైనవి 22.3 శాతం వాటాతో 97.9 కోట్ల లావాదేవీలు రిజిష్టర్ అయ్యాయి. విలువ పరంగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు రూ.500 లోపు నమోదైన లావాదేవీల విలువ 3.44 శాతం వాటాతో రూ.40,558 కోట్లు. అలాగే రూ.501–2,000 మధ్య రూ.1,17,782 కోట్లు చేతులు మారాయి. రూ.2,000లపైన జరిగిన లావాదేవీల విలువ 86.57 శాతం వాటాతో రూ.10,20,754.8 కోట్లుగా ఉంది. ఇక వ్యక్తుల నుంచి వర్తకులకు రూ.500 వరకు విలువ చేసే రూ.59,992.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. రూ.501–2,000 మధ్య రూ.68,665 కోట్లు, రూ.2,000లపైన రూ.2,68,782.5 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. -
స్టూడెంట్స్ పంట పండింది! రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది. నాలుగింట ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. చైనాను అధిగమించిన భారత్ 2022లో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్ కూడా.. ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all… — U.S. Embassy India (@USAndIndia) September 25, 2023 -
వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్ఫోన్..!!
ఆదిలాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28) పటాన్చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మొఘల్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్ తన బంధువు గౌస్ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఎజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు. టోలీచౌకీకి నదీమ్ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్, షహజాజ్ బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆమె అందం అలాంటిది, జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆమె స్నేహం కోసం..
అమృత షేర్గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి. అమృత షేర్గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత. అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది. రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం గొప్ప చిత్రకారిణి అమృత షేర్గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్ను కూడా గీసుకుంది. అకాల మరణం అమృత షేర్గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్ను వివాహం చేసుకుంది. వారు లాహోర్లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు. ఆకర్షణాజాలం అమృత షేర్గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి. -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ముగింపు! 20,100 ఎగువకు నిఫ్టీ..
Today StockMarket closing: దలాల్స్ట్రీట్లో బుల్ పరుగులు కొనసాగుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్మార్కెట్లు అదే జోరును కొనసాగిస్తూ సాయంత్రం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76 పాయింట్ల లాభంతో 67,543 వద్ద ముగియగా, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 20,102 వద్ద ముగిసింది. క్రితం రోజు ఆల్టైమ్ హై 20,000 పాయింట్లను దాటిన నిఫ్టీ ఈరోజు మరింత ఎగబాకి 20,100 పాయింట్లను దాటి రికార్డ్ సృష్టించింది. యూపీఎల్, హిందాల్కో, ఓఎన్జీసీ, దివిస్ ల్యాబ్స్, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, ఎల్టీఐ మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా సంస్థల నష్టాలను మూటగట్టుకుని లాప్ లూజర్స్ జాబితాలో చేరాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆర్టీసీలో అనగనగా ఓ రోజు.. సెప్టెంబర్ 11
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే.. నష్టాలు, అప్పులు, ఆలస్యంగా తిరిగే ట్రిప్పులు, డొక్కు బస్సులు.. ఇలాంటివి చాలామందికి మదిలో మెదులుతాయి. కానీ, కొంతకాలంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంస్థ తనను తాను మార్చుకుంటూ వస్తూ ఇప్పుడు అరుదైన రికార్డు సృష్టించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో కేవలం నాలుగు డిపోలు మాత్రమే ఖర్చులను మించి ఆదాయాన్ని సాధించాయన్న విషయం అధికారులు ఆయన ముందుంచారు. తాజాగా ఆర్టీసీ చేసిన ఫీట్ ఏంటంటే.. ఆర్టీసీలో 96 డిపోలు ఉండగా, గత సోమవారం (సెప్టెంబరు 11) రికార్డు స్థాయిలో 90 డిపోలు నిర్వహణ ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందాయి. ఇక ఈనెల సెప్టెంబర్ 11వ తేదీ వరకు వరసగా 71 డిపోలు లాభాల(నిర్వహణ ఖర్చులను మించి)ను ఆర్జించాయి. టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ రెండు ఫీట్లు నమోదయ్యాయి. ప్రభుత్వంలో విలీనం అవుతున్న నేపథ్యంలో మంచి ఊపుమీద ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కలిసికట్టుగా, పక్కా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఈ రికార్డులను సాధించటం విశేషం. ఫలితాన్నిస్తోన్న ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’ ‘ఆల్ డిపోస్ ప్రాఫిట్ చాలెంజ్’పేరుతో కొద్ది రోజులుగా ఆర్టీసీ అమలు చేస్తున్న ప్రత్యేక ప్రణాళిక ఇప్పుడు ఈ రూపంలో సరికొత్త ఫలితాలని అందించింది. సాధారణంగా సోమవారం రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణ సోమవారాల్లో రూ.16–రూ.17 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఈనెల 11న (చివరి ‘శుభముహూర్త’సోమవారం) ఏకంగా రూ.20.22 కోట్ల ఆదాయం నమోదైంది. ♦ సోమవారం రోజున ముషీరాబాద్–2, ఉట్నూరు, కోస్గి, భైంసా, మిధాని, నారాయణ్ఖేడ్ డిపోలు మినహా మిగతా 90 డిపోలు నిర్వహణ ఖర్చులను మించి ఆదాయాన్ని పొందాయి. నారాయణఖేడ్ డిపో ఖర్చు కంటే కేవలం రూ.వేయి మాత్రమే తక్కువ ఆదాయాన్ని పొందింది. నష్టాలు పొందిన మిగతా ఐదు డిపోలు కూడా రూ.22 వేల నుంచి రూ.1.45 లక్షల నష్టాన్ని మాత్రమే పొందటం గమనార్హం. ♦ ఆర్టీసీలో సాధారణంగా కొన్ని బస్సులను స్పేర్లో ఉంచుతారు. మరికొన్ని మరమ్మతు కోసం పక్కన పెడతారు. శ్రావణ శుభముహూర్తాల నేపథ్యంలో అస్సలు నడవలేని డొక్కు బస్సులు తప్ప అన్నింటినీ బాగుచేసి రోడ్డెక్కించారు. 11న ఆక్యుపెన్సీ రేషియో 85.19 శాతంగా నమో దైంది. సాధారణ రోజులతో పోలిస్తే గత పది రోజుల్లో కనీసం 5 శాతం వరకు పెరిగిందని ఆర్టీసీ పేర్కొంటోంది. ♦ కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కొన్ని రూట్లలో తక్కువగా ఉంటుంది. డెడికేటెడ్ సరీ్వ సుల పేరుతో, ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉండే మార్గాల్లోనూ బస్సులు తిప్పే అలవాటు ఉండేది. ఇప్పుడు, ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఎటు ఉందో ఆయా మార్గాల్లోనే ఎక్కువ బస్సులు తిప్పుతున్నారు. గత పక్షం రోజులుగా రోజువారీ ఆదాయం దాదాపు రూ.కోటిన్నర మేర పెరిగింది. ♦ ఇటీవలే దాదాపు 650 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు, 200 డీలక్స్ బస్సులు చేతికందాయి. వాటిని పూర్తి సామర్ధ్యంతో తిప్పుతున్నారు. సాధారణ రోజుల్లో 28 లక్షల కి.మీ. మేర బస్సులను తిప్పుతుండగా 11న 34 లక్షల కి.మీ. తిప్పారు. ♦ ఇతర సిబ్బందికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రధాన పాయింట్ల వద్ద వినియోగించారు. దీనివల్ల సమయానుకూలంగా బస్సులు, రావటం, వచ్చిన బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కేలా చూడటం, ప్రైవేటు వాహనాల వైపు వెళ్లేవారిని మళ్లించటం లాంటివి జరిగాయి. ♦ సెలవులను నియంత్రించి వీలైనంతమంది సిబ్బంది విధుల్లో ఉండేలా చూశారు. -
‘వర్జీనియా’కు రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు రికార్డుస్థాయిలో ధర పలకడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని ఐదు వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం దశల వారీగా ముగిసింది. గత ఏడాది కంటే కేజీ సరాసరి ధర రూ.50 పైగానే లభించింది. ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో పండే వర్జీనియాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ పరిధిలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో మొత్తం రూ.1,422.53 కోట్ల విలువైన పొగాకు అమ్మకాలు జరిగాయి. ఎన్ఎల్ఎస్ పరిధిలో 55 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకున్నారు. గత ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో కేజీ సరాసరి ధర రూ.191.72 లభించగా, ఈ ఏడాది కేజీ సరాసరి ధర రూ.248 లభించింది. అంటే ఈ ఏడాది కేజీకి రూ.56.28 అధికంగా లభించింది. -
అదానీ గ్రూప్ చరిత్రలోనే అత్యధికం.. భారీ లాభాలు!
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించాయి. గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఉమ్మడిగా రూ. 23,532 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించాయి. గ్రూప్ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. గతేడాది(2022–23) క్యూ1తో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధి. ఇక 2018–19లో గ్రూప్ ఆర్జించిన పూర్తి ఇబిటా రూ. 24,780 కోట్లకు దాదాపు సమానమని అదానీ గ్రూప్ పేర్కొంది. డైవర్సిఫైడ్ కార్యకలాపాలు కలిగిన గ్రూప్లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్ తదితరాలున్నాయి. వీటి రూ. 42,115 కోట్ల నగదు నిల్వలను పరిగణించాక రూ. 18,690 కోట్ల నికర రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. -
రుణమాఫీలో రికార్డు
సాక్షి, హైదరాబాద్: రైతుల పక్షాన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని, పదేళ్ల కాలంలో రెండుసార్లు రైతులకు పంట రుణాలు మాఫీ చేసి రికార్డు సృష్టించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పటికీ రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 37 లక్షల మందికి రూ.20,141 కోట్ల మేర రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.99,999 వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అమలు చేశామని, రూ.16.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,098 కోట్లు జమ అయ్యాయని వివరించారు. రుణమాఫీ, రెన్యువల్ తీరును పరిశీలించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ఆర్థిక, వ్యవసాయ శాఖ కార్యదర్శులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. సోమవారం బేగంపేటలోని వివాంటా హోటల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం(ఎస్ఎల్బీసీ) జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి హరీశ్రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ఘనత ముఖ్యమంత్రిదే..! దేశంలో పలు రాష్ట్రాలు రుణమాఫీ అంశంపై అనేక పరిమితులు విధించాయని, కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మాత్రమే అని హరీశ్రావు అన్నారు. తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతుకు భారీ ఊరట లభిస్తుందని అన్నారు. ఒకవేళ రైతు రుణ మొత్తాన్ని చెల్లించి ఉంటే ఆ మేరకు నగదును రైతుకు ఇవ్వాలని సూచించారు. కొందరు రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు వంటి పాత రుణాలు ఉండొచ్చని, ఇప్పుడు వచ్చిన డబ్బులను పాత అప్పు కింద జమ చేయకూడదని స్పష్టం చేశారు. రుణమాఫీ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేసేలా బ్యాంకులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం ధ్యేయంగా, ఆర్థిక భారాన్ని మోస్తూ రైతు రుణమాఫీని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి సాధించలేమన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి మార్చేశారని ప్రశంసించారు. -
అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి..
ప్రపంచంలో విచిత్రమైన రికార్డులు నెలకొల్పేవారు చాలామందే ఉన్నారు. అయితే ఒక మహిళ తన పొడవైన గడ్డంతో ప్రపంచ రికార్డు నెలకొల్పిందనే విషయం మీకు తెలుసా? వినేందుకు ఇది వింతగా అనిపించినా ఇది ముమ్మాటికీ వాస్తవం. అమెరికాకు చెందిన ఎరిన్ హనీకట్ గత రెండేళ్లుగా తన గడ్డాన్ని పెంచుతూ వస్తోంది. దీంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. ఎరిన్ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్) బాధితురాలు. దీని బారినపడిన వారికి హార్మోనల్ బ్యాలెన్స్ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా శరీరంపై అత్యధికంగా రోమాలు ఏర్పడతాయి. ఎరిన్కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమయ్యింది. మొదట్లో ఆమె వివిధ పద్దతుల్లో వాటిని తొలగించేది. మరోవైపు హైబ్లడ్ ప్రజర్ కారణంగా ఆమెకు చూపు మందగించింది. అప్పటి నుంచి ఆమె ముఖంపై వెంట్రుకలను పెంచసాగింది. ఎరిన్ హనీకట్ గడ్డం 30 సెంటీమీటర్ల పొడవు అంటే 11.81 ఇంచీలు పెరిగింది. ఒక మహిళకు ఇంత పొడవాటి గడ్డం ఉండటం విశేషం. ఫలితంగా ఆమె గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది. ఈమె కన్నా ముందు అమెరికాకు చెందిన 75 ఏళ్ల మహిళ వివియన్ హీలర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమెకు 25.5 సెంటీమీటర్ల గడ్డం ఉంది. తాను సాధించిన రికార్డు గురించి ఎరిన్ మాట్లాడుతూ తాను గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంటానని ఎన్నడూ అనుకోలేదని అన్నారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
‘ఎక్స్’లెంట్: ట్విటర్ సరికొత్త రికార్డ్! షేర్ చేసిన మస్క్
‘ఎక్స్’(X)గా పేరు మారిన ట్విటర్ (Twitter) సరికొత్త రికార్డ్ సాధించింది. మంత్లీ యూజర్ల సంఖ్యలో నూతన గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు దాని అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మంత్లీ యూజర్ల సంఖ్య 540 మిలియన్లను దాటినట్లు చూపుతున్న గ్రాఫ్ను షేర్ చేశారు. ఇటీవల పడిపోయిన ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునేందుకు సంస్థలో సంస్థాగత మార్పులు చేపట్టిన తరుణంలో యూజర్ల సంఖ్య రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. మరోవైపు ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెటా.. ట్విటర్కు పోటీగా థ్రెడ్స్ అనే మైక్రో బ్లాగింగ్ యాప్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్లో మస్క్ ట్విటర్ను కొనుగోలు చేయడానికి ముందు 2022 మే నాటికి ట్విటర్ 229 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉండగా తన ఆధీనంలోకి వచ్చాక 2022 నవంబర్లో 259.4 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు మస్క్ పోస్ట్ చేశారు. తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి మస్క్ ట్విటర్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. బ్లూటిక్ను పెయిడ్ సర్వీస్గా మార్చారు. అస్తవ్యస్తమైన మార్పుల ఫలితంగా ప్రకటనల ఆదాయం క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గత మేలో ఎన్బీసీ యూనివర్సల్ అడ్వర్టైజింగ్ చీఫ్గా ఉన్న లిండా యాకారినోను ట్విటర్ (ఎక్స్)కు సీఈవోగా నియమించారు. తద్వారా తనకు సబ్స్క్రిప్షన్ రాబడితోపాటు ప్రకటనల ఆదాయం కూడా కీలకమని సంకేతాలిచ్చారు. ఇదీ చదవండి ➤ Elon Musk: అతని కోపం ప్రళయం.. మస్క్ గురించి కీలక విషయాలు చెప్పిన మాజీ ఉద్యోగిని ప్రకటనల ఆదాయంలో దాదాపు 50 శాతం తగ్గిపోయిందని, అలాగే పెరిగిన రుణ భారం కారణంగా నగదు లోటును ఎదుర్కొంటున్నట్లు జులై నెల ప్రారంభంలో మస్క్ చెప్పారు. ఇంతలో ట్విటర్ని ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెటా, మైక్రోసాఫ్ట్తోపాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ‘ఎక్స్’ అక్షరంపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నాయి. కాబట్టి దీనిపై చట్టపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. 𝕏 monthly users reach new high in 2023 pic.twitter.com/trqLGBEvvA — Elon Musk (@elonmusk) July 28, 2023 -
ఇండియా రికార్డ్స్లో ‘వేదాన్షి’కి స్థానం!
కాకినాడ: రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి చెందిన యామల గజ్జన్నదొర, వరలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె ‘వేదాన్షి’కి ఇండియా రికార్డ్స్–2023లో స్థానం లభించింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి గజన్నదొర గురువారం విలేకర్లకు తెలిపారు. అతి చిన్న వయస్సులో జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, శరీర అవయవాలు వంటి 26 రకాల పేర్లను సులభంగా గుర్తించి, పలకడంతో ఆమెకు ఇండియా రికార్ుడ్సలో స్థానం లభించినట్టు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అవార్డును కొరియర్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. ఇండియా రికార్డ్స్లో స్థానం సాధించిన వేదాన్షి, ఆమె తల్లిదండ్రులను పలువురు అభినందించారు. -
LoreKeepers: మా కథలు మా సొంతం
అవ్వలు, తాతలు గతించిపోతే వారికి తెలిసిన జానపద సంపద కూడా అంతరించిపోతుంది. మన పెద్దల నుంచి వినాల్సిన ఎన్నో కథలు, పాటలు, సామెతలు, ఉదంతాలు ఇప్పటికే మన నిర్లక్ష్యం వల్ల అందకుండా పోయాయి. కేరళలో చిన్నారులు ఇకపై ఇలా జరగడానికి వీల్లేదంటున్నారు. తల పండిన వృద్ధుల దగ్గర కూచుని వారికి తెలిసిన మౌఖిక జానపద కథలను రికార్డు చేస్తున్నారు. ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లలు ఇలా కథలు సేకరించేందుకు ఒక ఎన్.జి.ఓ. ప్రతి బడికి తిరిగి శిక్షణనిస్తోంది. ఇది చాలా మంచి ఆలోచన కదూ. బహుశా ఇప్పుడున్న నానమ్మ, తాతయ్యల తరమే కొద్దోగొప్పో జానపద వారసత్వాన్ని కాపాడుకున్న తరం కావచ్చు. ఆ తర్వాతి తరమంతా సెల్ఫోన్ల తరం. టీవీల తరం. ఓటీటీల తరం. ఇప్పుడు పల్లెల్లో ఎవరూ గుంపుగా కూచుని కథలు చెప్పుకోవడం లేదు. తరం నుంచి తరానికి అందాల్సిన మాటలను చెప్పుకోవడం లేదు. పాటలను పంచుకోవడం లేదు. ఆటలను ఆడుకోవడం లేదు. ‘స్థానిక సంస్కృతి’, ‘జానపద వారసత్వం’ ప్రతి సమూహానికి ఉంటుంది. అది ఉమ్మడి ఆస్తి. జాగ్రత్తగా తరం నుంచి తరానికి అందించాలి. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు వరకూ ప్రతి సమూహంలోని ఎందరో వృద్ధులకు– చదవడం, రాయడం రాకపోయినా కథలూ గాథలూ పురాణాల స్థానిక ప్రక్షిప్తాలు చారిత్రక ఘటనలు తెలిసి ఉంటాయి. వారు గతించితే అవి అంతరించిపోతాయి. ఇప్పటికే ఎన్నో తరాల వద్ద నుంచి స్వీకరించి నిక్షిప్తం చేయాల్సిన మౌఖిక జానపద సంపదను రికార్డు చేయడంలో చాలా నిర్లక్ష్యం పాటించి ఉన్నాం. ఇప్పటికీ అరకొరగా మాత్రమే ఆ పని జరుగుతూ ఉంది. ఈ తరం కూడా దాటిపోతే ఆ తర్వాత తెల్లముఖం వేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కేరళ మేల్కొంది. ఇప్పటి వృద్ధతరం వెళ్లిపోక ముందే వారి నుంచి జానపద సంపదను అందుకోవాలనుకుంది. ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ (ఏ.ఆర్.పి.ఓ) అనే స్వచ్ఛంద సంస్థ ‘ది లోర్ కీపర్స్’ పేరుతో పిల్లల్నే సైనికులుగా రంగంలో దింపి జానపద కథలను రికార్డు చేయించి డిజిటల్ ఆర్కయివ్గా నిక్షిప్తం చేయనుంది. ► కరోనా సమయంలో ఆలోచన ‘ఆర్కయివల్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకుల్లో ఒకడైన స్రుతిన్ లాల్ కేరళలో జర్నలిస్ట్. కరోనా సమయంలో లక్షలాదిగా ఇళ్లకు మళ్లిన వలస కార్మికుల వ్యధను రికార్డు చేయడానికి ఢిల్లీ నుంచి లక్నో వరకు వారితో పాటు 600 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. వారి దీనాలాపనను రికార్డు చేశాడు. ఆ సమయంలో వారి మాటలను రికార్డు చేయకపోతే ఆ తర్వాత ఆ సందర్భం, ఆ మాటలు రెండూ మిస్ అయిపోతాయి. భావితరాలకు ఆ వేదన అందదు. సరిగ్గా ఆ సమయంలోనే వృద్ధతరం దగ్గర ఉన్న జానపద సంపద అతనికి గుర్తుకొచ్చింది. ‘నా బాల్యంలో అమ్మమ్మ, నానమ్మలు చెప్పే కథలు ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు చెప్పడం లేదు. ఏవో కొద్దిమంది దగ్గరే అలాంటివి మిగిలి ఉన్నాయి... వాటిని కాపాడుకోవాలి’ అనుకున్నాడతడు. ఆ ఆలోచన ఎన్.జి.ఓ. స్థాపనకు కారణమై మార్జినలైజ్డ్ సెక్షన్స్ దగ్గర వున్న కళారూపాలను నిక్షిప్తం చేసే పనికి అతణ్ణి పురిగొల్పింది. ► పిల్లలే సైనికులు మౌఖిక జానపద కథకు వారసులు బాలలు. వారికే ఆ విలువైన జానపద సంపద అందాలి. అలా అందాలంటే వారే నేరుగా రంగంలోకి దిగాలి అనుకున్నాడు స్రుతిన్ పాల్. ‘ఇప్పుడు దాదాపు ప్రతి చిన్నారికి సెల్ఫోన్ అందుబాటులో ఉంది. వారు సెల్ఫోన్ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు. అన్నీ టక్కున నేర్చుకుంటారు. వారికి రికార్డు చేసి ఎడిట్ చేయడం నేర్పిస్తే వారే పెద్దవాళ్ల దగ్గర కూచుని అన్నీ చెప్పించుకుంటారు. పైగా పిల్లలు అడిగితే చెప్పడానికి అవ్వలు, తాతలు ఇష్టపడతారు కూడా’ అంటాడు లాల్. అందుకోసం తన సంస్థ తరఫున కొందరు వాలంటీర్లను కేరళలోని వివిధ జిల్లాల స్కూళ్లకు పంపడం మొదలెట్టాడు. వారు స్కూల్లో పిల్లలకు మౌఖిక జానపద సంపద సేకరణ గురించి చెప్పి, సెల్ఫోన్తో పెద్దవాళ్లు చెప్పే కథలను ఎలా రికార్డు చేసి తమకు పంపాలో నేర్పుతారు. ఇక పిల్లలు ఊరుకుంటారా? రంగంలో దిగి వరదలా వీడియోలు పంపుతున్నారు. అవన్నీ నిక్షిప్తం అవుతున్నాయి. ► విన్నవీ కన్నవీ కాశీమజిలీ కథలో, కాటమరాజు కథలో, మర్యాద రామన్న కథలో, పూటకూళ్లమ్మ కథలో... అడవి కథలో, వేట కథలో, వ్యవసాయ కథలో, ప్రకృతి కథలో, గొడ్డుగోదా కథలో, రాజు పేదా కథలో... ఏవో కథలు ఒకప్పుడు చెప్పుకోని, వినని వారు ఉండరు. అయితే అందరూ గుర్తు పెట్టుకుని మళ్లీ చెప్పే స్టోరీ టెల్లర్లు కారు. కొందరు మాత్రమే ‘కథల పుట్ట’గా ఉంటారు. వీరు స్థానిక జ్ఞానాన్ని కథల్లో దాచి ఉంటారు. అవి రికార్డు కావాలి. కేరళలో ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నిజానికి ప్రతిచోటా ప్రభుత్వాలు పూనుకుని ఈ పని చేస్తే ప్రతి ప్రదేశంలోని విలువైన కథలు బయటికొస్తాయి. యూట్యూబ్లాంటి మాధ్యమాల వల్ల అందరికీ తెలుస్తాయి. కేరళ మేల్కొంది. అందరూ మేల్కొనాలి. -
ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్, రూ.2.6 కోట్ల ఆఫర్!
మన మధ్యలో కనిపించే కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఒకరికి స్కిన్ టోన్ బాగుంటే, మరొకరు మంచి ఎత్తులో ఉంటారు. ఈ కోవకు చెందినదే ఇంగ్లండ్కు చెందిన జాస్మిన్ లార్సన్. ఈమె నిజజీవితంలో డిస్నీప్రిన్సెస్. జనం ఆమె కురులకు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే ఆమెకు లెక్కలేనన్ని పెళ్లి ప్రపోజల్స్ వస్తుంటాయి. 22 ఏళ్ల జాస్మిన్ 2017 నుంచి తన కురులను పెంచడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆకర్షణీయమైన కురుల పొడవు 4 అడుగుల 7 అంగుళాలు. ఈ పొడవైన కురులు ఆమె మోకాళ్ల వరకూ ఉంటాయి. తన కురులను చూసి ముచ్చటపడిన 100 మందికిపైగా కుర్రాళ్లు తనకు ఆన్లైన్లో ప్రపోజల్స్ పంపారని జాస్మిన్ ఆనందంతో పొంగిపోతూ చెప్పింది. తన కురులను కట్ చేయించుకుంటే £250,000 (రూ. 2.6 కోట్లు) ఇస్తామంటూ కూడా ఆఫర్లు వచ్చాయని ఆమె తెలిపారు. దీనికి తాను ఒప్పు కోలేదని, తన జట్టు కత్తిరించి, దానిని ఎవరికో పంపాలని అనుకోవడం లేదని, ఈ కురులను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. బ్రిస్టల్లో ఉంటున్న జాస్మిన్ సోషల్ మీడియాలో తన కురులకు చెందిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ప్రపంచంలోని చాలామందిని ఇవి ఆకర్షిస్తుంటాయని, ముఖ్యంగా ధనవంతులు తన కురులకు ఆకర్షితులవుతున్నారని జాస్మిన్ తెలిపింది. ఇన్స్టాగ్రామ్లో జాస్మిన్కు 10వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బ్రాండ్స్ ఆమెతో కొలాబ్రేషన్కు సంప్రదిస్తుంటాయి. కాగా జాస్మిన్ ఒక కంపెనీలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి:11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ -
శరవేగంగా భూముల రీ సర్వే.. దేశంలోనే ప్రప్రథమంగా డిజిటల్ రికార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక మైలురాళ్లు అధిగమించింది. తొలి దశలో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, దేశంలోనే ప్రప్రథమంగా ఆ గ్రామాలకు డిజిటల్ రికార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఒక్క గ్రామంలో కూడా భూముల రీ సర్వే పూర్తి చేయలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ బ్రిటిష్ కాలం నాటి భూమి రికార్డులే ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి. వాటి ఆధారంగానే భూముల కార్యకలాపాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి కొత్త భూముల రికార్డులను డిజిటల్ రూపంలో తయారు చేసింది. ఆ గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రైతుల భూముల హద్దులను అక్షాంశ, రేఖాంశాలతో సహా ఎవరూ అక్రమ పద్ధతుల్లో మార్చలేని విధంగా నిర్ధారించింది. ప్రతి భూ కమతానికి ఒక విశిష్ట సంఖ్యను కూడా కేటాయించింది. ఏపీలో రూపొందుతున్న డిజిటల్ భూ రికార్డులు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు సైతం మోడల్గా నిలిచాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు మన మోడల్పై అధ్యయనం చేశాయి. రీ సర్వే ఎలా చేయాలనే అంశంపై ఏపీ సర్వే అధికారులతో ఆ రాష్ట్రాల అధికారులకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నాయి. ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో ఈ శిక్షణ తరగతులు జరగ్గా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయి. క్షేత్ర స్థాయి నిజనిర్ధారణలోనూ దూకుడు ఇప్పటివరకు అందిన ఓఆర్ఐలతో క్షేత్రస్థాయి నిజ నిర్ధారణను వేగంగా చేపడుతున్నారు. రైతులు చూపించే వాస్తవ సరిహద్దులను డ్రోన్ చిత్రాలతో పోల్చి చూసే అతి ముఖ్యమైన నిజనిర్ధారణ 4,283 గ్రామాల్లో 57 లక్షలకుపైగా ఎకరాల్లో పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల్లోని భూముల కమతాలకు సర్వే నంబర్లకు బదులుగా ఇచ్చే ల్యాండ్ పార్సిల్ మ్యాప్(ఎల్పీఎం)లు 43.42 లక్షలు జారీ చేశారు. మిగిలిన 2,246 గ్రామాల్లో నిజనిర్ధారణ జరుగుతోంది. ఆ తర్వాత మరోసారి రైతుల సమక్షంలో జరిగే గ్రౌండ్ వాలిడేషన్ (క్షేత్ర స్థాయి ధ్రువీకరణ) 3,428 గ్రామాల్లో (37.39 లక్షల ఎకరాలు) పూర్తవగా 855 గ్రామాల్లో జరుగుతోంది. ఇప్పటివరకు 3,092 గ్రామాల్లో (28.33 లక్షల ఎకరాలు) సర్వే పూర్తయినట్లు నంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ లెక్కలనుబట్టి రీ సర్వే ఎంత శాస్త్రీయంగా, పక్కాగా వేగంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. 1.08 లక్షల చదరపు కిలోమీటర్లలో డ్రోన్, ఏరియల్ సర్వే పూర్తి రాష్ట్రంలో అత్యంత ఆధునిక పద్ధతుల్లో రీ సర్వే జరుగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన డ్రోన్, ఏరియల్ సర్వేలు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొలవాల్సివుండగా 1.08 లక్షల చదరపు కిలోమీటర్లను ఈ సర్వే ద్వారా ప్రభుత్వం కొలిచింది. 17,460 గ్రామాలకుగాను 12,230 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా 1.8 కోట్ల ఎకరాల కొలతలను పూర్తి చేశారు. అతి త్వరలో మిగిలిన గ్రామాల్లోనూ ఈ సర్వే పూర్తికానుంది. డ్రోన్, ఏరియల్ సర్వే ద్వారా తీసిన చిత్రాలను అభివృద్ధి చేసి 6,529 గ్రామాల ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఓఆర్ఐ) లను సర్వే బృందాలకు అందించారు. మిగిలిన గ్రామాల ఓఆర్ఐలను నిర్ణీత సమయంలో సర్వే బృందాలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. -
'సలార్' టీజర్ సరికొత్త రికార్డ్.. ఏకంగా టాప్లోకి
'సలార్' టీజర్ దుమ్ములేపుతోంది. ప్రభాస్ దెబ్బకు రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. సరికొత్త ఘనతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయమే డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు కారణమైంది. టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. ఒక్క దెబ్బకు ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. ఇలా అదరగొట్టేస్తున్న సలార్ టీజర్.. ఓ విషయంలో మాత్రం 'కేజీఎఫ్ 2'ని దాటలేకపోయింది. ఫ్యాన్స్ నిరాశ డార్లింగ్ ప్రభాస్ నుంచి కొన్నిరోజుల ముందు 'ఆదిపురుష్' వచ్చింది. అభిమానుల్ని ఆ సినిమా ఘోరంగా నిరాశపరిచింది. దీంతో వాళ్ల దృష్టంతా 'సలార్' మీదకు మళ్లింది. అందుకు తగ్గట్లే జూలై 6న ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ ని డైనోసార్ తో పోల్చుతూ.. కొత్త తాత ఇచ్చిన ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. కానీ ప్రభాస్ ని 10 సెకన్లలోపే, అది కూడా ముఖం సరిగా చూపించకపోవడం ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. (ఇదీ చదవండి: 'రంగబలి' సినిమా రివ్యూ) రికార్డ్ వ్యూస్ ప్రభాస్ని టీజర్ లో సరిగా చూపించకపోతేనేం.. 24 గంటల్లో యూట్యూబ్ లో దీనికి ఏకంగా 83 మిలియన్ వ్యూస్, 1.67 మిలియన్ లైక్స్ సాధించింది. ఈ క్రమంలోనే ఒక్కరోజులో ఎక్కువ వ్యూస్ అందుకున్న టీజర్ గా అగ్రస్థానం దక్కించుకుంది. తర్వాత స్థానాల్లో ఆదిపురుష్(68.96 మిలియన్), కేజీఎఫ్ 2(68.83 మిలియన్), రాధేశ్యామ్(42.66 మిలియన్) ఉన్నాయి. ఇలా టాప్-4లో ప్రభాస్వే మూడు చిత్రాలుండటం విశేషం. అయితే లైక్స్ విషయంలో 'సలార్' టీజర్.. 'కేజీఎఫ్ 2' టీజర్ దాటలేకపోయింది. సినిమాపై అంచనాలు టీజర్పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా.. 'సలార్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు 'కేజీఎఫ్'తో సంబంధం ఉందని, టీజర్ లో అందుకు సంబంధించిన ఆధారాలు కనిపించాయని నెటిజన్స్ అంటున్నారు. మూవీ రిలీజైతే గానీ అసలు విషయం తెలీదు. ఇందులో హీరోయిన్ గా శుత్రిహాసన్, విలన్ గా జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, కీలకపాత్రలో శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సెప్టెంబరు 28న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 7:11 పీఎమ్ మూవీ రివ్యూ) -
కోటలు దాటుతున్న అంచనాలు.. సినిమానా? నంబర్ల గేమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. యూట్యూబ్ లో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ప్రతిదానిలోనూ టాప్ లోకి దూసుకెళ్లిపోయింది. థియేటర్లలోకి ఈ మూవీ రావడానికి మరో మూడు నెలల సమయముంది. కానీ ఇప్పటికే అంచనాలు కోటలు దాటేస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అదే సినీ ప్రేక్షకుల మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) లైకుల రికార్డు స్టార్ హీరో సినిమాల సందడంటే ఒకప్పుడు వేరుగా ఉండేది. ముందుగా పాటలు, అవొచ్చిన కొన్నాళ్లకు థియేటర్లలోకి సినిమా వచ్చేది. ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్.. ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అన్నట్లు మారిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సలార్' టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రభాస్ టాప్ ఇలా జస్ట్ టీజర్తో అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన హీరోగా టాలీవుడ్లో ప్రభాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మిగతా హీరోల్లో జూ.ఎన్టీఆర్-36 గంటలు, అల్లు అర్జున్-2 రోజుల 11 గంటలు, మహేశ్ బాబు- 18 రోజులు, రామ్ చరణ్- 20 నెలల సమయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాలపై అంచనాలు పెరగడం, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల్ని అలరించడం అన్న దానికంటే సినిమా అనేది నంబర్ల గేమ్లా మారుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. Fastest 1M Liked Teasers Of Tollywood Heroes: 1. #Prabhas- 6Hrs 👑🔥🔥 2. #JrNtr- 36Hrs 3. #AlluArjun- 2 Days 11hrs 4. #MaheshBabu- 18 Days 5. #RamCharan- 20 Months pic.twitter.com/cBXcMzfnUp — Hail Prabhas (@HailPrabhas007) July 6, 2023 (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) -
ప్రథమార్ధంలో డీల్స్ డౌన్
ముంబై: ఈ ఏడాది ప్రథమార్ధంలో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ పరిమాణంపరంగా పెరిగినా విలువపరంగా మాత్రం 75 శాతం క్షీణించింది. 32.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ వ్యవధిలో డీల్స్ సంఖ్య 5.2 శాతం పెరిగి 1,400కి చేరింది. 1980లో ఎంఅండ్ఏ డీల్స్ను రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఇదే గరిష్ట స్థాయి. గతేడాది ఏప్రిల్లో హెచ్డీఎఫ్సీ ద్వయం 40 బిలియన్ డాలర్ల ఒప్పందం ప్రకటించగా.. ఈసారి కనీసం 5 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కూడా లేకపోవడం గమనార్హం. ఫైనాన్షియల్ మార్కెట్ల డేటా సంస్థ రెఫినిటివ్ నివేదిక ప్రకారం.. తొలి త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల లోపు ఒప్పందాలే ఎక్కువగా ఉండగా .. రెండో త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్ల డీల్స్ నాలుగు నమోదయ్యాయి. ఈక్విటీ విభాగంలో 2018 తర్వాత ఈసారి ప్రథమార్ధంలో ఐపీవో మార్కెట్లో సందడి నెలకొంది. 75 చిన్న, మధ్య తరహా సంస్థలు లిస్ట్ కాగా.. 1.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. లిస్టయిన సంస్థల సంఖ్య వార్షికంగా చూస్తే 25 శాతం పెరిగినా.. సమీకరించిన నిధుల పరిమాణం మాత్రం 73 శాతం తగ్గింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫాలో ఆన్ ఆఫర్లు 127 శాతం పెరిగి 9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అదానీ గ్రూప్లో భాగమైన నాలుగు సంస్థల్లో 1.9 బిలియన్ డాలర్ల వాటాలు విక్రయించడం ఇందుకు ఊతమిచ్చింది. ► ఆర్థిక రంగంలో అత్యధికంగా 7.5 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదిరినప్పటికీ.. విలువపరంగా 89 శాతం తగ్గాయి. ఇండ్రస్టియల్స్ విభాగంలో 5.2 బిలియన్ డాలర్లు (11.6 శాతం డౌన్), హై టెక్నాలజీలో 5 బిలియన్ డాలర్ల (73.1 శాతం తగ్గుదల) ఒప్పందాలు కుదిరాయి. ► ప్రైవేట్ ఈక్విటీ దన్ను గల ఎంఅండ్ఏ డీల్స్ విలువ 8.2 బిలియన్ డాలర్లుగా (56 శాతం క్షీణత) నమోదైంది. ► ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు 10.3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021 తర్వాత ప్రథమార్ధంలో ఇంత అత్యధికంగా నిధులు రావడం ఇదే ప్రథమం. ► ప్రైమరీ బాండ్ల జారీ 66 శాతం పెరిగింది. ఇందులో ఫైనాన్షియల్ రంగం 81.3 శాతం, ఇండస్ట్రియల్స్ 7 శాతం మేర వాటా దక్కించుకున్నాయి. -
భూగోళంపై అత్యంత వేడి దినం.. జూలై 4
వాషింగ్టన్: గత 1,25,000 సంవత్సరాల్లో ఈ ఏడాది జూలై 4వ తేదీ భూగోళంపై అత్యంత వేడి దినంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా ఈ నెల 3వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్దలు కావడం విశేషం. 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్కు చేరినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 4వ తేదీన ఇది 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్హీట్)కు ఎగబాకినట్లు తెలియజేసింది. ఈ ఉష్ణోగ్రతను గణించడానికి మోడలింగ్ సిస్టమ్ను 1979 నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం నాటి ఉష్ణోగ్రతను సైతం అంచనా వేయొచ్చు. -
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు
-
సరుకు లోడింగ్లో విశాఖపట్నం పోర్టు మరో రికార్డు
సాక్షి, విశాఖపట్నం: సరుకు లోడింగ్లో విశాఖపట్నం పోర్టు అథారిటీ బుధవారం మరో రికార్డు నమోదు చేసింది. ఒక్క రోజు వ్యవధిలో ఒకేసారి నిర్వహించిన అతి పెద్ద సింగిల్ పార్శిల్ లోడు రికార్డును అధిగమించింది. ఎంవీ జీసీఎల్ గంగా కార్గో షిప్లో ఒకే రోజులో 1,04,496 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ పెల్లెట్స్ లోడ్ చేశారు. ఆర్సిలర్ మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్)కు సంబంధించిన ఇన్నర్ హార్బర్లోని వెస్ట్ క్యూ–1 బెర్త్లో ఈ లోడింగ్ జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన 1,02,200 మెట్రిక్ టన్నుల లోడింగ్ ఇప్పటి వరకూ రికార్డు సింగిల్ పార్శిల్గా ఉండేది. అత్యధిక మొత్తంలో లోడింగ్ నిర్వహించిన సిబ్బందిని పోర్టు చైర్మన్ డాక్టర్ అంగముత్తు అభినందించారు. -
ఏపీలో మండుతున్న ఎండలు..నిరంతరం పనిచేస్తున్న విద్యుత్ పరికరాలు
-
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ సరికొత్త రికార్డ్
ఎవరిని కదిపినా సరే 'ఆదిపురుష్' సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తోంది. తొలిరోజు షోలన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్స్ అయిపోయాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్'ని రామాయణం ఆధారంగా తీశారు. టీజర్ ని గతేడాది రిలీజ్ చేసిన టైంలో ఈ మూవీపై ఘోరమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో థియేటర్లలోకి వచ్చి ఈ సినిమాని ఎవరైనా చూస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ ట్రైలర్స్ విడుదల చేసిన తర్వాత నెగిటివిటీ కాస్త పాజిటివ్ గా మారింది. అంతటా హైప్ ఏర్పడింది. దీంతో జనాలు 'ఆదిపురుష్'పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. 'ఆదిపురుష్'పై ఇష్టాన్ని చాలామంది సోషల్ మీడియాలో చూపిస్తే.. మరికొందరు టికెట్స్ అమ్మే బుక్ మై షోలో లైక్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలా ఇప్పటివరకు 1.1 మిలియన్ యూజర్స్.. ఈ టికెట్ బుకింగ్ సైట్ లో 'ఆదిపురుష్'కి లైక్ కొట్టారు. దీంతో 1 మిలియన్ మార్క్ అందుకున్న మూవీగా ఇది ఘనత సాధించింది. ఈ లిస్టులో 'ఆర్ఆర్ఆర్'.. 1.75 మిలియన్ లైక్స్ తో టాప్ లో ఉంది. మరి మీలో ఎవరైనా 'ఆదిపురుష్' చూశారా? (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' థియేటర్లో నిజంగానే ప్రత్యక్షమైన హనుమాన్!) -
సర్వీస్ సెంటర్లలో మారుతీ సుజుకీ రికార్డ్! ఏకంగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సర్వీస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా 4,500ల కేంద్రాల మార్కును చేరుకుంది. హైదరాబాద్లోని రాంపల్లి సర్వీస్ సెంటర్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2022–23లో భారత్లో 310 సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేశామని సంస్థ సర్వీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ‘పట్టణేతర ప్రాంతాల్లో అత్యధికంగా ఇవి ప్రారంభం అయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో సర్వీస్ కేంద్రాలను అందుబాటులోకి తేవడం సంస్థ చరిత్రలో తొలిసారి. 2023–24లో కొత్తగా 350 కేంద్రాలను నెలకొల్పుతాం. సర్వీసు కోసం నగరాల్లో 10–15 కిలోమీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 25 కిలోమీటర్లకు మించి కస్టమర్ ప్రయాణించకూడదు అన్నది మా లక్ష్యం. సర్వీస్ టచ్ పాయింట్స్ 2,271 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. 335 సర్వీస్ ఆన్ వీల్స్ వర్క్షాప్స్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 326 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 2.23 కోట్ల వాహనాలకు సర్వీసు అందించాం’ అని వివరించారు. ఇదీ చదవండి: Maruti Suzuki Jimny: మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే.. -
ఆస్ట్రేలియా టీమ్ కి నిద్రలేని రాత్రులు ఎందుకంటే..!
-
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ ఏడు ఏస్లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్గా గ్రాండ్స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
చరిత్ర సృష్టించిన జో రూట్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ టెస్ట్ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్గా.. ఓవరాల్గా 11వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో రూట్ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున వేగవంతంగా 11000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడిగా, అలిస్టర్ కుక్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మైలురాయిని చేరుకునేందుకు కుక్కు 252 ఇన్నింగ్స్లు అవసరమైతే.. రూట్ 232 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ 11000 రన్స్ రికార్డు కుమార సంగక్కర (208 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. కాగా, ఫాబ్ ఫోర్గా చెప్పుకునే (రూట్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్) ప్రస్తుత తరం స్టార్ క్రికెటర్లలో పరుగుల పరంగా ఎవరూ రూట్కు దరిదాపుల్లో కూడా లేరు. 32 ఏళ్ల రూట్ 130 టెస్ట్ల్లో 11000 పరుగుల మైలురాయిని తాకితే.. 34 ఏళ్ల స్టీవ్ స్మిత్ 96 టెస్ట్ల్లో 8792 పరుగులు, 34 ఏళ్ల విరాట్ కోహ్లి (34) 108 టెస్ట్ల్లో 8416 పరుగులు, 32 ఏళ్ల కేన్ విలియమ్సన్ 94 టెస్ట్ల్లో 8124 పరుగులతో చాలా వెనుకపడి ఉన్నారు. వయసు పరంగా చూసినా ఫాబ్ ఫోర్లో మిగతా ముగ్గురితో పోలిస్తే రూట్కు టెస్ట్ల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (15921) బద్దలు కొట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో మ్యాచ్లో రెండో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. బెన్ డకెట్ (182) భారీ సెంచరీతో అలరించి ఔట్ కాగా.. ఓలీ పోప్ (197 నాటౌట్) ద్విశతకానికి 3 పరుగుల దూరంలో ఉన్నాడు. అతనికి జతగా రూట్(52 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. చదవండి: ఆఫ్ఘనిస్తాన్ సంచలనం.. తమ కంటే మెరుగైన జట్టుపై ఘన విజయం -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
సంచలనం సృష్టిస్తున్న రవితేజ శ్రీలీల..
-
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
T20 BLAST లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బౌలర్..
-
3.5 లక్షల కోట్ల డాలర్లు.. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డ్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లను దాటిందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– మూడీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో జీ–20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంచనాలనూ వ్యక్తం చేసింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ఆకర్షణ విషయంలో కొంత వెనుకబాటుకు గురయ్యే వీలుందని అంచనా వేసింది. సంస్కరణల అమల్లో వేగం లేకపోవడం, బ్యూరోక్రసీ నిర్ణయాల్లో నెమ్మది వంటి అంశాలు తమ ఈ అంచనాలకు కారణంగా పేర్కొంది. అమెరికా కేంద్రంగా పనిచేసే మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనాల్లో ముఖ్యాంశాలు... బ్యూరోక్రసీ స్థాయిలో లైసెన్సులను పొందడంలో ఆలస్యం జరగవచ్చు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు నెలకొల్పడం, ఇందుకు సంబంధించి ఆమోద ప్రక్రియలో నెమ్మది చోటుచేసుకునే వీలుంది. ప్రాజెక్టుల అమలూ ఆలస్యం కావచ్చు. ఆయా అంశాలు దేశానికి ఎఫ్డీఐ ఆకర్షణను కొంత తగ్గించవచ్చు. అదే సమయంలో ఈ విషయంలో ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉంటుంది. పెద్ద సంఖ్యలో యువత, విద్యావంతులైన శ్రామికశక్తి, చిన్న కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాలు దేశంలో సిమెంట్, గృహ నిర్మాణం, కొత్త కార్ల కోసం డిమాండ్ను పెంచుతుంది. ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయం.. ఉక్కు, సిమెంట్ రంగాలకు కలిసి వచ్చే అంశం. కాలుష్యం కట్టడికి, పునరుత్పాదకత రంగానికి దేశం ఇస్తున్న ప్రాధాన్యత ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనీయాంశం. ఇది పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తయారీ, మౌలిక రంగాలకు సంబంధించిన డిమాండ్ వచ్చే దశాబ్ద కాలంలో వార్షికంగా 3 నుంచి 12 శాతం మేర నమోదుకావచ్చు. అయతే 2030 నాటికి భారతదేశ సామర్థ్యం చైనా కంటే చాలా వెనుకబడే ఉంటుంది. ఎకానమీ పటిష్టంగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ, కీలక తయారీ, మౌలిక రంగాల్లో పెట్టుబడులు బలహీనంగానే కొనసాగే వీలుంది. ఎకానమీ సంస్కరణల విషయంలో పరిమితులు, విధాన నిర్ణయాల్లో అమలు వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. భూసేకరణ నిర్ణయాల్లో ఆమోదాలు, నియంత్రణా పరమైన క్లియరెన్స్లు, లైసెన్సులు పొందడం, వ్యాపారాలను స్థాపించడం వంటి వాటి కోసం ఎంత సమయం అవసరమో ఖచ్చితంగా తెలియకపోవడం భారత్ విధాన పరమైన అంశాల్లో ప్రధాన లోపం. ఇది ప్రాజెక్టుల అమల్లో తీవ్ర జాప్యాలకు కారణం అవుతోంది. ఆయా అంశాలతో పాటు ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వేగంలేకపోవడం విదేశీ పెట్టుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. అవినీతిని తగ్గించడానికి, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి, పన్నుల వసూళ్లు బేస్ పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే వీటిలోనూ అవరోధాలు కనబడుతున్నాయి. కార్మిక చట్టాల్లో సౌలభ్యాన్ని పెంపొందించడం, వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని పెంచడం, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను విస్తరించడం, తయారీ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంసహా గత కొన్ని సంవత్సరాలుగా పలు రంగాల పురోగతికి చేపట్టిన చర్యలు పటిష్టవంతంగా అమలు జరిగితే అది దేశ పటిష్ట అధిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇదీ చదవండి: Income Tax Return: అందుబాటులోకి ఐటీఆర్ 1, 4 ఫారమ్లు.. గడువు తేదీ గుర్తుందిగా.. -
రీ సర్వేలో సర్కారు స్పీడు
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వేతో కొత్త చరిత్రను లిఖిస్తున్న ప్రభుత్వం మరో రికార్డు సృష్టించింది. తొలి విడత రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో సరిహద్దు రాళ్లు పాతే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. వ్యవసాయ భూముల సరిహద్దులను చూపుతూ రాళ్లు వేసినప్పుడు మాత్రమే సమగ్ర భూ సర్వే పూర్తయినట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేయటంతో సర్వే శాఖ వేగంగా దాన్ని పూర్తి చేసింది. గత నెలాఖరుకి 13 లక్షల రాళ్లు పాతిన యంత్రాంగం ఆ తర్వాత 20 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 12.80 లక్షలకుపైగా రాళ్లు పాతి, కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెల 20వ తేదీకల్లా 2 వేల గ్రామాల్లో రాళ్లు పాతే పని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా మూడు రోజుల ముందే ఆ పని పూర్తి చేశారు. ఇందుకోసం సర్వే శాఖ వెయ్యి రోవర్లను సమకూర్చుకొంది. మరికొన్నింటిని అద్దెకు తీసుకొంది. రోజుకు సగటున 40 నుంచి 50 వేల రాళ్లను పాతారు. 2 వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తి రాష్ట్రంలోని 17 వేలకుపైగా గ్రామాలకుగాను తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తయింది. ఈ గ్రామాలకు కొత్త రెవెన్యూ రికార్డులు (ఆర్ఓఆర్) సైతం తయారయ్యాయి. ఆ గ్రామాలకు చెందిన 7.50 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలను జారీ చేశారు. చివరిగా రైతుల భూముల సరిహద్దుల్లో సర్వే రాళ్లు పాతడం కూడా పూర్తి చేయడం ద్వారా ఈ 2 వేల గ్రామాలను రీసర్వే మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఖర్చంతా ప్రభుత్వానిదే సాధారణంగా రైతులు భూమిని సర్వే చేయించుకుని రాళ్లు పాతించడం పెద్ద ప్రయాస. ఖర్చు ఎక్కువ. అయితే, ప్రభుత్వం రైతులపై పైసా కూడా భారం పడకుండా మొత్తం తానే భరించింది. సర్వే పూర్తి చేసి ఉచితంగా రాళ్లు పాతి రైతులకు భూములు అప్పగించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇందుకోసం అవసరమైన రాళ్లను కోట్ల ఖర్చుతో తయారు చేయించింది. రాళ్ల తయారీకి ప్రత్యేకంగా యూనిట్లు పెట్టి మరీ అవసరమైన సైజుల్లో రాళ్లను తయారు చేసింది. 25 లక్షలకు పైగా రాళ్లు సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో మొత్తం 25 లక్షలకు పైగా రాళ్లను పాతారు. మూడు గ్రామాలు కలిసే చోట (ట్రై జంక్షన్) ఏ క్లాస్ పెద్ద రాళ్లు 6,970 పాతారు. ప్రతి భూకమతం హద్దుల్లో బి క్లాస్ చిన్న రాళ్లు 25.73 లక్షలు పాతారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని 354 గ్రామాల హద్దుల్లో 4.48 లక్షల రాళ్లు పాతారు. విజయనగరం జిల్లాలో 179 గ్రామాల్లో 2.48 లక్షలు, పల్నాడు జిల్లాలో 70 గ్రామాల్లో 2.08 లక్షలు, కాకినాడ జిల్లాలో 121 గ్రామాల్లో 1.86 లక్షలు, చిత్తూరు జిల్లాలోని 134 గ్రామాల్లో 1.44 లక్షల రాళ్లు పాతారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా గ్రానైట్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, నాప రాళ్లను వినియోగించారు. 70 శాతానికిపైగా గ్రానైట్ రాళ్లనే పాతారు. -
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ రికార్డ్.. అమెరికా మార్కెట్లో 44 శాతం వాటా
బెరైటీస్ ఎగుమతుల్లో ఏపీఎండీసీ (ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ) సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా బెరైటీస్ మార్కెట్లో 44 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ బెరైటీస్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది. అమెరికా మార్కెట్లో ఒక దేశం గానీ, సంస్థ గానీ ఇంత శాతం వాటాను చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరం 30 శాతం వాటాను దక్కించుకున్న ఏపీఎండీసీ.. ఈ సంవత్సరం దాన్ని మరో 14 శాతం పెంచుకుని ప్రపంచ మార్కెట్లో సుస్థిర స్థానం సాధించింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 3 మిలియన్ టన్నుల బెరైటీస్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్న ఏపీఎండీసీ దాన్ని సాధించింది. గత సంవత్సరం బెరైటీస్పై ఏపీఎండీసీకి రూ.900 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది అది రూ.1,300 కోట్లకు పెరిగింది. మంగంపేటలో విస్తారంగా బెరైటీస్.. బెరైటీస్ నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మంగంపేటలో విస్తారంగా ఉన్నాయి. చమురు, సహజవాయువుల రంగానికి బెరైటీస్ అత్యంత కీలకం కావడం, అతి తక్కువ దేశాల్లో మాత్రమే ఇది దొరకడంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ ఉంది. భారత్లో ఉన్న బెరైటీస్ నిక్షేపాల్లో 98 శాతం మంగంపేటలోనే ఉన్నాయి. ఇక్కడ 74 మిలియన్ టన్నుల నిల్వలున్నాయి. ఇక్కడి నుంచి సుమారు 30 దేశాలకు బెరైటీస్ ఎగుమతి అవుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ 40 మిలియన్ టన్నుల బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీశారు. బెరైటీస్ను ఎందుకు వాడతారంటే.. బెరైటీస్ ఖనిజాన్ని అనేక ఉత్పత్తులో ఉపయోగిస్తారు. ముఖ్యంగా పెయింట్, ప్లాస్టిక్లలో పూరకం, ఇంజన్ కంపార్ట్మెంట్లలో సౌండ్ తగ్గించడానికి, ఆటోమొబైల్ ఉత్పత్తులో నునుపు, తుప్పు నిరోధకత కోసం వినియోగిస్తారు. అలాగే ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఘర్షణ కలిగించే ఉత్పత్తులు, రేడియేషన్ షీల్డింగ్ కాంక్రీటు, గ్లాస్ సిరామిక్, వైద్య ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. -
సంచలన విజయంతో కాంగ్రెస్ సరికొత్త రికార్డు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయం సాధించింది. అలాగే అత్యధిక ఓటింగ్ శాతంతో మాత్రమే కాదు.. ఒక పార్టీకి విజయం దక్కడంలోనూ అక్కడ సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. 34 ఏళ్ల తర్వాత.. ఒక పార్టీ ఇంతేసి ఓటు షేర్, ఇన్నేసి స్థానాలతోనూ గెలుపొందడం ఈ ఎన్నికల్లోనే జరిగింది. ► 1994లో 115 స్థానాలు గెలుపొందిన జేడీఎస్ మొత్తం ఓటింగ్లో 33.54 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా హెచ్డీ దేవగౌడ ప్రమాణం చేశారు. ► 1999 ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 132 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 40.84 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. ఎంఎం కృష్ణను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ► 2004 ఎన్నికల్లో.. 79 స్థానాలు నెగ్గిన బీజేపీ.. కేవలం 28.33 శాతం ఓట్ షేర్ను దక్కించుకుంది. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2008లో 110 స్థానాలు గెలుపొందిన బీజేపీ.. 33.86 శాతం ఓట్ షేర్ను దక్కించుకుంది. మళ్లీ యడియూరప్పనే సీఎంను చేసింది. ► 2013 అసెంబ్లీ ఎన్నికల్లో.. 122 స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్.. 36.6 శాతం ఓటు షేర్ను దక్కించుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ► 2018 ఎన్నికల్లో.. 104 స్థానాలు, 36.3 శాతం ఓటు షేర్ దక్కించుకుంది బీజేపీ. యాడియూరప్పను సీఎంను చేసింది. ► 2023 ఎన్నికల్లో.. 136 స్థానాలు, 43 శాతం ఓటింగ్తో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. గత ఎన్నికల్లో కంటే ఏకంగా ఐదు శాతం ఓటింగ్ను పెంచుకుంది కాంగ్రెస్. ఇక గతంలో.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 178 స్థానాలు దక్కించుకుని.. 43.76 శాతం ఓటు షేర్ను కైవసం చేసుకుంది. వీరేంద్ర పాటిల్ను అప్పుడు సీఎంను చేసింది. -
ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: ఫాస్ట్ట్యాగ్ సిస్టమ్ ద్వారా రోజువారీ టోల్ వసూళ్లు రూ.193.15 కోట్లకు చేరాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 29న ఒక్క రోజులో 1.16 కోట్ల లావాదేవీల ద్వారా ఈ రికార్డు నమోదయినట్లు పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో ఫాస్ట్ట్యాగ్ విధానాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ లేని వాహనాల నుంచి రెట్టింపు టోల్ ఫీజులు వసూలు చేస్తోంది. అప్పటి నుంచి ఒక్క రోజులో ఫాస్టాగ్ ద్వారా ఇంత భారీ మొత్తంలో వసూళ్లు జరగడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమం కింద టోల్ ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్లు ఎన్హెచ్ఏఈ తెలిపింది. ఇందులో 339 రాష్ట్ర టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.9కోట్ల ఫాస్టాగ్ కార్డులను జారీ చేసినట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది.టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఈ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే! -
ఉద్యోగాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సత్కారం
-
దేశీ పోర్టుల్లో రికార్డు స్థాయిలో కార్గో హ్యాండ్లింగ్
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రధాన పోర్టులు 2022 - 23లో రికార్డు స్థాయిలో 795 మిలియన్ టన్నుల మేర కార్గోను హ్యాండిల్ చేశాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం అధికం అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా వైజాగ్తో పాటు ముంబై, కొచ్చిన్, చెన్నై, పారాదీప్ తదితర 12 ప్రధాన పోర్టులు ఉన్నాయి. డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ (ఏఐ)ను ఉపయోగించి పోర్టుల సామర్థ్యాలను మరింతగా మెరుగుపర్చుకునేందుకు వీలుందని మంత్రి చెప్పారు. హరిత హైడ్రోజన్ హ్యాండ్లింగ్, నిల్వ, రవాణా కోసం ప్రధాన పోర్టులను హైడ్రోజన్ హబ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ కింద 2035 నాటికి అన్ని పెద్ద పోర్టుల్లోనూ హరిత హైడ్రోజన్ / అమోనియం బంకర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు సోనోవాల్ చెప్పారు. -
వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్
రూ.1.38 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు వనీషా మిట్టల్. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ కుమార్తె వనీషా. కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు వనీషా. డిసెంబర్ 2004లో మిట్టల్ స్టీల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి నియమితులయ్యారు ఏప్రిల్ 2011లో అపెరమ్ అనే కంపెనీలో చేరారు. అప్పటి నుండి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా ఉన్నారు. అయితే 2004లో అత్యంత అట్టహాసంగా జరిగిన వనీషా వివాహం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అత్యంత ఖరీదైన వివాహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చేరింది. వనీషా, అమిత్ పెళ్లి: రికార్డులు, విశేషాలు ప్రియుడు, అమిత్ భాటియాని 20004లో వనీషా వివాహమాడింది. వనీషా వివాహానికి స్టీల్దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ రూ. 240 కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుత వాల్యుయేషన్ ప్రకారం దీని ధర రూ.550 కోట్లకు పైగా ఉంటుంది. పారిస్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ సన్నాహాలకే ఒక ఏడాది పట్టిందంటేనే ఈ వెడ్డింగ్ రేంజ్ను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పెళ్లిలో ప్రతి అంశం ఒక విశేషం. ఆరు రోజుల పాటు వివాహ కార్యక్రమాలు జరిగాయి. ప్రిన్స్ విలియం తన వివాహానికి ఖర్చు చేసిన దానికంటే కూడా ఇది ఎక్కువట. (మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ) ♦ పెళ్లిలో 30 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడానికి కైలీ మినోగ్కు ఏకంగా 330,000 డాలర్లు చెల్లించారట. పాపులర్ బాలీవుడ్ స్టార్లు కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ♦ 1500 మంది అతిథుల బస, ప్రయాణ ఖర్చులను మిట్టల్ కుటుంబం చెల్లించింది. ♦ వెడ్డింగ్ డ్యాన్స్ స్టెప్స్ నేర్పించేందుకు కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ పెళ్లికి వెళ్లింది. జావేద్ అక్తర్ ఒక నాటకాన్ని రచించగా మిట్టల్ కుటుంబం యాక్ట్ చేసింది. ♦ బాలీవుడ్ హీరోయిన్లు, సూపర్ స్టార్లు స్పెషల్ గెస్ట్స్గా హాజరయ్యారు. అలాగే జూహీ చావ్లా, రాణిముఖర్జీ, సైఫ్ అలీఖాన్, షారూఖ్ చేసిన స్పూఫ్కి కోట్ల రూపాయలు ♦ వివాహ వేడుకలో కూడా ఐశ్వర్యరాయ్ ప్రదర్శన (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) ♦ అతిథులకు వడ్డించే రుచికరమైన వంటలకోసం పాపులర్ చెఫ్ మున్నా మహారాజ్ను ప్రత్యేకంగా పిలిపించారు. 20పేజీల సిల్వర్ ఇన్విటేషన్ బాక్స్, పారిస్కు టిక్కెట్లు ఇదంతా ఒక ఎత్తయితే..అతిథులందరికీ 20 పేజీల ఆహ్వాన కార్డులను సిల్వర్ బాక్స్లో పెట్టి అందించడం మరో ఎత్తు. ఇందులో పారిస్కు వెళ్లే వారి విమాన టిక్కెట్లు, అవాంట్-గార్డ్ ఇంటర్కాంటినెంటల్ ప్యారిస్లో బస వివరాలు కూడా ఉన్నాయి. దీనికి ముందు ప్రత్యేక అనుమతులుతీసుకొని మరీ ఎంగేజ్మెంట్ వేడుక వెర్సైల్స్ ప్యాలెస్లో, సంగీత్ వేడుకులను పారిస్లోని 500 ఏళ్ల నాటి టుయిలరీస్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. వనీషా మిట్టల్ 1980 ఆగస్టు 23న పుట్టింది వనీషా మిట్టల్.ఆమె సోదరుడి పేరు ఆదిత్య మిట్టల్. యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేసింది. అమిత్కు క్రీడలంటేచాలా ఇష్టం. వనీషా, అమిత్ దంపతులకు ముగ్గురు పిల్లలు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) అమిత్ భాటియా అమిత్ భాటియా యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో 1979 సెప్టెంబరు 4న జన్మించారు. కానీ 1995 వరకు ఢిల్లీలో కొలంబా స్కూల్లో, 1996లో లండన్లోని దుల్విచ్ కాలేజ్,1997లో ఢిల్లీ బ్రిటీష్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. యూకేలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు అమిత్. దీంతోపాటు స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్, ది గ్లోబల్ రిలీఫ్ ఇనిషియేటివ్ ఫౌండర్ కూడా అమిత్కు క్రీడలంటే ముఖ్యంగా గోల్ఫ్, క్రికెట్, ఫుట్బాల్ అంటే ఇష్టం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్ (క్యూపీఆర్) ఫౌండర్ చైర్మన్గా ఉన్నారు. అలాగే మామ మిట్టల్ ఛాంపియన్ ట్రస్ట్ ఏర్పాటులో కూడా అమిత్ది కీలక పాత్ర అని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. వనీషా, అమిత్ల పరిచయం ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. దీంతో ఈ లవ్బర్డ్స్ ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు కలకాలం గుర్తుండిపోయేలా అత్యంత వైభంగా మూడుముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించారు. View this post on Instagram A post shared by Amit Bhatia (@amitbhatia100) -
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగ విప్లవం
-
దక్షిణ మధ్య రైల్వే రికార్డు.. రూ.18,973 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. ఇటు సరుకు రవాణా రైళ్లు, అటు ప్రయాణికుల రైళ్ల ద్వారా కలిపి మొత్తం రూ.18,973 కోట్ల రాబడి సాధించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.15,708 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. 2021–22లో 14,266.04 కోట్లు మాత్రమే సాధించింది. ఈసారి పాత రికార్డులను బద్దలు కొడుతూ ఏకంగా రూ.19 వేల కోట్లకు చేరువ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లకు గాను దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో ఉత్తర రైల్వే, తర్వాత వరసగా మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, పశ్చిమ రైల్వేలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సరుకు రవాణాతో రూ.13,051.10 కోట్లు, ప్రయాణికుల రైళ్ల ద్వారా రూ.5,140.70 కోట్లు ఆర్జించిందని తెలిపారు. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 25.56 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారని, అంతకుముందు సంవత్సరంలో ఆ సంఖ్య కేవలం 12.70 కోట్లేనని పేర్కొన్నారు. ఆగస్టు నాటికి సిద్దిపేటకు రైలు మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో సిద్దిపేట వరకు పనులు వేగంగా పూర్తి చేసి వచ్చే ఆగస్టు నాటికి రైలును సిద్దిపేట వరకు నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు రైలు పట్టాలు దాటేందుకు ఏర్పాటు చేసిన స్ట్రక్చర్లను వినియోగించుకోవాలని, నేరుగా పట్టాలు దాటొద్దని కోరారు. 139 హెల్ప్లైన్ నంబరును వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో అదనపు జీఎం ధనంజయులు తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు! -
కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ జూమ్!
ముంబై: ప్రపంచ కంప్యూటర్ సేవల ఎగుమతుల్లో భారత్ వాటా మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) దాదాపు 11 శాతానికి పెరిగిందని ఆర్థిక సేవల దిగ్గజం– డీబీఎస్ ఒక విశ్లేషణలో తెలిపింది. సాఫ్ట్వేర్ ఎగుమతులు రికా ర్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరడం ఇందుకు దోహదపడినట్లు వివరించింది. 2021–22లో ఈ విలువ 255 బిలియన్ డాలర్లు. డీబీఎస్ సీనియ ర్ ఎకనమిస్ట్ రాధికా రావు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022–23 ట్రేడ్ డేటా విశ్లేషణ ప్రకారం, మొత్తం సేవల ఎగుమతి వాటాలో దేశం ఇప్పటికీ వెనుకబడి ఉంది. ఈ విభాగంలో మొత్తం భారత్ వాటా దాదాపు 4%మే. ► సేవల వాణిజ్యం పనితీరు పనితీరు పటిష్టంగా ఉంది. అంతర్జాతీయ ఫైనాన్షియల్ అంశాల్లో పటిష్టతకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కలిసిన వచ్చే అంశం ఇది. కమోడిటీ ధరలు తగ్గడం కూడా భారత్కు విదేశీ మారకం పరంగా సానుకూలత కల్పిస్తోంది. ► 2022–23లో సాఫ్ట్వేర్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 320 బిలియన్ డాలర్లకు చేరగా, సర్వీసెస్ ట్రేడ్ మిగులు 142 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22తో పోల్చితే, ఈ విలువ 30 శాతం పెరిగింది. సర్వీసెస్ దిగుమతులు కూడా భారీగా పెరగడం దీనికి నేపథ్యం. ► వస్తు, సేవలు కలిపి 2022–23లో ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక మొత్తం దిగుమతులు 17 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► కంప్యూటర్ సేవల ఎగుమతులు పటిష్ట స్థాయిలో ఉండడం కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) 2% లోపు (2022–23 జీడీపీలో) కట్టడిలో ఉండడానికి కారణం. ► బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కింద సేవల ట్రేడ్ వాటా 2019లో 3 శాతం (జీడీపీలో) ఉంటే, 2022 నాటికి ఇది 4.6 శాతానికి ఎగసింది. 2023లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ► సేవల ఎగుమతి పెరుగుదల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికం సంబంధిత రంగాలు పటిష్టంగా ఉన్నాయి. మొత్తం సేవల ఎగుమతులలో వీటి వాటా దాదాపు సగం ఉంది ► సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అమెరికా 55.5% వాటాతో అగ్ర స్థానంలో ఉంటే, యూరప్ తరువాతి స్థానంలో ఉంది. ఇందులో బ్రిటన్ది మొదటి స్థానం. -
హైదరాబాదీ రికార్డు.. ఏడాదిలో రూ.6 లక్షల ఇడ్లీలు!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారాల్లో ఇడ్లీకున్న క్రేజే వేరు. ఆ క్రేజే ఓ రికార్డును సృష్టించింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఈ రికార్డు సృష్టించినట్లు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఆయన ఇడ్లీపై తన ఇష్టాన్ని ఓ రేంజ్లో చూపించాడు. గత ఏడాది కాలంలో రూ.6 లక్షలు కేవలం ఇడ్లీల కోసమే ఖర్చు చేశాడు. తన కోసం, స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం.. ఏడాది మొత్తంలో 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. తాను ప్రయాణించిన వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన ఇడ్లీ జపమే చేసినట్లు స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది. ఇడ్లీ క్రేజ్కు సంబంధించిన ఇలాంటి విశేషాలెన్నో స్విగ్గీ వివరించింది. ఇటీవల ప్రపంచ ఇడ్లీ దినోత్సవం పురస్కరించుకుని ఇడ్లీ ఆర్డర్లపై నిర్వహించిన అధ్యయనంతో ఓ నివేదికను సంస్థ విడుదల చేసింది. చాలాచోట్ల డిన్నర్గా కూడా.. గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్లను పంపిణీ చేసినట్టు నివేదిక తెలిపింది. వినియోగదారుల్లో ఈ వంటకానికి ఇప్పటికీ ఉన్న విపరీతమైన క్రేజ్కు ఇది సూచికగా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. అత్యధిక ఇడ్లీలను ఆర్డర్ చేసిన మొదటి మూడు నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి. కొల్కొతా, కొచ్చి, ముంబై, కోయంబత్తూర్, పుణే, వైజాగ్, ఢిల్లీ నగరాలు ఆ తర్వాత ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, ముంబై వాసులు డిన్నర్గానూ ఇడ్లీని ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. కారం, నెయ్యి ఇడ్లీకి హైదరాబాద్ జై బెంగళూరు వాసులు రవ్వ ఇడ్లీలు, చెన్నై వాసులు నెయ్యి, పొడి ఇడ్లీలు ఇష్టపడుతుండగా.. హైదరాబాదీలు కారం పొడి, నెయ్యితో కూడిన ఇడ్లీని ఇష్టపడుతున్నారని తేలింది. ఇక ముంబయి వాసులు ఇడ్లీ..వడ కాంబినేషన్కు జై కొడుతున్నారు. అయితే అల్పాహారాల ఆర్డర్స్లో మసాలా దోశ ఫస్ట్ ప్లేస్లో నిలవగా ఇడ్లీ రెండోస్థానంలో ఉంది. -
మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 25 లక్షల యూనిట్ల ఎగుమతుల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. 1986–87 నుంచి కంపెనీ పలు దేశాలకు వాహనాల సరఫరా ప్రారంభించింది. తొలుత పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్కు ఈ కార్లు అడుగుపెట్టాయి. ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు ఇక్కడ తయారైన కార్లు ఎగుమతి అవుతున్నాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాలు వీటిలో ఉన్నాయి. భారత తయారీ శక్తి సామర్థ్యాలకు ఈ మైలురాయి నిదర్శనమని తెలిపింది. అధిక నాణ్యత, ఉన్నత సాంకేతికత, విశ్వసనీయత, పనితీరుతోపాటు అందుబాటు ధరలో లభించడంతో కంపెనీ తయారీ కార్లు విదేశీ కస్టమర్ల ఆమోదం, ప్రశంసలను పొందాయని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ తెలిపారు. భారత్ నుంచి అత్యధికంగా ప్యాసింజర్ వాహనాలను ఎగుమతి చేస్తున్న సంస్థగా నిలిచామన్నారు. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
జిడ్డు బ్యాటింగ్లో ఈ బ్యాటర్ను మించినోడు లేడు.. 400 నిమిషాలు క్రీజ్లో ఉండి..!
131 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో అత్యంత జిడ్డు బ్యాటింగ్ ప్రస్తుత సీజన్లో నమోదైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న షీల్డ్ 2022-23 ఫైనల్లో విక్టోరియా ఆటగాడు ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజ్లో నిలబడి, 280 బంతులను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విక్టోరియా 195 పరుగులకు ఆలౌట్ కాగా.. ఓపెనర్గా బరిలోకి దిగిన చంద్రసింఘే చివరి దాకా అజేయంగా క్రీజ్లో నిలబడి ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్ ఫైనల్లో కనీసం 250 బంతులను ఎదుర్కొని చివరి దాకా అజేయంగా క్రీజ్లో నిలబడిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 1997-98 సీజన్ ఫైనల్లో టాస్మానియా ఆటగాడు జేమీ కాక్స్ 267 బంతులు ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరిన్ని రికార్డులు కూడా కొల్లగొట్టాడు. షీల్డ్ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయకుండా షీల్డ్ ఫైనల్లో చివరి వరకు క్రీజ్లో నిలబడిన ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. 16.43 స్ట్రయిక్ రేట్తో బ్యాటింగ్ చేసిన చంద్రసింఘే.. తొలి పరుగు చేసేందుకు ఏకంగా 49 బంతులు తీసుకోవడం కూడా ఓ రికార్డే. కాగా, చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్ను కొందరు విమర్శిస్తుంటే, మరికొందరేమో ప్రశంశిస్తున్నారు. చంద్రసింఘే ఓపికగా క్రీజ్లో నిలబడిన విధానాన్ని టెస్ట్ క్రికెట్ ప్రేమికులు ఆకాశానికెత్తుతున్నారు. శ్రీలంక బీజాలు కలిగిన చంద్రసింఘే కుమార సంగక్కర, మైక్ హస్సీలను ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే, షీల్డ్ ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి విక్టోరియా 2 పరుగుల లీగ్లో ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 195 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 315 పరుగులకు ఆలౌటైంది. -
రైల్వే చరిత్రలో రికార్డు..పెనాల్టీల రూపంలో రూ.9.62 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య ఏ స్థాయిలో ఉందో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట. టికెట్ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి అపరాధ రుసుము వసూలు చేయటంలో తొమ్మిది మంది టికెట్ తనిఖీ సిబ్బంది చురుగ్గా వ్యవహరించి పెద్దమొత్తంలో పెనాలీ్టలు వసూలు చేశారు. ఇలా ఒక అధికారి రూ.కోటికిపైగా పెనాల్టీ వసూలు చేయటం రైల్వే చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఈ ఘనత సాధించారు. సికింద్రాబాద్ డివిజన్కు చెందిన చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ నటరాజన్ 12,689 మంది ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.9.16 కోట్లు వసూలు చేయటం విశేషం. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్!
ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ( iPhone 15 Pro Max) ఫోన్ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ల ఫ్రంట్ గ్లాస్కు సంబంధించిన వీడియోలు ఇటీవల ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఇందులో స్క్రీన్ బెజెల్ చాలా సన్నగా ఉన్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే స్క్రీన్కు చుట్టూ ఫోన్ ఫ్రేమ్కు మధ్య ఉన్న అంచును స్క్రీన్ బెజెల్ అని అంటారు. ఇదీ చదవండి: యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు! ఈ స్క్రీన్ బెజెల్ విషయంలో షావోమీ రికార్డ్ను ఐఫోన్ అధిగమించనుంది. షావోమీ (Xiaomi) 13 స్క్రీన్ బెజెల్ 1.81 ఎంఎం. ఇప్పటివరకూ ఇదే అతి సన్నని బెజెల్. ఇప్పుడు ఈ రికార్డ్ను యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బద్ధలుకొట్టబోతోంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ ఫోన్ బెజెల్ వెడెల్పు 1.55 ఎంఎం ఉంటుందని టిప్స్టర్ ఒకరు ట్విటర్లో షేర్ చేశారు. ఆల్వేస్ ఆన్, ప్రో మోషన్ వంటి డిస్ప్లే ఫీచర్లను యాపిల్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లకు పరిమితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే Wi-Fi 6E నెట్వర్క్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని పుకారు వచ్చింది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లలో హాప్టిక్ ఫీడ్బ్యాక్తో కూడిన సాలిడ్ స్టేట్ బటన్లు, టైటానియం ఫ్రేమ్, అధిక ర్యామ్ వంటి కొత్త ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది. iPhone 15 Pro Max will break the record of 1.81mm bezel black edge held by Xiaomi 13, and we measure that its cover plate black bezel width is only 1.55 mm.(S22 and S23 ≈1.95mm,iPhone 14 Pro 2.17mm) pic.twitter.com/9TBrVCGSCo — Ice universe (@UniverseIce) March 17, 2023 -
TSRTC: టార్గెట్ రూ.4,953 కోట్లు.. వచ్చింది రూ.6,055 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ గతంలో ఎన్నడూ లేనంత భారీ ఆదాయాన్ని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 17వ తేదీ నాటికి రూ.6,055 కోట్ల రెవెన్యూతో కొత్త రికార్డు సృష్టించింది. మార్చి నెలాఖరుకు ఈ మొత్తం రూ.6,285 కోట్లకు చేరుతుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.4,953 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, దానికి మించి రూ.వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. గతేడాది ఈ మొత్తం రూ.3,971 మాత్రమే కావటం గమనార్హం. ఖజానాను నింపే శాఖలపై ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల అమలుకు కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకునే క్రమంలో ప్రభుత్వం, మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసి వరుస సమీక్షలతో అధికారులను పరుగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో, రవాణా శాఖ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ సహా కొన్ని ట్యాక్స్లను పెంచి మరీ ప్రభుత్వ ఖజానాకు మెరుగైన మొత్తాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ట్రాన్స్పోర్టు వాహనాల యజమానులు పన్నులు సరిగా కట్టడం లేదు. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించి బకాయి పడ్డ పన్నులు సహా పెనాల్టీలను వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.54.21 కోట్ల పన్ను బకాయిలు, రూ.9.37 కోట్ల పెనాలీ్టలు వసూలు చేశారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.53 కోట్లకు చేరుకుంది. విలాసవంతమైన వాహనాల సంఖ్య కూడా బాగా పెరిగింది. వాహనాల లైఫ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం భారీగా పెరిగింది. ఇక ఫ్యాన్సీ నంబర్ల వేలాన్ని కూడా రవాణాశాఖ పోత్సహిస్తోంది. లైఫ్ ట్యాక్స్ రూపంలో రూ.4,401.75 కోట్లు, త్రైమాసిక పన్ను రూపంలో రూ.825.28 కోట్లు, ఫీజుల రూపంలో రూ.527.78 కోట్లు, యూజర్ చార్జీల రూపంలో రూ.129.10 కోట్లు, డిటెక్షన్ పద్దు ద్వారా 171.09 కోట్లు సమకూరింది. శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, జేటీసీలతో ఆదాయంపై సమీక్షించారు. లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సాధించిపెట్టినందుకు అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు.. అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర -
అశక్తులకు ‘వైఎస్సార్ పెన్షన్’ శక్తి
సాక్షి, అమరావతి: .. ఇలా ఈ ఇద్దరికే కాదు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వేల మంది అశక్తులకు సీఎం వైఎస్ జగన్ పెన్షన్ అందిస్తూ వారికి శక్తినిస్తోంది. ఇలాంటి తీవ్ర, దీర్ఘకాలిక బాధితులను ఆదుకునేందుకు వారికి ఉచిత వైద్యంతో పాటు ప్రతినెలా పెద్ద మొత్తంలో వారికి పెన్షన్ అందిస్తూ జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. తలసేమియా, సికిల్సెల్, హిమోఫిలియా, తీవ్రమైన మూత్రపిండాల (కిడ్నీ) రోగులు, కిడ్నీ, లివర్, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి, ఇంకా అనేక దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు సైతం నెలవారీ పెన్షన్ అందిస్తూ వారికి కొండంత అండగా నిలుస్తోంది. అలాగే, దేశంలో అత్యధిక పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. ఇదే విషయాన్ని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి వీరేంద్రకుమార్ సైతం గతేడాది గుజరాత్లో జరిగిన జాతీయ సదస్సులో ప్రస్తావించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆభినందించారు. ఏపీని మిగిలిన రాష్ట్రాలూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మొత్తం మీద సామాజిక భద్రతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందనడానికి ఇదే గొప్ప నిదర్శనం. దివ్యాంగులకు బాబు మొక్కుబడిగా.. గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దివ్యాంగులకు నామమాత్రంగా పెన్షన్ ఇచ్చి సరిపెట్టింది. అది కూడా వారిని రెండు కేటగిరిలుగా చూపించి రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున పెన్షన్ ఇచ్చేది. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి దివ్యాంగులతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాంత్వన చేకూర్చేలా పింఛన్లు మంజూరు చేసింది. దివ్యాంగులందరిని ఒకే కేటగిరిగా చేసి నెలకు రూ.3 వేలు చొప్పున పింఛను ఇస్తుండటం విశేషం. సామాజిక భ్రద్రతలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన ఉమాదేవి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ప్రతి 21 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయాలి. బిడ్డను కాపాడుకోవడానికి ఆమె తల్లిదండ్రులు పడుతున్న వేదనను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థంచేసుకుంది. ఉమాదేవికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తోంది. అంతేకాదు.. వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రతినెలా రూ.10 వేలు పింఛను అందించి ఆ కుటుంబానికి భరోసా ఇస్తోంది. కర్నూలు జిల్లా చానుగొండ్ల గ్రామానికి చెందిన గంగాధర్ హిమోఫిలియాతో బాధపడుతున్నాడు. మోకాళ్లు, కాలిమడం, చేతులు (జాయింట్లు) వాపులు వాస్తున్నాయి. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో తలసేమియా, సికిల్సెల్ రోగుల మాదిరిగానే గంగాధర్కు కూడా వైద్యం అందించి ఉచితంగానే మందులు ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్న అతని కుటుంబానికి భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా ప్రతినెలా రూ.10 వేలు అందిస్తోంది. అశక్తులకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలో అశక్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. రాష్ట్రంలో 14 రకాల రోగ పీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు మొత్తం రూ.255కోట్లకు పైగా పింఛన్లు ఇస్తోంది. దివ్యాంగులతోపాటు తలసేమియా, సికిల్సెల్, హీమోఫిలియా, బోదకాలు, కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ రోగులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు, పక్షవాతం, రోడ్డు ప్రమాదాలతో కుర్చీ, మంచానికే పరిమితమైన వారికి, కండరాల క్షీణత వంటి సమస్యలున్న వారికి ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు నెలనెలా పింఛను ఇస్తూ ఆందుకుంటోంది. – బి. రవిప్రకాశ్రెడ్డి, సంచాలకుడు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ -
వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్పే!
యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్పే తెలిపింది. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్కు ఆమోదం? యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది. -
IND VS AUS 4th Test: చారిత్రక రికార్డుపై కన్నేసిన టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపటి నుంచి (మార్చి 9) నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సిరీస్లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుని, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ బెర్తు కూడా ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే హిట్మ్యాన్ సేన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యం కాని ఓ చారిత్రక రికార్డుపై కూడా కన్నేసింది. 2013 నుంచి స్వదేశంలో వరుసగా 15 టెస్ట్ సిరీస్లు గెలిచిన భారత్.. ఆసీస్తో నాలుగో టెస్ట్లో విజయం సాధించినా లేక కనీసం డ్రా చేసుకున్నా, సొంతగడ్డపై వరుసగా 16వ టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా రికార్డుల్లోకెక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్ ఏ ఇతర జట్టు కూడా స్వదేశంలో వరుసగా ఇన్ని టెస్ట్ సిరీస్లు గెలిచింది లేదు. ఈ విషయంలో ఏ జట్టు కూడా కనీసం టీమిండియా దరిదాపుల్లో లేదు. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై రెండుసార్లు వరుసగా 10 టెస్ట్ సిరీస్లు గెలిచింది కానీ, టీమిండియా తరహాలో వరుసగా 15 సిరీస్లు గెలిచింది లేదు. ఈ జాబితాలో స్వదేశంలో 8 వరస సిరీస్ విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉంది. గత పదేళ్లలో భారత్ స్వదేశంలో 45 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. 36 మ్యాచ్ల్లో గెలుపొంది, కేవలం 3 మ్యాచ్ల్లోనే ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, BGT-2023లో తొలి రెండు టెస్ట్ల్లో గెలుపొంది, 4 మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసేలా కనిపించిన రోహిత్ సేన అనూహ్యంగా మూడో టెస్ట్లో ఆసీస్ చేతిలో చావుదెబ్బ తినింది. ఈ మ్యాచ్లో నాథన్ లయోన్ 11 వికెట్లతో పేట్రేగిపోవడంతో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టెస్ట్ల్లో బ్యాటింగ్లో పర్వాలేదనిపించిన భారత్.. ఈ మ్యాచ్లో పూర్తిగా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్లో లయోన్ వీరలెవెల్లో విజృంభించడంతో (8/64) 163 పరుగులకే చాపచుట్టేసింది. భారత్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (197) పరిమితమైన ఆసీస్.. టీమిండియా నిర్ధేశించిన 78 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు భారత్.. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 132 తేడాతో, రెండో టెస్ట్లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ను మట్టికరిపించింది. నాలుగో టెస్ట్ అనంతరం భారత్, ఆసీస్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. తొలి వన్డే మార్చి 17న ముంబైలో, రెండో వన్డే 19న విశాఖలో, మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగుతుంది. -
ట్రెండ్ సెటర్ సీఈవో సరికొత్త చరిత్ర: గంటకు రూ.12 కోట్లు
వాషింగ్టన్: గంటకు 12 కోట్లు సంపాదించడం అంటే చిన్న విషయం కాదు కదా. కానీ అమెరికాలోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్ సీఈవో స్టీఫెన్ స్క్వార్జ్మాన్ (76) ఈ ఫీట్ సాధించింది. 2022లో అత్యధిక సంపదను కూడబెట్టుకుని మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. గత ఏడాది ఏకంగా 1.27 బిలియన్ డాలర్లు సంపాదించారు. 2021లో స్క్వార్జ్మాన్ వార్షిక ఆదాయం 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజా నివేదికల ప్రకారం ఇన్వెస్టింగ్ టైటాన్ స్క్వార్జ్మాన్ 2022లో అతని సంపాదన గంటకు రూ. 12 కోట్లు. వాల్స్ట్రీట్లో ఆయనదే రికార్డు అని బిజినెస్ వర్గాలు తెలిపాయి. బ్లాక్స్టోన్ షేర్లలో దాదాపు 20శాతం ఉన్న ఆయనకు 1 బిలియన్ డాలర్ల డివిడెండ్, 253.1 మిలియన్ల డాలర్ల ఇతర ప్రయోజనాలను పొందారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బ్లాక్స్టోన్ సీఈవో నికర విలువ 30.6 బిలియన్ డాలర్లు. 2021లో ఏకంగా రూ.8,500 కోట్ల వేతనంతో వాల్స్ట్రీట్లో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా రికార్డు బద్దలు కొట్టారు. 2022లో ఎస్ అండ్ పీ 500 8.2 శాతం క్షీణించగా, బ్లాక్స్టోన్ షేర్ల నష్టాలు 1.5 శాతానికి పరిమితం కావడం విశేషం.స్టీఫెన్ వారసుడు బ్లాక్స్టోన్ ప్రెసిడెంట్ జోన్ గ్రే, 2022లో 479.2 మిలియన్ల డాలర్లు ఆర్జించాడు. బ్లాక్స్టోన్లో 3 శాతం వాటా, డివిడెండ్ ఆదాయం కలిపి 182.7 మిలియన్లు అతని నికర విలువకు చేరాయి. కాగా స్టీఫెన్ స్క్వార్జ్మాన్ ఫిబ్రవరి 14,1947న జన్మించారు. 1985లో ఏర్పాటైన బ్లాక్స్టోన్కు స్టీఫెన్ సహ వ్యవస్థాపకుడు. లెమాన్ బ్రదర్స్ మాజీ ఛైర్మన్, సీఈవో పీటర్సన్తో కలిసి 1985లో ది బ్లాక్స్టోన్ గ్రూప్ అనే గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థను స్థాపించారు స్క్వార్జ్మాన్ . -
టెలీమెడిసిన్ సేవల్లో రికార్డు సృష్టించిన ఏపీ
-
నందమూరి తారకరత్న గురించి ఈ విషయాలు తెలుసా?
సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వారిలో నందమూరి తారకరత్న ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో చిత్రసీమలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రం 2002లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. సక్సెస్ఫుల్ ఆడియో ఆల్బమ్స్తో యువతకు చేరువైంది. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే ఏకంగా 9 సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు నందమూరి తారకరత్న. కానీ అతనికి అదృష్టం కలిసి రాలేదు. పదిహేనుకు పైగా చిత్రాలు చేసినప్పటికీ తారకరత్నకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ కుమారుడైన నందమూరి మోహన కృష్ణ కుమారుడు తారకరత్న. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా పోషించారు. కుటుంబం విషయానికి వస్తే 2012లో నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. తారకరత్న హీరోగా వచ్చిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య క్యాస్టూమ్ డిజైనర్గా కూడా పని చేశారు. నందమూరి తారకరత్న చేసింది కొద్ది సినిమాలే అయినా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. హఠాత్తుగా గుండెపోటుతో ఆయన మరణించడంతో యావత్ సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఈ విషాద సమయంలో ఆయన నటించిన సినిమాలను ఓసారి గుర్తు చేసుకుందాం. ఒకటో నంబర్ కుర్రాడు(2002) యువ రత్న(2002) తారక్(2003) నో(2004) భద్రాద్రి రాముడు(2004) పకడై(2006) అమరావతి(2009) వెంకటాద్రి(2009) ముక్కంటి(2010) నందీశ్వరుడు(2011) విజేత(2012) ఎదురులేని అలెగ్జాండర్(2012) చూడాలని.. చెప్పాలని(2012) మహా భక్త సిరియాలా(2014) కాకతీయుడు(2015) ఎవరు(2016) మనమంతా(2016) రాజా చేయి వేస్తే(2016) కయ్యూం భాయి(2017) దేవినేని(2021) సారథి(2022) 2022లో 9 అవర్స్ సిరీస్లోనూ నటించారు. అమరావతి సినిమాలో నటనకు బెస్ట్ విలన్గా నంది అవార్డ్ అందుకున్నారు తారకరత్న. -
రాయలచెరువు పీహెచ్ సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకుంటుండగా సెల్ ఫోన్ తో చిత్రీకరణ
-
సంచలనం: ఒక్కడికే కనీవినీ ఎరుగని లాటరీ ప్రైజ్మనీ!!
లాటరీ చరిత్రలోనే అదొక సంచలనం. కనివినీ ఎరుగని రీతిలో లాటరీ ప్రైజ్ దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. ఎంతో తెలుసా? మన కరెన్సీలో అక్షరాల పదహారున్నర వేల కోట్ల రూపాయలకు పైనే. అమెరికా లాటరీ గేమ్ పవర్బాల్లో.. కాలిఫోర్నియాకి చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఏకంగా 2.04 బిలియన్ డాలర్లు గెల్చుకున్నాడు. ఆ విజేత ఎవరనే విషయాన్ని కాలిఫోర్నియా లాటరీ అధికారులు ఎట్టకేలకు చెప్పారు. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ కాస్ట్రో అంట. కానీ, అతనికి సంబంధించిన ఇతర వివరాలేవీ వెల్లడించలేదు అధికారులు. నవంబర్ నెలలో పవర్బాల్ జాక్పాట్ అతనికి దక్కగా.. తద్వారా చరిత్రలోనే కనివిని ఎరుగని లాటరీ ప్రైజ్మనినీ దక్కించుకున్నాడతను. కాలిఫోర్నియా చట్టాల ప్రకారం.. విజేత వివరాలను వెల్లడించొచ్చు. కానీ, అందులో కొన్ని కండిషన్లు ఉన్నాయి. పేరు చెప్పొచ్చు. ఆ టికెట్ను ఎక్కడ కొన్నాడనే విషయమూ చెప్పొచ్చు. టికెట్ కొన్న తేదీ.. గెల్చుకున్న తేదీ.. ఎమౌంట్ వివరాలను కూడా చెప్పొచ్చు. కానీ, అతని అడ్రస్ గిడ్రస్ లాంటి నేపథ్య వివరాలు మాత్రం వెల్లడించకూడదు. ప్రైజ్మనీ అనౌన్స్ చేసిన ఏడాదిలోపే ఎప్పుడైనా ఆ వ్యక్తి ముందుకొచ్చి ప్రైజ్ మనీ తీసేసుకోవచ్చు. కానీ, కాస్ట్రో మాత్రం అందుకు ఆసక్తిగా లేడట. మరి గోప్యంగా అయినా తీసుకుంటాడా? అనేది వేచిచూడాలి. Video Credits: NBC News ఇక జాక్పాట్కొట్టిన విషయం తెలిసిన వెంటనే షాక్కు, అదే సమయంలో భావోద్వేగానికి లోనైనట్లు క్యాస్ట్రో ఒక ప్రకటన విడుదల చేశాడు. పవర్బాల్ లాటరీ గేమ్లో గతంలో 1.6 బిలియన్ డాలర్లు(పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైనే..) గెల్చుకున్నారు ఎవరో. కానీ, ఆ ప్రైజ్మనీని మాత్రం తీసుకోవడానికి ముందుకు రాలేదంట. అమెరియా సంయుక్త రాష్ట్రాల్లోని.. 45 రాష్ట్రాల్లో పవర్బాల్ జాక్పాట్ లాటరీ గేమ్ బాగా పాపులర్. టికెట్ ధర ఎంతో తెలుసా? కేవలం 2 డాలర్లు మాత్రమే(మన కరెన్సీలో 170 రూ. దాకా ఉంటుంది). అలా చూసుకున్నా ఎడ్విన్ క్యాస్ట్రో ఎంత లక్కీనో కదా!. పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ లాటరీ గేమ్ ఆడాలి. ఇదిలా ఉంటే భారత్లోనూ గుర్తింపు ఉన్న లాటరీ ఏజెన్సీల ద్వారా ఈ టికెట్ కొనుగోలు చేసుకుని ఆడొచ్చు. లక్షల్లో ఎవరో ఒకరికి చాలా చాలా అరుదుగా దక్కుతుంది ప్రైజ్ మనీ. అయితే గోల్డెన్ ఛాన్స్ కొట్టే వాళ్లు మాత్రం ఎడ్విన్ కాస్ట్రోలాగా.. కోట్లల్లో ఒక్కడు ఉంటాడేమో!. -
ఆల్టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో చికెన్ ధర ఆకాశన్నంటింది. కరాచీ సహా ఇతర నగరాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే చికెన్ రేటు రికార్డు స్థాయిలో పెరగడానికి పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే ప్రాధన కారణమని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కోళ్ల ఫీడ్కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని చెప్పింది. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720గా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండి, సహా ఇతర నగరాల్లో ఈ ధర రూ.700-705గా ఉంది. పాకిస్తాన్లో రెండో పాపులర్ సిటీ అయిన లాహోర్లో కేజీ చికెన్ను రూ.550-600 మధ్య విక్రయిస్తున్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా చికెన్ను తినలేకపోతున్నామని చెబుతున్నారు. విచారణ కోళ్లకు అందించే ఫీడ్కు కొరత ఎందుకు ఏర్పడిందనే విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. చికెన్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. దాని సరఫరా గొలుసుకు ఏవైనా అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పాక్ మీడియా పేర్కొంది. చదవండి: టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు.. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
8 కోట్ల డీమ్యాట్ ఖాతాలు.. సీడీఎస్ఎల్ రికార్డ్
ముంబై: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ప్లాట్ఫామ్పై యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని సంస్థ గురువారం ప్రకటించింది. యాక్టివ్ (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) డీమ్యాట్ ఖాతాల విషయలో ఆసియాలోనూ, దేశీయంగా అతిపెద్ద డిపాజిటరీగా సీడీఎస్ఎల్ ఉంది. నియంత్రణ సంస్థ మార్గదర్శకం, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్, మార్కెట్ ఇంటర్మీడియరీల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని సీడీఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ నేహల్ వోరా పేర్కొన్నారు. సీడీఎస్ఎల్ 1999 ఫిబ్రవరిలో కార్యకలాపాలు ఆరంభించింది. సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించుకునే సేవలు అందిస్తుంటుంది. సీడీఎస్ఎల్ సబ్సిడరీ అయిన సీడీఎస్ఎల్ వెంచర్స్ దేశంలో మొదటి అతిపెద్ద కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీగా ఉంది. 4.5 కోట్ల కేవైసీ రికార్డులను కలిగి ఉంది. సీడీఎస్ఎల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కమోడిటీ రిపాజిటరీ సేవల్లోనూ ఉంది. -
నిర్మలా సీతారామన్ మరో రికార్డు, ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రెజెంటేషన్ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్ను కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. ► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్ను కోరారు. ►ఆ తరువాత ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ►ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. ►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు. ► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్కు చివరి బడ్జెట్ కావడంతో పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్ శ్లాబ్స్లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్కాల్ బడ్జెట్ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
నైజాంలో రికార్డు దరకు ప్రభాస్ ప్రాజెక్ట్ - కే రైట్స్
-
సిమ్రాన్ రికార్డును 22 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసిన శృతి హాసన్
-
TS:వైద్య విద్య చరిత్రలో రికార్డు.. 6.50లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో రికార్డు ఇది. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు లక్షలాది ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా ఎంబీబీఎస్లో సీట్లు దక్కుతున్నాయి. గతేడాది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ సీటు నీట్లో 2.70 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు రాగా, ఈసారి ఏకంగా 6.50 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీట్లు దక్కడం రికార్డు అని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఎన్ఆర్ఐ కోటాలోనైతే గతేడాది 9 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి దాదాపు 10 లక్షల ర్యాంకు వరకు వచ్చిన విద్యార్థులకు కూడా సీటు వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 85% రిజర్వేషన్తో తగ్గిన కటాఫ్ రాష్ట్రంలో ప్రస్తుతం 17 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఈసారి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఒక్కసారిగా సీట్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వంలో అన్నీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు కనీ్వనర్ కోటా కింద సీట్లు కేటాయిస్తారు. ప్రైవేట్లో సగం సీట్లు యాజమాన్య కోటా కింద కేటాయిస్తారు. 50 శాతంలో 35 శాతం బీ కేటగిరీ, మరో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయిస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు ప్రభుత్వంలో రూ. 10 వేలు, ప్రైవేట్లో రూ. 60 వేలు ఏడాది ఫీజు ఉంటుంది. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలు ఏడాదికి, ఎన్ఆర్ఐ ఫీజు బీ కేటగిరీకి రెట్టింపు వరకు వసూలు చేసుకోవచ్చు. ప్రభుత్వం పెంచిన మెడికల్ కాలేజీలతో మంచి ర్యాంకులు వచి్చన విద్యార్థులకు అందులో కన్వీనర్ కోటా సీట్లు రాగా, మిగిలిన విద్యార్థులకు బీ–కేటగిరీ సీట్లు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బీ–కేటగిరీలో 85% స్థానిక రిజర్వేషన్ తీసుకురావడంతో వెయ్యికి పైగా సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు దక్కాయి. అందుకే ఇతర రాష్ట్రాల విద్యార్థులు తక్కువ మంది దర ఖాస్తు చేసుకున్నారు. దీంతో 6.50 లక్షల ర్యాంకు వచి్చన విద్యార్థులకు కూడా ఈసారి బీ– కేటగిరీలో సీట్లు దక్కా యని చెబుతున్నారు. దీంతో భారీగా కటాఫ్ తగ్గిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన సీట్లు 188.. ప్రస్తుతం అన్ని కేటగిరీలకు చెందిన సీట్లకు మాప్ రౌండ్ వరకు సీట్ల కేటాయింపు పూర్తయింది. మరో స్పెషల్ రౌండ్ నిర్వహించాలని భావిస్తున్నారు. వాస్తవానికి మాప్ రౌండ్తోనే కౌన్సెలింగ్ ముగిస్తారు. కానీ బీ, ఎన్ఆర్ఐ కోటాలో సీట్ల మిగులుతో మరో రౌండ్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కల ప్రకారం బీ,సీ–కేటగిరీల్లో 188 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. గతేడాది 144 ఎంబీబీఎస్ సీట్లు మిగిలా యి. కొందరు చేరాక సీట్లు వదులుకోవడం, కొందరు బ్లాక్ చేయడం, కొన్ని కాలే జీల్లో ఎన్ఆర్ఐ సీట్లకు భారీ ఫీజులు ఉండటంతో చేరకపోవడం ఇందుకు కారణం. చదవండి: విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు.. -
అరుదైన రికార్డు సాధించిన ధనుష్..
-
దలాల్ స్ట్రీట్ రికార్డ్: 63 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభ లాభాలను మొదట్లో కోల్పోయిన సూచీలు ఆతరువాత ఒక రేంజ్లో ఎగిసాయి. తద్వారా సెన్సెక్స్ 63 వేల స్థాయిని సునాయాసంగా దాటేసింది. అంతేకాదు రికార్డు క్లోజింగ్ను నమోదు చేసింది. వరుసగా ఏడో రోజూ జోరుతో ఆల్-టైమ్ హైకి చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాల నార్జించాయి. ముఖ్యంగా మూడు గంటలతర్వాత రిలయన్స్, ఇన్ఫోసిస్, అదానీ షేర్ల లాభాలు మార్కెట్లను రికార్డు స్థాయిల వైపు మళ్లించాయి. ఆటో షేర్లు మెరిపించాయి. ఒక దశలో సెన్సెక్స్ 600పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 418 పాయింట్లు ఎగిసి 63009 వద్ద, నిఫ్టీ140 పాయింట్లు 187580 వద్ద స్థిరపడ్డాయి. ఎం అండ్ ఎం, హిందాల్కో, గ్రాసిం, సిప్లా ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో జేఎస్డబ్ల్యూ స్టీల్, డా.రెడ్డీస్ టాప్ విన్నర్స్గా, ఇండస్ ఇండస్ ఇండ్, ఎస్బీఐ, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 36 పైసలు ఎగిసి 81.42 వద్ద ఉంది. -
ష్.. గప్చుప్..!!.. యువతులు దుస్తులు మార్చుకునే దృశ్యాల చిత్రీకరణ
సాక్షి, కోనసీమ జిల్లా(ఆత్రేయపురం): ఆడపిల్లలకు రక్షణ కరవైంది. తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారనే సంగతి మర్చిపోయి కొందరు మృగాళ్లు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. షాపింగ్ మాల్స్, ట్రైల్ రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలు దుస్తులు మార్చుకునే దృశ్యాలను చాటుగా చిత్రీకరించే విషయాలను చాలా వింటున్నాం. అదే ఓ ప్రభుత్వ కార్యాలయంలోనే ఇలా చేస్తే.. ఎవరిదీ తప్పు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల ఇరిగేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఫేస్బుక్ పరిచయంతో స్నేహితులంతా కలసి లొల్లలాకుల వద్ద కార్తిక మాసం సందర్భంగా ఈ నెల 20న వన సమారాధన ఏర్పాటు చేసుకున్నారు. కొందరు యువకులు, యువతులు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. అయితే యువతులు దుస్తులు మార్చుకునేందుకు అక్కడే ఉన్న ఇరిగేషన్ కార్యాలయాన్ని అధికారుల అనుమతితో తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ కార్యాలయంలో పనిచేసే ఓ కాంట్రాక్టు సిబ్బంది ఒకరు రహస్యంగా ఆ రూమ్లో సెల్ఫోన్ రికార్డింగ్ బటన్ ఆన్చేసి.. ఎవరికీ కనబడకుండా కేవలం యువతుల దుస్తులు మార్చుకునే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. ఆ విషయం తెలియని ఆ యువతులు మామూలుగానే ఆ రూంలోకి వెళ్లారు. ఒకరిద్దరు దుస్తులు కూడా మార్చుకున్నారు. మరొకరు ఆ రూంలో చూస్తుండగా సెల్ఫోన్ కంట పడింది. దీంతో ఆ యువతులు షాక్కు గురై వెంటనే తమను ఇక్కడికి ఆహ్వానించిన స్నేహితులకు విషయం చెప్పి.. సెల్ఫోన్ అప్పగించారు. ఆ సెల్ఫోన్ ఎవరిదని ఆరా తీస్తే.. అక్కడ పనిచేస్తున్న వ్యక్తిది అని తెలిసింది. వెంటనే అతన్ని పట్టుకుని గట్టిగా దేహశుద్ధి చేశారు. అనంతరం ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ కొందరు పెద్దలు, అధికారులు కలసి విషయాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా రాజీచేసి కేసు లేకుండా ఆ సెల్ఫోన్ రికార్డింగ్ చేసిన ప్రబుద్ధుడిని వదిలేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిని సాధారణంగా వదిలేస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీసులు కుమ్మక్కై వదిలేశారనే ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సై సీహెచ్ సుధాకర్ వివరణ కోరగా జరిగిన విషయం వాస్తమేనని, అయితే తమకు కేసు వద్దని స్నేహితులంతా తెలిపారన్నారు. దీంతో చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. -
రికార్డ్ లాభాలను సాధించిన ఉజ్జీవన్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202223) రెండో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జులై-సెప్టెంబర్(క్యూ2)లో రూ. 294 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఒక క్వార్టర్కు బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభంకాగా.. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 274 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 63 శాతం జంప్చేసి రూ. 1,140 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం సైతం 54 శాతం ఎగసి రూ. 993 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 8.1 శాతం నుంచి 9.8 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 11.8 శాతం నుంచి 5.06 శాతానికి, నికర ఎన్పీఏలు 3.29 శాతం నుంచి 0.04 శాతానికి దిగివచ్చాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో క్విప్ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించినట్లు బ్యాంక్ వెల్లడించింది. -
ఒక్క మునుగోడులోనే 300 కోట్ల మద్యం అమ్మకాలు
-
పాత రికార్డులు బద్దలు.. మునుగోడులో 93.41% పోలింగ్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ముంబై నుంచి కూడా.. ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాయి. దీంతో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వడం పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. 686 మంది పోస్టల్బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్ నమోదైంది. దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా నారాయణపురం మండలంలో 93.76 శాతం పోలింగ్ జరిగింది. చౌటుప్పల్ మండలం నేలపట్లలోని 4వ పోలింగ్ స్టేషన్లో, సంస్థాన్ నారాయణపురం మండలం ఐదుదొనెల తండాలో 72వ పోలింగ్ కేంద్రంలో, గుజ్జ, నారాయణపురంలో ఒక పోలింగ్ స్టేషన్, మునుగోడు మండలం గంగోరిగూడెం, కొండూరు పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలు, పురుషుల ఓట్లు సమాన సంఖ్యలో పోలయ్యాయి. 105 పోలింగ్ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారు. చదవండి: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
సౌర వెలుగుల శిఖరంపై ముఖర.. రాష్ట్రంలోనే తొలి గ్రామంగా రికార్డు
ఇచ్చోడ (బోథ్): ఆదిలాబాద్ జిల్లా ముఖర(కె) గ్రామ పంచాయతీ సొంత నిధులతో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించుకుని రాష్ట్రంలోనే మొదటి గ్రామంగా నిలిచింది. పంచాయతీల్లో విద్యుద్దీపాలు, ఇతర సౌకర్యాల బిల్లులు పెరిగిపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. దీంతో సమస్య పరిష్కారానికి సర్పంచ్ గాడ్కే మీనాక్షి వినూత్నంగా ఆలోచించారు. గ్రామంలో సేంద్రియ ఎరువుల విక్రయంతో వచ్చిన ఆదాయం రూ.4లక్షలు ఖర్చు చేసి సోలార్గ్రిడ్ ఏర్పాటు చేయించారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే 6 కిలోవాట్ల విద్యుత్ను పంచాయతీ, అంగన్వాడీ, గ్రామ వీధి దీపాలకు వినియోగిస్తున్నారు. 4 కిలోవాట్ల విద్యుత్ పంచాయతీ అవసరాలకు సరిపోగా.. మిగతా 2కిలోవాట్ల విద్యుత్ను ట్రాన్స్కోకు విక్రయించి నెలకు రూ.4వేల ఆదాయం పొందుతున్నారు. బిల్లుల చెల్లింపు బాధ లేకపోగా ఆదాయం సమకూరుతుండటంతో ముఖర(కె) గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచింది. చదవండి: బడిలోనే ఒకరు.. బడికెళ్లనంటూ మరొకరు.. నలుగురు ఒకేరోజు.. -
వాతావరణ కార్యకర్త ఫోన్ చోరీ...ఫేస్బుక్లో లైవ్ రికార్డు చేస్తుండగా....
నొయిడా: వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం మొబైల్ ఫోన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెప్పపాటులో లాక్కుని పరారయ్యారు. ఈ మేరకు 11 ఏళ్ల బాలిక లిసిప్రియ నొయిడాలో తన అనుచరులతో కలిసి ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండేలా... కాకర్స్ కాల్చకుండా దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలనే దానిపై ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇంతలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె ఫోన్ని లాక్కుకుని వెళ్లిపోయారు. దీంతో ఆమె పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా తనకు సహాయం చేయమంటూ ట్విట్టర్లో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ నొయిడా అదనపు డీసీపీ సాద్మియాన్ కేసు నమోదు మొబైల్ స్నాచర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మణిపూర్కి చెందిన లిసిప్రియ కంగుజం వాతావరణ మార్పులపై పోరాటం చేస్తున్న పర్యావరణ కార్యకర్త. కీలకమైన వాతావరణ మార్పు సమస్యలపై పలువురు ప్రపంచ నేతలను కలిసింది కూడా. అంతేగాదు ఆ బాలిక కాప్ 25 వాతావరణ మార్పు సదస్సులో ప్రసంగించి అందరీ మన్ననలను పొందింది. ఇటీవల చత్తీస్గఢ్ బొగ్గు వ్యతిరేక నిరసనలో పాల్గొంది. అలాగే 2020లో వాషింగ్టన్లో ఎర్త్డేని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో కూడా పాల్గొంది. (చదవండి: మిరాకిల్ అంటే ఇదే...మీద నుంచి కారు వెళ్లిపోయింది ఐనా...) -
అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే!
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు మారడం.. యూకేలోని రాజకీయ అస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే పాలనాపరమైన నిర్ణయాలు దారుణంగా బెడిసి కొట్టడం.. సొంత పార్టీ నుంచే ప్రతికూలత నడుమ కేవలం 45 రోజులకే ట్రస్ ఆ పదవికి రాజీనామా చేయడం ఇక్కడ గమనార్హం. ఈ తరుణంలో.. ట్రస్ రాజీనామాపై సెటైర్లు సైతం పేలుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత తక్కువ కాలం పదవిలో కొనసాగిన కొందరి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం.. ► లిజ్ ట్రస్.. బ్రిటన్ అధికారిక కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతుతో.. సెప్టెంబర్ 6వ తేదీన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో ప్రధాని పగ్గాలు చేపట్టారు లిజ్ ట్రస్. కానీ.. ఆర్థిక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు 45 రోజుల తర్వాత డౌనింగ్ స్ట్రీట్ను వీడుతూ ఆమె తన రాజీనామాను ప్రకటించారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. అంతకు ముందు ఆ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. క్షయ వ్యాధి బారినపడి ఆగస్టు 8వ తేదీన, 1827లో ఆయన మరణించారు. ► అటల్ బిహారీ వాజ్పేయి.. 16 రోజులు దేశ ప్రధాని పదవిలో కొనసాగారు. మే 16, నుంచి జూన్ 1వ తేదీ దాకా.. విశ్వాస పరీక్ష తీర్మానం నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి స్వచ్ఛందంగా దిగిపోయి రాజకీయాల్లో తనదైన నిజాయితీ ప్రదర్శించారనే ముద్ర వేసుకున్నారాయన. ► వాజ్పేయి కంటే ముందు.. గుల్జారీలాల్ నందా ఆపద్ధర్మ ప్రధానిగా కేవలం పదమూడు రోజులపాటు.. అదీ రెండు పర్యాయాలు కొనసాగారు. మొదటిసారి నెహ్రూ మరణం తర్వాత, రెండోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత గుల్జారీలాల్ నందా ప్రధాని పదవిలో కొనసాగారు. గుల్జారీలాల్ నందా మధ్యలో.. ప్రమాణం చేసిన గంటకే.. 1967లో సియెర్రా లియోన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సియాకా స్టీవెన్స్ ప్రధాని అయ్యారు. కానీ, పాపం గంటకే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. మిలిటరీ తిరుగుబాటుతో ప్రమాణం చేసిన గంటకే ఆయన్ని అరెస్ట్ చేసి కారాగారానికి పంపారు. అయితే.. తన మార్క్ రాజకీయంతో జైలు నుంచే చక్రం తిప్పిన ఆయన.. రెండువారాలకు మిలిటరీ తిరుగుబాటును అణచివేయగలిగారు. బయటకు వచ్చి మళ్లీ ప్రధాని పదవి చేపట్టి.. పదిహేడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అధ్యక్షులు కూడా.. ► అమెరికా ఆర్మీ అధికారి, ఆ దేశానికి తొమ్మిదవ అధ్యక్షుడు అయిన విలియం హెన్రీ హ్యారీసన్.. కేవలం 32 రోజులపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పదవిలో ఉండగా మరణించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా హ్యారీసన్ కావడం గమనార్హం. ► మెక్సికో అధ్యక్షుడు పెడ్రో లాస్కురెయిన్.. 1913లో కనీసం గంటపాటు కూడా పదవిలో కొనసాగలేదు. జనరల్ విక్టోరియానో హ్యూయెర్టో సారధ్యంలో జరిగిన మిలిటరీ తిరుగుబాటుతో పగ్గాలు చేపట్టిన 45 నిమిషాలకే పెడ్రో తన పదవి కోల్పోయారు. ► 1945, ఏప్రిల్ 30 జర్మనీ మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం.. నాజీ జర్మనీలో జోసెఫ్ గోయెబ్బెల్స్ ఛాన్స్లర్ పగ్గాలు చేపట్టారు. అయితే.. ఆయన జర్మనీ చాన్స్లర్గా కొనసాగింది ఆ ఒక్క రాత్రి మాత్రమే. ఉదయం కల్లా భార్య మాగ్దా, తన ఆరుగురు పిల్లలతో గోయెబ్బెల్స్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజులు.. రాణులు కూడా! ► అధినేతల విషయంలోనే కాదు.. రాజరికంలోనూ అత్యంత తక్కువ కాలం సింహాసనం మీద కూర్చున్నవాళ్ల రికార్డులు ఉన్నాయి. ఫ్రాన్స్ రాజుగా లూయిస్ 19.. 1803లో కేవలం ఇరవై నిమిషాలపాటు మాత్రమే సింహాసనం మీద కూర్చున్నారు. చాలాకాలం ఆయన ఫ్రాన్స్కు దూరంగా గడిపారు. ► పోర్చుగల్ రాజుగా లూయిస్ పిలిపె కూడా అత్యంత తక్కువ సమయం(20 నిమిషాలే!) సింహాసనం అధిష్టించిన రికార్డు ఉంది. 1908 ఫిబ్రవరి 1న జరిగిన తండ్రి కార్లోస్ 1 హత్య జరగ్గా.. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు పిలిపె.. 20 నిమిషాలపాటు ప్రాణాలతో పోరాడాడు. ఆ 20 నిమిషాలను అతని సింహాసన కాలంగా గుర్తించింది పోర్చుగల్. ► నైన్ డేస్ క్వీన్గా గుర్తింపు పొందిన లేడీ జాన్ గ్రే.. తొమ్మిది రోజుల పాటు ఇంగ్లండ్, వేల్స్, ఐర్లాండ్లకు రాణిగా సింహాసనంపై కొనసాగింది. అదీ కేవలం 16 ఏళ్ల వయసులో. 1553 జులై 10 నుంచి 19 మధ్య ఆమె రాణిగా కొనసాగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు మరణ శిక్ష అమలు చేశారు. ► రష్యాలో.. మైకేల్ 2 అతితక్కువ సమయం సింహాసనంపై రాజుగా కొనసాగాడు. సోదరుడు సార్ నికోలస్ 2.. మార్చి 1997లో సింహాసనం నుంచి దిగిపోగా.. 18 గంటలపాటు రాజుగా మైకేల్ 2 కొనసాగాడు. అయితే.. తిరుగుబాటు నేపథ్యంలో అతన్ని చెరసాలలో బంధించగా.. ఆపై హత్యకు గురయ్యాడు. -
బతికుండగానే చంపేశారు!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఆస్తిపై కన్నేసిన దుర్మార్గులు ఓ వ్యక్తి బతికుండాగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించారు. ఘటనకు సంబంధించి ఎప్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాల మేరకు అనంతపురం రెండో పట్టణ సీఐ శివరాముడు కేసు నమోదు చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. అనంతపురం రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీరామ్నాయక్... మృతి చెందినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆయన ఇంటిని కాజేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీరామ్నాయక్ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల పాత్రపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ) -
సాధారణ తాడుపై థ్రిల్ ఏముందనుకున్నారేమో.. అగ్నిపర్వతంపై నడక
నిప్పులగుండం మీద నడక తెలిసిందే. కానీ.. ఇది జారిపడితే బూడిద కూడా మిగలకుండా పోయే లావాపై నడక. ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! కానీ నడిచి చూపించారు బ్రెజిల్కు చెందిన రాఫేల్ బ్రీదీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ స్కుల్జ్. సాహసాలు చేయడంలో ఆరితేరిన ఈ ఇద్దరికీ తాడు మీద నడవడమంటే మంచినీళ్ల ప్రాయం. అయితే సాధారణ తాడు మీద నడిస్తే... సాహసమేముందనుకున్నారేమో! టానా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతంపై 137 అడుగుల ఎత్తులో తాడుపై నడిచారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే... ఆ తాడుపై 856 అడుగుల మేర నడిచి.. గిన్నిస్ రికార్డును సృష్టించారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)