వీర జవాన్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు  | Farewell to Veera Jawan with military honours | Sakshi
Sakshi News home page

వీర జవాన్‌కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు 

Sep 29 2023 2:52 AM | Updated on Sep 29 2023 2:52 AM

Farewell to Veera Jawan with military honours - Sakshi

భట్టిప్రోలు: రాజస్తాన్‌లోని పాకిస్తాన్‌ బోర్డర్‌ జస్పల్‌మీర్‌ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జ­వా­న్‌ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించా­రు. సోమవారం జస్పల్‌మీర్‌ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్‌లో అకస్మాత్తుగా గోప­రాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం  స్వ­గ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు.  మృతదేహా­న్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారు­లు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్‌కు స్థూపం కట్టేందుకు  కేటాయించారు.

రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్‌ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్‌ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్‌ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్‌కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement