-
ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు
-
చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!
వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది. ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల -
128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక..
మమ్మకీ అంత్యక్రియాలా! అని ఆశ్చర్యపోకండి. ప్రమాదవశాత్తు మమ్మీగా మారిన ఆ వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్ 6 వరకు సందర్శనార్థం ఉంచి మరుసటి రోజు అనగా అక్టోబర్ 7న ఖననం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటన పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చరిత్రకారుల ప్రకారం..పెన్సిల్వేనియా వ్యక్తి 19వ శతాబ్దం చివరలో అనుకోకుండా మమ్మీగా చేయబడ్డాడు. స్టోన్మ్యాన్గా పిలిచే ఈ మమ్మీ 128 ఏళ్లుగా అలానే ఉండిపోయింది. నిజానికి అతని ఐడెంటిటీ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు ఆ మమ్మీ ఐడెంటిటీని కనుగొనడంతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడమే గాక అతడెవరనేది బహిర్గతం చేయాలనకున్నారు. ఐతే ఈ వ్యక్తి వెనక దాగున్న కథ కాస్త విచిత్రమైనదే. ఈ వ్యక్తి మద్యానికి వ్యసనపరుడై దొంగతనం ఆరోపణలతో బెర్క్స్ కౌంటీ జైలులో పట్టుబడ్డాడు. నవంబర్ 19, 1895న మూత్రపిండాల వైఫల్యంతో మరణించాడు. అయితే ఆ వ్యక్తి అరెస్టు సమయంలో జేమ్స్ పెన్ అనే తప్పుడు పేరుని సూచించినట్లు పేర్కొన్నారు. తన కుటుంబీకులు పరువు పోతుందనే భయంతో ఇలా చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఐతే ఆ తర్వాత అతడి మృతదేహం అతడి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు యత్నించి విఫలమవ్వడంతో పెన్సిల్వేనియాలో రీడింగ్లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్కి తరలించారు. అక్కడ ఎంబామింగ్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పొరపాటున ఇతర శరీరం మమ్మీ చేబడిందని అధికారులు వెల్లడించారు. ఇన్నేళ్లకు అతనెవరో గుర్తించడంతో అక్టోబర్ 6 వరకు ప్రజల సందర్శనార్థం బహిరంగంగా ఉంచాలే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ విధంగా 128 ఏళ్లుగా చెక్కుచెదరని దంతాలు, వెంట్రుకలతో మమ్మీ చేయబడిన వ్యక్తి అంత్యక్రియలు అక్టోబర్ 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మమ్మీని సంరక్షిస్తున్న రీడింగ్ ఫ్యూనరల్ హోం డైరెక్టర్ కైల్ బ్లాంకెన్బిల్లర్ మాట్లాడుతూ..ఆ మమ్మీతో గల తన అనుబంధాన్ని వివరించాడు. అతన్ని కేవలం మమ్మీ అని కాకుండా స్నేహితుడుగా భావించినట్లు తెలిపాడు. పెన్సిల్వేనియా నివాసితులు అతన్ని పట్టణంలో ఓ ప్రముఖుడిగా చూస్తున్నారు. పైగా ఆ వ్యక్తికి(మమ్మీ) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బలం కూడా ఉండటం విశేషం. ఆ మమ్మని సంరక్షించిన రీడింగ్ ఫ్యూనరల్ హెం 275వ వార్షికోత్సవం కావడంతో ఇప్పుడు ఆ మమ్మీకి 19వ శతాబ్దపు నాటి దుస్తులు వేసి .. కవాతు గౌరవంతో కూడిన అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. (చదవండి: ఎలుక పాలు లీటరు 18 లక్షలా..! దేనికి ఉపయోగిస్తారంటే..) -
వీర జవాన్కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు
భట్టిప్రోలు: రాజస్తాన్లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్మీర్ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జస్పల్మీర్ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్లో అకస్మాత్తుగా గోపరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారులు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్కు స్థూపం కట్టేందుకు కేటాయించారు. రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. -
రహస్యంగా మృతదేహం పూడ్చివేత
నల్లగొండ క్రైం : దుండగులు అర్ధరాత్రి ఓ మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి చందనపల్లి శివారు చెత్త డంపింగ్ యార్డు సమీపంలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా.. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 11:30 గంటలకు కారులో నలుగురు, మూడు బైక్లపై మరో ఆరుగురు వ్యక్తులు చందనపల్లి చెత్తడంపింగ్ యార్డు సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతానికి వచ్చారు. వాహనాలను అక్కడే నిలిపి తమ వెంట తెచ్చుకున్న పలుగు, పారలతో సుమారు 4 నుంచి 5 ఫీట్ల పొడవులో గొయ్యి తీశారు. ప్యాకెట్లలో తీసుకొచ్చిన ఉప్పు గొయ్యిలో పోశారు. అనంతరం బ్యాగులో కుక్కి కారులో తీసుకొచ్చిన మృతదేహాన్ని బయటికి తీశారు. ఇద్దరు వ్యక్తులు సదరు మృతదేహం కాళ్లు ఒకరు, చేతులు మరొకరు పట్టుకుని గోతిలో పెట్టి పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో వెంట వచ్చిన ఒకరు పెద్ద పెట్టున రోదించగా మిగతా వారు అతడిని వారించారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత అందరూ ఆయా వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. ఆ.. మృతదేహం ఎవరిది? గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన మృతదేహం ఎవరిదనేది చందనపల్లి గ్రామంలో చర్చ జరుగుతోంది. గొయ్యి పొడవు 4 నుంచి 5 ఫీట్ల లోపే ఉండడంతో ఆ మృతదేహం 6 నుంచి ఏడేళ్ల లోపు వారిదే ఉంటుందని తెలుస్తోంది. మృతదేహం ఆడ, మగ అనేది స్పష్టత లేదని అర్ధరాత్రి చాటుగా గమనించిన వారు పేర్కొంటున్నారు. ఏదైనా అనారోగ్యంతో మృతిచెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేస్తారు. మహిళలు ఎవరు లేకుండా, అర్ధరాత్రి బ్యాగులో మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయడంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం అష్టమి కావడంతో నరబలి ఇచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారనే అనుమానాలు లేకపోలేదు. అర్ధరాత్రి అంతిమ సంస్కారాల తంతును గమనించిన కొందరు చందనపల్లి గ్రామస్తులకు విషయం తెలపడంతో చర్చనీయాంశంగా మారింది. -
అధికార లాంఛనాలతో హరీశ్వర్రెడ్డి అంత్యక్రియలు
పరిగి: ఉమ్మడి రాష్ట్ర ఉప సభాపతి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి అంత్యక్రియలు శనివారం పరిగిలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హరీశ్వర్రెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం పట్టణంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పల్లవి డిగ్రీ కళాశాలలోని మైదానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు. ప్రముఖుల నివాళి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితారెడ్డి, మహేందర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్రెడ్డి, నరేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత ప్రహ్లాద్రావు, టీడీపీ నేత కాసాని వీరేశ్ తదితరులు హరీశ్వర్రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా హరీశ్వర్రెడ్డి మరణ వార్త తెలుసుకున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గన్ మిస్ ఫైర్ అంత్యక్రియల సందర్భంగా గాలిలో కాల్పులు చేసే క్రమంలో ఒకరి చేతిలోని గన్ అకస్మాత్తుగా పేలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అంత్యక్రియలు చేశారు.. అస్థికలు మరిచారు
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలోని (జూబ్లిహిల్స్ రోడ్డు) వైకుంఠ మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జలాల్లో కలపాల్సిన అస్థికలు ఏళ్లుగా అక్కడే ఉండిపోతున్నాయి. కొందరు మృతుల బంధువులు వాటిని తీసుకుపోకుండా అస్థికలు భద్రపరిచే రూంలోనే అమానవీయంగా వదిలేస్తుండటమే దీనికి కారణం. దాదాపు నాలుగేళ్ల నుంచి పలువురి అస్థికలు నిలువ ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించింది. అంత్యక్రియలు నిర్వహించి చాలాకాలంగా వదిలేసిన అస్థికలను సంబంధితులు తీసుకువెళ్లాలని రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం ట్రస్టు తెలిపింది. అంతిమ సంస్కారాలు చేసిన పలువురి అస్థికలు 2019 నుంచి మహాప్రస్థానంలోని గదిలోనే ఉండిపోతున్నాయని పేర్కొంది. అస్థికలను తీసుకుపోకుండా అలాగే ఉంచడం సరికాదని వివరించింది. కరోనా సమయంలోనూ చాలా మంది అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో జరిగాయి. అప్పటినుంచీ కొందరి అస్థికలు అలాగే ఉంటున్నాయి. దీంతో మహాప్రస్థానం ట్రస్టు స్పందించి.. ఈ నెల 30నాటికి అస్థికలను సంబంధికులు తీసుకువెళ్లాలని సూచించింది. లేని పక్షంలో అక్టోబర్ 14న ట్రస్టు ఆద్వర్యంలో సంప్రదాయబద్దంగా పూజా క్రతువులు నిర్వహించి, జలాల్లో కలుపుతామని స్పష్టం చేశారు. వివరాలకు 9703153111, 9703158111 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఇదీ చదవండి: సెల్ఫోన్ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య -
స్పందనకు కన్నీటి వీడ్కోలు
కర్ణాటక: ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య, నటి స్పందన అంత్యక్రియలు బుధవారం బెంగళూరు నగరంలోని హరిశ్చంద్ర ఘాట్లో జరిగాయి. ఆదివారం రాత్రి ఆమె థాయ్ల్యాండ్లోని బ్యాంకాక్ టూర్లో హోటల్లో గుండెపోటుతో మరణించడం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. ప్రముఖుల సందర్శన విజయ్ రాఘవేంద్ర ఇంటి వద్ద ఉంచి సంప్రదాయాలను పూర్తి చేశారు. ఆమె భౌతికకాయానికి విజయ్ పూజలు చేస్తుండగా కుటుంబసభ్యులు బోరుమంటూ విలపించారు. తండ్రి బీకే శివరామ్ ఇంటి వద్ద ఉదయం ఆరు గంటల నుంచి జనం సందర్శన కోసం ఉంచారు. రాఘవేంద్ర రాజ్కుమార్, అశ్విని పునీత్ రాజ్కుమార్లు కుటుంబసమేతంగా అంతిమ దర్శనం చేసుకున్నారు. అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. స్పందన కొడుకు శౌర్యను పలువురు ఓదార్చారు. సాయంత్రం 4 గంటలకు ఊరేగింపుగా తీసుకువచ్చి మల్లేశ్వరం సమీపంలోని హరిశ్చంద్రఘాట్లో ఈడిగ కుల సంప్రదాయం ప్రకారం విద్యుత్ దహనవాటికలో అంత్యక్రియలను పూర్తిచేశారు. ఆమె మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సహా అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. -
గద్దర్ అంతిమ యాత్ర విషాదం.. అశ్రునయనాల మధ్య అలీఖాన్ అంత్యక్రియలు
నాంపల్లి (హైదరాబాద్): సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ అంత్యక్రియలు దారుస్సలాం రోడ్డులోని ఆఖరిత్ మంజిల్లో జనసందోహం నడుమ జరిగాయి. సోమవారం గద్దర్ అంతిమ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో అస్వస్థతకు గురై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పార్థివదేహాన్ని సోమవారం రాత్రి ఆసుపత్రి నుంచి లక్డీకాపూల్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని మసీదుకు తరలించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పార్థివదేహాన్ని అభిమానులు, బంధువుల సందర్శనార్థం అక్కడే కాసేపు ఉంచారు. అనంతరం దారుస్సలాంలోని ఆఖరిత్ మంజిల్ శ్మశాన వాటికకు తీసుకెళ్లి అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతిమ యాత్రకు భారీ స్థాయిలో ఆయన అభిమానులు, జర్నలిస్టులు, రాజకీయ నేతలు, పౌర, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు హాజరయ్యారు. జహీరుద్దీన్ అలీఖాన్ కడచూపు కోసం తరలివచ్చిన వందలాది మందితో దారుస్సలాం రోడ్డు పూర్తిగా కిక్కిరిసిపోయింది. ప్రముఖుల పరామర్శ... లక్డీకాపూల్లోని జహీరుద్దీన్ అలీఖాన్ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రముఖ విద్యావేత్త వేదకుమార్, సీనియర్ జర్నలిస్టులు పల్లె రవికుమార్, విరాహత్ అలీ, షబ్నమ్ హాస్మి, అయూబ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ అమీన్వుల్లా హసన్ జాఫ్రి ఉన్నారు. అలీఖాన్ కుటుంబ సభ్యులకు డీజీపీ పరామర్శ సాక్షి, హైదరాబాద్: అస్వస్థతకు గురై సోమవారం సా యంత్రం మృతిచెందిన ఉర్దూ దినపత్రిక సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ అంజనీ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం లక్డీకాపూల్లోని అలీ ఖాన్ నివాసానికి వెళ్లారు. అక్కడ జహీరుద్దీన్ అలీఖాన్ కుటుంబ సభ్యులను డీజీపీ పరామర్శించి ఓదార్చారు. -
గద్దర్ అంత్యక్రియలు.. తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)
-
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో మరో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపు కోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్లోని గద్దర్ ఇంటి వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. గద్దర్కు అత్యంత సన్నిహితుడు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై.. ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్తోనే జహీరుద్దీన్ మృతి చెందినట్లు తెలిపారు. -
ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర..
-
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు
►గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించారు. ► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. ► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు.. ► గద్దర్ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు.. ► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ► అల్వాల్కి చేరుకున్న అంతిమ యాత్ర ► పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు ► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్కు గద్దర్ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. ►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. ►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర ► గద్దర్ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్పార్క్, అసెంబ్లీ, నెక్లెస్రోడ్లోని అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్బండ్, జేబీఎస్, తిరుమల మీదుగా అల్వాల్ చేరనుంది. గద్దర్ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. గద్దర్ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు. ► అల్వాల్ భూదేవి నగర్లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్రావు పరిశీలిస్తున్నారు. ►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, ►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గద్దర్ పార్దివదేహానికి వీచ్ హనుమంతరావు నివాళులు అర్పించారు ►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్ ►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు. ►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.. గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి ► గద్దర్కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి. ►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం. ►తన సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్కు రప్పించాం. ►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు. ►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు ►గద్దర్ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు. ► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. ►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ►ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. ►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్, మంచు మనోజ్, సింగర్ మధు ప్రియ గద్దర్కు నివాళులు అర్పించారు. ►అల్వాల్లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. ►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్ పోచారం ►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు ►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు. ►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు. ►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా. గద్దర్ మృతి బాధాకరం: కిషన్ రెడ్డి గద్దర్ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్ మృతి బాధాకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్మాడల్గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు. ‘నాకు గద్దర్తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది. నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు సాక్షి, హైదరాబాద్: గద్దర్ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్బాగ్ చౌరస్తా, జగ్జీవన్రామ్ విగ్రహం మీదుగా.. గన్పార్క్ వైపు సాగనుంది. గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్ మీదుగా భూదేవినగర్లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్్ మహాబోధి గ్రౌండ్స్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. -
అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు..!
-
అమర జవాన్కు ఆఖరి వందనం
పాములపాడు: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్ యూనిట్ నంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్ ఆపరేషన్లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్కు తీసుకువచ్చారు. బుధవారం కృష్ణానగర్ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో ఏఆర్ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు. -
కొండాయిలో నిండా విషాదమే!
ఏటూరునాగారం: భారీ వర్షాలు, జంపన్న వాగు వరదతో తీవ్రంగా దెబ్బతిన్న ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం కొండాయి ఇంకా విషాదంలోనే ఉండిపోయింది. వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన 8 మంది గ్రామస్తుల అంత్య క్రియలు కుటుంబ సభ్యుల రోదనల మధ్య శనివా రం పూర్త య్యాయి. గ్రామంలో మట్టి గోడలతో ఉన్న 80 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గ్రామమంతా నీట మున గడంతో బియ్యం, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తు వులు తడిసి పాడైపోయాయి. ఇళ్లలో, బయట ఎక్క డ చూసినా బురదతోనే నిండిపోయి కనిపిస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్ జంపన్న వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోవడంతో కొండాయి గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పారిశుధ్య చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. భారీగా విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో.. మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలేక చీకటిలోనే మగ్గుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బోట్లు ఉన్నంత సేపు కాస్త రాకపోకలు, అవసరమైన సరుకులు అందుతున్నాయి. ఆ బృందాలు వెళ్లిపోతే.. అడవి గ్రామంలో చిక్కుకుపోయినట్టేనని గ్రామస్తులు వాపోతున్నారు. మరణంలోనూ వీడకుండా.. కొండాయి గ్రామస్తులు రషీద్, ఆయన భార్య కరీమా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని వరద దాటుతుండగా కొట్టుకుపోయారని.. చనిపోయేంత వరకు వారు కలిసే ఉన్నారని గ్రామస్తులు చెప్పారు. మృతదేహాలు కూడా చేయిపట్టుకునే ఉన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు విపత్కర పరిస్థితిలో చిక్కుకున్న కొండాయి గ్రామస్తులను అన్ని విధాలా ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందజేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తక్షణ సాయంగా రూ.25 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శనివారం అధికారులతో కలసి ఆమె బోట్లలో కొండాయి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. వరద బాధితులను ఓదార్చారు. ఆస్తి, పంటల నష్టంపై అధికారులు సర్వే చేసి నివేదిక ఇస్తారని.. అనంతరం తగిన సాయం అందిస్తామని తెలిపారు. -
ప్రముఖ రచయిత శ్రీరమణ కన్నుమూత
మణికొండ: ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాసరచయిత, సినిమాగా వచ్చిన మిథునం కథా రచయిత, సీనియర్ జర్నలిస్టు శ్రీరమణ (71) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా గెటెడ్ కమ్యూనిటీలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జానకి, ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.1952 సెపె్టంబర్ 21న ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం వరహాపురం అగ్రహారంలో అనసూయ, సుబ్బారావు దంపతులకు జని్మంచిన శ్రీరమణ అసలుపేరు కామరాజ రామారావు. కానీ ఆయన రచయిత శ్రీరమణగానే అందరికీసుపరిచితం.ఏపీ సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ శ్రీరమణ మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాసిన కథలు మానవత్వం, విలువలతో కూడి ఉంటాయని జగన్ గుర్తుచేసుకున్నారు. -
తండ్రి అంతిమ సంస్కారాలకు అయ్యే ఖర్చుతో.. బ్రిడ్జ్ నిర్మాణం..
మన చుట్టూ నిత్యం ఎన్నో సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంబాలని ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులనో తిట్టుకుంటూ కూర్చొంటారు. కొంతమంది కాస్త ముందడుగు వేసి ప్రభుత్వానికి తెలియజేసేలా చేయడం వంటివి చేస్తారు. ఆ తర్వాత షరామాములే! ఆ పని ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు. కానీ ఇక్కడొక వ్యక్తి అన్ని రకాలుగా యత్నించి అవ్వకపోయినా వెనుదిరగక..వ్యక్తిగత ప్రయత్నంతో తమ ఊరికి ఎదురైన సమస్యకు చెక్పెట్టి శభాష్ అనిపించుకున్నాడు సుధీర్ ఝా. తండ్రి అంత్యక్రియలకు అయ్యే ఖర్చును ప్రజల మేలు కోసం ఉపయోగించి ఆ సమస్యను చాలా చక్కగా పరిష్కరించాడు. వివరాల్లోకెళ్తే..బిహార్లోని మధుబని జిల్లా కలువహి మండలంలోని నారార్ పంచాయతీ నుంచి ఓ కాలువ వెళ్తుంది. ఆ ఊరి నుంచి బయటకు వెళ్లాలంటే.. ఆ కాలువను దాటే వెళ్లాలి. వర్షాకాలంలో కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో గ్రామస్తులు ఊరి దాటి బయటకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఆపద వచ్చినా అంతే పరిస్థితి. అక్కడ బ్రిడ్జి వస్తే వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వర్షాకాలంలో సైతం ఎలాంటి ఇబ్బందులు పడకుండా హాయిగా ఉండొచ్చు. కానీ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంతెన మంజూరు కాలేదు. దీంతో పెద్దాయన మహదేవ్ ఝూ తమ గ్రామ పరిస్థితిని చూసి చలించిపోయి ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. ఆ ఊరికి ఎలాగైనా వంతెనను నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నాడు మహాదేవ్. జీవిత చరమాంకంలో ఉన్న ఆయనకు తనవల్ల ఇది సాధ్యం కాదని తెలుసు. తన సంకల్పం ఎలగైనా నెరవేరాలి. తన ఊరికి మంచి జరగాలి ఇదే ఆ పెద్దాయన ఆశయం. దీంతో మహదేవ్ .. "ఒకవేళ నేను చనిపోతే.. నా అంత్యక్రియలకు, దశదినకర్మలకు అయ్యే ఖర్చుతో బ్రిడ్జిని నిర్మించాలి" అని కుటుంబ సభ్యులను కోరాడు. అది తన కల .. చివరి కోరిక అని వారికి చెప్పాడు. మహాదేవ్ అ్నట్లుగానే కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలతో 2020లో మహదేవ్ ఝా మరణించాడు. కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యం.. అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మహదేవ్ ఝూ అతడి భార్య మహేశ్వరి దేవి, కుమారుడు విజరుప్రకాష్ ఝా అలియాస్ సుధీర్ ఝాకు బాగా తెలుసు. ఆ డబ్బుతో గ్రామంలో ఉన్న కాల్వపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నట్లుగానే ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి, కాల్వపై వంతెనను నిర్మించారు. అయితే కరోనా కారణంగా వంతెన నిర్మాణంలో రెండేళ్లు ఆలస్యం అయ్యింది. అయినా లెక్కచేయక దీక్షతో ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి..ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కలను సాకారం చేశారు. తమ సమస్య తీరడంతో గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వంతెన ద్వారా దాదాపు రెండు వేల మంది గ్రామస్తులు తేలికగా గ్రామం ఇటువైపు నుంచి అటువైపుకు రాకపోకలు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంతో ముఖ్యంగా రైతులకు ఎంతో మేలు జరిగిందని మహదేవ్ ఝా సోదరుడు మహవీర్ ఝా తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపి తిడుతూ కూర్చొకుండా..వ్యక్తిగత ప్రయత్నాలతో కూడా సమస్యను పరిష్కరించవచ్చని మహదేవ్ ఝా, అతడి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఒక ఉపాధ్యాయుడిగా మహదేవ్ ఈ సమాజానికి ఓ గొప్ప పాఠాన్ని నేర్పారు. (చదవండి: ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని కాలుపై కాలు వేసుకుని కూర్చొన్నారో.. అంతే సంగతి!) -
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
-
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
వర్చువల్ మాయాలోకంలో మనుషుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. ఆప్యాయత, అనురాగాలను ఆన్లైన్లోనే చూపిస్తున్నారు. పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల ఒంటరితనంతో బాధపడుతున్నారు. బెల్జియన్కు చెందిన డేవిడ్ బేర్టెన్ అనే వ్యక్తి బంధువులు తనను తక్కువ చేసి చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకు ఓ పథకం వేశాడు. తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. తీరా కుటుంబసభ్యులు, బంధువులంతా అంత్యక్రియలకు తరలిరాగా సినిమా స్టైల్లో హెలికాప్టర్ నుంచి దిగా అందిరికి షాక్ ఇచ్చాడు.ఇంతకీ డేవిడ్ డెత్ ప్రాంక్ ఎందుకు చేశాడు? ఆ తర్వాత ఏమైంది? వివరాల్లోకి వెళ్తే.. బెల్జియన్కు చెందిన డేవిడ్ బేర్టెన్ తన కుటుంబ సభ్యులు తనని లోకువగా చూస్తున్నారని తెగ ఫీలైపోయేవాడు. సొంత బంధువులే తనను పట్టించుకోవడం లేదని బాగా హర్ట్ అయ్యాడు. సొంతవారే తనను చిన్నచూపు చూడడంతో వారికి బుద్దిచెప్పేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో, వారి విలువ ఏంటన్నది తెలియజేయాలని తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. బతికుండగానే తన అంత్యక్రియలను దగ్గరుండి ఏర్పాడు చేశాడు. టిక్టాక్లో బాగా పాపులర్ అయిన డేవిడ్ బేర్టెన్(రాగ్నార్ లే ఫౌ) డెత్ ప్రాంక్ చేయడానికి ఆయన కూతుళ్లు కూడా సహాయం చేయడం మరో విశేషం. వాళ్లు ఎంతలా యాక్టింగ్ చేశారంటే.. తండ్రి నిజంగానే చనిపోయినట్లు వాట్సాప్ సందేశాల్లో పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మీరు ఎప్పటికీ మా ఙ్ఞాపకాల్లో బతికే ఉంటారు అని ఓ కూతురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, త్వరలోనే మీరు తాత కాబోతున్నారు. మీరు మాతో ఉండాల్సింది డాడీ..దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశారు? మీరే ఎందుకు చనిపోవాలి? మిస్ యూ సో మచ్ అంటూ మరో కూతురు ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ పోస్ట్ చూసి అయ్యో పాపం అనుకున్నారంతా. డేవిడ్ లేడనే వార్తతో శోకసంద్రంలో మునిగితేలారు. వారందరూ డేవిడ్ను తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అంత్యక్రియలు మరికాసేపట్లో జరుగుతాయనగా అక్కడికి ఓ హెలికాప్టర్ వచ్చింది. అది ల్యాండ్ కాగానే దాని నుంచి డేవిడ్ కిందకు దిగాడు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తర్వాత డేవిడ్ "నా అంత్యక్రియలకు వచ్చిన మీకందరికీ స్వాగతం" అంటూ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ఒక్కక్షణం అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తేరుకొని బంధువులు అతన్ని చుట్టుముట్టి హగ్ చేసుకుని ఏడ్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ను షూట్ చేసిన ఓ బృందం దీన్ని నెట్టింట షేర్ చేయగా క్షణాల్లో వీడియో వైరల్గా మారింది. బతికుండానే అంత్యక్రియలకు ఎందుకు ప్లాన్ చేశారని ఆయన్ను అడగ్గా.. కుటుంబసభ్యులంతా ఎప్పుడో విడిపోయామని, తనని దేనికీ ఆహ్వానించరని, ఎవరూ చూడటానికి కూడా రారు అని అందుకే ఇలా డెత్ ప్రాంక్ చేసినట్లు డేవిడ్ చెప్పుకొచ్చాడు. వారికి గుణపాఠం నేర్పించాలని, మనుషుల మధ్య బంధాలు ఉండాలని, వారిని కలవాలంటే చనిపోయేవరకు వేచి ఉండకూడదని చూపించాలని ఇలా చేశానని తెలిపాడు. ఇప్పుడు కుటుంబం అందరం కలిపోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. -
పాపం.. బతికిందని సంతోషించేలోపే గుండె ఆగింది
ఒంట్లో ఓపికలేకున్నా.. బలానంతా కూడదీసుకుని, తానింకా బతికే ఉన్నానని శవపేటిక మూతను తట్టిమరీ కొన ఊపిరితో బయటపడిన బామ్మ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అయితే.. బతికిందని సంతోషించేలోపే.. అదీ వారంలోపే ఆమె ఉదంతం విషాదాంతం అయ్యింది. ఈక్వెడార్ బామ్మ బెల్లా మోంటోయా(76) కార్డియాక్ అరెస్ట్తో కన్నుమూసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నామని, వారం తర్వాత(జూన్ 16న) ఆమె మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఇక తల్లి మృతిపై గిల్బర్ట్ బార్బెరా స్పందిస్తూ.. తన తల్లి శాశ్వత నిద్రలోకి జారుకున్నట్లు ప్రకటించాడు. చనిపోయిందనుకుని భావించి జూన్ 9వ తేదీన శవపేటికలో ఉంచి సమాధి చేయబోతుండగా.. శవపేటికను బాది ఆమె ప్రాణాలతో బయపడి అందరినీ ఆశ్చర్యపర్చింది. సుమారు ఐదు గంటలపాటు ఆ బామ్మ శవపేటికలోనే ఉండిపోయింది. శ్వాస అందకపోవడంతో ఇబ్బంది పడిన ఆమెను అప్పటికప్పుడే ఆంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. catalepsy(కండరాలు బిగుసుకుపోవడం) వల్ల ఆమె స్పృహ కోల్పోయి కదల్లేని స్థితిలో అచేతనంగా ఉండిపోయిందని, అలా ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు భావించి ఉంటారని ఆ టైంలో వైద్య నిపుణులు పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతూ.. వారం తర్వాత గుండెపోటు రావడంతో కన్నుమూసిందామె. ఏ స్మశానవాటికలో ఆమె బతికిందని సంతోషించారామె.. అదే చోట ఆమెను మళ్లీ ఇప్పుడు సమాధి చేశారు. Video Credits: Associated Press ఇదీ చదవండి: రక్తం కారుతున్నా లెక్క చేయకుండా.. -
ఖననం చేసే సమయంలో..శవపేటిక నుంచి శబ్దం అంతే..
ఓ మహిళ చనిపోయిందని వైద్యులు ధృవికరించారు. దీంతో బంధువులు ఆమె కడసారి చూపు కోసం కొద్ది గంటలు ఉంచి ఆ తర్వాత ఖననం చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలో శవపేటికలోంచి తడుతున్న శబ్దం. అంతే ఒక్కసారిగా బంధువులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన ఈక్వెడార్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఈక్వెడార్లోని ఒక ఆస్పత్రిలో బెల్లా మోంటోయా అనే 76 ఏళ్ల మహిళ కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. పునరుజ్జీవన ప్రయత్నాలకు స్పందించలేదని నిర్ధారించి మరీ ఆమె మృతిని ధృవీకరించారు. ఆమె జూన్13 ఉదయం ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వగా.. మధ్యాహ్నం చనిపోయినట్లు వైద్యుల ధృవీకరించారని ఆమె కుమారుడు గిల్బర్ రోడోల్ఫో బల్బెరన్ మోంటోయా చెబుతున్నారు. ఆమె కడసారి చూపు కోసం చాలా గంటల సేపు శవపేటికలో ప్రదర్శనగా ఉంచారు. ఇక ఖననం చేసేందుకు తీసుకువెళ్తుండగా..ఒక్కసారిగా శవపేటికను తట్టిన శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైన బంధువులు శవపేటికను తెరిచి చూడగా..ఆమె ఊపిరి పీల్చుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. వెంటనే హుటాహుటినా స్ట్రెచ్చర్ తెచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఈక్వెడార్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని బీబీసీ పేర్కొంది. బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ..ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆమె సజీవంగా ప్రాణాలతో నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అని ఆవేదనగా చెప్పాడు. (చదవండి: అద్భుతం..అంతరిక్షంలో వికసించిన పువ్వు! ఫోటో వైరల్) -
ఇతర మతస్థుడిని పెళ్లి చేసుకుందని కుమార్తెకు పిండ ప్రదానం..
మధ్యప్రదేశ్: బతికుండగానే కన్నకూతురికి అంతిమ సంస్కారాలు చేశారు తల్లిదండ్రులు. ఇతర మతస్థుడిని వివాహమాడిందనే కోపంతో కూతురికి పిండ ప్రదానం చేశారు. ఈ ఘటన మధ్యపదేశ్లోని జబల్పూర్లో జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. కానీ వారి కలలేవీ ఆ కూతురు నెరవేర్చలేదు. ఇతర మతస్థుడిని వివాహమాడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డ చనిపోయిందనుకున్నారు. నర్మదా నది ఒడ్డున ఏకంగా అంతమ సంస్కారాలు కూడా చేశారు. జబల్పూర్కు చెందిన అనామిక దూబె ఇతర మతస్థుడిని వివాహమాడింది. అడ్డగించిన బంధువులతో గొడవపడింది. న్యాయస్థానాన్ని సంప్రదించి జూన్ 7న ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆమె వివాహం జరిగింది. తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చి ఉజ్మ ఫాతిమాగా పేరు పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు బిడ్డను వదిలేశారు. నర్మదా నది ఒడ్డున ఆదివారం రోజున గౌరీ ఘాట్లో కూతురుకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పిండప్రదానం చేసి నదిలో కలిపేశారు. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని అనామిక సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదీ చదవండి:ప్రేమపెళ్లి చేసుకున్నారని.. ఆ గుడిలో ఏం చేశారంటే! -
అంత్యక్రియలు చేసిన మరుసటి రోజే ఇంట్లో ప్రత్యక్షం
తిరువళ్లూరు: తల్లి మృతి చెందిందని భావించి అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజే ఆమె ప్రాణంతో ఇంటి వద్ద ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా సేలైకండ్రిగ గ్రామానికి చెందిన సొక్కమ్మాల్(56)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సేలై కండ్రిగలోని చిన్న కుమారుడు శరవణన్ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సొక్కమ్మాల్కు, ఎదురింటి మహిళకు ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణలో సొక్కమ్మాల్ స్వల్పంగా గాయపడడంతో అలిగి చైన్నెలో ఉంటున్న పెద్ద కుమారుడు గాంధీ వద్దకు వెళ్లిపోయింది. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో పచ్చరంగు చీర, ఎరుపు రంగు జాకెట్ను ధరించినట్లు తెలిసింది. బుధవారం తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రైల్వే ట్రాక్పై అదే కలర్ దుస్తులతో వృద్ధురాలి మృతదేహం గుర్తు తెలియని రీతితో కనిపించింది. మృతదేహాంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పలు దినపత్రికల్లో రావడంతో మృతి చెందిన వృద్ధురాలు సొక్కమ్మాల్గా భావించిన ఆమె చిన్నకుమారుడు శరవణన్ ఈ రైల్వే పోలీసుల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి బంధువులకు సమాచారం ఇచ్చాడు. చైన్నెలో ఉన్న గాంధీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే గాంధీకి, శరవణన్కు మధ్య మాటలు లేకపోవడంతో గాంధీ ఫోన్ లిప్ట్ చేయలేదు. మే 28వ తేదీ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా సొక్కమ్మాల్ సోమవారం ఉదయం శరవణన్ ఇంటి వద్దకు రావడంతో కలకలం రేపింది. సొక్కమ్మాల్ ప్రాణంతో వచ్చారన్న విషయం తెలియడంతో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. దీనిపై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతి చెందిన మహిళ తన తల్లిగా భావించి అంత్యక్రియలు నిర్వహించామని, ప్రస్తుతం తన తల్లి ప్రాణంతో ఇంటికి వచ్చిందని సమాచారం అందించాడు. దీంతో రైల్వే పోలీసులు శరవణన్ను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో మృతి చెందిన మహిళ సొక్కమ్మాల్ కాదని నిర్ధారించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ అంబిక, ఆర్ఐ గణేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీశారు. డీఎన్ఏ టెస్టు కోసం నమూనాలను సేకరించారు. విచారణలో మృతి చెందిన మహిళ రెడ్హిల్స్కు చెందిన ఏలుమలై భార్య శకుంతలమ్మాల్(66)గా గుర్తించారు. -
Sarath Babu Funerals: సీనియర్ నటుడు శరత్బాబు అంత్యక్రియలు (ఫొటోలు)