jawan
-
ఆర్మీ జవాన్ కార్తీక్ మృతికి వైయస్ జగన్ సంతాపం
-
ముగిసిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు
-
అనంతపురం జిల్లా నార్పలలో ఘనంగా వీర జవాను సుబ్బయ్య అంత్యక్రియలు
-
సైనికుల మధ్య రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీపావళి వేడుకలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అస్సాంలోని తేజ్పూర్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొన్ని ప్రాంతాలలో వివాదాలను పరిష్కరించడానికి భారత్- చైనాలు దౌత్య, సైనిక చర్చలు జరుపుతున్నాయని అన్నారు.ఇరు దేశాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఏకాభిప్రాయం కుదిరింది. సైనిక బలగాల క్రమశిక్షణ, ధైర్యం వల్లే ఈ విజయం సాధించాం. ఏకాభిప్రాయ ప్రాతిపదికన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తామని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల దృఢమైన నిబద్ధత, అద్భుతమైన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.యువతకు నిజమైన స్పూర్తిదాయకంగా ఉంటూ, అంకితభావంతో మాతృభూమికి సేవ చేస్తున్న సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. వైమానిక యోధులు సవాళ్లను ఎదుర్కోవడానికి నిత్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. వైమానిక దళ సిబ్బంది అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. ఇది కూడా చదవండి: స్టార్మర్ దీపావళి వేడుకలు -
అమర జవాను చితికి నిప్పంటించిన నాలుగేళ్ల చిన్నారి
సిర్సా: కశ్మీర్లోని బారాముల్లాలోగల గుల్మార్గ్లో జరిగిన ఉగ్రదాడిలో హర్యానాకు చెందిన 28 ఏళ్ల ఆర్మీ జవాను జీవన్ సింగ్ వీరమరణం పొందారు. ఆయన భౌతికకాయం ఆయన స్వస్థలమైన ఘరాకు చేరుకోగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడు జీవన్సింగ్ మృతదేహం అతని ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆ అమరవీరునికి నివాళులర్పించేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు.కశ్మీర్లోని గుల్మార్గ్లోని బూటా-పత్రి ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో రైఫిల్మెన్ జీవన్ సింగ్ రాథోడ్ వీరమరణం పొందారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు సహా నలుగురు మృతి చెందగా, జీవన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు నివాళులర్పించారు. నలుగురు సోదరీమణులకు జీవన్ సింగ్ ఏకైక సోదరుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, తల్లిదండ్రులు ఉన్నారు.జీవన్ సింగ్ 2016లో సైన్యంలో చేరి, రాజ్పుతానా రైఫిల్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇంటికి చేరుకున్న తండ్రి మృతదేహాన్ని చూసి, అతని కుమార్తెలు అనన్య, భీషా బోరున విలపించడం అక్కడున్న అందిరినీ కంట తడిపెట్టించింది. గ్రామంలోని శ్మశాన వాటికలో జీవన్ సింగ్ పెద్ద కుమార్తె తండ్రి చితికి నిప్పంటించింది. దీనిని చూసిన అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
Prabhas: ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. కాగా ‘బుక్ మై షో’లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ పేర్కొన్నారు.‘‘12.15 మిలియన్+టిక్కెట్ సేల్స్ (దాదాపు కోటీ 20 లక్షలు)తో ‘బుక్ మై షో’లో హయ్యస్ట్ సేల్స్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా 12.01 మిలియన్ల టిక్కెట్ సేల్స్ రికార్డును సాధించింది. ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన కేవలం 20 రోజుల్లోనే ‘జవాన్’ రికార్డును దాటింది. వీకెండ్తో పాటు వీక్ డేస్లోనూ మా సినిమా వసూళ్లు చాలా స్టడీగా ఉన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
స్వగ్రామానికి అమర జవాను మృతదేహం
రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.జమ్మూకశ్మీర్లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్లోని చింద్వారాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.జమ్మూకశ్మీర్లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. #WATCH | CRPF jawan Kabir Das Uikey's mother, Indravati Uikey says, "Before the incident, he spoke to me around 2 pm. He was supposed to return home on soon." pic.twitter.com/O5k04CwAVx— ANI (@ANI) June 13, 2024 -
ఇసుకలో అప్పడం కాల్చిన జవాను
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.రాజస్థాన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా షాక్కు గురవుతున్నారు. తాజాగా బికనీర్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్ఎప్ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.బీఎస్ఎఫ్ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది. उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज... देखें वीडियो #summersafety पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024 -
Manipur: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి జవాన్ ఆత్మహత్య
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్కు చెందిన ఓ సైనికుడు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకొని మరణించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. దక్షిణ మణిపూర్లోని మయన్మార్ సరిహద్దు సమీపంలో మోహరించిన అస్సాం రైఫిల్స్ బెటాలియన్లో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కాల్పులకు మణిపూర్లో కొనసాగుతున్న జాతుల ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది రాష్ట్రంలో హింసకు కేంద్ర బిందువైన మయన్మార్ సరిహద్దు ప్రాంతం చురాచాంద్పుర్ కావడం గమనార్హం. అతడు కుకీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే గాయపడిన ఆరుగురు సైనికులు మణిపూర్కు గానీ, మైతీ చెందిన వారు కాదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షతగాత్రులను ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. మణిపూర్లో గత ఏడాది మేలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం విదితమే. అప్పటి నుంచి అడపాదడపా హింసాత్మక సంఘటనలు నమోదవుతునే ఉన్నాయి. అధికారులు, పోలీసులు పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఇటీవల ఈశాన్య రాష్ట్రంలో మరోసారి కాల్పుల మోత మోగింది. వివిధ ఘటనల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 180 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: రాహుల్ భద్రతపై అమిత్షాకు ఖర్గే లేఖ -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
నయన్, అలియా, కత్రినాలకు ఝలక్: అరంగేట్రంలోనే వందల కోట్లతో అదరగొడుతున్న అమ్మడు
2023లో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇలా బాక్సాఫీసు వసూళ్లతో దూసుకు పోతోంది. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, నయనతార, అలియా భట్లను వెనక్కి నెట్టేసింది. డెబ్యూలోనే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో చాన్స్ దక్కించుకొని.. నెక్ట్స్ ఎవరితో అనే ఆసక్తికర చర్చకు తెర లేపింది. ఇంతకీ ఎవరా నటి? ఈ కథనంలో తెలుసుకుందాం! ఆమె ఎవ్వరో కాదు స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో పెంపుడు తల్లిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించిన రిధి డోగ్రా. 2007 నుండి నటిస్తోంది. తొలుత టీవీ తెరపై వెలిగిపోయింది. ఇటీవల ఓటీటీ స్టార్గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్ మూవీతో బాలీవుడ్ భారీ బేక్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన టైగర్-3 సక్సెస్ ఆమెకు మరింత స్టార్డమ్ తెచ్చిపెట్టింది. మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలోప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్.దీంతో తొలి ఏడాదిలోను 1500 కోట్ల క్లబ్లో చేరిందీ అమ్మడు. మరో వెయ్యికోట్లపై కన్ను ఈ ఏడాదికి ఇంతకుముందెన్నడూ చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్లో షేర్ చేసింది రిధి. జవాన్ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు వెలిగించింది. With a heart full of gratitude and joy this diwali I decided to do something I had never done before coz what’s happened has never happened before !! 🤩🤩🤩🤩 Lit a 1000 🪔 for 1000 crore on #jawan whilst praying for a 1000 crore for #tiger3 pic.twitter.com/8b3MP5wD7q — Ridhi Dogra (@iRidhiDogra) November 14, 2023 ఎవరీ రిధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న పుట్టింది. న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్లోని అపీజే స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ పట్టా అందుకుంది. ఝూమ్ జియా రేతో తన టీవీ అరంగేట్రం. హిందీ హై హమ్ (2009), YRF టెలివిజన్ రిష్తా డాట్ కామ్,సెవెన్ (2010), లాగీ తుజ్సే లగన్ (2010), మర్యాద…లేకిన్ కబ్ తక్? (2010-12), సావిత్రి (2013), యే హై ఆషికీ (2014), దియా ఔర్ బాతీ హమ్ (2015), వో అప్నా సా (2017-18), ఖయామత్ కీ రాత్ (2018) లతో ఆకట్టుకుంది. 2013లొ డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే 6, ఖత్రోన్ కే ఖిలాడి 6 (2014) తో పాపులర్ అయింది. వెబ్లో సంచలనం సైకలాజికల్ థ్రిల్లర్ అసూర్తో రిధి ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ షో స్ట్రీమింగ్ ఇటీవలే దాని రెండవ సీజన్ కూడా సక్సెస్పుల్గా ముగిసింది. ముంబై డైరీస్, బద్దమీజ్ దిల్ , వెల్కమ్ టు యువర్ డార్క్ సైడ్ అండ్ ది మ్యారీడ్ వుమన్ అనే వెబ్ సిరీస్లలో అద్భుతమైన పాత్రలు పోషించింది. ఉత్తమనటిగా అవార్డు కొట్టేసింది. దీపికాకు దీటుగా 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె నటించిన పఠాన్ , జవాన్ రెండు చిత్రాలు ఏకంగా రూ.2200 కోట్లు రాబట్టాయి. దీపికా తరువాత రిధి డోగ్రా నిలుస్తోంది. నయనతార (రూ. 1150 కోట్లు), త్రిష కృష్ణన్ (రూ. 962 కోట్లు), అమీషా పటేల్ (రూ. 691 కోట్లు), రమ్య కృష్ణన్ (రూ. 610 కోట్లు), అలియా భట్ , కత్రినా కైఫ్ (ఇద్దరూ రూ. 350 కోట్లు) స్టార్లను దాటి పైకి ఎగబాకింది రిధి. 2011లో నటుడు రాకేశ్ బాపట్ను పెళ్లాడింది. కానీ మనస్పర్థల కారణంగా 2019లో భర్త నుంచి విడిపోయింది. -
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్ను శ్రీకాంత్గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. ఛత్తీస్గఢ్లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
షారుక్ ఖాన్కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
వీర జవాన్కు సైనిక లాంఛనాలతో వీడ్కోలు
భట్టిప్రోలు: రాజస్తాన్లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్మీర్ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జస్పల్మీర్ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్లో అకస్మాత్తుగా గోపరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారులు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్కు స్థూపం కట్టేందుకు కేటాయించారు. రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు. -
గుండెపోటుతో మరణించిన వీర సైనికుడు
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26) సోమవారం రాజస్థాన్లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్మీర్ వద్ద విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్ధివదేహాన్ని మంగళవారం సికింద్రాబాద్ మిలటరీ హాస్పిటల్కు తరలించారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరపున అక్కడి ఐఏఎస్, మిలటరీ అధికారులు గోపరాజు పార్ధివదేహానికి నివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున భట్టిప్రోలు మేజిస్ట్రేట్, తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఆర్ఐ శివరామకృష్ణ సికింద్రాబాద్ వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని గోపరాజు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకు వచ్చారు. భట్టిప్రోలు నుంచి పల్లెకోన గ్రామస్తులు గోపరాజు పార్ధివదేహం వెంట ర్యాలీగా స్వగ్రామానికి వెళ్లారు. అమర్ రహే గోపరాజు అంటూ నినాదాలు చేశారు. గోపరాజు భౌతికకాయం వెంట మిలటరీ కెప్టెన్ రిషబ్ సూద్, జూనియర్ కమిషనర్ ఆఫీసర్లు (జేసీవోలు) కురేష్, సుభాష్చంద్ర, గురవ్, పల్లిబాబు, మరో 25 మంది వివిధ విభాగాలకు చెందిన జవాన్లు వచ్చారు. గురువారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు దున్నా తిరుపతిబాబు తెలిపారు. -
జీ20 సమ్మిట్ విషయంలో మోదీపై షారుక్ ట్వీట్ వైరల్
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న జవాన్ సినిమా వజయంతో షారుక్ ఖాన్ ఫుల్ జోష్లో ఉన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపై సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి షారుక్ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును విజయవంతం చేసినందుకు గౌరవప్రదమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. 'ప్రపంచ ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం అన్ని దేశాల మధ్య ఐక్యతను పెంపొందించినందుకు మోదీకి అభినందనలు అని షారుక్ కొనియాడారు. (ఇదీ చదవండి: లావణ్య తీసుకున్న నిర్ణయానికి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్) దేశ శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ పనిచేస్తున్నారని SRK చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీలో చారిత్రాత్మక జీ20 సదస్సు ముగియడంతో షారుక్ ఖాన్ ప్రధాని గురించి ఇలా చెప్పారు. 'ఇది ప్రతి భారతీయుడి హృదయంలో గౌరవం, గర్వాన్ని సృష్టించింది. సార్, మీ నాయకత్వంలో మేము ఒంటరిగా కాకుండా ఐక్యంగా అభివృద్ధి చెందుతాము. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అని షారుక్ తన ట్వటర్ (ఎక్స్)లో రాశారు. పఠాన్ తర్వాత బాలీవుడ్ బాద్ షా మరో బ్లాక్ బస్టర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 500 కోట్ల మార్క్ను జవాన్ దాటింది. అట్లీ యాక్షన్ కట్తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఒకే సంవత్సరంలో రెండు విజయవంతమైన చిత్రాలను అందించిన ఘనత SRKకి ఉంది. SRK తో పాటు, నటుడు విజయ్ సేతుపతి, నటి నయనతార కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమతో కలిసి షారూక్ తీసిన మొదటి సినిమా ఇది. తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు చాలా విజయవంతమైంది. పలు కీలక అంశాలపై ఆ సదస్సులో చర్చించారు. తదుపరి సమావేశానికి బ్రెజిల్ బాధ్యత వహిస్తుంది. డిసెంబర్ 1న సమాఖ్య అధ్యక్ష పదవిని బ్రెజిల్ అధికారికంగా చేపట్టనుంది. Congratulations to Hon. PM @narendramodi ji for the success of India’s G20 Presidency and for fostering unity between nations for a better future for the people of the world. It has brought in a sense of honour and pride into the hearts of every Indian. Sir, under your… https://t.co/x6q4IkNHBN — Shah Rukh Khan (@iamsrk) September 10, 2023 (ఇదీ చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్
• నాలుగు రోజుల్లో 'జవాన్'కు రూ. 500 కోట్లు • ఆదివారం ఒక్కరోజే 28 లక్షలకు పైగా టికెట్లు • షారుక్ తర్వాతి సినిమా ఇదే ఈ ఏడాదిలో పఠాన్', జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్లను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్లో సరైన భారీ హిట్ సినిమాలు లేవు.. ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్లను అందుకుంటూ బాలీవుడ్లో వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి పఠాన్తో వచ్చిన షారుక్ అక్కడి బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు. (ఇదీ చదవండి: మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న లావణ్య త్రిపాఠి) దీంతో బాలీవుడ్ బాద్ షా తాను మాత్రమేనని నిరూపించాడు. ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్లోనే సెప్టెంబర్ 7న జవాన్గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం నాలుగు రోజుల్లోనే జవాన్ చిత్రం రూ. 500 కోట్లు కలెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. కొంత సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్లో చేరడంతో షారుక్ రికార్డుకెక్కాడు. కేవలం ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగగా జవాన్ సినిమా టికెట్లు 28 లక్షలు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదీ ఎవరూ అందుకోలేని రికార్డు అంటూ పలువురు తెలుపుతున్నారు. దీంతో లాంగ్ రన్ టైమ్లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్ను పక్కాగా దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే. షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నట్టే. Jawan creates HISTORY. Sold a RECORD 2⃣8⃣7⃣5⃣9⃣6⃣1⃣ tickets from tracked shows alone in India on the 4th day. Biggest ever for a bollywood film. ||#ShahRukhKhan|#Nayanthara|#Jawan|| Worldwide hits ₹500 cr gross club, making Shah Rukh Khan the only actor to achieve this feat… pic.twitter.com/CHeMFO7wmS — Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023 -
స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!
స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ హీరో ఆస్తుల విషయానికొస్తే ముంబయి, దుబాయ్లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్ ఖాన్కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్) అమెరికాలోని లాజ్ ఎంజిల్స్లో షారుక్ ఖాన్కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అద్దె ఎంతో తెలుసా? లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..) -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. ఇదే విషయం ఆమెకు చెప్తే..: విజయ్ సేతుపతి
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం జవాన్. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ దర్శకుడు అట్లీ బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా నటించగా విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు నటి దీపికా పడుకొనే అతిథి పాత్రలో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న జవాన్ చిత్రం ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ) ఈ సందర్భంగా జవాన్ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రాన్ని ఎనిమిది నెలలు పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశామని అయితే కరోనా తదితర కారణాల వల్ల మూడేళ్లు పట్టిందని చెప్పారు. అదే సమయంలో చిత్రం మరింత బ్రహ్మాండంగా రూపొందిందని, ఖర్చు కూడా భారీగా పెరిగిందన్నారు. అందుకు షారుక్ ఖాన్ ఎంతగానో సహకరించారని అట్లీ చెప్పారు. షారుక్ ఖాన్తో కలిసి నటించడం మంచి అనుభవమని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. తాను పాఠశాలలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అయితే అది వన్ సైడ్ లవ్ అని చెప్పారు. ఆ అమ్మాయి మాత్రం తాను నటుడు షారుక్ ఖాన్ వీరాభిమానినని ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పిందన్నారు. అప్పటినుంచి తనకు షారుక్ ఖాన్పై పగ ఏర్పడిందన్నారు. ఆ పగను ఈ చిత్రంలో తీర్చుకున్నానని సరదాగా అన్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) షారుక్ ఖాన్ మాట్లాడుతూ నటుడు విజయ్ సేతుపతి ఇంతకు ముందు చెప్పినట్లుగా తనపై ప్రతీకారం తీర్చుకోలేరని కారణం ఆయన తనకు అభిమాని అని పేర్కొన్నారు. జవాన్ చిత్రంలో నటించడంతో దక్షిణాది సినిమా గురించి చాలా నేర్చుకున్నానని షారుక్ ఖాన్ చెప్పారు. కాగా చైన్నెలో జవాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొనడానికి వచ్చిన షారుక్ ఖాన్కు నటుడు కమలహాసన్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. -
ఆస్పత్రిలో భార్య.. షూటింగ్ ఆపేయమన్న షారుక్: అట్లీ
ప్రపంచ వ్యాప్తంగా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ హిట్ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్తో పాటు కోలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. జవాన్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని లుక్లో ఈ సినిమాలో షారుక్ కనిపించనున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో కథానాయిక. విజయ్ సేతుపతి విలన్ రోల్ పోషిస్తుండగా, దీపికా పదుకొణె కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోంది. (ఇదీ చదవండి: ఇన్స్టాగ్రామ్లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే) దర్శకుడు శంకర్తో కో-డైరెక్టర్గా సినీ రంగ ప్రవేశం చేసిన అట్లీకి జవాన్ ఐదవ చిత్రం కానున్నడం విశేషం. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాక దళపతి విజయ్తో వరుసగా మూడు చిత్రాలు థెరి, మెర్సల్, బిగిల్ భారీ విజయాలు సాధించాయి. దీని తర్వాత అట్లీ జవాన్ను ప్రకటించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో వేదికపై అట్లీ ప్రసంగం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నటి ప్రియను వివాహం చేసుకున్న అట్లీ సుమారు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. జవాన్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న సమయంలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని షారుక్ ఖాన్కు తెలిపినప్పుడు ఆయన ఎలా స్పందించాడో తాజాగ అట్లీ గుర్తుచేసుకున్నాడు. 'జవాన్ షూటింగ్ కోసం నేను అమెరికాకు చేరుకున్నాను. ఈలోపు తాను గర్భం దాల్చినట్లు ప్రియా ఫోన్ చేసి తెలిపింది. ఎనిమిదేళ్ల తర్వాత గర్భం దాల్చినందున మూడు నెలల పాటు ప్రయాణం చేయవద్దని వైద్యులు సూచించారు. పూర్తిగా బెడ్ రెస్ట్ అన్నారు. అప్పటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మూడు రోజులే అయింది. దీంతో ప్రియాను అమెరికాకు రమ్మని చెప్పలేకపోయాను ఏం చేయ్యాలో తెలియక ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్కి చెప్పగా, వెంటనే షూటింగ్ ఆపేయమని, కొద్దిరోజులు వెయిట్ చేస్తానని చెప్పాడు. షారుక్ చెప్పిన మాటను ప్రియతో తెలుపగా.. షూటింగ్ ఆపవద్దని చెప్పడమే కాకుండా తన పనులు తానే చూసుకుంటానని చెప్పింది. అలాంటి కష్ట సమయంలో కూడా సినిమా పనులపై దృష్టి పెట్టమని ఆమె నన్ను ప్రోత్సహించింది. ప్రియా అందించిన ఆ సహకారమే నా విజయ రహస్యం' అని వేదికపై అట్లీ అన్నారు. తన కష్ట సమయంలో షారుక్ ఏంతో ధైర్యాన్ని ఇచ్చాడని, తండ్రి స్థానంలో షారుక్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని ఆట్లీ ఎమోషనల్ అయ్యాడు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆందోళన చెందనని అట్లీ తెలిపాడు. కాగా, గత జనవరిలో వీరికి మగబిడ్డ జన్మించాడు. అట్లీ, ప్రియా నవంబర్ 2014 లో వివాహం చేసుకున్నారు. ఇక అట్లీ భార్య ప్రియా కొన్ని తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియా నటించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నా పేరు శివ, యముడు లాంటి సినిమాల్లో ప్రియా నటించింది. 10years back , we were shooting near #ShahRukhKhan sir home , I stood near his gate and clicked a pic. Now his home gate opened for me and Shah Rukh sir stood at the gate to welcome me ! You are more than my father , my everything sir . #Atlee pic.twitter.com/ulmjyaSOzN — iamsrksneha (@iamsrkian000) August 30, 2023 -
ఇన్స్టాగ్రామ్లో నయనతార ఎంట్రీ.. ఫాలో అయ్యేది ఆ ఐదుగురిని మాత్రమే
సౌత్ ఇండియా లేడీ సూపార్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు అందరూ రాఖీ పండుగ సెలబ్రేషన్లో ఉండగా నయనతార ఇన్స్టాగ్రామ్లోకి అడుగు పెట్టింది. మొదటగా తన ఇద్దరు కుమారులతో (ఉయిర్, ఉలగం) కలిసి ఉన్న స్టైలిష్ వీడియోను షేర్ చేసింది. నయనతార ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే భారీగా వైరల్ కావడంతో ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. ఆమె పెట్టిన రీల్ను కూడా ఇప్పటికే ఐదు లక్షలకు పైగా లైక్ చేయగా.. రెండు మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. (ఇదీ చదవండి: హీరో గోపీచంద్ని అసభ్య పదజాలంతో దూషించిన డైరెక్టర్) ఇప్పటికే సౌత్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన నయన్కు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. తన కుమారుల ఫోటోలను ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయని నయన్ తొలిసారి ఇలా షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నయన్ ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆమెకు ఇప్పటి వరకు ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేయలేదు. తనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు భర్త విఘ్నేష్ శివన్ షేర్ చేస్తూ వచ్చేవాడు. (ఇదీ చదవండి: హీరోయిన్తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్గా బంగారం, భవనాలు) 'జైలర్'లోని హుకుమ్ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో తన కవలలను ఎత్తుకుని మాస్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చిన నయన్ తన ఇన్స్టాలో మాత్రం కేవలం ఐదుగురిని మాత్రం ఫాలో అవుతుంది. అందులో తన భర్త విఘ్నేశ్, హీరో షారుక్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో పాటు తన సొంత ప్రొడక్షన్ సంస్థ అయిన 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'జవాన్' రెండో ట్రైలర్ విడుదల
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. యూఎస్ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను నెలరోజుల కిందటే విడుదలైంది. అందులో భారీ యాక్షన్ సీన్స్తో షారుక్ అదరగొట్టాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గపడుతుండడం వల్ల సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. అందువల్ల ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ను కూడా మేకర్స్ తాజాగ విడుదల చేశారు. రెండో ట్రైలర్లో కూడా షారుఖ్ దుమ్ములేపాడనే చెప్పవచ్చు. ముంబయ్లోని మెట్రోను షారుఖ్ హైజాక్ చేస్తాడు.. ఈ సీన్తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారు. ట్రైలర్లో విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన లుక్లో చూపించారని చెప్పవచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీ ఖాన్ జవాన్ను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలోకి రానుంది .ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా(దుబాయ్)పై జవాన్ ట్రైలర్ను ప్రదర్శించేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. దీనిని నేడు రాత్రి (ఆగష్టు 31) 9 గంటలకు పదర్శించనున్నారు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్పై షారుక్ సినిమా ట్రైలర్ను ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన 'పఠాన్' సినిమా ట్రైలర్ను కూడా ఇదివరకే అక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ను పక్కా మాస్ లుక్లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తీసిన ఈ సినిమాలో విశాల్కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఇప్పుడు షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఆమె చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నయనతార సూపర్ స్టార్గా ఎదిగింది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్లోనూ ఆమె వివాదాలు వెంటాడాయి. అలా అన్నింటినీ అధిగమించి ఇప్పుడిప్పుడే తన ఇద్దరు పిల్లలతో లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. (ఇది చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి) అయితే ప్రస్తుతం ఆమె నటించిన జవాన్ వచ్చేనెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ లీడ్ రోల్లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయన్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. తన సొంత చిత్రాలకు నయనతార ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటోంది. అలాంటి బాలీవుడ్ అరంగేట్ర చిత్రమైన జవాన్ ప్రమోషన్లలో నయన్ కనిపించకపోవడం అభిమానుల్లో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. మరో విషయమేంటంటే ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణే షారుక్తో కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ జవాన్లో లీడ్ రోల్ చేసింది నయనాతారనా లేక దీపికనా అంటూ ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇదే విషయం అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవలే మరో నటి కస్తూరి నయనతారను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను లేడీ సూపర్ స్టార్ గా భావించలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్గా ఉందో!) -
అమర జవాన్కు ఆఖరి వందనం
పాములపాడు: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్ యూనిట్ నంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్ ఆపరేషన్లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్కు తీసుకువచ్చారు. బుధవారం కృష్ణానగర్ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో ఏఆర్ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు. -
'జవాన్' మొదటి పాట రిలీజ్.. దీనికి పెట్టిన ఖర్చుతో సినిమానే తీయవచ్చు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న తాజా చిత్రం 'జవాన్'. దీనికి దర్శకత్వం అట్లీ. నయనతార, ప్రియమణి,దీపికా పదుకొణె ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ‘జవాన్’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ 'జిందా బందా' తెలుగులో 'దుమ్ము దులిపేలా'ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాటకోసం హైదరాబాద్,చెన్నై, బెంగళూరు, ముంబయి నుంచి వెయ్యికి మందికి పైగా మహిళ డ్యాన్సర్లన రప్పించి షూట్ చేశారు. వీరందరితో పాటు సన్యా మల్హోత్రా, ప్రియమణిలతో షారుఖ్ వేసిన స్టెప్పులకు ఎవరైనా ఫిదా అవుతారు. ఇందులో ఆయన చాలా యంగ్ లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: సుమన్ జైలుకు వెళ్లడంపై బయటికొచ్చిన అసలు నిజాలు.. ఇంతమంది ప్రమేయం ఉందా?) ఈ పాటను ఐదు రోజుల పాటు చిత్రీకరించగా అందుకు అయిన ఖర్చు సుమారుగా రూ.15 కోట్లు అని సమాచారం. ఈ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ పాడితే.. నృత్య దర్శకుడు శోభి వారందరితో అదిరిపోయే స్టెప్పులు వేయించారు. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది. -
ముంబై-జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఫైరింగ్ కలకలం
-
మణిపూర్లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకో అమానవీయ ఘటన వెలుగులోకి వస్తోంది. కెమెరా సాక్షిగా జవాన్ చేతిలో ఓ మహిళ ఇబ్బందులను ఎదుర్కొంది. కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను బీఎస్ఎఫ్ జవాను విచక్షణా రహితంగా బయటకు లాగి పడేశాడు. మహిళ మెడపై జవాన్ చేతితో గట్టిగా పట్టుకోగా.. ఆ పట్టుబిగువుకు ఆమె విలవిల్లాడింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన జులై 20న జరగగా.. సదరు జవాన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీసీటీవీ వీడియో ప్రకారం.. ఓ బీఎస్ఎప్ జవాను రైఫిల్ను ధరించి ఉన్నాడు. ఓ కిరాణ స్టోర్ నుంచి ఓ మహిళను విచక్షణా రహితంగా బయటకు లాగాడు. జులై 20న ఈ ఘటన జరగగా.. నిందితునిపై కేసు నమోదు చేశారు. విధుల నుంచి తప్పించారు. నిందితున్ని సతీష్ ప్రసాద్గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా రోడ్డుపై ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే కాక ఇప్పటికే అక్కడి పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చాలా స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ వాటిపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అలాగే ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ సెల్ విభాగం దీనిపై ప్రత్యేకంగా పనిచేస్తోంది. ఇదీ చదవండి: మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్.. -
ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఆయనతో కలిసి నటించేవాడిని: విజయ్ సేతుపతి
‘‘షారుక్ ఖాన్ కోసమే ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్నాను. నాకు ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వకపోయినా కూడా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అన్నారు నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ‘ముంబైకర్’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల (జూన్ 2) విడుదలైంది. ప్రస్తుతం ఆయన షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా ‘జవాన్’ లో విలన్గా నటిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ–‘‘షారుక్ అంటే నాకు అభిమానం. ఆయన కోసమే ‘జవాన్’లో విలన్గా చేస్తున్నా. నాకు పారితోషికం ఇవ్వకున్నా ఆయనతో కలిసి నటించేవాణ్ణి’’ అంటూ షారుక్ ఖాన్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న విడుదలకానుంది. కాగా త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ (2019) లో విజయ్ సేతుపతి నటనపై షారుక్ ఖాన్ గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ కింగ్ షారుఖ్ను ఢీ కొడుతున్న ప్రభాస్..
పాన్ ఇండియా సినిమా వార్లో రోజుల వ్యవధిలోనే రెండు బిగ్ సినిమాలకు సంబంధించిన టీజర్స్ బయటికి వస్తే ఎలా ఉంటుంది. వారి ఫ్యాన్స్తో యూట్యూబ్ షేక్ అవడం గ్యారెంటీ. జులై 6న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' టీజర్తో వస్తే.. జులై 7న బాలీవుడ్ కింగ్ షారుఖ్ 'జవాన్'తో రానున్నాడని తెలుస్తోంది. ఇదీ జరిగితే ఈ రెండు సినిమాల టీజర్లు కేవలం కొన్ని గంటల వ్వవధిలో విడుదల అవుతాయి. దీంతో వారిద్దరి ఫ్యాన్స్ యూట్యూబ్ వ్యూస్లో తమ సత్తా చాటేందుకు పొటీ పడుతున్నారు. (ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్లాక్ చేసేదాన్ని:నటి) KGF తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా సలార్ రాబోతోంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఆదిపురుష్ గేమ్ ఓవర్ కావడంతో ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల 'పఠాన్' సినిమాతో బాలీవుడ్లో బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. 'జవాన్'తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయాలని చూస్తున్నాడు. పఠాన్తో తన కెరీయర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రూ.1000 కోట్లు రాబట్టాడు. ఇదే జోరును కొనసాగిస్తూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్' సినిమా జులై 12న విడుదల కానుంది.. ఈ మూవీ మధ్యలో జవాన్ టీజర్ను రిలీజ్ చేయనున్నారని కూడా ప్రచారం జరుతుంది. (ఇదీ చదవండి: విజయ్ను డైరెక్ట్ చేసే లాస్ట్ ఛాన్స్ ఆ దర్శకుడికే..) ఇప్పుడు ఈ టీజర్ వార్ పీక్స్లోకి వెళ్లింది. ఏదేమైనా ఈ రెండు టీజర్లు రిలీజ్ అయ్యాక ఏది ఎక్కువ వ్యూస్ రాబట్టింది? అనే చర్చ జరగడం పక్కాగ ఉంటుంది. కానీ 'జవాన్' కంటే 'సలార్' పైనే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకరేమో కొన్నేళ్లుగా బాలీవుడ్ను శాసించే కింగ్ కాంగ్... మరోకరేమో పాన్ ఇండియా స్టార్. దీంతో డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. ఎదేమైనా ఈ పోటీలో జవాన్ కంటే సలార్ పైనే భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ డార్లింగ్దే కానుంది. -
మాజీ సైనికుల కోసం ‘జై జవాన్ కిసాన్’
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) తెలంగాణలోని మాజీ సైనిక ఉద్యోగుల కోసం ‘జై జవాన్ కిసాన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్షణ సేవల నుంచి చిన్న వయస్సులో పదవీ విరమణ పొందే సిబ్బందికి పునరావాసం కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిటైర్డ్ సిబ్బందికి వేతనంతో కూడిన స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి నాబార్డు సహకారంతో మేనేజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాజీ సైనికులకు వ్యవసాయ సంబంధిత నైపుణ్యాన్ని అందించేందుకు 15 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 4 నుంచి 18వ తేదీ వరకు రాజేంద్రనగర్లోని మేనేజ్లో నిర్వహించే ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు లేదు. శిక్షణ అనంతరం సంబంధిత రంగాల్లో అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తారు. దీనికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లోని మాజీ సైనికులు, రాష్ట్రంలోని బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ మొదలైన పారామిలిటరీ దళాల నుంచి పదవీ విరమణ పొందిన సిబ్బంది అర్హులు. దరఖాస్తు సమర్పణకు జూలై 15 చివరి తేదీ. వివరాలకోసం 9052028777 నంబర్ సంప్రదించాలని లేదా సంస్థ వెబ్సైట్లో చూడాలని మేనేజ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆలస్యంగా వస్తున్న జవాన్
షారుక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జవాన్’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా, ప్రధాన పాత్రలో విజయ్ సేతుపతి, కీలక పాత్రల్లో సంజయ్ దత్, దీపికా పదుకోన్ నటించారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ‘జవాన్’ సినిమాను షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించారు. కాగా ఈ సినిమాను తొలుత జూన్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండటం ‘జవాన్’ రిలీజ్ వాయిదా పడటానికి ముఖ్య కారణమని బాలీవుడ్ సమాచారం. -
జవాన్ అనిల్ కు కన్నీటి వీడ్కోలు..
-
ఆర్మీ జవాన్ అనిల్ అంత్యక్రియలు...
-
ఇటు ఆదిపురుష్, అటు జవాన్.. ఇంతకీ జూన్ 2న విడుదలయ్యేది ఏది ?
-
Hyd: ప్రేమ విఫలమైందని రివాల్వర్తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్చంద్ర లడ్డా ఇంట తుపాకీ పేలింది. ఆయన వద్ద పని చేసే ఓ జవాన్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్ బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్గఢ్కు చెందిన దేవేందర్ కుమార్గా గుర్తించారు. సీఆర్పీఫ్ ఐజీ మహేష్చంద్ర లడ్డా వద్ద విధులు నిర్వహిస్తున్నాడు దేవేందర్. సూసైడ్కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బెట్టింగ్లో భారీ నష్టం.. అయ్యో మధు! -
సెలవులపై ఇంటికొచ్చి మృత్యు ఒడికి.. విద్యుత్ షాక్తో జవాన్ మృతి..
సాక్షి, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన ఐటీబీపీ జవాన్ విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరామ్నగర్లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తాటి మహేంద్ర కుమార్ (29) ఐటీబీపీ 53 బెటాలియన్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఛత్తీ›స్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా సోంపూర్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది హనుమకొండ జిల్లాకు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ఈ మధ్యనే వారికి పాప పుట్టింది. భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులపాటు సెలవు పెట్టి మార్చి 30న సొంత ఊరైన శ్రీరామ్నగర్ వచ్చాడు. శనివారం కూలర్లోని నీటిపంపు పనిచేయకపోవడంతో దానిని పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్కుగురై మహేంద్ర కింద పడి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు మహేంద్రను మొదట వాజేడు, అక్కడినుంచి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర కుమార్ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిననట్లు తెలిపారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: తండ్రిని చంపిన కిరాతకుడు -
బన్నీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్!
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఇండియా వైడ్ హీరోలందరూ తమ మార్కెట్ ను పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు. అందుకే తమ సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం తమ సినిమాల్లో సౌతిండియా యాక్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు సౌతిండియా స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ఓ బంపరాఫర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌతిండియా డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్తో ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నయన తార నటిస్తుంది. విజయ్ సేతుపతి, రానా, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు షారూఖ్... ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్ ని...తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశాడు. డైరెక్టర్ అట్లీ..బన్నీ ని అప్రోచ్ కూడా అయ్యాడు..ఈ మూవీ కథ కూడా నేరేట్ చేయడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ...ఇప్పుడు నటించటానికి నో చెప్పాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంవలో పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం గెడ్డం ఉన్న లుక్ ని మెయింటేన్ చేస్తున్నాడు. కానీ జవాన్ లో బన్నీ లుక్ మార్చాల్సి ఉంది. దీంతో జవాన్ లో తన క్యారెక్టర్ నచ్చిన కూడా...లుక్ ఛెంజ్ కావాల్సి ఉండటంతో డైరెక్టర్ అట్లీకి నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడింది. ఆస్కార్ అవార్డ్స్ నుంచి చెర్రీ రాగానే అప్రోచ్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కి....రామ్ చరణ్ కి మధ్య గుడ్ రిలేషన్ ఉంది. కాబట్టి జవాన్ మూవీలో గెస్ట్ రోల్ రిక్వెస్ట్ ను ..యాక్సెప్ట్ చేస్తాడనే ప్రచారం నెట్టింట బాగా సాగుతోంది. ఈ ఆఫర్ విషయంలో రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15లో నటిస్తున్నాడు. -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
ఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని మృతిచెందాడని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. మధ్యప్రదేశ్కు చెందిన రాజ్బీర్ కుమార్ (53) సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్లో ఉంటున్న మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. -
కూతురుపై అసభ్యకర వీడియో.. వ్యతిరేకించినందుకు సైనికుడుని కొట్టి చంపారు
గుజరాత్లో బీఎస్ఎఫ్ జవానుని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తన కుమార్తెపై అసభ్యకర వీడియోని ప్రసారం చేయడాన్ని నిరసించినందుకు ఆ జవాన్ తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన గుజరాత్లోని నదియాడ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ కూతురుపై ఒక అసభ్యకర వీడియోను 15 ఏళ్ల యువకుడు ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఈ విషయమై ఫైర్ అయిన సదరు జవాన్ సదరు యువకుడి కుటుంబంతో మాట్లాడేందుకువెళ్లాడు. అక్కడ యువకుడి కుటుంబ సభ్యలు అతడిపై దాడి చేసి కొట్టి చంపేశారు. సదరు జవాన్ ఆ యువకుడి ఇంటికి భార్య, ఇద్దరు కుమారులు, మేనల్లుడితో కలిసి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. విచారణలో జవాన్ కూతురు సదరు యువకుడితో రిలేషన్లో ఉన్నట్లు తెలిసింది. ఆ అభ్యంతరకర వీడియోను వ్యతిరేకించడంతోనే జవాన్ కుటుంబంపై సదరు యువకుడు కుటుంబం దుర్భాషలాడి దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు) -
చిక్కుల్లో షారుక్ చిత్రం, డైరెక్టర్పై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు
‘కింగ్ ఖాన్’ జవాన్ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ డైరెక్టర్ అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో హిందీలో జవాన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై సౌత్తో పాటు బాలీవుడ్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ తనదని, డైరెక్టర్ అట్లీ దానిని కాపీ కొట్టాడని కోలీవుడ్ నిర్మాత మాణిక్యం నారాయణన్ ఆరోపించాడు. చదవండి: తండ్రి కాబోతున్న ప్రముఖ కమెడియన్, ‘అసలు పెళ్లెప్పుడు అయింది?’ అంతేకాదు డైరెక్టర్ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు చేసి జవాన్ టీంకి షాకిచ్చాడు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పేరరసు’ సినిమా కథనే అట్లీ ‘జవాన్’ పేరుతో హిందీలో నిర్మిస్తున్నాడంటూ ఆయన ఆరోపించాడు. అయితే ఈ సినిమాపై షారుక్ ఖాన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తమిళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మూవీపై కాపీ రైట్ ఆరోపణలు రావడంతో బాద్షా ఫ్యాన్స్ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ స్పందించకపోవడం గమనార్హం. మరి దీనిపై జవాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: సమంత వ్యాధి గురించి అప్పుడే తెలిసింది, అయినా తానే స్వయంగా..: యశోద నిర్మాత -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
బుల్లెట్లతో ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు.. సీఆర్పీఎఫ్ జవాన్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏకే 47 రైఫిల్ బుల్లెట్లతో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ జవాన్. మొత్తం 62 బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని టవల్పై ఇంగ్లిష్ అక్షరాలతో రాసి ఉన్న ఫొటో గురువారం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చెన్నూరులో టీఆర్ఎస్ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్లో ఈ ఫొటో పెట్టుకున్నాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం తెలిసింది. చెన్నూరుకు చెందిన వంగాల సంతోష్ సీఆర్పీఎఫ్ జవాన్. ప్రస్తుతం బీజాపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన వద్ద ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి, వాట్సాప్లో పంపించాడు. దీన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
మాజీ జవాన్ నిర్వాకం.. మద్యంమత్తులో కలెక్టరేట్కి వచ్చి..!
వేలూరు: వేలూరు కలెక్టరేట్లో ప్రజా విన్నపాల దినోత్సవాన్ని కలెక్టర్ కుమరవేల్ పాండియన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఇందులో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మాజీ ఆర్మీ జవాన్ తన భార్యతో కలెక్టరేట్కు చేరుకొని కలెక్టర్ వద్దకు వెళ్లి.. మద్యం మత్తులో సెల్ఫోన్ను చూస్తూ నిలుచున్నాడు. ఆ సమయంలో వినతిపత్రం ఇవ్వాలని కలెక్టర్ మాజీ జవాన్ను కోరగా అందుకు ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. గమనించిన జిల్లా అధికారులు వెంటనే పోలీసులను రప్పించి అతన్ని బయటకు తీసుకొచ్చారు. అక్కడ మద్యం మత్తులో అతను కింద పడి పోయాడు. అనంతరం పోలీసులు విచారణ జరపగా అతను వేలూరు జిల్లా కన్నియంబాడికి చెందిన మాజీ జవాన్ వేల్మురుగన్ తేలింది. ఇతని కుటుంబ ఆస్తి సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు తేలింది. దీంతో పోలీసులు చేసేది లేక అతన్ని కారులో ఇంటికి పంపించి వేశారు. -
బారాత్లో గత్తర లేపిన జవాన్!
కులం, మతం, జాతి ఏదైనా సరే.. పెళ్లి బారాత్లలో మైమరిచిపోయి ఆడామగా తేడాలేకుండా చిందులేయడం ఈ గడ్డకే చెందుతుంది. అందునా ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. రీసెంట్గా ఓ వ్యక్తి చేసిన డ్యాన్సులు ఇంటర్నెట్లో ఈలలు వేయిస్తోంది. అందునా అతని నేపథ్యం ఆసక్తికరంగా ఉండడంతో అది ఇంకా స్పెషల్గా మారింది. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా గురువారం ఉదయం ట్విటర్లో ఒక వీడియోను ఉంచారు. గంటల వ్యవధిలోనే అది విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉంది ఓ జవాన్ కావడం?!. తన శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్.. నేరుగా స్నేహితుడి పెళ్లి బారాత్కు చేరుకుని అలా మైమరిచిపోయి చిందులేశాడు. అయితే అవి తీన్మార్ స్టెప్పులనుకుంటే పొరపాటే. తన మార్క్ చూపించాడు కాబట్టే ఆ జవాన్ వీడియోలో లైకులు, షేర్లలతో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగింది? ఆ జవాన్ వివరాలేంటన్నది దీపాన్షు చెప్పలేదు. దీంతో అసలు అతను నిజంగానే జవానేనా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు. ट्रेनिंग खत्म होते ही दोस्त की बारात में पहुंचा जवान. 😅 pic.twitter.com/Vh7BqQokaZ — Dipanshu Kabra (@ipskabra) April 21, 2022 చదవండి: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా! -
పాపం ఏమైందో గానీ పెళ్లయిన నెలకే జవాను, భార్య ఆత్మహత్య
మద్దిపాడు: పెళ్లయిన 38 రోజులకే భార్య ఆత్మహత్య చేసుకుంది.. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాను అయిన భర్త ఢిల్లీ నుంచి వచ్చి మరీ రిజర్వాయర్లో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన పొదిలి మహానంది (30)కి ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన తురకపల్లి ప్రియాంకతో గత డిసెంబర్ 29న వివాహమైంది. సంక్రాంతి పండుగ తరువాత తాను పనిచేస్తున్న సీఐఎస్ఎఫ్ క్యాంప్కు చేరుకున్నాడు. శుక్రవారం రాత్రి ప్రియాంక ఉరేసుకుని చనిపోయిందని సమాచారం రావడంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి రైలులో ఒంగోలు వచ్చాడు. ఒంగోలు నుంచి ఆటోలో మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద బ్యాగ్, ఇతర లగేజ్ ఉంచి, రిజర్వాయర్ 14వ గేటు వద్ద తన దుస్తులు, చెప్పులు, సెల్ఫోన్, పర్స్ వదిలేసి రిజర్వాయర్లోకి దూకేశాడు. అంతకు ముందు 4 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తాను చనిపోవడానికి రిజర్వాయర్ వద్దకు వచ్చినట్లు తెలపడంతో బంధువులు వెంటనే బయలుదేరి రిజర్వాయర్ వద్దకు వచ్చి పరిశీలించగా ఫోన్, దుస్తులు కనిపించడంతో మద్దిపాడు ఎస్ఐ శ్రీరామ్కు సమాచారం అందించారు. గజఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. మహానంది తల్లిదండ్రులు, బంధువులు రిజర్వాయర్ వద్దకు వచ్చి మృతదేహాన్ని చూసి విలపించారు. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. -
కొడుకు బర్త్డేకి తప్పకుండా వస్తానన్నాడు.. ఇంతలోనే
ఇంపాల్: మణిపూర్లో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. భద్రతా దళాల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని శనివారం ఉదయం మెరుపుదాడికి దిగారు. ఈ ఘటనలో ‘46 అస్సాం రైఫిల్స్’కు చెందిన ఖుగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితోపాటు మరో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరణించిన భద్రతా సిబ్బందిలో అస్సాం రైఫిల్స్ జవాన్ సుమన్ స్వర్గిరీ ఒకరు. బక్సా జిల్లాలోని బరామా ప్రాంతానికి సమీపంలోని తేకెరకుచి కలిబారి గ్రామానికి చెందిన సుమన్ 2011లో భారత సైన్యంలో చేరాడు. అంతకుముందు 2007లో మిలిటెంట్లు అతని తండ్రి కనక్ స్వర్గిరీని హత్య చేశారు. సుమన్ చివరిసారిగా ఈ ఏడాది జూలైలో ఇంటికి వచ్చాడు. (చదవండి: మణిపూర్లో తీవ్రవాదుల ఘాతుకం) సుమన్కు వివాహం అయి ఓ కుమారుడు ఉన్నాడు. డిసెంబర్లో కుమారుడి మూడవ పుట్టిన రోజు. కొడుకు బర్త్డేకు తప్పకుండా వస్తానని భార్యకు మాటిచ్చాడు. మరి కొన్ని రోజుల్లో భార్యాబిడ్డలను కలవబోతున్నానని తెగ సంతోషించాడు సుమన్. కానీ అతడి ఆనందాన్ని తీవ్రవాదులు దూరం చేశారు. సుమన్ కుటుంబంలో జీవితాంతం తీరని దుఖాన్ని మిగిల్చారు. సుమన్ మరణ వార్త తెలిసి అతడి భార్య గుండలవిసేలా విలపిస్తోంది. ‘‘నా భర్త వచ్చే నెల కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వస్తానని మాటిచ్చాడు. పోయిన శుక్రవారం నాకు కాల్ చేశాడు. అప్పుడు తాను ఓ రిమోట్ ఏరియా ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపాడు.. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కాల్ చేస్తానన్నాడు. మాకు కాల్ చేసే లోపే అతడికి తీవ్రవాదుల రూపంలో చివరి కాల్ వచ్చింది. నాకు, నా బిడ్డకు దిక్కెవరు’’ అంటూ ఏడుస్తున సుమన్ భార్యను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. (చదవండి: ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్ దారుణ హత్య) ఈ దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్(ప్రెపాక్), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) అనే తీవ్రవాద సంస్థలు ప్రకటించాయి. మణిపూర్ విముక్తి కోసం ఈ సంస్థలు పోరాడుతున్నాయి. చదవండి: ఆ విషాదంపై రతన్ టాటా భావోద్వేగం -
పెళ్లిళ్ల జవాన్ బాగోతం.. ఇద్దరు భార్యలు ఫిర్యాదు చేయడంతో..
సాక్షి, హుబ్లీ (కర్ణాటక): దేశ రక్షణకు పాటుపడాల్సిన ఓ జవాన్ అమాయక యువతులను మోసం చేయడం పనిగా పెట్టుకున్నాడు. హుబ్లీ చెందిన ఈ సైనికుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతని వంచనపై మొదటి, రెండవ భార్యలు హుబ్లీ పోలీసులను ఆశ్రయించారు. హుబ్లీ తాలూకా నెలవడి గ్రామవాసి గురుసిద్దప్ప సిరోళ పంజాబ్లో బీఎస్ఎఫ్ జవాన్గా ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు 2015లో ఇతనికి గదగ్ జిల్లాకు చెందిన రేఖ అనే యువతితో పెళ్లి చేశారు. వీరికి ఓ కుమారుడు పుట్టాడు. ఈ ఘనుడు తరచూ భార్యను వేధిస్తుండడంతో విసిగిన ఆమె బిడ్డతో పుట్టింటికి చేరుకుంది. ఇదే అవకాశంగా గురుసిద్దప్ప పెళ్లి సంబంధాల వెబ్సైట్లో మంజుళ అనే ఆమెను పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుని మరోచోట కాపురం పెట్టాడు. ఆ తర్వాత సుధా అనే యువతిని వలలో వేసుకుని ఆమెకూ మూడుముళ్లు వేశాడు. ఇతని లీలలు తెలియడంతో మొదటి, రెండవ భార్యలు న్యాయం చేయాలని విద్యానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమలాగ ఎవరూ మోసపోరాదని తెలిపారు. -
ఒక జవాన్ ఇంకో జవాన్ పై కాల్పులు కలకలం
-
‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్
సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్ టాక్తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్తో యువ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు సైనికుడే’’ ‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం ఖాయం.’’ సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో కెప్టెన్ బాత్రా తన తోటి జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్ బడీ కుత్తీ ఛీజ్ హై యార్" యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ నినదిస్తాడు. చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్గా ఉంటుంది. దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్ చేస్తుందీ సినిమా. నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్మార్క్లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. -
జమ్మూకాశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం
-
‘ఫ్రెండ్ కోసమే దొంగిలించాను.. త్వరలోనే తిరిగిస్తాను’
భోపాల్: మధ్యప్రదేశ్లో ఓ వింత దొంగతనం చోటు చేసుకుంది. సరిహద్దులో ఉండి మనకు కాపాల కాసే జవాను ఇంటకి కన్నం వేశాడు ఓ దొంగ. బంగారం, విలువైన వస్తువులు దోచుకెళ్లడమే కాక విధిలేక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా దొంగతనం చేయాల్సి వచ్చింది.. క్షమించండి అని కోరుతూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ భింద్ జిల్లా భీమ్ నగర్ ప్రాంతంలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్) జవాను ఇంట్లో కొన్ని రోజుల క్రితం దొంగతనం చోటు చేసుకుంది. బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లాడు. పోయిన వస్తువుల కంటే కూడా సదరు దొంగ రాసిన లేఖ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లేఖలో సదరు దొంగ ప్రాణాపాయంలో ఉన్న తన స్నేహితుడిని బతికించుకోవడం కోసమే ఈ దొంగతనానికి పాల్పడుతున్నానని తెలిపాడు. ‘‘క్షమించండి.. విధిలేని పరిస్థితుల్లోనే చోరీ చేయాల్సి వచ్చింది.. కానీ త్వరలోనే నేను దోచుకెళ్లిన సొత్తును తిరిగి మీకు అప్పగిస్తాను. ఇప్పుడిలా దొంగతనం చేయకపోతే.. నా స్నేహితుడు మరణిస్తాడు.. దయచేసి అర్థం చేసుకోండి’’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
15 ఏళ్ల క్రితం తప్పించుకున్నాడు.. తాజాగా అరెస్ట్
లక్నో: ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తూ 15 ఏళ్ల క్రితం సెంట్రల్ జైలు నుంచి పరారైన మాజీ జవాన్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. అనిల్ సింగ్ అనే వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేవాడు. 1994లో సింగ్ విధుల్లో ఉన్నప్పుడు తన పై అధికారిని హత్య చేసి అరెస్ట్ అయ్యాడు. జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఎస్పీ విపిన్ టాడా అప్పట్లో వెల్లడించారు. ఈ కేసులో దోషిగా తేలిన అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఆ తర్వాత అలహాబాద్ కోర్టు అతడికి 2005 అక్టోబర్ 12 నుంచి 2006 ఏప్రిల్ 13 వరకు పెరోల్ ఇచ్చింది. 6 నెలల పెరోల్ ముగిసినా అతడు జైలుకు రాకపోవడంతో సింగ్ పారిపోయినట్లు గుర్తించారు. అప్పటి నుంచి అతనికోసం గాలిస్తుండగా తాజాగా తన స్వగ్రామం గైగాట్ సమీపంలో సంచరిస్తున్న సమాచారం అందడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. చదవండి: బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం.. మాస్కు ధరించలేదని కాల్చిపడేశాడు -
అనుమానాస్పద స్థితిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కూర్మాపు చిన్ని (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. చత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్న ఆయన రెండు రోజుల కిందట సెలవుపై ఇంటికి బయల్దేరారు. మరో నలుగురితో కలిసి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వరకు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. శనివారం ఉదయం ఆమదాలవలసలో దిగి ఆటోలో బయల్దేరుతూ టెక్కలి జగతిమెట్ట వద్దకు తమ్ముడిని పంపించాలని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన కాసేపటికే చిన్ని ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. తమ్ముడు జగతిమెట్ట వద్దే ఉన్నా చిన్ని రాలేదు. ఎంతకూ రాకపోవడంతో శనివారమంతా చుట్టుపక్కల గ్రామాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆదివారం నందిగాం మండలం దేవుపురం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ మృతదేహం కనిపించడంతో పోలీసులు చిన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మృతదేహం చిన్నిదేనని గుర్తు పట్టారు. -
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో
మహానంది: నిశ్చితార్థం ఒకరితో చేసుకొని, మరో యువతిని పెళ్లాడిన సీఆర్పీఎఫ్ జవాన్పై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. శిరివెళ్ల మండలం గుంప్రమానుదిన్నె గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మధుభాస్కర్తో మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ యువతికి జనవరి 16న నిశ్చితార్థం అయ్యింది. అయితే మధుభాస్కర్ బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన యువతిని ఈ నెల 15వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇదేం న్యాయమని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఎక్కువ కట్నం ఇచ్చారు అని సమాధానమిచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు.. పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం -
రాకేశ్వర్ సింగ్ విడుదల.. 100కి.మీకు పైగా బైకుపై
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి–కొత్తగూడెం: మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు. అతన్ని విడిపించేందుకు మధ్యవర్తులు, విలేకరులు దండకారణ్యంలోకి 100 కిలోమీటర్లకుపైగా బైకుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ప్రత్యేక చర్చల ప్రక్రియ ఎట్టకేలకు సఫలం కావడంతో ఆరురోజుల తర్వాత రాకేశ్వర్ సింగ్ చెరవీడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోలకు కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మంగళవారం నాటికే సానుకూల సంకేతాలు పంపింది. కానీ అదే సమయంలో రాకేశ్వర్ క్షేమంపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే కేంద్రం హామీలపై సంతృప్తి చెందిన నేపథ్యంలోనే మావోలు బుధవారం రాకేశ్వర్ సింగ్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సందేశం మావోయిస్టులకు తెలియజేయడానికి నమ్మకస్తులు, తటస్థులైన ధర్మపాల్ షైనీ, తెల్లం బోరయ్యలను ఎంపిక చేసుకున్నాయి. జర్నలిస్టులకు ముందే సమాచారం: జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు బుధవారమే మధ్యవర్తులతో పాటు ఏడుగురు విలేకరులకు అర్ధరాత్రి దాటాక ఫోన్ చేస్తామని చెప్పి ఉంచారు. అదే ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇద్దరు మధ్యవర్తులను తీసుకుని బీజాపూర్ నుంచి బైకులపై బయ ల్దేరాలని జర్నలిస్టులకు సూచించారు. దీంతో మొత్తం 9 మంది అటవీమార్గాన దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్కౌంటర్ జరిగిన జొన్నగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ.. వారి వెంట ఎవరూ ఫాలో కాలేదని మావోలు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి లోపలికి మరో 15 కిలోమీటర్లు ఫోన్లో సూచనలు ఇస్తూ పిలిపించుకున్నారు. మొత్తానికి ఉదయం 9.30 గంటలకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రాకేశ్వర్ను బంధించిన చోటుకు వీరంతా చేరుకున్నారు. అక్కడ వారికి కోడి, టమాట కూరలు, చపాతీలతో భోజనం పెట్టారు. మధ్యవర్తులతో మావోయిస్టులు ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. జొన్నగూడకు 40 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 దాటగానే మధ్యవర్తులు, జర్నలిస్టులు జొన్నగూడ వైపు బయల్దేరారు. రాకేశ్వర్ సింగ్తో పాటు 40 మంది మావోయిస్టులు వారిని అనుసరిస్తూ వచ్చారు. తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో అందరిముందు రాకేశ్వర్ తాళ్లు విప్పి బంధ విముక్తుణ్ణి చేసిన మావోయిస్టులు అతన్ని మధ్యవర్తులకు అప్పగించారు. మావోయిస్టులు తమను బాగా చూసుకున్నారని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం కానీ, దురుసుగా ప్రవర్తించటం కానీ చేయలేదని చర్చల్లో పాల్గొన్న ముఖేశ్ చంద్రాకర్ ‘సాక్షి’కి వివరించారు. చదవండి: (రాకేశ్వర్సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?) -
రాకేశ్వర్సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఏప్రిల్ 3వ తేదీన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్ చేసిన జవాను రాకేశ్వర్సింగ్ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. రాకేశ్వర్సింగ్ను కిడ్నాప్చేసి 6 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోయిస్టులు మొదటి నుంచి అతనిపై సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. అతని ప్రాణానికి ఎలాంటి హామీ తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే రాకేశ్వర్ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఒక పాకలో ఏ విధమైన ఆందోళన లేకుండా కూర్చుని ఉన్న రాకేశ్వర్సింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే అనూహ్యంగా గురువారం మధ్యాహ్నమే రాకేశ్వర్సింగ్ను మావోలు విడుదల చేసినట్టుగా బస్తర్ ఐజీ ప్రకటించడం అం దరినీ విస్మయానికి గురిచేసింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. ఎలా విడుదల చేశారు? రాకేశ్వర్ను బందీగా పట్టుకుని చర్చలకు రావాలని ప్రభుత్వానికి డిమాండ్లు విధించిన మావోయిస్టులు అకస్మాత్తుగా అతన్ని విడుదల చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఛత్తీస్గఢ్ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేశాయన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు ప్రభుత్వాధికారులను అపహరించడం, తమ డిమాండ్లు, నెరవేర్చుకోవడం, తమవారిని విడిపించుకోవడం కొత్త విషయమేమీ కాదు.. దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఇప్పుడు కూడా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అదే విధంగా మావోల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ‘‘ఆపరేషన్ ప్రహార్’’ను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులు పైకి చెబుతున్నట్టుగానే ఎలాంటి డిమాండ్లు, షరతులు లేకుండానే జవానును వదిలేశారా? లేక తెరవెనుక ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? లావాదేవీలు నడిచాయా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. రాకేశ్వర్ విడుదలతో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహం.. కూంబింగ్ నిలిపివేతకు ఇటాలియన్ల కిడ్నాప్ 2012 మార్చి14న కోరాపూట్లో ఎమ్మెల్యే జినా హికాకాతో పాటు ఇద్దరు ఇటాలియన్ టూరిస్టులు క్లాంజియో కొలాంటిడియో, బసుస్కో పౌలోను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపింది. మావోయిస్టుల కోసం ఒరిస్సా అడవుల్లో జరుగుతున్న కూంబింగ్ను వెంటనే ఆపేయాలన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించడంతో మావోలు ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఇటాలియన్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేశారు. అయితే దాని వెనుకా వేరే కారణం ఉందన్న ప్రచారం జరిగింది. ఒకేసారి ఏడుగురు ఐఏఎస్ అధికారులను..! 1987లో తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఏడుగురు ఐఏఎస్ అధికారులను మావోలు కిడ్నాప్ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఐఏఎస్లను బందీలుగా చేసుకుని మావోలు అప్పట్లో వారి డిమాండ్లు నెరవేర్చుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రాకేశ్వర్ సింగ్ విడుదల వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రహార్ నిలిపివేతకు, గిరిజనులకు హామీ లభించిందా? ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్కే కోసం కలెక్టర్ కిడ్నాప్ 2011 ఫిబ్రవరి 17. మల్కన్గిరి జిల్లా బడ పాడ గ్రామం. ఇది ఏపీ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ, జేఈ పబిత్రా మోహన్తో కలిసి బైక్పై వెళ్తుండగా.. దారికాచిన మావోలు వారిని కిడ్నాప్ చేసి చిత్రకొండ అడవుల్లో బంధించారు. ఏపీ నుంచి పలువురు పౌరహక్కుల నేతలు మధ్యవర్తిత్వం వహించి వారిని విడుదల చేయించారు. దీనికి ప్రతిగా ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత నిలిపివేసి, అరెస్టు చేసిన ఆదివాసీలను విడుదల చేసింది. ఇదంతా బయటికి కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే.. మావో అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ను ఓ రహస్య ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతన్ని అరెస్టు లేదా ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వెంటనే మల్కన్గిరి కలెక్టర్ను కిడ్నాప్ చేశారు. ఆర్కేను అరెస్టు చేయకుండా భద్రతా బలగాలు వెనక్కి వచ్చేయాలని షరతు విధించారు. విధిలేని పరిస్థితుల్లో భద్రతాదళాలు ఆర్కేను విడిచిపెట్టగా, మావోలు కలెక్టర్, జేఈలను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి మాత్రం అదంతా గిరిజనుల విడుదల కోసం జరిగిన కిడ్నాప్గా ప్రచారం జరిగింది. చదవండి: (వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల) -
ఎన్కౌంటర్లో మృతిచెందిన జవాన్ శాఖమూరి మురళీకృష్ణ
-
జవాన్ ప్రవీణ్ కుమార్రెడ్డికి ఘన నివాళి
-
చైనాకు తగిన బుద్ధి చెబుతాం..
15 ఏళ్ల సర్వీసు.. నాలుగు పదోన్నతులు.. ఎన్నో గోల్డ్మెడల్స్.. ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్తాన్ సరిహద్దులో విధుల నిర్వహణ.. సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్బాబు పేరిట ఉన్న రికార్డ్ ఇది. ఉన్నతకుటుంబం నుంచి ఆర్మీలోకి అడుగుపెట్టిన సంతోష్బాబు దేశసేవలో తనముద్ర వేసుకున్నాడు. లడక్లోని గాల్వన్ లోయ వద్ద భారత్–చైనా బలగాల మధ్య జరిగిన బాహాబాహీలో సంతోష్బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేట / సూర్యాపేట క్రైం : దేశం కోసం సేవ చేయాలనే తపన ఉంది. కాని చేయలేకపోయాడు. ఎలాగైనా తన కుటుంబం నుంచి ఆర్మీలో ఒకరు ఉండాలన్న ఆలోచనతో సూర్యాపేట జిల్లాకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ తన కుమారుడు సంతోష్బాబును ఆర్మీలోకి అడుగు పెట్టించాడు. తండ్రి ఆశయాన్ని కుమారుడు నెరవేర్చాడు. కానీ అర్ధంతరంగా దేశసేవలోనే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం రాత్రి లడక్లోని గాల్వన్ లోయ వద్ద భారత్– చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేట జిల్లావాసి కల్నల్ సంతోష్బాబు మరణించారు. వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్ – మంజుల దంపతులకు ఇద్దరు సంతానం. భార్యపిల్లలతో సంతోష్బాబు(ఫైల్) కుమారుడు సంతోష్ బాబు, కుమార్తె శృతి ఉన్నారు. ఉపేందర్ ఎస్బీఐలో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. ఉపేందర్ సంతోష్బాబును చిన్ననాటి నుంచే ఆర్మీలోకి అడుగుపెట్టే విధంగా తయారుచేశాడు. సంతోష్బాబు 1 నుంచి 5 వ తరగతి వరకు సంధ్య హైస్కూల్లో, 1993లో 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు కోరుకొండ సైనిక్స్కూల్ విజయనగరంలో విద్యనభ్యసించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్మీలో చేరాడు. పాఠశాలలో మౌర్య, గుప్తాహౌస్కి కెప్టెన్గా వ్యవహరించాడు. ఆయన 2018 బ్యాచ్లో కోరుకొండ సైనిక్ స్కూల్ టాపర్గా నిలిచాడు. సంతోష్ అన్ని పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. డిగ్రీ నేషనల్ డిఫెన్స్ పూణెలో, ట్రైనింగ్ ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్లో పూర్తి చేసుకున్నాడు. 2004, డిసెంబర్లో లెఫ్ట్నెంట్గా ఢిల్లీలో బీహార్ –16 బెటాలియన్లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం సంతోష్బాబు సతీమణి సంతు, కుమారుడు అనిరు«ధ్, కుమార్తె అభిజ్ఞలు ఢిల్లీలోనే ఉన్నారు. కుమార్తె అభిజ్ఞ మూడో తరగతి విద్యనభ్యసిస్తోంది. సంతోష్బాబు మరణవార్తతో సూర్యాపేట జిల్లాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో రెండో మరణం జిల్లాలో ఇది రెండో మరణం. కార్గిల్ యుద్ధంలో 20 ఏళ్ల క్రితం పెన్పహాడ్ మండలం చీదెళ్ల గ్రామానికి చెందిన పోలోజు గోపయ్యచారి వీరమరణం పొందాడు. పదిహేనేళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు.. సంతోష్బాబు తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొంది ప్రస్తుతం లడక్లో ( కల్నల్) కమాండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న వయసులోనే కల్నల్గా ఎదిగి ఎన్నో గోల్డ్మెడల్స్ను సొంతం చేసుకున్నాడు. అదే విధంగా 2007లో ముగ్గురు చొరబాటు దారులను సైతం అంతమొందించాడు. 15 ఏళ్ల పదవీ కాలంలో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, లడక్, పాకిస్థాన్ సరిహద్దులో పనిచేశాడు. కొంతకాలం ఖంగో దేశంలో కూడా విధులు నిర్వహించాడు. సంతోష్ బాబు మరణ వార్తను టీవీలో చూస్తున్న తల్లిదండ్రులు మధ్యాహ్నం 2 గంటలకు సంతోష్బాబు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు.. సంతోష్బాబు మరణవార్త తెలిసినప్పటికీ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. తిరిగి తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా చేరవేశారు. బు«ధవారం తెల్లవారేసరికి సంతోష్బాబు పార్థి వదేహాన్ని ఢిల్లీలో కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు ఆర్మీ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంతోష్బాబు పార్థివదేహం బుధవారం మధ్యాహ్నానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కోవిడ్ నేపథ్యంలో హైదరాబాద్లోనే నిర్వహించాలని ఆర్మీ అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంతోష్బాబు నివాసాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు సంతోష్బాబు మరణ వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్, సూర్యాపేట డీఎస్పీ ఎస్.మోహన్కుమార్, సీఐలు ఆంజనేయులు, విఠల్రెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంతోష్బాబు మృతికి పలువురు సంతాపం.. బిక్కుమళ్ల సంతోష్బాబు మృతిపై సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ వైవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్కుమార్, ఉ ప్పల ఆనంద్, కక్కిరేణి శ్రీనివాస్, రాజు, రమేష్ ఆయన నివాసానికి చేరుకుని తల్లిదండ్రులను ఓదార్చి పరామర్శించారు. పలువురు పరామర్శ సంతోష్ కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. తల్లిదండ్రులు ఉపేందర్, మంజులను సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ఓదార్చారు. దేశసేవలో సంతోష్ సేవలను కొనియాడారు. అదే విధంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కూడా పరామర్శించారు. సంతోష్బాబుకు ఆత్మకూర్(ఎస్) మండలంతో అనుబంధం ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : చైనా దుశ్చర్యతో మృతిచెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు పూర్వీకులది మండల పరిధిలోని బొప్పారం గ్రామం. సంతోష్బాబు తాత చక్రయ్య గ్రామంలో ఉంటూ వ్యాపారం చేసేవాడు. చక్రయ్య ముగ్గురు సంతానం వ్యాపారరీత్యా సూర్యాపేటలో స్థిరపడ్డారు. ఈ ముగ్గురిలో ఉపేందర్ కుమారుడు సంతోష్బాబు ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో భాగంగా ఆర్మీలో చేరాడు. మంగళవారం భారత్, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో సంతోష్బాబు మృతిచెందడం పట్ల మండలవాసులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖుల సంతాపం సూర్యాపేట అర్బన్ : భారత్, చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సూర్యాపేట నివాసి బిక్కుమళ్ల సంతోష్ బాబు మృతిపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఫోన్లో సంతోష్బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం వీర మరణం పొందిన సంతోష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. సంతోష్బాబు దేశం కోసం తన ప్రాణాలను అర్పించి వీర మరణం పొందారని ఆయన వారితో పేర్కొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి పరామర్శ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ పరామర్శించారు. నేటి యువతకు ఆదర్శం : మండలి చైర్మన్ నల్లగొండ : దేశం కోసం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు వీరమరణం పట్ల శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన సంతోష్ బాబు దేశ రక్షణ కోసం ఆర్మీ ఉద్యోగంలో చేరి కల్నల్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ సరిహద్దులో కల్నల్ బిక్కుమళ్ల సంతోష్బాబు వీరమరణం పొందడం పట్ల నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సంతాపం తెలిపారు. చైనాకు తగిన బుద్ధి చెబుతాం : డాక్టర్ చెరుకు సుధాకర్ సూర్యాపేట : కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ మరణానికి కారణమైన చైనా దేశానికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ హెచ్చరించారు. శాంతిమంత్రం జపిస్తూ దందుడుకుగా యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న చైనా వైఖరిని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కల్నల్ సంతోష్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిరస్థాయిగా నిలిచిపోతాడు : సంకినేని దేశం కోసం సరిహద్దులో వీర మరణం పొందిన సంతోష్బాబు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్లు సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్ పేరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఫోన్లో కల్నల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సీఆర్పీఎఫ్ జవాన్లకు సోకిన కరోనా
ఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. ఢిల్లీ నగరంలో లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడం సంచలనం రేపింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) విభాగంలో 9 మంది జవాన్లకు కరోనా వైరస్ సోకింది. దీంతో వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. 9 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ విభాగంలో పనిచేస్తున్న 47 మందిని సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఢిల్లీలో అంతకంతకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. Out of 47 CRPF (Central Reserve Police Force) personnel who were sent to the quarantine centre in Narela (Delhi), 9 have tested positive for COVID-19. They have been sent to the isolation ward. All were deployed in Delhi: CRPF Sources pic.twitter.com/1ONCgURuaf — ANI (@ANI) April 24, 2020 -
ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డ జవాన్..
న్యూఢిల్లీ : ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో ఓ జవాన్ జారిపడ్డాడు. హిమాచల్ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ దగ్గర పెట్రోలింగ్ పార్టీ ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అతని కోసం ఆర్మీ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన జవాన్ ట్రిపీక్ బ్రిగేడ్కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్లగా గుర్తించారు. జవాను జారిపడిన విషయం తెలిసిన వెంటనే సైనికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తొలుత పెట్రోలింగ్ పార్టీ ఆపరేషన్ ప్రారంభించగా.. అనంతరం మరో 200 మంది గాలింపు చర్యల్లో దిగారు. నీటిమట్టం ఎక్కువగా ఉండడంతోపాటు ప్రవాహ ఉధృతి కూడా అధికంగా ఉన్నప్పటికీ ప్రకాశ్ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్లు, నిఘా హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక బలగాలు, ఇంజినీర్ టాస్క్ఫోర్స్ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఈతగాళ్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. -
ఉద్దానం వీరుడికి ఘన స్వాగతం
యుద్ధభూమిలో శత్రువులతో పోరాడి, ఇద్దరిని మట్టుబెట్టిన ఉద్దానం వీరుడు తామాడ దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను ప్రజలు ఘనంగా సన్మానించారు. ఆర్మీలో పనిచేస్తున్న మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులను మట్టుపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా గాయపడిన దొరబాబు నయమైన అనంతరం స్వస్థలానికి వచ్చారు. శ్రీకాకుళం, మందస: మాతృభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్ఆర్ బెటాలియన్లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్లోని కోజ్పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభ మవ్వగా సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమైంది. బాధను భరిస్తూనే, ఏకే 47తో ముష్కరులపై దాడికి దిగాడు. పాకిస్తాన్కు చెందిన భయంకరమైన టెర్రరిస్టు సాభిర్అహ్మాలిక్ను హతమార్చాడు. మరో ఉగ్రవాదిని కూడా దొరబాబుతోపాటు తోటి సైనికులు హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో స్వల్పంగా గాయపడిన దొరబాబు కోలుకొని బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు దొరబాబుకు ఎదురెళ్లి, వీరతిలకం దిద్ది, త్రివర్ణ పతా క రెపరెపల మధ్య పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సమావేశంలో దొర బాబు సాహసాన్ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు బచ్చల మధుబాబు, యోగేశ్వరరావు, కృష్ణారావు, దుమ్ము ధనరాజు, తామాడ హేమరాజు, మాధవరావు, పందిరి శ్రీను, తాళ్ల తులసీదాసు, ఢిల్లీరావు, పందిరి శ్రీ ను, దున్న కుమారి, బచ్చల లక్ష్మి, నాగమ్మ, తామాడ రెయ్యమ్మ పాల్గొన్నారు. ఉద్దానం వీరుడు దొరబాబును సన్మానిస్తున్న చిన్నలొహరిబంద గ్రామ మహిళలు -
రివాల్వర్తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య
జవహర్నగర్: కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడికి గురైన ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్నగర్ కార్పొరేషన్లోని సీఆర్పీఎఫ్ క్యాంపస్లో ఆదివారం చోటుచేసుకుంది. జవహర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా పవన్నగర్ గ్రామానికి చెందిన బబన్ విఠల్రావు మన్వర్ (44) సీఆర్ఫీఎఫ్ క్యాంపస్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. నెల రోజుల పాటు సెలవులపై సొంతూరికి వెళ్లి ఈ నెల 2న తిరిగి విధుల్లో చేరాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి తీవ్రమవడంతో ఆదివారం ఉదయం డ్యూటీలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకుని అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కూతురు ఉంది. సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రత్నమ్మ ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
అనాథ బాలికపై లైంగికదాడి
కర్ణాటక , రాయచూరు రూరల్: నగరంలోని బాల మందిరానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఓ జవాన్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆజాద్ నగర్లో ప్రభుత్వ ఆధీనంలో రిమాండ్ హోం నిర్వహిస్తున్నారు. అయితే ఆ రిమాండ్ హోంలో ఎల్బీఎస్ నగర్కు చెందిన ఓ అనాథ బాలిక ఉంటోంది. అక్కడే జవాన్గా పని చేసే సిద్ధయ్య(26) అనే వ్యక్తి ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి గత నవంబర్ 11న బీఆర్బీ సర్కిల్ వద్ద గల తన ఇంటికి పిలుచుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఇటీవల తరచు ఆమెను వేధిస్తుండడంతో విసిగి పోయిన ఆ బాలిక ఫిర్యాదు మేరకు మేల్కొన్న జిల్లాధికారి వెంకటేష్ కుమార్ శుక్రవారం నగరంలోని బాల మందిరాన్ని జిల్లా ఎస్పీ వేదమూర్తి తదితరులతో కలిసి పరిశీలించారు. నిందితునిపై కేసు నమోదు చేసి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన రిమాండ్ హోం అధికారులు సయ్యద్ పాషా, గురు ప్రసాద్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. -
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
మీర్జాపూర్: సీఆర్పీఎఫ్ జవాన్ సహా నలుగురు కలసి 15 సంవత్సరాల వయసున్న పాఠశాల విద్యార్థినిని ఎత్తుకెళ్లి గ్యాంగ్రేప్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో సోమవారం జరిగింది. నిందితుల్లో ఒకడైన జై ప్రకాశ్ సోదరి హాలియా గ్రామంలో ఉంటుందని, దీంతో తరచూ వచ్చేవాడని, ఈ నేపథ్యంలో ఈ విద్యార్థినితో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. అయితే సోమవారం రాత్రి 10 గంటలకు విద్యార్థిని తల్లికి జై ప్రకాశ్ ఫోన్ చేసి ఇంటి బయటికి రావాలని కోరగా, వచ్చిన బాధితురాలిని బలవంతంగా పోలీస్ లోగో ఉన్న కారులో హాలియా అడవిలోకి తీసుకెళ్లి నలుగురు గ్యాంగ్రేప్ చేశారని బాధితురాలి తండ్రి పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో సీఆర్పీఎఫ్ జవాను మహేంద్ర యాదవ్, గణేశ్ ప్రసాద్ బింద్, లవకుశ్ పాల్, మాజీ జైలర్ కుమారుడు జై ప్రకాశ్ మౌర్యలు ఉన్నారు. బాధితురాలితో సహా నిందితులను వైద్య పరీక్షల కోసం పంపినట్లు మీర్జాపూర్ ఎస్పీ ధరమ్వీర్ సింగ్ తెలిపారు. -
జ్ఞాపకాల బుల్లెట్
ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి. కంకిపాటి కామాయికి ఇన్ఫెంట్రీలో ఇచ్చిన పేరు ప్రయివేటు సిపాయి నంబరు 58310 అని. ఆ చుట్టుగోడలో వున్న కంతలోంచి దూరి ఇవతల పడ్డాడు. బోర్ల నుంచి వెల్లకిల తిరిగాడు. ఆ వెధవ మణిపూరు రోడ్డు – కొండలూ, గుట్టలూ, పైగా ఎనిమీ కట్టే అడ్డుగోడలూ! సూర్యుని కిరణాలు కామాయి బుగ్గల మీద తాండవిస్తుంటే ఆ చలికాలంలో వాడికి హాయిగా వున్నది. వాడనుకోవడం – ఆ గోడ కంతలోంచి దూరి హాయిగా ఇవతల పడ్డానని. ‘‘ఆ! యేడిసినట్టుంది. గౌహటీ నుంచి బయల్దేరి నవుగామ్ కొచ్చాం. ఆడనుంచి మణిపూరెళుతుండాం. నా కాలికేదో తగిలి నేనీడ పడ్డాను. యారయినా యింటే నవ్వుతారు. లేచీ మిగతావోళ్ళను కలుసుకోవాల. ఆళ్ళీపాటి కవతల కొండమీదకి పోయుంటారు’’ అనుకున్నాడు కామాయి. చేతులూ కాళ్ళూ కదలడం లేదు. లేవాలని ఎంతో ప్రయత్నించాడు. దుఢీలున మహా భయం వేసింది వాడికి. సూర్యకిరణా లాగిపోయాయన్నట్లుగా వాడి శరీరమంతా చల్లబడడ మారంభించేసరికి వాడికి మహా గాభరా వేసింది. ‘‘అరే దేముడా! ఓ యాల నేనూ ఓ యాల నేనూ; కాదు కాదు’’ అని మళ్ళీ శాంతపడ్డాడు. ‘‘ఆ పడ్డంలో యెక్కడో బెణికింది గామోసు, అందుకనే లేవలేక పోతుండా’’ అనుకున్నాడు. కొంచెం సేపటికి వాడి శరీరంలో ఉన్న చల్లదనం పోయింది. సూర్యకిరణాల వేడికి మళ్ళీ హాయి పొందుతున్నాడు కామాయి. అదంతా అసలు సీఓ తప్పు. లేకపోతే ఏమిటి మరి? వాళ్ళందర్నీ సెలవ కిండ్లకు పంపిస్తానన్నాడు. వారం రోజులైనా కాలేదు, యేక్షన్లోకి పోవాలన్నాడు. ఇండ్ల మీద ప్రాణాలు పెట్టుకున్నవాళ్ళు ఎట్లా ఆ వెధవ మణిపూరు రోడ్డు మీద బార్బుడు వైరు వెనక పాకులాడుతూ పోతారు? ఆ పనిమీద మనసెలా వుంటుంది? న్యాయం కాదు. ఆ మొదటి కొండ పక్కనుంచి ఆ గ్రామం గుండా గోడల సందుల్లో బోర్లపడి పాకులాడుతూ పోయినప్పుడంత కష్టంగా లేదు. అప్పుడు ముందర బోడిరాము డుండేవాడు. వాడి తలకాయి చూసుకుంటూ పాకాడు కామాయి. పాపం చాలా మంచివాడు బోడిరాముడు. ఎన్ని బాంబులు పడుతున్నా వాడి యాసలో వాడు ఏవేవో చమత్కారాలాడుతూ ఆ వున్నవాళ్ళ ధైర్యం పోకుండా చూసేవాడు. అదైపోయింది. అసలు నాటకం – లేచి ఆ చుట్టూ గోడ పక్కనుంచి పాకులాడుతూ పోవాలని ఆర్డరొచ్చింది. కామాయి వెంటనే ఎదుట చూడంగానే గోడలో మనిషి దూరేంత కంత వుంది. మహా అదృష్టవంతుణ్ణనుకున్నాడు. దూరి అవతలకు పోతే ఫస్టు అనుకున్నాడు. అక్కడ్నుంచీ పాకటం ఉండదనుకున్నాడు. వాడి కోసమే ప్రత్యేకం, ఆ కంత ఉందనుకున్నాడు. దభాలున దూకాడు. అయితే కాళ్ళమీద లేవాల్సింది మొఖం బోర్లా పడ్డాడు – ఆ యెత్తు నుంచి! ఆశ్చర్యం! ఆ దూకబోయే ముందర ఓసారి చుట్టూ చూశాడు. కంకిపాటి చెరువల్లే ఓ చెరువూ, అక్కడ మోస్తరే ఓ వరిపొలం కనబడ్డాయి. ఆశ్చర్యం సుమా! ప్రపంచంలో రెండుచోట్ల ఒకే మాదిరుండడం. ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి. పాపం ఎన్నిసార్లు వాళ్ళమ్మ ఎండలో ఆ పొలంలో చమటలు కమ్ముతూ పని చేయలేదు? నిజం – అదంతా కళ్ళకు కట్టినట్లు కనపడ్డాది వాడికి – ఆ గొంతుకలు కూడా వినబడ్డాయి. నిజంగా ఆ గొంతుకలు వినబడ్డాయి. తమ్ముడు చెట్టెక్కాడు. ‘‘రేయి నీ జిమ్మ తియ్యా! ఆ వున్న ఒక్క గంతా సింపుకుంటావు. దిగి రాయేంరా!’’ అనేది అమ్మ. కామాయి చెర్లో చేపలు పడుతుంటే ‘‘రాయేంరా! ఈ మట్టి తియ్యాలి రారా!’’ అనేది. వాళ్ళు ముగ్గురే! ఆ గ్రామంలో ఇంకా వున్నారు గాని వీళ్ళ ముగ్గురికీ వీళ్ళు ముగ్గురే అన్నట్లుండేది. అప్పుడే – అప్పుడే సుబ్బిని కలిశాడు కామాయి. సుబ్బిని కలిసిం తర్వాత మారాడు. అప్పట్నుంచీ అమ్మా కాదు, తమ్ముడూ కాదు – ప్రపంచమంతా సుబ్బే! సుబ్బి ఇప్పుడుంటే ఎంతిచ్చుకోడు? ఆ నున్నగా, నల్లగా చంపలమీదానిస్తే ఏమివ్వడు? పక్కన పడుకుంటే చాలు – ఆ గుండెలో వేత్తున్న నొప్పంతా పోతుంది. ఆ గుండెలో నొప్పి, మొఖం మీద మంటా వాడ్ని ముందుకు లాక్కెళ్ళుతున్నాయి – సుబ్బిని కలుసుకోడానికి. అవును సీఓ లీవిస్తానన్నాడు. వెళ్ళి సుబ్బిని పెండ్లాడవచ్చు. సుబ్బి పెండ్లాడుతుందా? కంకిపాటి సుబ్బి అవుతుందా? అయితే ఆ పొలం పక్కన, ఆ చెరువొడ్డున, ఆ వేపచెట్టు పక్కనున్న గడ్డివామి మద్దెన పడుకున్నప్పుడాడిన మాటలు మాటాడుతుందా? మళ్ళీ వొకసారి లేవడానికి ప్రయత్నించాడు కామాయి. ఉహు! ఏ అవయవమూ కదల్దే! పోనీలే. కదలకపోతే నేమాయె. ఇప్పుడు కదిల్తేనేం, కదలకపోతేనేం. అంతా అయిపోయినట్లుంది. ఏమిటా చీకటి? గ్రహణం పట్టిందా? గ్రహణంలో కదలకూడనివాళ్ళు గర్భిణీ స్త్రీలు. తాను సిపాయి. ఎందుకు కదలకూడదూ? మూతి బిగించి లేవబోయాడు. కదలలా! వాడికే నవ్వొచ్చింది. మెడ ఓ వైపు తిప్పాడు. ఆ చెరువు వొంక చూశాడు – నవ్వుతూ. శవాలను వెతుక్కుంటూ గాయపడ్డవాళ్ళను మోసుకెళ్ళే పార్టీ ఒకటక్కడికి వచ్చింది. వాళ్ళ లీడరు అటూ ఇటూ చూసి కామాయిని కనిపెట్టాడు. దగ్గరకు పోయాడు. చచ్చి చాలా సేపయిందనుకున్నాడు. ముఖం చూశాడు. ఆ వేపు చెరువును చూస్తునట్లుగా వుంది. పెదిమల మీద చిర్నవ్వుంది. లీడరు కామాయి బ్లవుజు విప్పాడు. మెళ్ళో ఉన్న రెండు ఐడెంటిటీ డిస్కులు చూశాడు. చదివాడు. కంకిపాటి కామాయి – నంబరు 58310 అని వుంది. ఎదురుగా కొండ వేపు చూశాడు. కామాయి పుర్రెలో వున్న గుండు దెబ్బ చూశాడు. ‘‘ఈడీ కంతలోంచి ఈతలికి సూసేసరికాదెబ్బ తగిలుంటుందిరా. ఇంటికి ఐడెంటిటీ తీస్కోండి. ఆ తర్వాత ఏదైనా వస్తుంది!’’ అని తక్కిన వాళ్ళతో అన్నాడు. శవం నక్కల పాలైంది. శిష్టా ఉమామహేశ్వరరావు కథ ‘పడిపోయిన సిపాయి’ ఇది. తెలుగులో సైన్యం నేపథ్యంలో రచనలు చేసిన అరుదైన రచయిత శిష్టా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశారాయన. ‘సిపాయి కథలు’ కథాసంపుటి. వీటి ప్రచురణ 1946–1948. ఆకాశవాణి కథలు మరో సంపుటి. కథకుడిగా కన్నా కవిగా ఎక్కువ చర్చల్లోకి వచ్చాడు. విష్ణు ధనువు, నవమి చిలుక ఆయన కవితాసంపుటాలు. అతి నవీనుల్లో నవీనుడు అనీ, కవిత్వంలో రౌడీవేషం అనీ, వ్యక్తిగత జీవితంలో అరాచకుడు అనీ అనిపించుకున్నాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితకు శిష్టా కవిత ‘మారో మారో మారో’ ప్రేరణ అని శ్రీశ్రీయే చెప్పుకున్నారు. శిష్టా జనన మరణ తేదీల్లో (1909–1953) కొంత సంశయాలు ఉన్నప్పటికీ చిన్న వయసులోనే మరణించాడన్నది మాత్రం విషాదకరంగా నిస్సంశయం. -
రైలు నుంచి జారిపడి జవాన్ మృతి
సాక్షి, మిర్యాలగూడ : ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఈ ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం నందిపాడుకు చెందిన కొప్పోజు వెంకటేశ్వర్లు, సైదమ్మల రెండో కుమారుడు ధర్మేంద్రచారి 13ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్కు ఎంపికై జార్ఖండ్లో విధులు నిర్వహిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా తోటి జవాన్లతో కలిసి శుక్రవారం రాత్రి రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెం దినట్లు కుటుంబ సభ్యులకు సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఫోన్ ద్వార సమాచారం అందించారు. కాగా నందిపాడుకు చెందిన ధర్మేంద్రచారి నకిరేకల్ పట్టణానికి చెందిన నిర్మలాదేవితో 12ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూ తురు హర్షిత, కుమారుడు శ్రీకాంతాచారి ఉన్నారు. ధర్మేంద్రచారి నెలరోజుల క్రితం నందిపాడుకు వచ్చాడు. 20రోజుల క్రితం తిరగి జార్ఖండ్కు వెళ్లి విధుల్లో చేరాడు. విధి నిర్వహణలో భాగంగా వెలుతున్న క్రమంలో ధర్మేంద్రచారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. శోకసంద్రంలో నందిపాడు.. నిత్యం అందరితో కలిసిమెలసి ఉంటూ ఆప్యాయతగా పలుకరించే ధర్మేంద్రచారి విధినిర్వహణలో ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి చనిపోవడంతో నందిపాడు శోక సంద్రంలో మునిగిపోయింది. విధి నిర్వహణలో పట్టుదలతో ఉండే ధర్మేంద్రచారి అకాల మరణం నందిపాడును కలచివేసింది. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్రచారి బంధువుల, స్నేహితులు, పరిసర ప్రాంత ప్రజలు భారీగా తరలి వచ్చారు. పట్టణంలో ర్యాలీ.. విధి నిర్వహణలో మృతిచెందిన జవాన్ ధర్మేంద్రచారి పార్థీవదేహం వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు, కార్పెంటర్లు, పోలీసులు, పట్టణ వాసులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ధర్మేంద్రచారి జోహార్లు అంటూ నినాదాలతో సాగర్రోడ్డు మీదుగా పార్థీవదేహం నందిపాడుకు చేరుకుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు.. జవాన్ ధర్మేంద్రచారి మృతదేహన్ని శనివారం రాత్రి మిర్యాలగూడకు తీసుకొచ్చారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తిచేశారు. -
జవాన్లపై దాడి చేసిన హోటల్ సిబ్బంది
-
ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్
-
వైరల్ : మానవత్వం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్..!
శ్రీనగర్ : పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్ సింగ్ అనే జవాన్ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్ బాక్స్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్లోని నవాకాదల్ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్ తన లంచ్ బాక్స్ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు. 31 సెకన్ల నిడివి గల ఈ వీడియో వైరల్ అయింది. సోల్జర్ మంచితనంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక్బాల్ ఔదార్యం మెచ్చి ‘హ్యూమన్ అండ్ సెల్ఫ్లెస్ యాక్ట్’ సర్టిఫికేట్ కూడా అందించామని సీఆర్పీఎఫ్ తెలిపింది. వీరత్వం, కరుణ అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు అని పేర్కొంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇదే కాన్వాయ్లోని ఓ వాహనానికి ఇక్బాల్ డ్రైవర్గా ఉన్నారు. క్షతగాత్రులైన సహచరులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి ఆయన వారి ప్రాణాలు కాపాడారు. ఔదార్యం చాటుకున్న ‘పుల్వామా’ జవాన్ -
జవాన్ల ఓటుకూ తూట్లు
కుటుంబాలకు.. స్వస్థలాలకు సుదూరంగా దేశ రక్షణ విధుల్లో తలమునకలయ్యే జవాన్లు వారు.అవసరమైతే ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొనడమే తప్ప.. తమ స్వస్థలాల్లో, తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు రక్షణ, పారా మిలటరీ దళాల్లోని జవాన్లకు ఇంతవరకు కల్పించలేదు.ఆ లోటును పూడ్చుతూ సర్వీస్ ఓటర్లుగా పిలిచే ఇటువంటి వారందరికీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది.కానీ ఏం లాభం.. దేశరక్షణకు తుపాకులు చేతబట్టే ఈ జవాన్లకు ఓటు వజ్రాయుధం మాత్రం అందని పరిస్థితి దాపురించింది. పోలింగ్ జరిగి 15 రోజులు దాటినా కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందలేదు.ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ల జారీలో అవకతవకలపై ఇప్పటికే రచ్చ జరుగుతోంది. ఈ తరుణంలో సర్వీస్ బ్యాలెట్ల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా సాగినట్లు ఫిర్యాదులు, ఆరోపణలు తెరపైకి రావడం సర్వీస్, పోస్టల్ బ్యాలెట్ల జారీలో యంత్రాంగం వ్యవహారశైలిని మరింత ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాలతోపాటు పారా మిలటరీ దళాలుగా పిలిచే బీఎస్ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్), సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వు ప్రొటెక్షన్ ఫోర్స్), ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్), సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్), ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యురిటీ గార్డ్స్), ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్), డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్(డీఎస్ఎస్), ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) తదితర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ కుటుంబాలకు, స్వస్థలాలకు దూరంగా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తుంటారు. ఇలా దేశ రక్షణలో నిమగ్నమయ్యే వీరికి ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉండే ది కాదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల నుంచే ఓటు హక్కు కల్పించారు. దీంతో తమ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో.. తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకునే అవకాశం వీరికి లభించింది. దీన్నే సర్వీస్ ఓటు అంటారు. 20 శాతం మందికి మించి అందనిసర్వీస్ ఓటు రక్షణ విభాగాలతోపాటు పారామిలటరీ దళాల్లో పనిచేసేందుకు ఉత్తరాంధ్ర వాసులు పోటీపడుతుంటారు. ఈ కారణంగానే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అయితే లక్షల్లోనే ఉన్నారు. విశాఖ జిల్లాలో కనీసం 20వేల మంది వివిధ దళాల్లో పని చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ తొలిసారి లభించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరారు. కానీ సరిహద్దుల్లో పనిచేస్తున్న జిల్లాకు చెందిన సైనికోద్యోగుల్లో కనీసం 20 శాతం మందికి కూడా సర్వీస్ బ్యాలెట్లు అందని విషయం బయటపడింది.పోస్టల్ బ్యాలెట్లలోనే కాదు.. సర్వీస్ బ్యాలెట్ల జారీలోనూ జిల్లా యంత్రాంగం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించిందో దీన్ని బట్టే అర్ధమవుతోంది. ఆర్వో దృష్టికి తీసుకెళ్లిన మాజీ సైనికులు ఇలా సర్వీస్ బ్యాలెట్ పొందని వారి వివరాల కోసం భీమునిపట్నానికి చెందిన శ్రీ చైతన్య ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వే చేసింది. భీమిలి, విశాఖ తూర్పు నియోజకవర్గాల్లో కనీసం 20 శాతం మందికి కూడా అందలేదని గుర్తించారు. ఇలా సర్వీస్ ఓటు అందని సైనికుల జాబితాతో శుక్రవారం భీమిలి అసెంబ్లీ ఆర్వో బాలాత్రిపురసుందరిని కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వీస్ ఓటు అందని వారికి కనీసం ఆన్లైన్లో ఓటు హక్కు విని యోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కొయ్య గురాయరెడ్డి, కొయ్య నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ నాన్ చెట్టి, కార్యవర్గ సభ్యులు కేకే రెడ్డి, సురేష్, కోటి, శ్రీనివాస్, కొయ్య రామకృష్ణ, కొయ్య రాంబాబు, చిల్లా దేవి చెట్టి, కొటిరెడ్డి తదితరులున్నారు. అందని అసెంబ్లీ ఓట్లు బ్యాలెట్లు అందుకున్న కొద్దిమందిలో కూడా చాలా మందికి లోక్సభ బ్యాలెట్లే తప్ప.. అసెంబ్లీ బ్యాలెట్లు అందలేదని సమాచారం. ఉదాహరణకు కోల్కతా సమీపంలోని కృష్ణానగర్ వద్ద ఉన్న బీఎస్ఎఫ్ 99వ బెటాలియన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు లోక్సభ బ్యాలెట్ పత్రాలు తప్ప అసెంబ్లీ బ్యాలెట్ పత్రాలు నేటికీ అందలేదు. కమాండెంట్ను ఎన్నిసార్లు అడిగినా పోస్ట్లో వస్తాయని చెబుతున్నారని విశాఖ జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఒకరు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆర్మీతో పాటు వివిధ పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్న విశాఖ జిల్లాకు చెందిన సైనికుల్లో అత్యధికంగా భీమిలి, విశాఖ తూర్పు, గాజువాక, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఉన్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 1150 మందికిపైగా సైనికులుండగా, వారిలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 265 మందికి మించి లేరని తేలింది. ఇదే రీతిలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సర్వీసు ఓటు అందని సైనికోద్యోగులు వేలల్లోనే ఉన్నారు. బ్యాలెట్ల జారీ ఇలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు వారు స్వయంగా దరఖాస్తు చేస్తే తప్ప పోస్టల్ బ్యాలెట్ జారీ చేయరు. కానీ సర్వీస్ ఓటర్లయిన జవాన్లు తమ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయనవసరం లేదు. వీరి సర్వీస్ రికార్డును బట్టి ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేస్తూ సంబంధిత రక్షణ విభాగాల ద్వారా భారత ఎన్నికల కమిషన్కు జాబితాలు పంపిస్తారు. ఈ జాబితాలను రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల ద్వారా ఆయా జిల్లా ఎన్నికల అధికారులకు పంపిస్తారు. ఆ జాబితాల ఆధారంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత సర్వీస్ బ్యాలెట్లను సంబంధించిన ఉద్యోగులు పని చేస్తున్న బెటాలియన్ క్యాంప్ కార్యాలయాలకు పంపాలి. పోలింగ్కు కనీసం వారం పది రోజుల ముందుగానే క్యాంప్ కార్యాలయాలకు చేరుకునే సర్వీస్ బ్యాలెట్లను సిబ్బంది తీసుకొని తమ ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఓటు వేయాల్సి ఉంటుంది. వీరంతా దేశ రక్షణలో ఉన్న జవాన్లు అయినందున ఏ పార్టీకి అనుకూలంగా ఉండకూడదన్న భావనతో ఈ బ్యాలెట్ పత్రాల్లో పార్టీల గుర్తులుండవు. పో టీ చేసే అభ్యర్థుల పేర్లు మాత్రమే ఆంగ్లంతో పాటు మాతృ భాషల్లో ఉంటాయి. తమకు నచ్చిన పేరు ఎదురుగా టిక్ పెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేయాలి. ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన్ ద్వారా ఆయా జిల్లాలకు పంపిస్తారు. కౌంటింగ్ రోజున తొలుత సర్వీస్ బ్యాలెట్లు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. మావాళ్లకు బ్యాలెట్లు అందలేదు మా కుటుంబ సభ్యుడైన శ్రీనివాసరెడ్డి జబుల్పూర్ వద్ద ఆర్మీలో పనిచేస్తున్నారు. మా బంధువు కొల్లి వెంకటరెడ్డి బెంగుళూరులో డిఫెన్స్ సెక్యురిటీ సర్వీసెస్లో పనిచేస్తున్నారు. వీరిద్దరికి సర్వీసు ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించలేదు. ఎన్ని సార్లు అడుగుతున్నా పోస్ట్ ద్వారా రావాల్సి ఉందని అంటున్నారే తప్ప ఇప్పటివరకు అందలేదు. –కొయ్య గురాయరెడ్డి, మాజీ సైనికోద్యోగి -
‘నేను రాకుంటే నా దుస్తులు వస్తాయి’
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ భద్రత కోసం సైనికులు కుటుంబాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలను సైతం అర్పించాల్సి ఉంటుంది. తమిళనాడుకు చెందిన ఓ సైనికుడు సైతం అందుకు సిద్ధపడ్డాడు. నిశ్చితార్థం ముగిసి జూన్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణాన్ని తృణప్రాయంగా స్వీకరించాడు. పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించాడు. ‘నా కోసం బెంగ పెట్టుకోవద్దు.. నేను వస్తా.. లేకుంటే నా దుస్తులు వస్తాయి’ అంటూ తన సమీప బంధువుకు వాట్సాప్ ద్వారా హృదయ విదారకమైన సందేశాన్ని పంపాడు. వివరాలు.. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి సమీపంలోని మరుకాలకురిచ్చి గ్రామంలో 300కు పైగా కుటుంబాల్లోని పలువురు యువకులు భారత సైనికదళంలో సేవలందిస్తు న్నారు. దేశ సరిహద్దులను కాపాడుతూ, వివిధ బాధ్యతల్లో విధులను నిర్వహిస్తున్నారు. వీరంతా ఏడాదికోసారి సెలవులకు మాత్రమే ఊరికి వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆ సమయాల్లోనే వారికి పెళ్లి సంబంధాలు చూడడం, నిశ్చయించడం జరిగిపోతుంటుంది. ప్రస్తుతం భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా మరుకాల్కురిచ్చి దక్షిణ వీధికి చెందిన సుబ్బయ్య కుమారుడు వానమామలై (25) కూడా సైనిక దళంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది మోటర్ బైక్ ప్రమాదంలో సుబ్బయ్య మరణించగా, ప్రస్తుతం అతనికి తల్లి చెల్లమ్మాల్ (50), ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అతని అక్కకు మాత్రమే వివాహమైంది. ఇదిలాఉండగా, వానమామలైకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో కొన్ని నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది జూన్లో అతను సెలవులకు స్వగ్రామానికి వస్తుండగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో వానమామలై కుటుంబ సభ్యులు, అత్తింటి వారు, కాబోయే భార్య సైతం తరచు అతనితో సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. కశ్మీర్ పుల్వామా ప్రాంతంలో ఇటీవల జరిగిన పాక్ ముష్కరుల దాడులకు ఎదురుదెబ్బతీసే చర్య ఈ నెల 25వ తేదీన చోటుచేసుకుంది. భారత విమాన దళాలు ఈ చర్యలు చేపట్టగా, వారిలో మధ్యప్రదేశ్ సైనిక దళాన్ని సిద్ధంగా ఉండాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. అదే దళంలో వానమామలై కూడా సైనికుడిగా ఉన్నాడు. అప్పుడు వానమామలై తన కాబోయే భార్య బంధువుల్లో ఒకరికి వాట్సాప్ ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. ‘మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. యుద్ధానికి వెళుతున్న నేను తిరిగి వస్తానో రానో. నేను రాకుంటే నా దుస్తులు ఇంటికి వస్తాయి. పెళ్లి కుమార్తె పేరును ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ఆమెతో చెప్పవద్దు. ఇక అంతా దైవాదీనం. ఇకపై నేను ఫోన్లో మాట్లాడడానికి వీలుకాదు. వీలుంటే ఉదయం మాట్లాడతాను అంటూ వాట్సాప్లో సమాచారం ఇచ్చాడు. యుద్ధానికి సంబంధించిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు సమాచారం వచ్చిందని, తన కుటుంబ సభ్యులకు వానమామలై మరుసటి రోజు తెలియజేశాడు.దేశాన్ని రక్షించే జవానుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపే ఈ హృదయ విదారక సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్
జమ్ముకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర ఘాతుక ఘటనను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తీవ్రంగా ఖండిచింది. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన 49మంది జవాన్లను భారతీయులెవరు మరిచిపోలేరని ప్రకటించింది. వారి ప్రాణాలను హరించిన పాక్ తీవ్రవాద మూకలకు భారత్ గట్టి సమాధానం చెబుతుందనే విశ్వాసాన్ని నాట్స్ వ్యక్తం చేసింది. పుల్వామాలో ఉగ్రదాడి తెలిసిన వెంటనే అమెరికాలో ఉండే తెలుగువారంతా దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవానుల కుటుంబాలకు నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపింది. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు జవాన్ల కుటుంబానికి అండగా ఉండాలని పేర్కొంది. -
2018లో 96 మంది జవాన్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాలకు చెందిన 96 మంది జవాన్లు 2018లో వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైందని కేంద్ర హోంశాఖ తెలిపింది. అలాగే నివేదిక ద్వారా 2016లో 90 మంది, 2017లో 121 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు బలగాల పని పరిస్థితుల మెరుగుదల అనేది ఒక స్థిరమైన ప్రయత్నమని, అవసరమైనపుడు హోంశాఖ తగు సూచనలు చేస్తుందని కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కాలానుగుణంగా సమీక్ష నిర్వహిస్తోందని వివరించారు. జవాన్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఒత్తిడికి గల కారణాలపై ప్రొఫెషనల్ ఏజెన్సీల ద్వారా సమాచారం తెప్పించుకుని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో జవాన్లు పని చేసిన తర్వాత ఒత్తిడి తగ్గించడానికి, ఆత్మహత్యలను నివారించడానికి వారు కోరుకున్న చోట్ల పోస్టింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెగ్యులర్గా అధికారులతో జవాన్లు తమ సమస్యలు చెప్పుకునే సమావేశాలు ఏర్పాటు చేసి ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. పని వేళలు కూడా తగ్గించి జవాన్లకు కావాల్సినంత విశ్రాంతి ఇస్తున్నట్లు, పని ఒత్తిడి మరింత తగ్గించేందుకు క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు కిరణ్ రింకు రాజ్యసభలో తెలిపారు. -
వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. జవాన్ల ధైర్య, సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. సైనికులకు, వారి కుటుంబ సభ్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు భారత జవాన్లకు ఆర్మీడే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. 1948వ సంవత్సరం చిట్టచివరి బ్రిటీష్ కమాండర్ ‘సర్ ఫ్రాన్సిస్ బచ్చర్’ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కరియప్ప జనవరి 15వ తేదీన దేశ సైనికాధికారి బాధ్యతలు స్వీకరించారు. దీంతో విదేశీ సైనిక పాలన నుంచీ దేశానికి విముక్తి లభించినట్లయింది. అందుకు గుర్తుగా ప్రతి ఏటా ‘జనవరి 15న’ ఆర్మీడే జరుపుకొంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. (సైనికుడా.. వందనం) With deep respect, I extend my heartfelt gratitude towards our brave soldiers & their families and salute their courage and valour#ArmyDay pic.twitter.com/dGym8HT4p5 — KTR (@KTRTRS) 15 January 2019 -
సైనికుడా.. వందనం
భైంసాటౌన్(ముథోల్) : మనం ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు.. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీరు మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా.. దేశాన్ని కాపాడేది సైనికుడు.. అందుకే ముందుగా జై జవాన్, ఆ తరువాతే జై కిసాన్ అన్నారు. దేశసేవ కోసం జిల్లా నుంచి ఎంతోమంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 15న సైనిక దినోత్సవం. నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకునే రోజు ఇది. ఈ నేపథ్యంలో కథనం.. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. అనేక పోరాటాల ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని భారత సైనికులు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. 1948లో చివరి బ్రిటిషన్ కమాండర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్గా కేఎం కరియప్ప జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజున ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి దేశరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లకు ప్రభుత్వం వారి పదవీ విరమణ అనంతరం ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తాయి. అయితే గతంలో పదవీ విరమణకు ముందే జవాన్లకు ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించేది. కానీ 2009 నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆర్మీ జవాన్లకు పదవీ విరమణ తరువాతే భూమి కేటాయించాలని నిర్ణయించింది. దీంతో గతంలో మాదిరే ముందుగానే ప్రభుత్వం భూమిని కేటాయించాలని జవాన్లు కోరుతున్నారు. తమపై ఆధారపడే కుటుంబసభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే ఐదెకరాల స్థలం కేటాయిస్తే ఎందరో యువకులు దేశరక్షణలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం యువత దేశరక్షణలో రాణించేలా వారిని ప్రోత్సహించాలని జవాన్లు కోరుతున్నారు. లక్ష్యమే కనిపించింది మాది భైంసా మండలం లింగా 2 గ్రామం. ఇటీవల జమ్మూకాశ్మీర్లో జరిగిన పాక్ కాల్పుల్లో నాచేతి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయమైంది. ఆ రోజు చుట్టూ పొగమంచు ఆవరించి ఉంది. కాసేపు ఏం జరిగిందో తెలియలేదు. శత్రువుల నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా సుమారు గంటసేపు ఉగ్రమూకలతో పోరాడా. గాయాలు కావడంతో సైనిక అంబులెన్స్లో ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందాలని సూచించడంతో స్వగ్రామానికి వచ్చా. – దుప్పి విశ్వనాథ్, జవాను, లింగ 2 యూనిఫాం అంటే ఇష్టంతో.. మాది నిర్మల్ జిల్లా ఖానా పూర్లోని శాంతినగర్. అమ్మ లక్ష్మి, నాన్న నర్సయ్య వ్యవసాయం చేస్తారు. నేను కూడా వ్యవసాయంలో నాన్నకు సాయం చేస్తూ చదువుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యూనిఫాం జాబ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కసి ఉండేది. మొదటగా కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. అయితే తరువాత కఠోర సాధనతో 2008లో ఆర్మీ రిక్రూట్మెంట్లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యాను. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వర్తిస్తున్నా. – కడుకుంట్ల ప్రవీణ్కుమార్, జవాన్ దేశసేవ కోసమే మాది భైంసాలోని కిసాన్గల్లి. అమ్మ గంగాబాయి, నాన్న రాములు. పదోతరగతి వరకు భైంసాలోని సరస్వతి శిశుమందిర్లో విద్యాభ్యాసం జరిగింది. 2002లో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం నాయక్గా విధులు నిర్వర్తిస్తున్నా. – కార్తీక్, నాయక్, భైంసా జైహింద్ మన నినాదం కావాలి మాది భైంసా పట్టణంలో ని గణేశ్నగర్. అమ్మ భూ మాబాయి, నాన్న సాయ న్న. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నా విద్యాభ్యాసం భైంసాలోని సర స్వతి శిశుమందిర్లో సాగింది. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు ఎక్కువ. 2000 సంవత్సరంలో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం హవల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నా. పిల్లలకు గుడ్మార్నింగ్, గుడ్నైట్లకు బదులు జైహింద్, జైభారత్ అనే నినాదాలు నేర్పించాలి. దీంతో వారిలో దేశం పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. – ఆకుల దత్తాత్రి, హవల్దార్, భైంసా -
వీరుడా వందనం
చింతలమానెపల్లి (సిర్పూర్): కశ్మీరులో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ రాజేశ్ దాకువా అంత్యక్రియలు గురువారం స్వగ్రామం కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజేశ్ భౌతికకాయం రవీంద్రనగర్కు చేరుకుంది. సాయంత్రం సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. మొదట ప్రజల సందర్శనార్థం రాజేశ్ దాకువా పార్థివదేహాన్ని గ్రామంలోని పాఠశాల మైదానంలో ఉంచారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు కన్నీటి పర్యంతమవుతూ అంజలి ఘటించి నివాళులర్పించారు. తల్లి లతిక, భార్య జయ, కుమార్తెలు రోషిణి, ఖుషి, సోదరి మీనా, రీనా రాజేశ్ భౌతికకాయం చూడగానే కన్నీరు మున్నీరుగా రోదించారు. ఆర్మీ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. జవాన్ చితికి కుమార్తె రోషిణి నిప్పంటించారు. -
‘నా కొడుకు తప్పు చేసి ఉంటే.. తప్పకుండా శిక్షించాలి’
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో బులంద్షహర్లో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్కుమార్ సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు యోగేశ్ రాజ్, సుబోధ్పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానించారు. తాజాగా.. జమ్ముకశ్మీర్కు చెందిన జవాను జీతు ఫ్యూజి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారాడు. శ్రీనగర్కు చెందిన జీతు ఇన్స్పెక్టర్ సుబోధ్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజు ఫ్యూజి అక్కడే ఉన్నట్లు.. అనంతరం అదే రోజు సాయంత్రమే శ్రీనగర్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బులందషహర్ ఘటనలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోల్లో జీతు ఫ్యూజి స్పష్టంగా కనిపించాడు. అతడిని పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు జమ్ముకశ్మీర్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సుబోధ్ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా అల్లర్ల సమయంలో సుబోధ్ను చంపేయ్యండి అంటూ కొందరు ఆందోళనకారులు అరుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ ఘర్షణలో మరో యువకుడు సుమిత్ కూడా చనిపోయాడు. సుమిత్ మృతికి ప్రతీకారంగానే సుబోధ్పై దాడి చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. కొందరు ఆందోళన కారులు పోలీసులను వెంబడిస్తూ ‘వారి దగ్గర నుంచి తుపాకీలు లాక్కొని వారిని చంపేయండి’ అని అరుస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది. (జవాన్ జీతు ఫ్యూజీ తల్లిదండ్రులు) పదునైన ఆయుధంతో సుబోధ్పై దాడి చేసి ఆ తర్వాత తలపై కాల్చి చంపారు. సుబోధ్ చనిపోయిన సమయంలో జీతు అతని ఎదురుగానే ఉన్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే అతన్ని గుర్తు పట్టడంలో జీతు తల్లి తడబుతున్నట్లు తెలుస్తోంది. వీడియోల్లో తన కొడుకును స్పష్టంగా గుర్తించలేకపోయానని తెలిపింది. ఒకవేళ పోలీసులు చెప్పినట్లు తన కొడుకే సుభోద్ను హత్య చేసి ఉంటే.. ఢ. మరో కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. సుభోద్ సింగ్ మరణించిన రోజున జీతు ఘర్షణ జరిగిన ప్రాంతంలోనే ఉన్నాడని తెలిపారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి ‘డ్రామా చూశారా’ అంటూ ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. అనంతరం సాయంత్రం కార్గిల్ వెళ్లాడని తెలిపారు.