పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి | Pigs Fight Competition Held In Annamayya District | Sakshi
Sakshi News home page

పందులకూ ఓ పందెం! విజేతలకు రూ.2 లక్షల బహుమతి

Jun 3 2022 3:17 AM | Updated on Jun 3 2022 11:22 AM

Pigs Fight Competition Held In Annamayya District - Sakshi

పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు. అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం

రాయచోటి: కోడి పుంజులకు కత్తులు కట్టి బరిలో వదలడం చూశాం. అలాగే పొట్టేళ్లు, మేక పోతులు ఢీకొనడమూ చూశాం.. అయితే ఇపుడు కొత్తగా పందుల పోటీ కూడా ఈ జాబితాలో చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి సమీపం లోని దిగువ అబ్బవరంలో గురువారం పందుల పోటీ నిర్వహించారు. పొట్టేళ్ల మాదిరిగానే వీటిని రెచ్చగొట్టి వదిలారు.

అవి ఒకదానిని ఒకటి బలంగా ఢీకొనడం, నోటితో కరవడం. కాళ్లతో రక్కడం.. ఇలా తమ శక్తిమేరకు పోరాడాయి. చివరకు కొన్ని పందులు పోటీ పడలేక పారిపోయాయి. విజేతలయిన వరాహాలకు రూ.2లక్షల బహుమతి ప్రకటించారు. ఈ పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సుకత ప్రదర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement