వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి | Road Accident At Guvvalacheruvu YSR District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి

Published Mon, Aug 26 2024 8:43 PM | Last Updated on Mon, Aug 26 2024 8:53 PM

Road Accident At Guvvalacheruvu YSR District

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో కంటైనర్‌కు వెనకనుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు, కంటైనర్‌ డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందారు. 

కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement