ఈసారి ఎండలు.. మంటలే | Temperatures above normal from March to May | Sakshi
Sakshi News home page

ఈసారి ఎండలు.. మంటలే

Published Sat, Mar 1 2025 3:10 AM | Last Updated on Sat, Mar 1 2025 3:10 AM

Temperatures above normal from March to May

నైరుతి వర్షాలపైనా తీవ్ర ప్రభావం

సాక్షి, విశాఖపట్నం: దక్షిణాది రాష్ట్రాలు ఈసారి ఎండలతో మండిపోతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ డి.ఎస్‌.పై తెలిపారు. మార్చి నుంచి మే నెల వరకు సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెబెక్స్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. మే నెలలో వడ­గాలుల తీవ్రత చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మినహా అన్నిచోట్లా భారీగా ఉంటుందని తెలిపారు. 

మే నెలలో వడగాలులు వీచే రోజుల సంఖ్య కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. నైరుతి రుతుపవనాల రాక సమయంలో పసిఫిక్‌ మహా­సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే సూచనలున్నాయని, అందు­వల్ల రుతుపవనాలు బలహీనపడతాయని చెప్పారు. 

దీనివల్ల ఈ వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులుంటాయని, రుతుపవనాల ప్రభావం కొంత తగ్గేలా ఉం­దని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం, రవా­ణా తదితర రంగాలపై ఎండల తీవ్రత ప్రభా­వం చూపిస్తుందని డాక్టర్‌ డి.ఎస్‌.పై పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement