![YS Jagan has no security provided by the government: Andra pradesh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/21/car_1.jpg.webp?itok=f9oigZth)
వైఎస్ జగన్కు ప్రభుత్వం కల్పించిన భద్రతలో డొల్లతనం బహిర్గతం
దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ
చంద్రబాబు పదేళ్లు ఆ వాహనంలోనే ప్రయాణించినట్లు వెల్లడి
అదే వాహనంలో వేల కిలోమీటర్లు తిరిగినట్లు అంగీకారం
కనీస మరమ్మతులకు నోచుకోని బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు
పదే పదే మొరాయించడంతో మరో వాహనంలో వెళ్లిన జగన్
సాక్షి, అమరావతి: అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబైతే.. దు ష్ప్రచారానికి మారుపేరు టీడీపీ అనేది మరోసారి నిరూపితమైంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వం కలి్పంచిన భద్రతలో బహిర్గతమైన డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలను అస్త్రాలుగా చేసుకుని, దు్రష్ఫచారం చేసే యత్నంలో టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్ జగన్కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం(ఏపీ 39పీ 0014) పాతదేనని అంగీకరించడం ద్వారా తన నకిలీ బతుకును బయపెట్టుకుంది. ఆ వాహనంలో పదేళ్లు చంద్రబాబు ప్రయాణించారని.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిరిగారని ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఆ పార్టీ అధికారికంగా వెల్లడించింది.
కాలం చెల్లిన ఆ వాహనానికి కనీసం మరమ్మతులు చేయకుండా వైఎస్ జగన్కు కేటాయించింది. వినుకొండలో నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో అత్యంత పాశవికంగా నరికి నరికి చంపారు. ఈ నేపథ్యంలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే తాడేపల్లి నుంచి వినుకొండకు వైఎస్ జగన్ బయలుదేరారు. అత్యంత పాతది.. పైగా మరమ్మతులు చేయకపోవడంతో ఆ వాహనం పదే పదే మొరాయించింది. దాంతో మరో వాహనంలో వైఎస్ జగన్ వినుకొండ చేరుకున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్కు జడ్ ప్లస్ భద్రత ఉంది. జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి ఎవరికైనా కండీషన్లో ఉండే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలన్నది నిబంధన. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. జడ్ ప్లస్ భద్రత ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కండీషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా వైఎస్ జగన్కు కాలం చెల్లిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. పదేళ్లపాటు లక్షల కిలో మీటర్లు తిరిగిన ఆ వాహనానికి టీడీపీ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదు. వైఎస్ జగన్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment