
సాక్షి, తాడేపల్లి: ఇటీవల ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టింది టీడీపీ నేతల బోట్లేనని తెలిసినా పచ్చ పార్టీ నేతలు మాత్రం ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక, బోట్లకు సంబంధించిన మరో సాక్ష్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీన్నీ వైఎస్సార్సీపీ బహిర్గతం చేసింది.
వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా పచ్చ మంద.. వైఎస్సార్సీపీపై నిందలు వేస్తోంది. ఇంతకంటే దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చంద్రబాబు? అని ఘాటు విమర్శలు చేసింది.
#Prakashambarrage
🚨 Big Expose Alert! 🚨
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి
జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు
ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి
అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా… pic.twitter.com/snqtMSm9mx— YSR Congress Party (@YSRCParty) September 10, 2024
ఇది కూడా చదవండి: ‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’
CMగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ, TDP కార్యకర్తలు వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజిని గుద్దిన టీడీపీ బోటు కూడా ఉంది. ఆ బోటుపై TDP జండాలు చూడచ్చు. pic.twitter.com/NFRdhqnTQE
— Anitha Reddy (@Anithareddyatp) September 10, 2024