prakasham barrage
-
బ్యారేజ్లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
బోటు రాజకీయంలో బోల్తాపడ్డ టీడీపీ
-
వీడియో: ఆ బోట్లు టీడీపీవే.. ఇదిగో మరో సాక్ష్యం
సాక్షి, తాడేపల్లి: ఇటీవల ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టింది టీడీపీ నేతల బోట్లేనని తెలిసినా పచ్చ పార్టీ నేతలు మాత్రం ఇంకా విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక, బోట్లకు సంబంధించిన మరో సాక్ష్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీన్నీ వైఎస్సార్సీపీ బహిర్గతం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా పచ్చ మంద.. వైఎస్సార్సీపీపై నిందలు వేస్తోంది. ఇంతకంటే దిక్కుమాలినతనం మరొకటి ఉంటుందా చంద్రబాబు? అని ఘాటు విమర్శలు చేసింది.#Prakashambarrage🚨 Big Expose Alert! 🚨 ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా… pic.twitter.com/snqtMSm9mx— YSR Congress Party (@YSRCParty) September 10, 2024 ఇది కూడా చదవండి: ‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’ CMగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి అభినందనలు తెలుపుతూ, TDP కార్యకర్తలు వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు పడవల ర్యాలీ నిర్వహించారు. అందులో కృష్ణా బ్యారేజిని గుద్దిన టీడీపీ బోటు కూడా ఉంది. ఆ బోటుపై TDP జండాలు చూడచ్చు. pic.twitter.com/NFRdhqnTQE— Anitha Reddy (@Anithareddyatp) September 10, 2024 -
ఊపిరి పీల్చుకుంటున్న బెజవాడ
-
‘ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే’
సాక్షి, విజయవాడ: టీడీపీ బండారం బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ కలరింగ్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్.. వైస్సార్సీపీపై ఆ నెపాన్ని నెట్టేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలిక కర్చుకుంది. మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో, పచ్చ పార్టీ కార్యకర్తలు ఉషాద్రి, రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు.‘ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో, టీడీపీ మంత్రులు.. వైఎస్సార్సీపీపై చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చ పార్టీ నేతల కామెంట్స్ తప్పు అని మరోసారి రుజువైంది. ఇక, నారా లోకేష్తో కూడా బోటు యజమాని ఉషాద్రి అనేక సార్లు ఫోటోలు దిగారు. ప్రశాకం బ్యారేజ్కి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్స్లు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి, రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు అని వైస్సార్సీపీ ఆ ఆరోపణలను ఎక్స్ వేదికగా ఖండించింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు @naralokesh కు సన్నిహితుడేప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను @ncbn ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో… https://t.co/Q3Tu2gr4Aa pic.twitter.com/KsBUI0ICag— YSR Congress Party (@YSRCParty) September 9, 2024ప్రకాశం బ్యారేజీ వద్దకు వరదకు కొట్టకొచ్చిన బోట్ల కేసు నిందితుడు నారా లోకేష్ కు సన్నిహితుడే. బ్యారేజీకి బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్రకోణం ఉందంటూ గత అర్థరాత్రి పోలీసులు కోమటి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరు వ్యక్తులను చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో రామ్మోహన్ పేరుమీద ఒక్క బోటు కూడా లేదు. నాలుగైదేళ్ల క్రితమే తన బోట్లను అమ్మేశారు. పైగా రామ్మోహన్ టీడీపీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరామ్కు సమీప బంధువు.ఈ కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి ఉషాద్రి తనకు వైఎస్సార్సీపీతో సంబంధాలు లేవని స్పష్టంచేసినా పోలీసులు అతన్ని ఇరికించి అరెస్టుచేశారు. నారా లోకేష్తో ఉషాద్రికి సంబంధాలు ఉన్నాయనేదానికి ఈ ఫోటోలే సాక్ష్యాలు. పబ్లిసిటీ పిచ్చిలో వరద బాధితుల్ని గాలికి వదిలేయడంతో ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంపై జనం ఉమ్మేస్తున్నారు. దాన్ని తుడవడానికి ఎల్లో మీడియా ముప్పుతిప్పలు పడుతోంది. ఇప్పట్లో వరద బాధితుల ఆగ్రహం తగ్గేలా లేదు. దాంతో ఇష్యూని డైవర్ట్ చేయడానికి తలాతోక లేని బోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి ఫేక్ ప్రచారమా టీడీపీ?. మీరు ఇలా ఎన్ని జిత్తుల మారి వేషాలేసినా.. విజయవాడని ముంచిన మీ పాపాన్ని కడుక్కోలేరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది YSRCP.ఇక.. ప్రకాశం గేట్లను ఢీ కొట్టిన ఘటనపై విచారణలోకీలక విషయాలు బయటపడ్డాయి. బోట్లను ఇనుప గొలుసులతో కాకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని సమాచారం. అలాగే.. గొల్లపూడి నుంచి బోట్లు నిలిపిన ప్రాంతం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి.. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయని దర్యాప్తులో వెలుగు చూసింది. -
ప్రకాశం బ్యారేజ్ కు మళ్ళీ పెరుగుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు బంద్
-
అలర్ట్: ప్రకాశం బ్యారేజ్కు వరద హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు వరద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, పులిచింతల నుంచి దిగువకు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్లో వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్కు రెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. దీంతో, అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇదే సమయంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు.. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లోకి ఇన్ ఫ్లో 88,879 క్యూసెక్కులుగా ఉండగా.. సముద్రంలోకి 71,650 క్యూసెక్కులు నీరు వెళ్తోంది. ఇక, కాలువల ద్వారా 17,229 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతోంది. కాగా, రెండు అడుగుల మేర 30 గేట్లు, ఒక్క అడుగు మేర 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. -
గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్లోకి 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్ 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద నీటిలో మునిగి రైతు మృతి కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ మునిగిపోయాడు. ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి, శబరి నదులు -
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
‘నదిలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేటు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు పోటెత్తినట్లు విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. దీంతో మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ శాఖ తెలిపింది. సహాయక చర్యలకు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలో ఎవరూ ప్రయాణాలు చేయవద్దని విపత్తు నిర్వహణశాఖ సూచించింది. ఈ ఘటనకు సంబంధించి పులిచింతల ప్రాజెక్ట్ను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ పరిశీలించారు. 16వ నంబర్ గేట్ వద్ద సాంకేతిక సమస్యను ఆయన పరిశీలించారు. కాగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు వెళ్లారు. అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 16వ నెంబర్ గేటును పరిశీలించారు. రాత్రి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక సాగర్ నుంచి పులిచింతలకు 1.88లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల నుండి ప్రాజెక్టు 16వ గేటుతో కలిపి మరో 14 గేట్లు ఎత్తడంతో ఇప్పటివరకు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 16వ గేట్ అమర్చేందుకు మరో 3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేయాలని, 5 మీటర్లకు నీటిమట్టం తగ్గిస్తేనే గేటు అమర్చడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించామని, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
జలాశయాలు విలవిల
సాక్షి, అమరావతి: జాతీయ జలవిధానం, కృష్ణా బోర్డు ఉత్తర్వులు, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి(వర్కింగ్ ప్రొటోకాల్)లను తుంగలో తొక్కుతూ.. శ్రీశైలం, సాగర్, పులిచింత ప్రాజెక్టుల్లోకి వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండడాన్ని రెండు రాష్ట్రాల్లోని విద్యుత్, నీటిపారుదల రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. సాగునీటి అవసరాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఏపీకే కాదు.. తెలంగాణకూ నష్టమేనని తేల్చిచెబుతున్నారు. అయినా సరే.. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కల్పించడం లక్ష్యంగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుండటం బరితెగింపునకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలల్లో విద్యుదుత్పత్తిని చేయకుండా తెలంగాణను నిలుపుదల చేసి.. తమ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం పదే పదే లేఖలు రాస్తోంది. వాటిపై స్పందించిన కృష్ణా బోర్డు.. విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను సైతం తెలంగాణ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు సరి కదా శ్రీశైలం, సాగర్, పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద పోలీసులను మోహరించి మరీ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ యథేచ్ఛగా దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో.. గేట్లు ఎత్తి జలాలను వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇరు రా ష్ట్రాల్లోని ప్రాజెక్టులనూ బోర్డు అధీనంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం: 885 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? ► జూన్ 1 నాటికి శ్రీశైలంలో 808.4 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంది. కనీస నీటి మట్టం కంటే దిగువన ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి, కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. ► శ్రీశైలంలో 854 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు, రాయలసీమ, నెల్లూరు కోసం రోజుకు ఏడు వేల క్యూసెక్కులను తరలించడానికి ఆస్కారం ఉంటుంది. 848 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే.. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చుక్క నీటిని తరలించడానికి అవకాశం ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ నియమావళి(ప్రోటోకాల్) ప్రకారం విద్యుదుత్పత్తిని ఎప్పుడు చేయవచ్చు: ► 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉండి, వరద ప్రవాహం వస్తున్న సమయంలో స్వచ్ఛందంగా విద్యుదుత్పత్తి చేయవచ్చు. ► సాగర్ ఆయకట్టు కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు ఆదేశించినప్పుడు.. బోర్డు కేటాయించిన మేరకు ఏపీ, తెలంగాణలు రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ సమానస్థాయిలో నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం ► శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం 823.33 అడుగుల్లో 43.35 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రాజెక్టులోకి 13,340 క్యూసెక్కులు వస్తుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా 30,610 క్యూసెక్కులను తెలంగాణ సాగర్కు విడుదల చేస్తోంది. ► జలాశయంలో ఎక్కువ ఎత్తులో నీటి నిల్వ ఉన్నప్పుడు పది వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్.. తక్కువ ఎత్తు నీటి నిల్వ ఉన్నప్పుడు 20 వేల క్యూసెక్కులతో ఉత్పత్తయ్యే విద్యుత్కు సమానం. ఎందుకంటే ఎక్కువ ఎత్తు నుంచి తక్కువ నీటిని విడుదల చేసినా.. టర్బైన్లు వేగంగా తిరుగుతాయి. తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ నీటిని విడుదల చేసినా టర్బైన్లు వేగంగా తిరగవు. తక్కువ ఎత్తు నుంచే నీటిని తరలించడం వల్ల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగదు. దీని వల్ల తెలంగాణకూ నష్టమే. ఇది తెలంగాణ జెన్కో అధికారులకు తెలియంది కాదు. ► కేవలం.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు.. చెన్నైకి తాగునీటి అవసరాలకు నీటిని దక్కకుండా చేయాలన్న కారణంతోనే ఏకపక్షంగా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తోంది. నాగార్జునసాగర్ పూర్తి నీటి మట్టం: 590 అడుగులు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టాలో ఇప్పటిదాకా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయలేదు. డెల్టాకు నీటిని కృష్ణా బోర్డు కేటాయించలేదు. నీటిని విడుదల చేయాలని కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపలేదు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తూ 32,190 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది.. ఆ జలాలు పులిచింతల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. సాగర్ నిర్వహణ నియమావళి ఏం చెబుతోంది? ► నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుని.. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పుడు తెలంగాణ, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక విద్యుదుత్పత్తిని నిలిపేయాలి. ► కృష్ణా బోర్డు కృష్ణా డెల్టాకు కేటాయించిన జలాలను.. రోజుకు నిర్ధిష్ట పరిమాణంలో విడుదల చేయాలని ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడు.. ఆ జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల్లో రెండు రాష్ట్రాలు చెరి సగం వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలి. ఎవరికి ఎంత నష్టం వచ్చిన నీటిని వచ్చినట్టు వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయడం వల్ల సాగర్లో నీటి మట్టం పెరగదు. దీని వల్ల ఏపీలో సాగర్ కుడి కాలువ కింద.. తెలంగాణ, ఏపీలోని సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సకాలంలో పూర్తి స్థాయిలో విడుదల చేయలేని పరిస్థితి. పులిచింతల ప్రాజెక్టు తెలంగాణ ఏం చేస్తోంది? కృష్ణా డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలతో నిమిత్తం లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ 4,600 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తోంది. ఆ జలాలు ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. ‘పులిచింతల’ ప్రోటోకాల్ ఏం చెబుతోంది? కృష్ణా డెల్టా సాగునీటి అవసరాల కోసం నిర్మించిన బ్యాలెనింగ్స్ రిజర్వాయర్ ఇది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. సముద్రంలోకి వరద జలాలు కలుస్తున్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. వరద ప్రవాహం ఆగిపోయాక.. కృష్ణా డెల్టా అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని డెల్టా ఎస్ఈ ప్రతిపాదనలు పంపినప్పుడే.. ఆ నీటిని వాడుకుంటూ విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఎవరికి ఎంత నష్టం కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంటలకు ఇప్పటిదాకా నీటిని విడుదల చేయలేదు. అవసరం లేకపోయినా దిగువకు విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు ఖాళీ అవుతుంది. కృష్ణా డెల్టా ప్రయోజనాలకు ఇది విఘాతం కల్పిస్తుంది. ప్రకాశం బ్యారేజీ జాతీయ జలవిధానం ఏం చెబుతోంది? ► ప్రాజెక్టులలో నిల్వ చేసిన జలాలను వినియోగించడానికి కేంద్రం జాతీయ జలవిధానాన్ని (నేషనల్ వాటర్ పాలసీ) ప్రకటించింది. ఆ విధానం ప్రకారం ► మొదటి ప్రాధాన్యం: తాగునీటి అవసరాలు ► రెండో ప్రాధాన్యం: సాగునీరు ► మూడో ప్రాధాన్యం: సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసే సమయంలోనే విద్యుదుదుత్పత్తి చేయవచ్చు. -
‘కృష్ణా’పై 3 బ్యారేజీలు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్ ఉత్తర్వులిచ్చింది. కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ► కృష్ణా నదిపై 1,323 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీల దిగువున 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీని నిర్మించనున్నారు. తొలి దశలో బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణ కోసం రూ.102.17 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసింది. ► కృష్ణా నదిపై 1,373 కి.మీ వద్ద అంటే ప్రకాశం బ్యారేజీకి 62 కి.మీ దిగువన 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. సర్వే, ఇన్వెస్టిగేషన్ తదితర పనులు, భూసేకరణ కోసం రూ.102.20 కోట్లను ఇప్పటికే సర్కార్ మంజూరు చేసింది. జల, ఉపరితల రవాణాకు ఊతం.. కృష్ణా నదిపై మూడు బ్యారేజీల నిర్మాణం అంతర్గత జల రవాణా, ఉపరితల రవాణాలకు ఊతం ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన, దిగువన బ్యారేజీలను నిర్మించడం వల్ల ఆ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కొత్తగా నిర్మించే బ్యారేజీల వల్ల పులిచింతల నుంచి హంసలదీవి వరకూ నదిలో నీరు నిల్వ ఉంటుందని.. ఇది జలరవాణాకు ఊతమిస్తుందంటున్నారు. డెల్టా పరిరక్షణ భూగర్భ జలమట్టం తగ్గడం వల్ల భూమి పొరల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడం, కృష్ణా నది వెంబడి సముద్రపు జలాలు పైకి ఎగదన్నడం వల్ల కృష్ణా డెల్టా చౌడు బారుతోంది. పంటల దిగుబడులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటికీ ఇబ్బందులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా డెల్టా పరిరక్షణకు ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భూగర్భ జలమట్టం తగ్గకుండా కాపాడుకోవచ్చు. -
ప్రకాశం బ్యారేజీ నుంచి సీ ప్లేన్ సేవలు..!
న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)–ఉడాన్ పథకంలో కొత్త ఏరోడ్రోమ్లు నిర్మించాలని యోచిస్తోంది. సీ ప్లేన్ సేవలపై హైడ్రోగ్రాఫిక్ సర్వే చేపట్టాలని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యూఏఐ)ను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖ కోరాయి. అలాగే నదుల్లో కాంక్రీట్ జెట్టీల(వాటర్ ఏరోడ్రోమ్) నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు నౌకాయాన శాఖ వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ సీ ప్లేన్ సేవలకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు నౌకాయాన శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్లో నర్మదా నదిలో, సబర్మతి రివర్ఫ్రంట్లో ఏరోడ్రోమ్ల నిర్మాణాన్ని ఐడబ్ల్యూఏఐ రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఐక్యతా శిల్పం నుంచి సబర్మతి రివర్ఫ్రంట్ 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోదీ కేవలం 40 నిమిషాల్లోనే ఈ రెండు ప్రాంతాల మధ్య సీ ప్లేన్లో ప్రయాణించారు. -
స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలంప్రాజెక్ట్/అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 6,15,797 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 3,472 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 6,12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 2 లక్షలు, ఉజ్జయిని నుంచి 1.50 లక్షలు, తుంగభద్ర నుంచి 50 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కరకట్ట లోపల తగ్గిన వరద గుంటూరు జిల్లా వైపు కరకట్ట లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. కొల్లూరు, తాడేపల్లిలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్కుమార్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీరు చేరిన ఇళ్లను గుర్తించేందుకు వెంటనే సర్వే చేపట్టాలని ఆదేశించారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. కొల్లిపర మండలంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల పర్యటించారు. గోదావరిలో కొనసాగుతున్న ప్రవాహం వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 26,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 24,520 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,73,089 క్యూసెక్కులు చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలంలోకి 5,12,690 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,12,690 క్యూసెక్కులు చేరుతోంది. పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి.. కుడి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 5,09,948 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. -
వరద సాయం శరవేగం
విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చాలి. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలి. వారంలోగా నష్టంపై అంచనాలు పంపించాలి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండాయి. ఈ పరిస్థితిని మార్చాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. వాయుగుండం నిన్న(మంగళవారం)నే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, అయినా పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. వరద సహాయక కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో హోం మంత్రి సుచరిత తదితరులు ప్రకాశం బ్యారేజీకి భారీ వరద – తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. – ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. 45 నెలల్లో శాశ్వత మరమ్మతులు – రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరగాలి. 45 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మతులు పూర్తి చేయాలి. వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపించాలి. – తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది. కాబట్టి అవసరమైన ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి. వ్యాధులు ప్రబలకుండా చర్యలు – కలుషిత నీరు లేకుండా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి. – అన్ని పీహెచ్సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్ చేయాలి. వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. నీటి వృథాను అరికట్టాలి – రిజర్వాయర్లు నింపాలి. అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. – నెల్లూరు జిల్లా కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం. ఇప్పటి వరకు గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం. వరద తగ్గాక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు – వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు వీలైనంత త్వరగా అంచనాలు పంపాలన్నారు. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ కొనసాగుతోందని చెప్పారు. – వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. – ఈ సమీక్షలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : కృష్ణా డెల్టాకు జవసత్వాలు కల్పిస్తూ ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య ఒక బ్యారేజీ నిర్మాణం కానుండగా, 62 కి.మీ. దిగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య మరో బ్యారేజీని నిర్మించనున్నారు. ఇందుకోసం సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణకు రూ.204.37 కోట్లను మంజూరు చేస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యద్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం తొలిదశ పరిపాలన అనుమతి ఉత్తర్వులు జారీ చేశారు. (కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా) కృష్ణమ్మ పరవళ్లు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 3,38,823 క్యూసెక్కులు చేరుతుండటం.. నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉండటంతో పది గేట్లు ఎత్తి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 4,12,345 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీల నుంచి 2,28,991 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి చేరుతుంది. నాగార్జునసాగర్లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ 18 గేట్లు ఎత్తి, విద్యుత్కేంద్రం ద్వారా 3,48,518 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న వరదలో 3,35,858 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతుండగా.. అంతే పరిమాణంలో 14 గేట్లు ఎత్తేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరదకు మున్నేరు, కట్టలేరు, వైరా, కొండవీటివాగు, కొండవాగుల ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 3,61,268 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు 4,829 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి 3,79,389 క్యూసెక్కులను కడలిలోకి వదులుతున్నారు. సోమశిల ప్రాజెక్టులోకి 69,888 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 76 టీఎంసీలకు చేరుకుంది. కండలేరులోకి 10,459 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 38.50 టీఎంసీలకు చేరుకుంది. -
ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు
సాక్షి, అమరావతి: నేటి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయమై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుందని అధికార వర్గాల సమాచారం. – రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో పని చేస్తున్న ఆర్డీవో (రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్) తరహాలోనే.. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో) పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. – ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై గురువారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులు రానున్నాయి. నేడు కేబినెట్ భేటీ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయం ఒకటో బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. – ఈ సమావేశంలో ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
మళ్లీ గోదారమ్మ ఉగ్రరూపం!
సాక్షి, హైదరాబాద్: శాంతించినట్లే శాంతించిన గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల పెన్గంగ, ప్రాణహిత నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్ 65 గేట్లు ఎత్తి.. 8.60 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి శబరి, తాలిపేరు, కిన్నెరసాని, కొండవాగుల ప్రవాహం తోడవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,06,032 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 11,600 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 3,89,032 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాలో వరద తగ్గుముఖం.. ఇటు పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం వల్ల కృష్ణాలో వరద తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ల నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాçహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 22,345 క్యూసెక్కులకు తగ్గింది. ప్రధాన ఉపనది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ మంగళవారం నిండటంతో గేట్లు ఎత్తి 2,137 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిస్తే.. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయిని, జూరాల డ్యామ్లు నిండటం వల్ల వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ నెలలో కూడా కృష్ణాకు భారీగా వరదలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద తగ్గుముఖం పట్టింది. బ్యారేజీలోకి 32,435 క్యూసెక్కులు వస్తుండగా.. కృష్ణా డెల్టాకు 16,705 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 15,730 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తుతున్న వరద
సాక్షి, కృష్ణా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అదే విధంగా ప్రకాశం బ్యాకేజ్కి వరద నీరు పోటెత్తుతోంది. వరదకు వర్షం తోడుకావటంతో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. దీంతో అరవై గెట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఈ సాయంత్రానికి 80వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావచ్చని అంచానా వేస్తున్నారు. గంటగంటకు వరద పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్ధితిని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలిస్తూ ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదీ పరీవాహక ప్రాంత తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. ఫొటో గ్యాలరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి... -
విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు
-
మల్లన్న చెంతకు కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణా జలాలు పోటెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు కృష్ణా నది నుంచి 29 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1740 క్యూసెక్కులు కలిపి 30,740 క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. దాంతో ఇక్కడి జలాశయంలో నీటి నిల్వ 38.29 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. ప్రాజెక్ట్ వద్ద 9 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. స్పిల్ వే ద్వారా 42,244, విద్యుత్ కేంద్రం ద్వారా 28,779 క్యూసెక్కులు కలిపి 71,023 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు హంద్రీ, తుంగభద్ర నుంచి వరద చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి వచ్చే ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాల వల్ల మున్నేరు, మూసీ నదుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్లోకి 12,137 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది. ► ఎగువ నుంచి గతేడాది జూలై 30న శ్రీశైలానికి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది రెండు వారాల ముందే రావడం గమనార్హం. ► తుంగభద్ర జలాశయంలోకి 8,029 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 48,679 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 45,679 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► వంశధార నది నుంచి 7,985 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ గేట్లు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా రావడంతో 30 గేట్లు ఎత్తి 21,750 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
-
ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆర్కే పరిశీలన
-
నిమజ్జనంలో అపశృతి..
-
నిమజ్జనంలో అపశ్రుతి.. చావుతో పోరాడిన యువకుడు
సాక్షి, విజయవాడ : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రకాశం బ్యారేజ్లోని సీతమ్మ వారి పాదాల ఘాట్ వద్ద గణేష్ నిమజ్జానాన్ని తిలకిస్తున్న ఓ యువకుడు బ్యారేజ్లో పడిపోయాడు. వరద ప్రవాహానికి ఆ యువకుడు చాలా దూరం కొట్టుకుపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం అప్రమత్తం కావడంతో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చావుతో పోరాడుతున్న యువకుడిని ఎన్డీఆర్ఎఫ్ సభ్యుడు నరేష్ సోనియా రెస్క్యూ చేసి కాపాడారు. ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పొన్నూరు సుధాకర్గా గుర్తించారు. కాగా, ప్రాణాలకు తెలిగించి యువకుడిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సందర్శకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రెస్య్యూ చేసి యువకుడిని కాపాడిన నరేష్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బ్యారేజ్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. -
కృష్ణాకు భారీ వరద.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ వరద పోటెత్తుతోంది. జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం నుంచి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు మంగళవారం ఉదయం సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పులిచింతలకు.. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. గత వరద ముంపును దృష్టిలో పెట్టుకుని అధికారులు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ సాక్షి, శ్రీశైలం: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వరద మంగళవారం ఉదయానికి భారీగా పెరిగింది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టులో 6 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ నిండుకుండలా దర్శనమిస్తోంది. వరద ఉధృతిని దృష్ట్యా అధికారులు సోమవారం సాయంత్రం నాగార్జున సాగర్ 16 రేడియల్ క్రాస్ట్గేట్లు ఎత్తి 2,94,300 క్యూసెక్కులు నీటిని దిగువ పులిచింతల ప్రాజెక్టులోకి విడుదల చేశారు. ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో గరిష్ట నీటి మట్టం 45.77 టీఎంసీలకు చేరడంతో దిగువ ప్రకాశం బ్యారేజీకి 50 వేలు క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట నీటిమట్టం నమోదుకావడంతో.. కాలువలకు విడుదల చేసే నీరు పోను, దిగువకు 18,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 45 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం లంక గ్రామాల ప్రజల అప్రమత్తం.. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండటంతో నదీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 15 నాటికే నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండింది. జిల్లాలోని అన్ని జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత వరద ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ కాలువలకు పుష్కలంగా నీరు విడుదల.. జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉండటంతో నాగార్జున సాగర్ కుడికాలువకు 10,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తాగునీటి చెరువులను పూర్తిగా నింపారు. సాగునీటి అవసరాలకు సరిపోను నీరు మిగులు ఉండటంతో 1500 క్యూసెక్కుల నీటిని గుండ్లకమ్మ వాగులోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండటంతో జిల్లాలో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. (చదవండి: ఉధృతంగా గోదావరి) -
నష్టం అంచనాలు లెక్కించండి : సీఎం జగన్
సాక్షి, విజయవాడ : భారీ వరదలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గణనీయంగా తగ్గింది. ముంపు ప్రాంతాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, స్వచ్ఛంద సంస్థల సేవలు కొనసాగుతున్నాయి. భారీ వరదల నేపథ్యంలో ప్రకాశం నుంచి ఇప్పటివరకు 300 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక వరదల కారణంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 4300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. వరద తాకిడికి 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నాయి. పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు లెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిన నష్ట నివేదికలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కడపటి వార్తలు అందేసరికి ప్రకాశం బ్యారేజీకి 1.21 లక్షల క్యూసెక్కుల వరదలు వస్తుండగా.. 1.04 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునాసాగర్, పులిచింతల గేట్లు మూసేడయంతో ఇన్ఫ్లో నిలిచిపోనుంది. (చదవండి : వరద తగ్గింది) -
ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి: గతవారం రోజుల పాటు మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ క్రమేణా శాంతిస్తోంది. ఆదివారం ఉదయం ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.26 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గింది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. దీంతో కృష్ణా కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 9467, పశ్చిమ డెల్టాకు 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు బ్యారేజీ కన్జర్వేటర్ తెలిపారు. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు మరోసారి మంత్రులు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన.. పెనమలురు ముంపు గ్రామాల్లో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్య కొలుసు పార్థసారధి ఆదివారం ఉదయం పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ఆరా తీశారు. పునరావాసాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల బాధితులను అన్ని విధాలా ఆందుకుంటామని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. కరకట్ట వద్ద రిటర్నింగ్ వాల్ను నిర్శించాలని అక్కడి స్థానికులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వారు సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. -
చురుగ్గా మంత్రులు.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, అమరావతి: ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండలా మారాయి. అయితే ఎగువ నుంచి భారీ వరదను వదలడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రాజెక్టు దిగువ పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో పలుగ్రామాల్లోని ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే వరదలను ముందే పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా పునారావాస కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజుల నుంచి వరద ఇలానే కొనసాగుతుండటంతో సహాయ చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారలు తప్పనిసరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. క్షేత్రస్థాయిలో మంత్రుల పర్యటనలు.. ఈ నేపథ్యంలో మంత్రులు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ప్రచారానికి, ఆర్భాటానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు క్షత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద బాధితులకు మంచినీళ్లు, ఆహారం అందిస్తూ.. బాధితులను ఆదుకుంటున్నారు. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పెనమలూరు పార్థసారథి, కైకలూరులో అనిల్కుమార్, అవినగడ్డలో సింహాద్రి రమేష్, మంగళగిరిలో ఆర్కే, నందిగామలో డాక్టర్ జగన్మోహన్రావు, విజయవాడలో మల్లాది విష్ణులు పర్యటించారు. -
నా కొంప ముంచడానికే వరద వస్తోంది!
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని, కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం బాధగా ఉందని ఆయన అన్నారు. శనివారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై సెక్యురిటీ జోన్లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం చాలా అరుదున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని అన్నారు. ఆయన నివాసం అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కాగా భారీ వరదలతో నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అక్కడి సిబ్బందికి అధికారులు సూచించారు. సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని సూచిస్తున్నాం. తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారు. మీక్షేమం కోసం చెబుతున్నాం. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ ఇళ్లు ఏర్పాటు కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తాం’ అని అన్నారు. -
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జిల్లాలోని గని ఆత్కురలులో ఎమ్మెల్యే డా.జగన్హోహన్రావు పర్యటించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను చేపట్టాలని, ముంపులో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరిలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. -
కృష్ణలంకలో వైఎస్సార్సీపీ శ్రేణుల పర్యటన
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ లంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు శుక్రవారం విస్తృత పర్యటన చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా బాధితులకు ఆహార పదార్థాలను అందజేయడమేకాక పునరావాస కేంద్రాలపై దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ వరద బాధిత కుటుంబాలను పరామర్శించారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కృష్ణలంకలో ఒక రైటనియోగ్ వాల్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో సహా, అధికారులు అక్కడిని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ముంపు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సహాయక చర్యల కోసం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మూడో రోజైన గురువారం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ నుంచి 4,51,686 క్యూసెక్కుల (39.03 టీఎంసీలు)ను సముద్రంలోకి వదులుతున్నారు. శుక్రవారం ఉదయానికి కూడా ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో లంక గ్రామాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. లంక గ్రామాలను ఏ క్షణంలో అయినా వరద ముంచెత్తే అవకాశం ఉందని.. వృద్ధులు తక్షణమే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని మైక్లో ప్రచారం చేశారు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతానికి 791 హెక్టార్లలో అరటి, పసుపు, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కరకట్ట వద్ద పెరిగిన ముంపు కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న ఇళ్లల్లో వరద ముంపు మరింత పెరిగింది. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న విషయం విదితమే. ఆ భవనాన్ని కూడా వరద చుట్టుముట్టింది. అక్కడి భవనాల్లో ఎవరూ ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొనసాగుతున్న హై అలర్ట్ కృష్ణా పరిధిలో హై అలర్ట్ కొనసాగుతోంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి దిగువకు 5.20 లక్షల క్యూసెక్కుల(44.93 టీఎంసీలు)ను, నారాయణపూర్ నుంచి 5.27 లక్షల క్యూసెక్కుల(45.56 టీఎంసీలు)ను వదులుతున్నారు. ఉజ్జయిని జలాశయం నుంచి 5,950 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్లోకి 7.05 లక్షల క్యూసెక్కుల(60.92 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. తుంగభద్రలో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్లోకి 8.62 లక్షల క్యూసెక్కుల (74.55 టీఎంసీలు) ప్రవాహం చేరుతుండగా, దిగువకు 8.61 లక్షల క్యూసెక్కులు (74.48 టీఎంసీలు) విడుదల చేస్తున్నారు. సాగర్లోకి 8.78 లక్షల క్యూసెక్కులు (75.95 టీఎంసీలు) చేరుతుండగా.. నీటి నిల్వ 303.95 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్ట్లోకి 6.44 లక్షల క్యూసెక్కులు (55.71 టీఎంసీలు) వస్తుండగా.. అదే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా వరదలపై సీఎం సమీక్ష కృష్ణా నది వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు.. వివిధ రిజర్వాయర్ల నుంచి విడుదల అవుతున్న నీటి వివరాలను తెలుసుకున్నారు. దాదాపు 7లక్షల క్యూసెక్కులకుపైగా నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతుందని అధికారులు చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని అదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే
సాక్షి, అమరావతి : ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి భారీగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ను పరిశీలించారు. కృష్ణా నదీగర్భంలో అక్రమంగా నిర్మించిన నివాసాన్ని చూసి అక్కడి పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎగువన గల పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోందని, చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుకను తరలిస్తున్నారని, ఇల్లు మునిగిపోతుందన్న భయంతోనే చంద్రబాబు ఇంటిని వదిలి హైదరాబాద్కు పారిపోయారని ఆర్కే ఎద్దేవా చేశారు. కాగా చంద్రబాబు అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ఇంట్లోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్న విషయం తెలిసిందే. కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్ట్స్కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి పరిస్థితి అర్థంకాలేదని ఆర్కే అన్నారు. ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులోనైనా చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాన్ని ఖాళీచేయక తప్పదని ఆయన హెచ్చరించారు. (చదవండి: ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!) పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. -
‘ముప్పు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు’
సాక్షి, విజయవాడ : పులిచింతల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీవైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులు కురసాల కన్నబాబు ,వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ ,జేసీ మాధవీ లత వరద పరిస్థితుల్ని వారికి వివరించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయని కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కృష్ణా, గోదావరినదులు ఉప్పొంగడంతో వరదలు పోటెత్తుతున్నాయి. 4.47లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మునిగిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కాదిది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాం. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు స్నానానికి నదిలో దిగొద్దు. ముందస్తుగా గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం’అన్నారు. మంచి చెప్పినా రాజకీయమన్నారు.. ప్రకాశం బ్యారేజీ 70గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పదేళ్ల తర్వాత అన్ని డ్యామ్లు నిండుకుండలా మారాయని ఆనందం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మాజీ సీఎం చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి నీటి వరద వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు. వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి చెప్పినా రాజకీయ కోణంలోనే చూశారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం
సాక్షి, విజయవాడ: పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ను వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ప్రకాశంలోని 72 గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత ప్రాజెక్టును పరిశీలించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4లక్షల 40వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ప్లో ఆరులక్షల క్యూసెక్కులకు మించితే లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పునరావాసాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతుండటంతో దిగువకు విడుదల చేస్తున్న వరద పరిమాణాన్ని అధికారులు పెంచుతూ పోతున్నారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో సర్కార్ హైఅలర్ట్ను ప్రకటించింది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 164కు చేరింది. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఈరోజు సాయంత్ర వరకు వరద ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టు నిండుకుండాల మారనుంది. ఎగువన శ్రీశైలం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 312 టీఎంసీలుగా.. ప్రస్తుతం 281టీఎంసీలు నీటినిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టులోని పూర్తి26 గేట్ల ద్వారా నీటికి దిగువకు వదలుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిండుకుండలు
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణాలో నీటి ప్రవాహాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నమొన్నటితో పోలిస్తే బేసిన్ ప్రాజెక్టులకు కొద్దిమేర వరద ఉధృతి తగ్గినా భారీగానే వరద వస్తోంది. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సాగర్లోకి మంగవారం సాయంత్రం 8.14 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదుకాగా ప్రాజెక్టులో నీటినిల్వ 312 టీఎంసీలకుగాను 275 టీఎంసీలకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 576 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు నుంచి 5.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో సైతం ఎగువ వరదనుబట్టి నీటినిల్వ ఉంచి మరో 4.24 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరద ప్రకాశం బ్యారేజీ మీదుగా బంగాళాఖాతంలోకి వెళుతోంది. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ద్వారా 570 అడుగుల నుంచి కృష్ణమ్మ కిందికి దుముకుతుండటంతో ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. నేడు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు రాష్ట్రంలో బుధవారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, సాగర్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మాద్ పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు గేట్లు ఎత్తే ముందు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకి వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ తెలిపారు. ముందు జాగ్రత్తగా గేట్ల ఎత్తి నీటిని విడుదల చేశామాన్నారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వచ్చని పేర్కొన్నారు. -
ప్రకాశం బ్యారేజ్కు భారీ వరద.. హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం పులిచింతల ప్రాజెక్టులోని 14 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. దీంతో దిగువన గల ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద చేరుతోంది. బ్యారేజ్లో ఇప్పటికే పది అడుగుల మేర నీరు చేరింది. 12 అడుగులకు నీటిమట్టం చేరిన తరువాత తూర్పు పడమర కాలువల నీటి విడుదల చేస్తామని ద్వారా అధికారులు తెలిపారు. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు పులిచింతలకు విపరీతమైన వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జిల్లాలోని మూడు ముండలాల్లో ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అలర్ట్ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నది పరీవాహకంలో నీటి ఉధృతి ఎక్కడి వరకు వస్తుందోనని రెవెన్యూ, పోలీసు అధికారులు అంచనా వేసి ముంపు గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న ప్రజలను దూర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ముంపు ప్రాం తాల్లో ఎవరైనా ఉంటే తరలివెళ్లాలని ఎస్పీ రావి రాల వెంటకటేశ్వర్లు ప్రకటన విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 2లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు పులిచింతల ప్రాజెక్టులో 1.01 టీఎంసీల నీరుంటే సామవారం అర్ధరాత్రి వరకు 17 టీఎం సీల వరకు ప్రాజెక్టులోకి నీరొచ్చింది. ప్రాజెక్టు పూర్థి స్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు. వరదతో ఒక్కరోజులోనే ఈప్రాజెక్టు నిండనుంది. దీంతో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టా ఆయకట్టులో రెండు పంటలకు నీళ్లు అందనున్నాయి. -
రేపు ఉదయం కృష్ణా డెల్టాకు నీటి విడుదల
సాక్షి, విజయవాడ : జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కృష్టాజిల్లా 31వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్థసారధి, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం 9.45 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. పంట దెబ్బతినకుండా ప్రతి రైతుకు నీరు అందిస్తామన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను కొనసాగిస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతం 70 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైతే కాలువలను పర్యవేక్షణ చేయాలని నాని కోరారు. -
ప్రకాశం బ్యారేజీకి ముప్పు!
ఈ ఫొటో చూశారా.. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్కు కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలోనే ఇసుకాసురులు ప్రొక్లెయిన్లతో కృష్ణా నదిలో ఇసుకను తవ్వేస్తున్న దృశ్యమిదీ.. బ్యారేజీలకూ.. బ్రిడ్జిలకు కనీసం 650 మీటర్ల దూరం వరకు నదిలో ఇసుకను తవ్వకూడదు. ఒకవేళ తవ్వితే బ్యారేజీకీ, బ్రిడ్జికీ ముప్పు తప్పదు. కానీ ప్రకాశం బ్యారేజీ.. రైల్వే బ్రిడ్జికి మధ్యన, కనకదుర్గ వారధి (జాతీయ రహదారిలోని రెండు వంతెనల) పక్కన కృష్ణానదిలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారనేందుకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. కృష్ణా నదీ గర్భంలో సీఎం చంద్రబాబు నివాసం అంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుక స్మగ్లర్లు చెలరేగిపోతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఇసుక తవ్వకంపై జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ) ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక తవ్వకానికి అడ్డుకట్ట వేయాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ రాష్ట్రసర్కారు ఏమాత్రం స్పందించడం లేదు. కృష్ణా నదిలో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోకపోగా ‘ముఖ్య’నేత కనుసన్నల్లో ముగ్గురు మంత్రులు ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన కృష్ణా నదిలో భారీ ఎత్తున ర్యాంపులు ఏర్పాటు చేసి.. ఇసుకను తవ్వేస్తూ వందలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటినిల్వ గరిష్టస్థాయిలో ఉండటం.. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి.. రైల్వే బ్రిడ్జికి మధ్యన ఉన్న ఇసుకపై స్మగ్లర్ల కళ్లు పడ్డాయి. ప్రకాశం బ్యారేజికి.. బ్రిడ్జికి మధ్య 800 నుంచి 900 మీటర్ల దూరం ఉంటుంది. ఈ మధ్యన నదిలో ఎలాంటి తవ్వకాలు జరపకూడదు. ఒకవేళ తవ్వకాలు జరిపితే అటు ప్రకాశం బ్యారేజీకి.. ఇటు బ్రిడ్జికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నదిలో ఇసుకను ప్రొక్లెయిన్లతో తవ్వకూడదని పర్యావరణ చట్టాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇసుక స్మగ్లర్లు ఇదేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న నేతల దన్నుతో వారు చెలరేగిపోతున్నారు. ప్రకాశం బ్యారేజీ ఆఫ్రాన్ నుంచి ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, భారీ లారీలను గత మూడు రోజులుగా నదిలోకి దింపుతున్నారు. ప్రొక్లెయిన్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. ఆఫ్రాన్ మీదుగా వాహనాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల ఆఫ్రాన్ దెబ్బతింటుందని జలవనరులశాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇదే అంశాన్ని తెలియజేస్తూ ప్రొక్లెయిన్లతో ఇసుక తవ్వకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చాయని.. దాంతో మిన్నకుండిపోయామని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యారేజీకి కేవలం 50 నుంచి 60 మీటర్ల దూరంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల.. భారీ వరదలు వస్తే బ్యారేజీకి ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. అక్రమార్జనకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే దుస్సాహసానికి పాల్పడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయి నీటి మట్టం
-
కృష్ణమ్మ పరవళ్లు !
భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజి నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు రావడంతో బ్యారేజి వద్ద అధికారులు 40 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. జలకళ సంతరించుకున్న కృష్ణానదిని కనులారా వీక్షించేందుకు ప్రజలు బ్యారేజి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నీటి ఉద్ధృతి కన్పించేలా సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు ఆసక్తి చూపుతున్నారు. సాక్షి, విజయవాడ : భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో బ్యారేజి నిండుకుండలా మారింది. 40 గేట్లు ఎత్తిన అధికారులు 29 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీరు దాటడంతో నాలుగు గేట్లను ఒక అడుగు ఎత్తు పైకి తీసి సముద్రంలోకి వర్షపు నీరు వదిలారు. ఆ తరువాత పెరుగుతున్న వరద ఉధృతికి అనుగుణంగా గేట్లను పెంచుకుంటూ వెళ్లారు. కాల్వలకు పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేశారు. మున్నేరు, కట్టలేరు, పాలేరు నుంచి వరద నీరు కృష్ణానదిలోకి వచ్చి చేరుతోంది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీరు మున్నేరు వద్ద ఉందని అధికారులు లెక్కిస్తున్నారు. కడలిలోకి ఒక టీఎంసీ నీరు.... ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు ఒక టీఎంసీ నీటిని సముద్రంలోకి వదిలి వేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పై నుంచి వస్తున్న వరద ఉధృతిని బట్టి రెండు రోజులు పాటు సముద్రంలోకి నీరు వదలాల్సి ఉంటుంది. వరద తీవ్రత మరింత పెరిగితే మరికొద్ది రోజులు కొనసాగిస్తామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగులు (3.07 టీఎంసీ) కంటే ఎక్కువ నీరు ఉండే అవకాశంలేనందున పై నుంచి వచ్చే నీరు తొలుత కాల్వలోకి, తరువాత సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మున్నేరు వాగు ఉధృతంగా పెరగడంతో పక్కనే ఉన్న పొలాలు నీట మునుగుతున్నాయి. నీటి ప్రవాహం మరింత పెరిగితే వందల ఎకరాలు నీట మునిగిపోయే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా వరదనీటిని వడిసి పట్టేందుకు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కాల్వలకు 11,500 క్యూసెక్కుల నీరు విడుదల ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు పూర్తిస్థాయి సాగునీరు విడుదల చేస్తున్నారు. కాల్వల ద్వారా 11,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరు రైతులకు ఉపయోగపడేది లేదు. ఒకవైపు శనివారం ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో కాల్వలపై రైతులు ఏ మాత్రం ఆధారపడటం లేదు. ప్రజలను అప్రమత్తం చేశాం... మున్నేరు, కట్టలేరు నుంచి వచ్చే వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి దాటిన బ్యారేజ్ దిగువకు వదిలివేస్తున్నారు. సముద్రంలోకి నీరు వదిలేడప్పుడు ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. 68 కిమీ దూరంలో ఉన్న హంసలదీవి వద్ద సముద్రంలో వరద నీరు కలవాలంటే సుమారు లక్ష క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంటుంది. -సతీష్కుమార్, చీఫ్ ఇంజినీరు, జలవనరులశాఖ -
శివస్వామి పాదయాత్రకు అనుమతి లేదు
-
ప్రకాశం బ్యారేజ్పై నుంచి దూకేశాడు..!
సాక్షి, విజయవాడ: ఓ విద్యార్థి ఆదివారం ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటి నుంచి నేరుగా బ్యారేజి వద్దకు చేరుకున్న అతను ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. నదిలోకి దూకిన వ్యక్తి నాగూర్గా పోలీసులు గుర్తించారు. అతను నదిలోకి దూకుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృష్ణా నదిలో స్పీడ్ బోటుల ద్వారా నాగూర్ను గాలించి పట్టుకున్నారు. అప్పటికే నాగుర్ బాగా నీళ్లు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనికి ప్రాథమిక వైద్యం అందించి.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగూర్ ప్రాణాలు విడిచాడు. -
నదిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
విజయవాడ : ఆ యువతికి ఏమి కష్టమచ్చిందో ఏమో గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయచింది. స్థానిక సిబ్బంది అప్రమత్తమై ఆమెను కాపాడారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒక యువతి ప్రకాశం బ్యారేజీపై అటూఇటూ తిరుగుతూ ఒక్కసారిగా 65వ కానా వద్దకు వచ్చి నదిలోకి దూకింది. అయితే ఆమె బ్యారేజీ గేట్లపై పడింది. ఈ ఘటనను సీసీ కెమెరాలో చూసిన పోలీసు కంట్రోల్ సిబ్బంది వన్టౌన్ పోలీస్స్టేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ ఫణి, హోంగార్డ్ వెంకటేశ్వరరావు అప్రమత్తమై 65వ కానా వద్దకు చేరుకొన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి ఆమెను రక్షించి బయటకు తీసుకొచ్చారు. నదిలో దూకిన యువతి నీటిలో కాకుండా ఇనుప గేటుపై పడటంతో కాలికి తీవ్ర గాయమైంది. తన పేరు మాటూరి జయ అని, తండ్రి పేరు కృష్ణారావు అని, తమ ఊరు పాల్వంచ అని చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. సీఐ కాశీవిశ్వనాథ్ సిబ్బందిని పర్యవేక్షించారు. -
వృద్ధురాలిని ఇలా కాపాడారు..
* కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం * పోలీసుల సొంత ఖర్చులతో వైద్యం ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలిని మత్స్యకారులు కాపాడగా... పోలీసులు వెంటనే స్పందింది ఆమెకు తక్షణ వైద్యం అందించి కోలుకునేట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం బ్యారేజి కృష్ణానది ఎగువ ప్రాంతం జీరో పాయింటు వద్ద గురువారం ఓ వృద్ధురాలు నీటిలో దూకింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అనంతరం సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని వైద్యం నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సొంత ఖర్చులతో వైద్యం చేయించారు. రెండు మూడు గంటలసేపు ఆ వృద్ధురాలికి∙ సేవలు అందించారు. ఆమె కోలుకున్న తరువాత వివరాలు అడిగితే చెప్పేందుకు నిరాకరించింది. ఎలాగోలా ఆమెను బతిమిలాడి, భోజనం పెట్టి, బంధువుల వివరాలు అడిగేందుకు పోలీసులు ప్రయత్నించినా వృద్ధురాలు మాత్రం నోరు విప్పలేదు. పేరు కూడా విచిత్రంగా ‘అమ్మోరు’ అని చెప్పిందని అన్నారు. బస్సు టికెట్ ఆధారంగా ఆమె బందరు నుంచి వచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. సాయంత్రం వరకు ఆ వృద్ధురాలికి సేవలు అందించిన పోలీసులు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నులకపేటలోని మేరీ హౌస్కు తరలించారు. -
ప్రకాశం బ్యారేజీకి కొత్తందాలు
-
వరద ఉధృతి తగ్గుముఖం
మున్నేరు నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి పెరిగిన సందర్శకులు రెండు రోజులుగా నిండుకుండలా కనిపించిన కృష్ణానదిలో నీటిమట్టం తగ్గుతోంది. వరద ఉధృతి నెమ్మదించడంతో పులిచింతల ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గింది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ దిగువకు వదిలే నీటిని తగ్గించారు. ప్రస్తుతానికి మూసీ నది నుంచి మాత్రమే కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మూసి వరద తగ్గుముఖం పడితే యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది. సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆదివారం తగ్గుముఖం పట్టింది. 1.33 లక్షల క్యూసెక్కులు వచ్చే నీరు 1,01,222 క్యూసెక్కులకు పరిమితమైంది. శనివారం బ్యారేజీ దిగువకు 1.50 లక్షల క్యూసెక్కులు వదలగా.. ఆదివారం కేవలం 93,240 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు. కాల్వలకు 7,982 క్యూసెక్కులు వదలిపెట్టారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను రెండడుగుల ఎత్తుకు పరిమితం చేశారు. మున్నేరు నుంచి శనివారం 60 వేల క్యూసెక్కుల వరద నీరు రాగా.. ఆదివారం 25 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సోమవారం సాయంత్రానికి వరద ఉధృతి మరింత తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. పెనుగంచిప్రోలు, వేదాద్రి, ముక్త్యాలల్లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘాట్లకు సందర్శకుల తాకిడి.. ఆదివారం సాయంత్రం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు సెలవు కూడా కావడంతో ప్రకాశం బ్యారేజీకి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. సాధారణ రోజుల్లో బ్యారేజీ దిగువన ఇసుక తిన్నెలు మాత్రమే దర్శనమిస్తుంటాయి. అలాంటిది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సముద్రం వైపు దూసుకుపోవడాన్ని ప్రజలు తిలకించి పులకించారు. బ్యారేజీపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ పోలీసులు వాహనాలను నిలవనివ్వలేదు. దీంతో పద్మావతి ఘాట్, కృష్ణవేణì , దుర్గా, పున్నమి ఘాట్ల వద్దకు సందర్శకులు వెళ్లారు. చిరు వ్యాపారాలు జోరుగా సాగాయి. భవానీ ద్వీపానికి తగ్గిన సందర్శకులు కృష్ణానదికి వరద తాకిడి ఎక్కువగా ఉండడంతో భవానీ ద్వీపానికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. వదరల కారణంగా నదిలోకి వెళ్లేందుకు ఆసక్తి కనపరచలేదు. నదిలో బోటింగ్ య«థావిధిగా సాగుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం ఒకడుగుడు వెనక్కి వేశారు. సాధారణంగా వారాంతంలోను, సెలవు రోజుల్లోనూ 2,500 మంది ద్వీపానికి వస్తారు. ఆదివారం మాత్రం ఐదారు వందలకు మించి రాలేదు. బోటింగ్ ద్వారా పర్యాటక సంస్థకు రూ.లక్ష ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 35 వేలకే పరిమితమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
జనాలకు చుక్కలు చూపిస్తున్న మంత్రులు
-
నీట మునిగిన పులిచింతల
-
నీట మునిగిన పులిచింతల
గుంటూరు : ఊహించినట్లుగానే గుంటూరు జిల్లాలోని పులిచింతల నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్ట్కు నీటిమట్టం పెరగటంతో కోళ్లూరు గ్రామం కూడా పూర్తిగా జలమయం అయ్యింది. బెల్లంకొండ మండలంలోని ముంపు గ్రామాలైన గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా, బోదనం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టులో 10.30 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 46.5 టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తి అయిన దానిని బట్టి 11 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు టీఎంసీల నీరు వస్తే తెలంగాణలో నాలుగు గ్రామాలకు ముంపు వాటిల్లే ప్రమాదం ఉంది. కాగా గ్రామాల్లోకి వచ్చేస్తున్న నీరు ఇప్పటికే పంట పొలాలను ముంచెత్తుతోంది. ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పైరు వరద నీటికి మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పులిచింతలకు భారీగా వరద నీరు
గుంటూరు: పులిచింతల ప్రాజెక్ట్ భారీగా వరద నీరు చేరుతోందని ఆ ప్రాజెక్ట్ ఇంచార్జ్ ఎస్ ఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పులిచింతలలో 10.29 టీఎంసీల నీటి నిల్వ ఉందని, ఎగువ నుంచి పులిచింతలకు 30 వేల క్యూసెక్కుల నీరు చేరుతోందిని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి 15300 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని, మరో 2 టీఎంసీల నీరు చేరితే తెలంగాణలోని 4 గ్రామాలకు ముంపు బెడద ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్ట్ లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్న ఇంచార్జ్ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. -
పసికందును కృష్ణానదిలోకి విసిరి..
తాడేపల్లి రూరల్, న్యూస్లైన్: ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో కానీ నవమాసాలు కడుపున మోసి, కని, ఐదు నెలలు అల్లారుముద్దుగా పెంచి, అన్నప్రాసన చేయాల్సిన సమయంలో కన్నబిడ్డను ప్రకాశం బ్యారేజి పైనుంచి అమాంతం కృష్ణానదిలోకి విసిరేసింది. ఒక్క మగ్గు నీళ్లు నెత్తిన పడితేనే ఉక్కిరి బిక్కిరవుతారు పసిబిడ్డలు. అట్లాంటిది 30 అడుగులు ఎత్తు నుంచి గాలిలో తేలుతూ, పడుతూ లేస్తూ అమాంతం నీళ్లలో పడి అడుగుకు చేరిన ఓ పసికందు.. మానవత్వం పరిమళించిన ఓ ఆటో డ్రైవర్ సాహసం పుణ్యమా అంటూ మృత్యుంజయురాలైంది. బిడ్డకు భయమేస్తే లాలించి హత్తుకుని అక్కున చేర్చుకునే అమ్మ ఉలుకు పలుకులేకుండా పడిపోయి కనిపించింది. ఆదివారం మిట్టమధ్యాహ్నం ప్రకాశం బ్యారేజిపై జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఏం జరిగిందేంటే.. గుంటూరుకు చెందిన లింగాల నాగసుజాత. కన్నబిడ్డకు మురిపెంగా ‘ఆకాంక్ష’ అనే పేరు పెట్టుకుంది. ఏకాంక్ష తీరకుండానే ఆ బిడ్డను ఆదివారం కృష్ణానదిలోకి విసిరేసింది. బిడ్డను కృష్ణానదిలోకి విసిరేయడం చూసిన ఆటోడ్రైవర్ పోతినేని మురళీకృష్ణ ఆటోను ఆపి అమాంతం నీళ్లలో దూకి, బిడ్డను రక్షించాడు. ఈ లోగానే తల్లి నాగసుజాత కూడా ఎగిరి కృష్ణానదిలో దూకింది. ఆమెను రక్షించేందుకు అటుగా వెళుతున్న ఎం.విజయకుమార్ అనే యువకుడు నదిలోకి దూకాడు. ఎంతో ప్రయాసపడి నీట మునిగిన ఆమెను రక్షించి, బ్యారేజి గేట్లపైకి చేర్చాడు. కేర్ కేర్ మంటూ ఏడుస్తున్న బిడ్డ ఒకవైపు, నీళ్లు తాగి కోమాలోకి వెళ్లిన తల్లి మరోవైపు... ఇలా.. రెండు గంటలపాటు ఇద్దరు యువకులు తాము రక్షించిన తల్లీబిడ్డలతో బ్యారేజి గేట్లపైనే సహాయం కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక జాలర్ల సహాయంతో వారిని పైకి తీసుకువచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాగసుజాత భర్త పవన్ ఆస్పత్రికి వచ్చి ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకున్నాడు. పుట్టింటికంటూ ఉదయం 9 గంటలకు తన భార్య బిడ్డతో సహా బయటకు వచ్చిందని, ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో తెలియదని అంటున్నాడు పవన్. నాగసుజాత చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే కీచులాటలు తప్ప పెద్ద గొడవలేం లేవనేది అతని వాదన. సుజాత స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదు. -
కృష్ణాడెల్టాకు తీవ్ర అన్యాయం
మచిలీపట్నం, న్యూస్లైన్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారయింది కృష్ణాడెల్టా ఆయకట్టు రైతు పరిస్థితి. డెల్టాలో వ్యవసాయం 60శాతం సాగునీటి ద్వారానూ, 40శాతం వర్షాధారంగానూ జరుగుతుంది. జిల్లాలో వరిసాగుకు సకాలంలో నీరు అందకపోవటంతో సెప్టెంబరులోనూ వరినాట్లు వేస్తున్నారు. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండే వరకు కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టులు నిండాక ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి, కాలువలకు ఒకేసారి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వృథాగా పోతున్న నీటిలో దాదాపు 50 టీఎంసీలను మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో సముద్రం పాలు చేయాల్సి వచ్చింది. నీటిపారుదలశాఖ మంత్రి తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కావటంతో పాటు ఈశాఖలో పనిచేస్తున్న 38 మంది ఉన్నతాధికారుల్లో 28 మంది తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే కావటంతో డెల్టాకు నీరు విడుదల చేయకుండా తొక్కిపట్టారనే వాదన వినిపిస్తోంది. కృష్ణాడెల్టాకు ప్రథమ వినియోగ హక్కుగా ఉన్న కృష్ణా జలాలను దిగువకు వదలకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరించడంతో డెల్టాకు సాగునీటి విడుదలలో 20 రోజులు ఆలస్యంగా జరిగిందనే వాదన వినిపిస్తోంది. కృష్ణాడెల్టాలో ఏడాదికి రెండు పంటలు పండిస్తారని చెప్పేవారు సముద్రతీర ప్రాంతంలోని మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని రైతులు చెబుతున్నారు. సెప్టెంబరులోనూ వరినాట్లు వేస్తుండటంతో డిసెంబరు నెలాఖరు నాటికి వరికోతలు పూర్తవుతాయని రైతులు చెబుతున్నారు. రెండో పంటకు నీరిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. రెండో పంటకు నీరు ఇవ్వకుంటే మినుము సాగు చేయాల్సి ఉంటుంది. డిసెంబరు నెలాఖరులో మినుములు విత్తితే ఈ ప్రభావం రెండో పంటపైనా పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువల సామర్థ్యం తక్కువయినందునే... ఈ ఏడాది ఖరీఫ్లోనే మలి వేసవిని తలపిస్తూ ఉష్ణాగ్రతలు నమోదవుతుండటంతో సాగునీటి వినియోగం అన్ని ప్రాంతాల్లో అధికమైంది. ఒక రోజు పొలానికి పూర్తి స్థాయిలో నీరు పెట్టినా తెల్లారేసరికి ఆ నీరు ఇంకిపోవడంతో మళ్లీ అదే పొలానికి నీటిని పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎగువ ప్రాంత రైతులు సాగునీటి వినియోగాన్ని పెంచడంతో దిగువకు చుక్కనీరు రాని దుస్థితి నెలకొంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతున్నా కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకోవడానికి పాలకులు 20 రోజులపాటు జాప్యం చేయడంతో ఈ ప్రభావం వరిసాగుపై ప్రధానంగా పడుతోంది. ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు వచ్చినా ఆ నీటిని పూర్తి స్థాయిలో పొలాలకు వదలక పోవడానికి కాలువలు కుంచించుకుపోవడమేననే వాదన వినిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీనుంచి అన్ని కాలువలకు కలిపి రోజులకు 10,300 క్యూసెకుల నీటిని విడుదలచేస్తే సరిపోతుందని, అయితే కాలువల సామర్థ్యం తక్కువగా ఉండటంతో నీటి విడుదలను తగ్గించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది వర్షాధారంగానే నీటి విడుదల... గత ఏడాది నాగార్జునసాగర్నుంచి నీటిని సకాలంలో విడుదల చేయకున్నా వర్షాలు సక్రమంగా కురవడంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఉపనదులు, వాగుల ద్వారా వచ్చిన నీటిని పొదుపుగా కాలువలకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 2012 జూన్, జూలై, ఆగస్టు నెలలల్లో సాధారణ వర్షపాతం 521.2 మిలీమీటర్లు కాగా 729.8 మిలీమీటర్లుగా నమోదైంది. 2013 జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ వర్షపాతం 521.2 మిల్లీమీటర్లు కాగా 575.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 154 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదైంది. ఖరీఫ్ సీజన్లో దాదాపు 6.37 లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటి విడుదల అరకొరగానే మారింది. గత ఏడాది ఆగస్టు20వ తేదీ నాటికి జిల్లాలో వరినాట్లు పూర్తికాగా ఈ ఏడాది సెప్టెంబరు 3వ తేదీ నాటికి 5.87 లక్షల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి. ఇంకా 50వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేయాల్సి ఉంది. 50 టీఎంసీల నీరు సముద్రం పాలు... కృష్ణా డెల్టాకు ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు సుమారుగా 80 టీఎంసీల నీరు ఇస్తే సరిపోతుంది. అయితే అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపు 50 టీఎంసీలకు పైగా నీటిని ఈ ఖరీఫ్సీజన్లో సముద్రంలోకి వదిలివేశారు. కాలువ శివారున ఉన్న బందరు, కోడూరు, నాగాయలంక, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో ఇంకా వరినాట్లు పూర్తి కాలేదు. కాలువల సామర్థ్యం సరిపడినంతగా లేకపోవడంతో ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆగస్టులోనే వారాబందీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణాడెల్టా పాకిస్తాన్లో ఉన్నట్లుగా భావించి పాలకులు కత్తికట్టి నీటి విడుదలలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.