రాజాధిరాజ వాహనంపై నారసింహుడు
మంగళగిరి/ మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై దర్శనమిచ్చా రు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయు డు కళావేదికలో భక్తి గీతాలు, కూచిపూడి నృత్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించగా కైంకర్యపరు లుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు. స్వామివారు ఆదివా రం రాత్రి యాలివాహనంపై దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment