
బాపట్ల
బుధవారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
నిజాంపట్నం: అడవులదీవి గ్రామంలో వేంచేసియున్న అనంత సాయిబాబా మందిర 15వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. బాబాకి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు.
రేపు బ్రహ్మంగారి ఆరాధన తిరునాళ్ల
కర్లపాలెం: ఏట్రవారిపాలెంలో పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన తిరునాళ్లు గురువారం జరుగుతాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంగళవారం తెలిపారు.
శిలువ పాదయాత్ర
నాదెండ్ల: ఇర్లపాడు విచారణ ఆర్సీఎం సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గ్రామం నుంచి కనపర్రు బాలయేసు పుణ్యక్షేత్రం వరకు శిలువ పాదయాత్ర నిర్వహించారు.
చీరాల: ముఖ్యమంత్రి హోదాలో రెండోసారి బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబునాయుడు ప్రజలను నిరుత్సాహపర్చాడు. గతంలో జిల్లాకు ఇచ్చిన హామీల గురించిగానీ, పరిశ్రమల స్థాపన గురించిగానీ ప్రస్తావించకుండా పొంతన లేని మాటలు చెప్పి వెళ్లారు. వచ్చాడు...వెళ్లాడు అనే చందంగా సాగింది సీఎం పర్యటన. పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో మంగళవారం పింఛన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. తీరప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేసి తద్వారా పరిశ్రమలను తీసుకువచ్చి వెనుకబడిన బాపట్ల జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని జిల్లాప్రజలు ఆశించారు. చివరకు ఎమ్మెల్యే ఏలూరి సైతం షిప్ బ్రేకింగ్, షిప్ బిల్డింగ్ యూనిట్లు పెట్టా లని కోరినప్పటికీ గట్టి హామీ ఇవ్వలేకపోయారు. చీరాల్లో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఫిషింగ్ హార్బర్ నిధులు, నిర్మాణం గురించి ఊసే ఎత్తలేదు. బంగారు కుటుంబం, మార్గదర్శులు కావాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారే తప్ప ప్రభుత్వం నుంచి పరిశ్రమల ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. సెల్ఫోన్ నేనే తెచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే ఏలూరి ఎత్తిపోతల పథకాలు లేకపోవడం వలన రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తే చంద్రబాబు మాత్రం తాను అన్నీ బాగు చేసి వెళ్తే వచ్చే వారు మళ్లీ చెడగొట్టి వెళ్తున్నారని అనడం చూస్తే ఆయనకు మళ్లీ అధికారంలోకి వస్తారో....లేదో...అనే అనుమానం ఉన్నట్లు సభకు హాజరైన వారు చర్చించుకోవడం విశేషం. పేదరికంలేని సమాజాన్ని చూపించేందుకు 2029లో కృషి చేస్తానన్నారు. 12.40 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు సమావేశం మధ్యాహ్నం 2.45 గంటల వరకు బోరుగా సాగింది. గత ప్రభుత్వం అప్పులు ఇచ్చి వెళ్లింది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా కానీ సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని ప్రతి సభలో చెప్పిన విధంగానే చినగంజాం సభలో చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆరోగ్యం లేకపోయినా మీటింగ్కు రండి
కేవలం వ్యాపారవేత్తలకు, బడా వ్యక్తులకు పేదలను దత్తత పంపేందుకే, బడా వ్యాపారవేత్తలు పేదలకు ఏవిధంగా ఆర్థిక చేయూతనివ్వాలో తెలిపేందుకు సభ నిర్వహించారా అని ప్రజలు చర్చించుకున్నారు. పింఛన్ల పంపణీలో భాగంగా ఎల్లావుల వెంకాయమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. ఆమె కూతురు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా సీఎం చంద్రంబాబు ఆ కుటుంబాన్ని మీటింగ్కు రావాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆలయంలో పూజలు
కొత్తగొల్లపాలెంలో ఉన్న దేవాలయంలో చంద్రబాబు పూజలు చేశారు. పూజారైన పెద్దగొల్లను మీటింగ్కు వద్దకు రావాలని చంద్రబాబు పిలవడం ఆసక్తిగా అనిపించింది.
యువకుడికి వార్నింగ్
ఒక యువకుడు సీఎం సార్ ప్లీజ్ అంటూ ఫ్లకార్డు, అర్జీ పట్టుకోగా కడుపు నొప్పిగా ఉందా....సమస్య ఉంటే నేరుగా రా....చిల్లర వేషాలు వేస్తే ట్రీట్మెంట్ ఇస్తా అని చంద్రబాబు అన్నారు.
ప్రజాధనం వృథా
చంద్రబాబు ఊకదంపుడు ప్రసంగం మినహా ప్రజాసేవ, ప్రజావేదిక వలన జరిగిన ప్రయోజనం మాత్రం లేదని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం నలుగురికి పింఛన్లు పంపిణీ చేసేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం చంద్రబాబుకు తగునా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సమస్యలు ప్రస్తావించని ఎంపీ
బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా కేవలం చంద్రబాబు వలనే తాను ఎంపీగాను, లోక్సభ ప్యానల్ స్పీకర్గా పనిచేస్తున్నానని చెప్పుకున్నారు.
సూపర్ సిక్స్ ప్రస్తావనే లేదు
7
న్యూస్రీల్
పాఠశాలలు ఒక్కపూటే పనిచేయాలి
గుంటూరుఎడ్యుకేషన్: జిల్లాలోని వివిధ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారం తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యా దులు అందుతున్నాయని డీఈఓ సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవే టు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ యాజమాన్యాలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకే తరగతులు నిర్వహించాలన్నారు.
నేను బాగుచేస్తాను..
మళ్లీ వచ్చినోళ్లు చెడగొడుతున్నారు
పథకాలపై స్పష్టమైన
హామీల్లేని ప్రసంగం
ఎత్తిపోతల పథకాల గురించి
పట్టించుకోని సీఎం
మూడు గంటలు సాగిన బాబు పర్యటన
కేవలం పింఛన్ల పెంపుదల చేసింది....పేదలకు 20 రకాలైన పింఛన్లు అందిస్తున్నాని చెప్పడమే కానీ సూపర్ సిక్స్ పథకాలు గురించి కానీ, ఉచిత బస్సుకానీ, మహాలక్ష్మి పథకం కానీ ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో ప్రజలు నిరాశ పడ్డారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు..జిల్లాకు మంచి వరాలు....పేద ప్రజలకు సంక్షేమ పథకాల గురించి గొప్ప హామీలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశించిన ప్రజలు సీఎం చంద్రబాబు ప్రసంగంతో భంగపాటుకు గురయ్యారు.

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల

బాపట్ల