ఖమ్మంస్పోర్ట్స్: ఆల్ ఇండియా ర్యాంకింగ్ పురుషుల టెన్నిస్ పోటీలు సోమవారం నుంచి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ర్యాంకింగ్లో నిలిచిన 32 మంది హాజరు కాగా క్వాలిఫయింగ్ పోటీల్లో మరో 13 మంది క్వాలిఫై కావడంతో వారికి నాకౌట్ మ్యాచ్లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, రూ.2.50 లక్షలకు పైగా నగదు బహుమతులు అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు. మూడు టెన్నిస్ కోర్టులు సిద్ధం చేశామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment