శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకల ఏర్పాట్లపై గురువారం ఉదయం 11 గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని రకాల వసతి, సౌకర్యాల కల్పనకు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు.
జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందన
కొత్తగూడెంటౌన్: ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు గుంటూరులో జరగనున్న ఆర్చరీ నేషనల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. పోటీలకు ఎంపికై న ఎం.విక్రమ్ (కొత్తగూడెం), పి.హరీష్(పాల్వంచ), క్రాంతి వర్మ(సుజాతనగర్) ఐడీఓసీలో బుధవారం కలెక్టర్ను కలిశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పి.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment