పాల్వంచరూరల్: లారీని ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనం పైనుంచి యువకులు కిందపడి గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథపురానికి చెందిన కార్తీక్, గోపీచంద్ కలిసి ద్విచక్రవాహనంపై రంగాపురం వైపు వెళ్తున్నారు. ఆర్టీఏ చెక్పోస్టు సమీపంలో నాగారంకాలనీ వద్ద బీసీయం జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment