యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Fri, Mar 7 2025 12:15 AM | Last Updated on Fri, Mar 7 2025 12:13 AM

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

ఇల్లెందురూరల్‌: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ నిజాంపేటకు చెందిన వర్స సాగర్‌ (30) గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన యువతితో సాగర్‌కు రెండు నెలల కిందట వివాహమైంది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటివద్ద ఒంటరిగా ఉన్న సాగర్‌ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంట్లో వేలాడుతున్న సాగర్‌ను చూసి కిందకు దించారు. అప్పటికే సాగర్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement