మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

Published Sat, Mar 22 2025 12:08 AM | Last Updated on Sat, Mar 22 2025 12:07 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు మతసామరస్యానికి ప్రతీక అని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కలెక్టర్‌కు ఖురాన్‌ను బహూకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, సీపీఓ సంజీవరావు, డీపీఆర్‌ఓ అజ్గర్‌హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement