ఫెడ్‌ భయం,  ఫ్లాట్‌గా సూచీలు | After Three Straight Days Of Sell Off Sensex Nifty turns flat | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ భయం,  ఫ్లాట్‌గా సూచీలు

Published Wed, Jun 15 2022 10:31 AM | Last Updated on Wed, Jun 15 2022 10:31 AM

After Three Straight Days Of Sell Off Sensex Nifty turns flat - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 78 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 15,725 వద్ద  ట్రేడింగ్‌ను ఆరంభించాయి.   మూడు  రోజుల భారీ నష్టాల తరువాత ప్రస్తుతం కీలక సూచీలు స్వల్ప లాభాలతో  కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 65 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 

యూఎస్‌ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు, ఆందోళన, ప్రపంచ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి.  హింద్‌మోటార్స్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌, అదానీ పవర్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్,బజాజ్ ఆటో లాభాల్లోనూ, టాటా స్టీల్, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్రిటానియా టాప్ లూజర్‌లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement