Flat
-
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గిన డిమాండ్
తెల్లారింది లేచామా.. ఆఫీసుకు వెళ్లామా.. రాత్రికి ఎప్పుడో ఇంటికి చేరుకున్నామా.. మరుసటి రోజు మళ్లీ సేమ్ టు సేమ్.. ఇదే నగరవాసి జీవితం.. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేదతీరేందుకే గూడు. ఇదంతా కరోనాకు ముందు.. కరోనా వచ్చి సగటు మనిషి ప్రపంచాన్నే మార్చేసింది. కేవలం తినడం, పడుకోవడమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ ఇంటి నుంచే కావడంతో ఒకప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన స్టూడియో అపార్ట్మెంట్లకు క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంగా విశాలమైన గృహాలు, ఫ్లాట్స్కు గిరాకీ పెరిగిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. గతేడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్లు స్టూడియో అపార్ట్మెంట్లున్నాయి. 19 శాతానికి స్టూడియో ప్రాజెక్ట్లు.. 2013 నుంచి 2019 మధ్య స్టూడియో అపార్ట్మెంట్ల ట్రెండ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2013లో ఏడు ప్రధాన నగరాల్లో 2,102 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. ఇందులో 4 శాతంతో 75 ప్రాజెక్ట్లు స్టూడియో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అలాగే 2014లో 151, 2015లో 190, 2016లో 128, 2017లో 197, 2018లో 446 స్టూడియో ప్రాజెక్ట్లు లాంచ్ అయ్యాయి. 2019లో 1,921 ప్రాజెక్ట్లు ప్రారంభం కాగా.. 19 శాతం వాటాతో 368 ప్రాజెక్ట్లు స్టూడియో అపార్ట్మెంట్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచ్లర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వీటికి విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాల చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కానీ, కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు.మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాల్లో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాల్లో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. గతేడాది హెచ్–1లో ఏడు నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్ల్లో.. 71 ప్రాజెక్ట్లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణెలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్లు లాంచ్ అయ్యాయి. -
ఖరీదైన ఫ్లాట్ను అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లు లాభమంటే?
బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన ఫ్లాట్ను అమ్మేశారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో ఖరీదైన డ్యూప్లెక్స్ ఫ్లాట్ను విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని ప్రముఖ రియాల్టీ సంస్థ స్క్వేర్యార్డ్స్ వెల్లడించింది. ఆ ఫ్టాట్ దాదారు 5 వేలకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపింది.అమితాబ్ బచ్చన్ ఈ ఫ్లాట్ను ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ప్రాంతంలోని తన డ్యూప్లెక్స్ ఫ్లాట్ను ఈనెల 17న వ తేదీన విక్రయించారు. ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు.కాగా.. అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎస్టేట్లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎస్టేట్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాటిలో ప్రధానందగా నివాస సముదాయాలతో పాటు వాణిజ్య స్థలాలు ఓషివారా, మగాథనే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో ఉన్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్పతి రియాలిటీ షోకు హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు. -
రూ. 31 లక్షలు ఖర్చుపెట్టి మరీ యూట్యూబర్ ప్రయోగం : ఎందుకో ఊహించలేరు
భూమి ఫ్లాట్గా ఉందని నిరూపించడానికి యూట్యూబర్ అత్యంత సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా రూ. 31 లక్షలతో యాత్ర చేశాడు. చివరికి ఏమైంది? ఆసక్తిగా ఉంది కదూ. పదండి అసలేమైందో ఈ కథనంలో తెలుసుకుందాం.భూమి బల్లపరుపుగా లేదా ఫ్లాట్గా ఉంటుందని గట్టిగా వాదన ఇప్పటిది కాదు. అయితే ఫ్లాట్గా ఉంటుందని గట్టిగా నమ్మేవాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఫ్లాట్ ఎర్త్ సిద్ధాంతాలపై పేరుగాంచిన యూట్యూబర్ జెరన్ కాంపనెల్లా (Jeron Campanella) భూమి ఆకారం గుండ్రంగా లేదు అని తేల్చాలను కున్నాడు. తన వాదనలను ధృవీకరించడానికి అంటార్కిటికాకు రూ. 31.4 లక్షల (37,000 డాలర్లు) ఖర్చుతో కూడిన యాత్ర చేశాడు.NEW: Flat Earther travels all the way to Antarctica to prove that the Earth is flat only to find out that it's not.Lmao.Flat Earth YouTuber Jeran Campanella went on a $35,000 trip to prove that there was "no 24-hour sun.""Sometimes you are wrong in life and I thought there… pic.twitter.com/8jvLWawB2J— Collin Rugg (@CollinRugg) December 18, 2024తన ప్రయాణానికి ముందు, కాంపనెల్లా అంటార్కిటికాలో ఉదయాస్తమాలు లేకుండా సూర్యుడు 24 గంటలూ ఉంటాడనే సిద్ధాంతాన్ని నమ్మలేదు. దక్షిణ ఖండానికి అతని పర్యటన ఈ నమ్మకాలను బద్దలు కొట్టింది.కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలో తన నమ్మకాన్ని పరీక్షించడానికి కాలిఫోర్నియా(California) నుంచి దాదాపు 14,000 కిలోమీటర్లు ప్రయాణించి అంటార్కిటాకు చేరాడు. అక్కడ మిడ్నైట్ సన్ని చూసి షాక్ అయ్యాడు. “అంటార్కిటికా ఓ మంచు గోడ, సూర్యుడు రోజూ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు” అన్న తన నమ్మకం నిజంకాదని తేల్చుకున్నాడు. "కొన్నిసార్లు జీవితంలో తప్పు చేస్తాం," అంటూ కాంపనెల్లా తన పర్యటన తర్వాత ఒక వీడియోను షేర్ చేశాడు. తన తప్పును అంగీకరిస్తూ, ఫ్యాన్స్కు వివరణ ఇచ్చాడు "ఇలా చెప్పినందుకు నన్ను షిల్ అని పిలుస్తారని నాకు తెలుసు. అయినా నష్టంలేదు, నిజాయితీగా ఉండటం ముఖ్యం" అంటూ అసలు విషయాన్ని అంగీకరించాడు.ట్విస్ట్ ఏంటంటే...తన ఫ్లాట్ ఎర్త్ మ్యాప్ తప్పని తేలిందని అంగీకరించిన కాంపనెల్లా చేసిన మరో ప్రయోగం కూడా ఉంది. కాంపనెల్లా ప్రయాణం కొలరాడో పాస్టర్ విల్ డఫీ నేతృత్వంలోని ‘ది ఫైనల్ ఎక్స్పెరిమెంట్’ అనే కార్యక్రమంలో భాగమే ఈ పర్యటన. భూమి ఫ్లాట్గా ఉందని నమ్మే నలుగురు మిడ్నైట్ సన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అంటార్కిటికాకు వెళ్లారు. చివరికి భూమి గోళాకారమని శాస్త్రీయంగా నిరూపించారు. ‘‘ఈ ప్రయోగంతో భూమి ఫ్లాట్గా ఉందనే వాదనకు ముగింపు పలకవచ్చు”అని డఫీ ధీమాగా చెప్పారు. దీంతో భూమి ఆకారాన్ని దాచడానికి ఎవరినీ అనుమతించరని ప్రచారంలో ఉన్న వాదనలకు కూడా చెక్పడింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా అంటార్కిటికాను సందర్శించవచ్చని తేలింది.భూమి గోళాకారంలో అనడానికి నిదర్శనంగా అంటార్కిటికాలో దక్షిణ వేసవిలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ వేసవిలో సూర్యుడు 24 గంటలూ కనిపిస్తాడు. ఈ దృగ్విషయం, ధ్రువ ప్రాంతాలకు ప్రత్యేకమైనది. కాగా గతంలో భూమి గుండ్రంగా లేదని, బల్లపరుపుగా ఉందని నమ్మే ఓ అమెరికన్ పైలట్ తన అభిప్రాయం నిజమని నిరూపిస్తానంటూ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టిన సంగతి గుర్తుందా? సొంతంగా తయారు చేసిన ఆవిరితో ప్రయాణించే రాకెట్ ద్వారా యాత్ర చేపట్టాడు. కానీ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో 64 ఏళ్ల 'మ్యాడ్' మైక్ హ్యూజ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. -
ఎవరీ 'రిషి పార్టి'.. ఏకంగా రూ.190 కోట్ల ప్లాట్ కొన్నాడు
హర్యానాలోని గురుగ్రామ్ ఇప్పుడు లగ్జరీ ప్రాపర్టీ మార్కెట్ విభాగంలో.. ముంబై, బెంగళూరులతో పోటీ పడుతోంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కామెలియాస్లో వ్యాపారవేత్త 'రిషి పార్టి' (Rishi Parti) ఏకంగా రూ. 190 కోట్లు చెల్లించి.. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ఇంతకీ రిషి పార్టీ ఎవరు? ఆయనకు సంబంధించిన కంపెనీలు ఏవి? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ రిషి పార్టి?ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఫైండ్ మై స్టే ప్రైవేట్ లిమిటెడ్, ఇంటిగ్రేటర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సహా నాలుగు కంపెనీలకు 'రిషి పార్టి' డైరెక్టర్. అయితే ఎక్కువగా ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్పై ద్రుష్టి సారిస్తున్నారు. అంతే కాకుండా ఈయన ఏంజెల్ ఇన్వెస్టర్గా ఉన్నారు.ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ఇన్ఫో-ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది లాజిస్టిక్స్కు సంబంధించిన కంపెనీ. ఇది 2001లో ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లాజిస్టిక్స్ కంపెనీలలో కొత్తదనానికి మార్గం వేస్తోంది. రిషి పార్టి దీనిని 24ఏళ్ల వయసులో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ప్రారభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీలో 150 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. -
అపార్ట్మెంట్ ఖరీదు అబ్బో.. దేశంలోనే ఖరీదైన డీల్!
దేశంలోనే ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏది అంటే ముంబై అని చెబుతారు. కానీ ఖరీదైన ప్రాపర్టీ డీల్స్లో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం ముంబైని మించిపోతోంది. గుర్గావ్లోని డీఎల్ఎఫ్ కామెలియాస్లోని ఓ అపార్ట్మెంట్ ఇటీవల రూ. 190 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎన్సీఆర్లో అత్యంత ఖరీదైన హై-రైజ్ కండోమినియం అపార్ట్మెంట్ డీల్గా నిలిచింది. చదరపు అడుగుల ధర (కార్పెట్ ఏరియా) పరంగా దేశంలోనే అతిపెద్దది.ఇండెక్స్ట్యాప్కు లభించిన పత్రాల ప్రకారం.. ఇన్ఫో ఎక్స్ సాఫ్ట్వేర్ టెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో దాని డైరెక్టర్ రిషి పార్థీ ఈ 16,290 చదరపు అడుగుల పెంట్హౌస్ని కొనుగోలు చేశారు. ఈ డీల్ డిసెంబర్ 2న నమోదైంది. ఇందుకోసం కంపెనీ రూ.13 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. అయితే ఈ డీల్పై డీఎల్ఎఫ్ స్పందించలేదు.దేశంలోనే అతిపెద్దది“చదరపు అడుగుల ప్రకారం చూస్తే ఒక హై రైజ్ అపార్ట్మెంట్కు రూ. 190 కోట్ల ధర దేశంలోనే అత్యధికం. ఇది ముంబైని మించిపోయింది. సూపర్ ఏరియాను పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగుకు రూ. 1.18 లక్షలు, కార్పెట్ ఏరియా పరంగా అయితేరూ. 1.82 లక్షలు. ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రాపర్టీ ధరలు సూపర్ ఏరియా ప్రాతిపదికన ఉండగా, ముంబైలో కార్పెట్ ఏరియాలో ఉంటాయి. కాబట్టి ఈ గుర్గావ్ ఒప్పందం కార్పెట్ ఏరియా పరంగా ముంబై ధర కంటే చాలా అధికం’’ అని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రొపెక్విటీ ఫౌండర్-సీఈవో సమీర్ జసుజా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు.. ఇల్లు సొంతం!ముంబైలోని టానియెస్ట్ ఏరియాల్లో కార్పెట్ ఏరియా ధరలు రూ. 1,62,700 వరకు ఉన్నాయి. ఈ కామెలియాస్ డీల్కు ముందు జరిగిన అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ డీల్లలో ముంబైలోని లోధా మలబార్లో జరిగిన డీల్ ఒకటి. ఇక్కడ ఓ కంపెనీ గత ఏడాది చదరపు అడుగుకు (కార్పెట్ ఏరియా) రూ. 1,36,000 చొప్పున రూ. 263 కోట్లకు మూడు అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. -
అక్కడ ఒక్కో ఇల్లు రూ. 100 కోట్లు.. అదిరిపోయే ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: జీవితంలో ఓ సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికైనా ఉంటుంది. ఇందుకోసం పైసాపైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న వారు లేదా కొనుక్కున్న వారు ఉంటారు. ఈ క్రమంలో సామాన్యులు తమ తాహతుకు మించే ఖర్చు చేస్తారు. అయితే మన దేశంలో వంద కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా?లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనంన్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవరపర్స్(డీఎల్ఎఫ్) సంస్థ ‘ది కామెల్లియాస్’ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో లగ్జరీ రియల్ ఎస్టేట్కు కొత్త నిర్వచనాన్ని అందించే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. ‘ది కామెలియాస్’లో ఒక్కో అపార్ట్ మెంట్ ధర రూ.100 కోట్ల వరకు ఉంది. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, అత్యంత ధనవంతులకోసం ‘ది కామెల్లియాస్’ నిర్మితమయ్యింది. ఈ ప్రాజెక్ట్ విలాసవంతమైన ఇంటీరియర్స్, సాటిలేని విసాలవంతమైన సౌకర్యాలకు నెలవుగా ఉంది.పదేళ్లలో నాలుగు రెట్లు పెరిగిన ఇళ్ల ధరలు2014లో ‘ది కామెలియాస్’ ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు చదరపు అడుగు ధర రూ.22,500. కానీ నేడు దాని ధర చదరపు అడుగు రూ.85,000కు పైగానే పలుకుతోంది. అంటే పదేళ్లలో 4 రెట్లు పెరిగింది. గతంలో దాదాపు రూ.25-30 కోట్లకు అమ్ముడుపోయిన ఇక్కడి ఫ్లాట్ ధర నేడు రూ.100 కోట్లకు చేరుకుంది. ఢిల్లీలోని అత్యంత పాష్ ఏరియాలు, గురుగ్రామ్లోని పాష్ ఏరియాల మధ్య ధరల వ్యత్యాసం ఇప్పుడు తగ్గుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇటీవల, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్పై ఒక నివేదికను అందించింది.బాల్కనీలోంచి చూస్తే..డీఎల్ఎఫ్ ది కామెల్లియాస్లోని ఫ్లాట్లో 72 అడుగుల గాజు బాల్కనీ ఉంటుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అతిథులు కోసం మరొకటి ఆ ఫ్లాట్లోని వారి కోసం రూపొందించారు. ఈ బాల్కనీ వినోదాలకు కేంద్రంగా ఉంటుంది. దీనిలో డైనింగ్ ఏరియా, ఫార్మల్ సీటింగ్, ఫ్యామిలీ మీటింగ్స్ కోసం ప్రత్యేక కార్నర్లు ఉన్నాయి. ఈ బాల్కనీలోంచి చూస్తే బయటనున్న స్విమ్మింగ్ పూల్, పచ్చని చెట్లు కనిపిస్తాయి.లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్మార్క్ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్లో సింపుల్గా ఉంటుంది. క్లాస్సి, స్పెషల్ ఫర్నిషింగ్ను ఇందుకోసం వినియోగించారు. డీఎల్ఎఫ్కు చెందిన ఐకానిక్ ప్రాజెక్ట్లు ‘ది అరాలియాస్’, ‘ది మాగ్నోలియాస్’ మాదిరిగా ఈ ప్రాజెక్ట్ కూడా ఢిల్లీ- ఎన్సీఆర్లో అల్ట్రా-లగ్జరీ లివింగ్ కోసం కొత్త బెంచ్మార్క్ను సెట్ చేసింది. కాగా ది కామెల్లియాస్కు మించిన పెద్ద ప్రాజెక్ట్ను త్వరలో ప్రారంభించేందుకు డీఎల్ఎఫ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.కొత్త ప్రాజెక్టులో..డీఎల్ఎఫ్ దహ్లియాస్ పేరుతో నిర్మితమవుతున్న ఈ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ గోల్ఫ్ కోర్స్ రోడ్, గురుగ్రామ్లో నిర్మింతం కానుంది. సగటున ఒక అపార్ట్మెంట్కు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుకానుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 34,000 కోట్లుగా అంచనా. ఇందులో 9,500 చదరపు అడుగుల నుండి 16,000 చదరపు అడుగుల వరకు నివాస స్థలాలు ఉంటాయి. దహ్లియాస్లో 2,00,000-చదరపు అడుగుల క్లబ్హౌస్ ఏర్పాటు కానుంది. ఇది కామెల్లియాస్లోని క్లబ్హౌస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఇది లగ్జరీ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారనుంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
హైదరాబాద్లో ఫ్లాట్ కొంటున్నారా..? ధరలు.. ఏ ఏరియాలో ఎంత?
సాక్షి, సిటీబ్యూరో: స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్మెంట్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి సెలబ్రిటీలు, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు, గృహాల సరఫరా తక్కువగా ఉంటుంది.కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లో అంతర్జాతీయ మౌలిక వసతులు, హైరైజ్ ప్రాజెక్ట్లతో ఫ్లాట్ల ధరలు ఎక్కువ పలుకుతున్నాయి. కరోనా తర్వాత విశాలమైన అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బిల్డర్లు హైరైజ్ ప్రాజెక్ట్లలో స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్, జాగింగ్ ట్రాక్స్ వంటి ఆధునిక వసతులను కల్పిస్తున్నారు.కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటి పరిధిలో చ.అ.కు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పైగానే ధరలు ఉంటున్నాయి. నగరంలో అపార్ట్మెంట్ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,500 ఖర్చవుతోంది. భవనం ఎత్తును బట్టి నిర్మాణ వ్యయం పెరుగుతూంటుంది.నోట్: అపార్ట్మెంట్ విస్తీర్ణం, వసతులు, ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. -
సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రండి బాబు.. రండి.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనండి.. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో భాగస్వాములు కండి.. ఇక్కడ కొనండి.. అక్కడ సభ్యత్వం పొందండి..’’ ఎన్నో అక్రమాలకు కేరాఫ్గా మారిన జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం చేస్తున్న ప్రచారమిది. సొసైటీకి ఏ మాత్రం సంబంధం లేని, ఇంకా కట్టని, అసలు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్లో ఫ్లాట్లను అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 13.713 ఎకరాలు.. 1,900 ఫ్లాట్లు.. 40 ఫ్లోర్లు.. రివర్ వ్యూ, హైరైజ్ అంటూ జూబ్లీహిల్స్–4 పేరిట విక్రయాలు చేస్తోంది. ఇదంతా నమ్మి రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తే.. ఏదో ఒకరోజు ‘హైడ్రా’ ఎటాక్ తప్పని పరిస్థితి. ఈ వెంచర్కు సంబంధించి స్థానికులు, కొందరు సభ్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్–4 వెంచర్స్ పేరుతో.. ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్సీహెచ్బీఎస్)’ పాలకవర్గం కొత్త దందాకు తెర తీసింది. ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రపోజ్డ్ డెవలపర్గా ప్రవేశించి.. ఫ్లాట్లు విక్రయించే పని చేపట్టింది. ఫ్లాట్లు అమ్మేందుకు భారీ స్కెచ్ వేసింది. ఎంతో డిమాండ్ ఉన్న ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’లో కొత్తగా సభ్యత్వాలను మొదలుపెట్టింది. సభ్యత్వం కావాలంటే.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్ కొనాలని కొర్రీపెట్టి, అంటగడుతోంది. సొసైటీ నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదని పాలకవర్గం చెప్తున్నా.. ఇక్కడ సభ్యత్వాలు ఇచ్చే సమయంలోనే వెంచర్ తెరపైకి ఎలా వచ్చింది? అది ప్రైవేట్ వెంచర్ అయినప్పుడు సొసైటీ ఎందుకు విక్రయిస్తోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీని వెనుక వందల కోట్ల స్కామ్ ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కు ఇంత అన్న లెక్కన కొందరి జేబుల్లోకి సొమ్ము చేరేలా తతంగం నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే కొత్తగా సభ్యత్వం కోసం వస్తున్నవారికి ‘‘దాదాపు 15 వేల కోట్ల ఆస్తులపై మీకు హక్కులు వస్తాయి. క్లబ్కు వెళ్లొచ్చు. స్కూల్లో మీ పిల్లలను చదివించొచ్చు. కమ్యూనిటీ సెంటర్ వంటివి వినియోగించుకోవచ్చు..’’ అంటూ ప్రచారం చేస్తున్నారని సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఫేజ్–4లో ఫ్లాట్ కొనుగోలు చేయాల నే షరతు పెట్టారని, భవిష్యత్లో అన్ని అనుమతులు రా కుంటే పరిస్థితి ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదని అంటున్నారు. ఇదంతా తెలియని కొందరు మాత్రం సిటీ మధ్య లోని ఆస్తుల్లో భాగస్వాములం కాబోతున్నామనే ఆశతో సొసైటీ పాలకవర్గం బుట్టలో పడుతున్నారని చెప్తున్నారు. మాకే ఇంకా స్థలాలు ఇవ్వలేదంటూ.. మరోవైపు దశాబ్దాలుగా సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకే స్థలాలు ఇవ్వలేదని.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇక్కడ రూ.5 లక్షలు తీసుకుని సభ్యత్వం ఇవ్వడమేంటని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తమ సొసైటీ సభ్యులుగా ఉన్నా.. ఈ అక్రమాలపై స్పందించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫేజ్–4 బ్రోచర్ను నేరుగా మంత్రి తుమ్మలతోనే ఆవిష్కరింపజేశారు. దీనివల్ల ఇబ్బందులు, అనుమానాలు ఉండవనే ఎత్తుగడ ఉన్నట్టు స్పష్టమవుతోందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. జనం ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొస్తారని, అధికారులు జోక్యం చేసుకోకుండా ఓ సంకేతం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇక్కడి మోసాలు, అక్రమాలు మంత్రికి తెలియకుండా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సొసైటీ మార్చారని వాపోతున్నారు. ఒక్కో షేర్కు రూ.300 చొప్పున వసూలు చేసి.. రూ.15,000 కోట్ల ఆస్తులపై హక్కులు ఎలా కలి్పస్తారని కొందరు సభ్యులు ప్రశి్నస్తున్నారు. సొసైటీ మొత్తం సభ్యులు 5,000 మంది అనుకున్నా.. ఒక షేర్ కొన్న కొత్త సభ్యుడి వాటా సుమారు రూ.30 లక్షలు అవుతుందని... ఇలా ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటా వెంచర్.. ఎక్కడ? నార్సింగి పరిధిలోని మంచిరేవుల వద్ద టింబర్ చెరువును ఆనుకుని జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో చేపడుతున్న ఈ వెంచర్కు రహదారి వివాదం ఉంది. దేవాదాయ శాఖ భూముల్లోంచి దారితీసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వెంచర్కు అనుమతి రావాలంటే దారి చూపించాలి. అది సాధ్యం కాదు గనుక వెంచర్ ఏర్పాటు కలేనని స్థానికులు అంటున్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినా.. వెంచర్ బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని సమాచారం. అలాగే వదిలేస్తే భవిష్యత్లో హైడ్రా దృష్టిలో పడితే ఎలాగని, తమ ఉద్యోగానికి ఎసరొచ్చే పరిస్థితి వస్తుందేమోనని కలవరపడుతున్నారు.జవాబు లేని ప్రశ్నలెన్నో.. » రహదారే లేకుండా హెచ్ఎండీఏ నుంచి వెంచర్కు అనుమతి ఎలా వస్తుంది? » అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు తీసుకోవాలని సభ్యులపై ఒత్తిడి ఎందుకు? » షరతు విధిస్తూ సభ్యత్వ నమోదు ఫారం ఇస్తున్నా సహకార శాఖ అధికారులెక్కడ? » ఇలా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నా సహకార శాఖ అధి కారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఏం జరుగుతోంది?మా భూమిలో నుంచి రోడ్డు లేదు మంచిరేవుల రెవెన్యూ పరిధిలో జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో వస్తున్న వెంచర్కు ఉత్తరం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుతో అనుమతులు రావనే ఉద్దేశంతో.. 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 293లోని దేవాదాయ శాఖ భూమిలో నుంచి వంద అడుగుల రోడ్డు ఉన్నట్టు చూపుతూ హెచ్ఎండీఏ, ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు వేసేందుకు ప్రయతి్నస్తే అడ్డుకున్నాం. వారికి అనుమతులు రాకుండా హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దు. – పి.సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్, మంచిరేవులప్రైవేటు కేసులు, రోడ్డు డాక్యుమెంట్లు చూసుకోవాలి మంచిరేవులలో సర్వే నంబర్ 234, 236, 237, 263, 264, 265, 266, 267లలో ఉన్న భూమి పట్టాభూమి. దానికి ఉత్తరం వైపు గ్రీన్ఫీల్డ్ లే–అవుట్లో నుంచి రోడ్డు ఉంది. రెవెన్యూపరంగా కేసులు లేవు. ప్రైవేటుగా ఉన్న కేసులు, రోడ్డు సౌకర్యం, ఇతర వివరాల డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. కొంత మేర ఇటికిన్ చెరువు బఫర్ ఈ భూమికి తగిలి ఉంటుంది. ఇటీవల దేవా దాయ శాఖ భూమిలో నుంచి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నస్తే స్థానికులు అడ్డుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. – నర్రా శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం -
మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?
'ఆదిపురుష్' సినిమాతో సీతమ్మగా మనందరికీ తెలిసిన హీరోయిన్ కృతి సనన్ మరో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఓవైపు నటిగా హిట్స్ కొడుతున్న ఈమె.. మరోవైపు బిజినెస్లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ సొంతం చేసుకుంది. ఇంతకీ దీని రేట్ ఎంత? ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటి?(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ధర ఎంతంటే?)బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో హీరోయిన్గా కృతి సనన్ బాగానే కలిసి వస్తోంది. 2023లో ఈమె చేసిన మూడు సినిమాలు సరిగా ఆడనప్పటికీ.. ఈ ఏడాది మాత్రం 'తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' చిత్రాలతో హిట్ కొట్టింది. గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది.ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఫ్లాట్ ఉంది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్టులోని ఫ్లాట్ ఇది. మొన్నీమధ్య అమితాబ్ బచ్చన్ కూడా ఇందులోనే ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి కృతి సనన్ చేరింది. ఏదేమైనా చేతిలో డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నట్లుంది!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా?) -
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్లో రూ. 97.4 కోట్లతో అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్కే, 5 బీహెచ్కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
కొత్త ఫ్లాట్ కొన్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్.. రేటు ఎంతంటే?
'సీతారామం', 'హాయ్ నాన్న' తదితర చిత్రాలతో తెలుగులో బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకుర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ పలు మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు ఈమె ముంబయిలోని ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే ఈ ఫ్లాట్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ ఫ్యామిలీది కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'బిగ్బాస్' ప్రియాంక.. ఆ తప్పు వల్లే ఇలా!) ముంబయికి చెందిన మృణాల్ ఠాకుర్.. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బాలీవుడ్లో లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్ తదితర చిత్రాలు చేసింది. ఉన్నంతలో ఓ మాదిరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 2022లో 'సీతారామం' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి సౌత్లో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆచితూచి ఒక్కో చిత్రంలో నటిస్తున్నప్పటికీ అవన్నీ మృణాల్కి మరింత పేరు తెచ్చి పెడుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ముంబయిలోని అంధేరి ప్రాంతంలో కొత్తగా ఫ్లాట్ కొనుగోలు చేసింది. గతంలో ఇది హీరోయిన్ కంగనా రనౌత్ తండ్రి-సోదరుడికి సంబంధించినది. ఇప్పుడు దీన్ని మృణాల్ సొంతం చేసుకుంది. అయితే దీని విలువ ఎంతనేది బయటకు రాలేదు గానీ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు. ఏదైతేనేం మృణాల్ కొత్త ఫ్లాట్ రేటు గురించి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) -
100 కోట్లతో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సీఈఓ.. ఇంతకి ఎవరామె?
దేశంలో లగ్జరీ ఇళ్లకు అంతకంతకూ పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ ఢిల్లీలోని గురుగ్రామ్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్పై ఫ్రీ-లాంచ్ ప్రకటించింది. అలా అనౌన్స్ చేసిందో లేదో ఇలా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఎగబడ్డారు. కేవలం 72 గంటల్లో రూ.7200 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడు పోయాయి. ఢిల్లీతో పాటు ముంబైలో ఖరీదైన ప్లాట్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నాయి. తాజాగా, ముంబైలో ఓ లగ్జరీ ప్లాట్ అమ్ముడుపోయింది. ఆ ఫ్లాట్ విలువ అక్షరాల రూ.116.42 కోట్లు. ఇంతకి ఆ ప్లాట్ను కొనుగోలు చేసింది ఎవరని అనుకుంటున్నారా? 49వ ఫ్లోర్లో ఇల్లు ప్రముఖ లగ్జరీ హోం డెకోర్ కంపెనీ మైసన్ సియా ఫౌండర్, అండ్ సీఈఓ ఫ్యాషన్ డిజైనర్ వ్రాతికా గుప్తా ఆకాశ హర్మ్యాలను తాకుతూ ముంబైలోని లోయర్ పారెల్ ప్రాంతంలో 52 ఫ్లోర్లతో నిర్మించిన త్రీసిక్స్టీ వెస్ట్లో ఓ ప్లాన్ను సొంతం చేసుకున్నారు. 49వ ఫ్లోర్లో 12,138 స్కైర్ ఫీట్లో ఉన్న ఈ ఫ్లాట్లో సుమారు 8 కార్ల వరకు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. వ్రాతికా గుప్తా ఎవరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ,పెర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్లో పూర్వ విద్యార్థిని వ్రాతిక గుప్తా. అంజుమన్ ఫ్యాషన్స్ లిమిటెడ్లో అపెరల్ డిజైనర్గా ఫ్యాషన్ ప్రపంచంలో తన వృత్తిని ప్రారంభించారు. 2009 నుండి 2011 వరకు అంజూమోడీ డిజైనర్గా, టూ వైట్ బర్డ్స్లో డిజైన్ డైరెక్టర్గా పని చేశారు. 2017లో వస్త్రప్రపచంలోకి అడుగు పెట్టారు వ్రాతిక. వ్రాతిక & నకుల్ని స్థాపించారు. భర్త నకుల్ అగర్వాల్తో కలిసి భారతీయ వారసత్వం ఉట్టిపడేలా బ్రాండెడ్ డిజైన్లను తయారు చేస్తున్నారు. 2022లో మైసన్ సియా అనే లగ్జరీ హోమ్ డెకర్ బ్రాండ్తో రియల్ ఎస్టేట్లో విభాగంలో రాణిస్తున్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్ కుమార్తె!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, సారికల కూతురు అక్షర హాసన్ గురించి చాలామందికి తెలియదు. అక్షర సినిమాల్లో నటించినప్పటికీ శృతిహాసన్లా గుర్తింపు రాలేదు. 2015లో షమితాబ్ సినిమాతో అక్షర ఎంట్రీ ఇచ్చింది. ఆమె హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. వివేగం, లాలీకీ షాదీ మే లాడ్డూ దీవానా అనే సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న అక్షర హాసన్.. ఖార్ ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. దాని విలువ దాదాపు రూ.15.75 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 అంతస్తులున్న టవర్లో 13వ ఫ్లోర్లో ఇంటిని కొనుగోలు చేసింది. కాగా.. అక్షర ప్రస్తుతం తన తల్లి సారికతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. కమల్ హాసన్తో 2004లో సారిక ఠాకూర్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అక్షర 2015లో బాలీవుడ్ చిత్రం షమితాబ్లో అమితాబ్ బచ్చన్, ధనుష్లతో కలిసి నటించింది. ఆమె చివరిగా తమిళ చిత్రం అచ్చం మేడం నానం పయిర్పులో కనిపించింది. అక్షర హాసన్ కేవలం నటనే కాదు.. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. మహిళల హక్కుల కోసం, లింగ సమానత్వం, మహిళ మానసిక ఆరోగ్యం వంటి సమస్యలపై పోరాటం చేస్తోంది. View this post on Instagram A post shared by Akshara Haasan (@aksharaa.haasan) -
సాక్షి మనీ మంత్రా: రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్మార్కెట్లు
Today Stockmarket Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. ఆరంభం నుంచి స్తబ్దుగా కదలాడిన సూచీలు చివరికి వరుసగా రెండో రోజు కూడా బలహీన్నోట్లో ముగిసాయి.సెన్సెక్స్ 78.22 పాయింట్లు క్షీణించి 65,945 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 19,665 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19700 దిగువకు చేరింది. బ్యాంక్, ఫార్మా , ఐటీ మినహా మిగిలిన అన్ని సూచీలు ప్రధానంగా ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 0.5 శాతం లాభంతో గ్రీన్లో ముగిశాయి. బీఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగియగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది వోడాఫోన్ ఐడియా ఏకంగా 7శాతం లాభపడి 20 నెలల గరిష్టానికి చేరింది. ఐషర్ మోటార్స్, హీరో మోటో, నెస్లే, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ టాప్ గెయినర్స్గా టెక్ ఎం, సిప్లా, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్ర, అదాని ఎంటర్ ప్రైజెస్ టాప్ లూజర్స్గా మిగిలాయి. రూపాయి:డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం 10 పైసల నష్టంతో 83.23 వద్ద ముగిసింది. సోమవారం 83.14 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్రా: ఐటీ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
Today Stock Market Closing bell: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఉదయం నుంచీ లాభ నష్టాల మధ్య ఒడిదుడుకుల ట్రేడింగ్లో సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు పెరిగి 66,024, నిఫ్టీ 19,675 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ 1.5 శాతం, బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం పెరగగా, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ స్వ్పలంగా నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పెరగగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్తో ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, టాటా క న్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, కోల్ ఇండియా టాప్ గెయనర్స్గా నిలిచాయి. మరోవైపు హిందాల్కో, ఎస్బీఐ లైఫ్, హీరోమోటో, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారంనష్టాల్లో ముగిసింది. మరియు శుక్రవారం ముగింపులో 82.93 వద్ద డాలర్కు 21 పైసలు తగ్గి 83.14 వద్ద ముగిసింది. -
అపార్ట్మెంట్ బదులు భూములు కొంటే 10 రెట్ల లాభం! ఎలాగో తెలుసా?
పెట్టుబడి మార్గంగా అపార్ట్మెంట్ కొంటున్నారా? అయితే సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ కంటే భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల 10 రెట్లు ఎక్కువ రాబడిని ఇస్తుందని కొలియర్స్ (Colliers)అడ్వైజరీ సర్వీసెస్ ప్రచురించిన నివేదిక తెలిపింది. అద్దె రూపంలో రాబడి అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో భూములు కొని అద్దెకు ఇవ్వడం ద్వారా అపార్ట్మెంట్ల కంటే 10 రెట్లు అధిక రాబడి పొందవచ్చని కొలియర్స్ నివేదిక పేర్కొంది. సిటీ సెంటర్కు సమీపంలో ఉండటం, రాబోయే మౌలిక సదుపాయాలు, సామాజిక సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు, ఆర్థిక స్థోమత వంటివి దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ అప్రిషియేషన్కు కీలకమైన చోదకాలుగా ఉన్నాయని ‘టాప్ ఇన్వెస్ట్మెంట్ కారిడార్స్ ఇన్ ఇండియా’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక వివరించింది. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాక్షన్ కొనసాగుతోందని, దీనికి తోడు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెరిగిందని, భారతదేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లోని మైక్రో-మార్కెట్లు కీలక పెట్టుబడి కారిడార్లుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్లు వ్యవసాయేతర భూమి లభ్యత అత్యధికంగా ఉండటంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల రాక వంటి అంశాల ఆధారంగా మహారాష్ట్రలోని వసాయి విరార్, భివండి, నేరల్-మాథెరన్ వంటి ప్రాంతాలు కీలకమైన హాట్స్పాట్లుగా ఉన్నట్లు కొలియర్స్ నివేదిక గుర్తించింది. హైదరాబాద్లోనూ.. కీలకమైన పెట్టుబడి ప్రాంతాలలో ఒకటిగా పరిగణించే మహారాష్ట్రలోని నెరల్-మాథెరన్ మైక్రో-మార్కెట్లో హాలిడే హోమ్లకు సగటు వార్షిక అద్దె రాబడి 15 శాతం ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాలలో భూమి పెట్టుబడులపై ఐదు రెట్లు రాబడిని పొందగలదని అంచనా వేసినట్లు నివేదిక పేర్కొంది. గుజరాత్లోని పర్యాటక, పారిశ్రామిక కేంద్రం - సనంద్ నల్ సరోవర్ కారిడార్, చెన్నైలోని ECR, హైదరాబాద్లోని మేడ్చల్, కోల్కతాలోని న్యూ టౌన్, రాజర్హట్లు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పింది. పుష్కలమైన భూమి లభ్యత, పర్యాటకరంగంలో పెరిగిన ట్రాక్షన్, మౌలిక సదుపాయాలను పెంచడం వంటి కారణాలతో ఈ కారిడార్లు పెట్టుబడుల గమ్యస్థానాలుగా అభివృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలలో 2.5 నుంచి 4 శాతం సగటు వార్షిక అద్దె రాబడి మధ్య, భూమిపై 6 నుంచి 8 శాతం వార్షిక ధర పెరుగుదల ఉంటుందని వివరించింది. -
ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..
UK Flats: భూమి మీద అత్యంత విలువైనది.. కాలంతోపాటు విలువ పెరిగేది ఏదైనా ఉందంటే అది భూమి (ఇళ్లు) మాత్రమే. అన్ని దేశాల్లోనూ ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతుతున్నాయి. అయితే యూకేలోని ఓ నగరంలో మాత్రం రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లను రూ.100కే విక్రయిస్తున్నారు. లూయీ నగరంలోని కార్నిష్ టౌన్ సెంటర్లో నివాసితులకు చౌకగా ఇళ్లు అందించేందుకు 6,40,000 పౌండ్ల (రూ.6.6 కోట్లు) విలువైన గ్రేడ్ 2 లిస్టెడ్ ఫ్లాట్లను 1 పౌండ్ (రూ.103)కే విక్రయించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 11 కోస్ట్గార్డ్ ఫ్లాట్లను త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్కు విడుదల చేయాలన్న సిఫార్సును కార్న్వాల్ కౌన్సిల్ క్యాబినెట్ ఆమోదించింది. అంతేకాకుండా గ్రాంట్ ఫండింగ్ ద్వారా 1 మిలియన్ పౌండ్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడానికి ముందుకొచ్చింది. డిప్యూటీ కౌన్సిల్ లీడర్ డేవిడ్ హారిస్ ప్రకారం.. ‘ఈ ఫ్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడంలేదు. దీని వల్ల ఇప్పటికే రెండో ఇంటి యాజమాన్యం, హాలిడే హోంలు అధిక స్థాయిలో ఉన్న లూయీ పట్టణంలో చౌక గృహ సదుపాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కమ్యూనిటీ-నేతృత్వంలోని పునరాభివృద్ధి పథకం ఈ ఫ్లాట్లను పేదలకు మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తుంది. (Flipkart New Feature: ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో సరికొత్త ఫీచర్!) అధిక సంఖ్యలో హాలిడే హోమ్లు ఉండే ఇంగ్లాండ్లో సెకండ్ హోమ్లు, హాలిడే హోమ్ల సమస్య కార్న్వాల్లో మరీ ఎక్కువగా ఉంది. 2021లో ఈ ప్రాంతంలో 13,000 సెకండ్ హోమ్లు ఉన్నట్లుగా కార్న్వాల్ లైవ్ నివేదించింది. కౌన్సిల్ 2021లో చేపట్టిన నార్త్ రోడ్ భవనం పునర్నిర్మాణాన్ని ఆర్థికంగా పనికిరానిదిగా, అవసరానికి మించినదిగా ప్రకటించారు. అధిక నిర్వహణ ఖర్చులను నివారించేందుకు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. లూయి కౌన్సిలర్లు ఎడ్వినా హన్నాఫోర్డ్, అర్మాండ్ టామ్స్ మద్దతుతో త్రీ సీస్ కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్ 1 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ఖర్చుతో ఆస్తుల పూర్తి పునరుద్ధరణను చేపట్టడానికి ముందుకొచ్చింది. అర్హతలు ఇవే.. ఇదే విధమైన పథకాన్ని 2015లో స్టోక్-ఆన్-ట్రెంట్ కౌన్సిల్ అమలు చేసింది. వీటిపై ఆసక్తి ఉన్నవారు కనీసం ఐదేళ్ల పాటు కొత్త ప్రాపర్టీలలో ఉండటానికి అంగీకరించాలి. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి. కుటుంబ ఆదాయం 18,000 నుంచి 25,000 పౌండ్ల మధ్య ఉండాలి. కొత్త పథకం పోర్ట్ల్యాండ్ స్ట్రీట్ ప్రాంతంలో ఉంటుందా లేదా నగరంలోని మరొక వెనుకబడిన ప్రాంతంలో ఉంటుందా అన్నది ఇంకా నిర్ణయించలేదని హౌసింగ్ క్యాబినెట్ సభ్యుడు, కౌన్సిలర్ రాండీ కాంటే పేర్కొన్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సాక్షి మనీ మంత్రా: మార్కెట్ల యూటర్న్, రూ. 6 లక్షల కోట్లు ఆవిరి
Today Market Closing: దేశీయ మార్కెట్లు యూటర్న్ తీసుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులమధ్య సాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలకు పరిమితమై నాయి ముఖ్యంగా రికార్డు స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలతో 380 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. చివరికి సెన్సెక్స్ 94 పాయింట్లు లాభంతో 67,221.13 వద్ద ముగిసింది. అలాగే 20వేలకు ఎగువన మొదలైన నిఫ్టీ ఈ స్థాయిని నిలుపుకోవడంలో విఫలమైంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టంతో 19,993.20 వద్ద ముగిసింది. ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లు ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, ఆయిల్ & గ్యాస్, మెటల్ , రియాల్టీ ఒక్కొక్కటి 1-3 శాతం చొప్పున నష్టపోయాయి. తద్వారా వరుసగా 7 రోజుల లాభాలకు చెక్ పడింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ మునుపటి సెషన్లోని రూ.324.3 లక్షల కోట్ల నుండి దాదాపు రూ.318.7 లక్షల కోట్లకు పడిపోయింది.అంటే ఒక్క సెషన్లోనే దాదాపు రూ. 5.6 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు కోల్పోయారు.మిడ్, స్మాల్ క్యాప్లు ఈరోజు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 2.96 శాతం క్షీణించి 32,084.93 వద్దకు చేరుకోగా, బిఎస్ఇ స్మాల్క్యాప్ ఇండెక్స్ 4.02 శాతం క్షీణించి 36,982.74 వద్దకు చేరుకుంది. నిఫ్టీ ఇండెక్స్లో బీపీసీఎల్ ,ఎన్టీపీసీ ,పవర్ గ్రిడ్ ,షేర్లు టాప్ లూజర్లుగా ముగిశాయి. మరోవైపు టిసిఎస్ , లార్సెన్ అండ్ టూబ్రో ,ఇన్ఫోసిస్ ,షేర్లు టాప్ గెయినర్లుగా ముగిశాయి. అటు యుఎస్ ద్రవ్యోల్బణం డేటా ,యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ , యుఎస్ ఫెడ్ ద్రవ్య విధాన సమావేశాలపై దృష్టి సారించడంతో గ్లోబల్ సూచనలు కూడా బలహీనంగా ఉన్నాయి. అలాగే ఈ రోజు తవెల్లడి కానున్న ఆగస్ట్లో భారత ద్రవ్యోల్బణం డేటా , జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి డేటా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు రూపాయి: అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు ఎగిసింది. -
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
సాక్షి మనీ మంత్రా: బ్యాంకింగ్ దెబ్బ, ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్
Today StockMarket Closing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. రోజంతా ఒడిదుడులకు మధ్య సాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 11 పాయింట్ల లాభంతో 650,87వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభాలకు పరిమితమై 19,347 వద్ద ముగిసింది. తద్వారా నిఫ్టీ 19400 దిగువకు చేరింది. రియల్టీ ఇండెక్స్ 1 శాతం, ఆటో, ఎఫ్ఎంసిజి, ఐటీ మెటల్ 0.5 శాతం పెరిగాయి. మరోవైపు, పవర్, ఆయిల్ & గ్యాస్ ,బ్యాంకింగ్ రంగ షేర్లు 0.5 శాతం తగ్గాయి. టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గాఉన్నాయి. మరోవైపు పవర్ గ్రిడ్, బీపీసీఎల్, డా. రెడ్డీస్, హీరోమోటోకార్ప్ భారీ నష్టాల్ని ఎదుర్కొన్నాయి. రూపాయి: డాలరు మారకంలో దేశీయ కరెన్సీ కూడా నష్టపోయింది. మంగళవారం నాటి ముగింపు 82.70తో పోలిస్తే బుధవారం రూపాయి 82.73 వద్ద స్థిరపడింది. -
అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్గ, ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు. మరోవైపు చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. -
సాక్షి మనీ మంత్రా: లాభాలకు చెక్, అయ్యో,జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
Today StockMarketClosing: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 3.94 పాయింట్లు లేదా 0.01 శాతం పెరిగి 65,220వద్ద, నిఫ్టీ 2.90 పాయింట్లు లేదా 0.01 శాతం లాభంతో 19,396.50 వద్ద ముగిశాయి. తద్వారా సోమవారం నాటి లాభాలకు చెక్ చెప్పాయి. ఐటీ, ఫార్మా , పీఎస్యు బ్యాంక్ మినహా అన్ని రంగాలు లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ , పవర్ ఒక్కొక్కటి 1 శాతం లాభపడ్డాయి. మెటల్ , ఎఫ్ఎంసిజి ఒక్కొక్కటి 0.5 శాతం ఎగిసాయి. అలాగే నేటి ట్రేడింగ్ సెషన్లో బిఎస్ఇ మిడ్క్యాప్ , స్మాల్క్యాప్ రెండు సూచీలు తాజా రికార్డు గరిష్టాలను అధిగమించాయి. ఇది కీలక సూ చీలకు ఊతమిచ్చాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ,ఎన్టీపీసీ, హీరోమోటో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్, ఐషర్ మోటార్స్, టీసీఎస్ టాప్ లూజర్స్గాఉన్నాయి. మరోవైపు సోమవారం మార్కెట్లో లిస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వరుసగా రెండో రోజు కూడా 5 శాతం కుప్పలకూలడం గమనార్హం.ఎన్ఎస్ఇలో రూ.236.45 వద్ద లోయర్ సర్క్యూట్ అయింది. రూపాయి: డాలర్తో పోలిస్తే భారత రూపాయి 17 పైసల లాభంతో ముగిసింది. గత ముగింపు 83.11తో పోలిస్తే 82.94 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: ఐటీ జోరు, కోలుకున్న సూచీలు
దేశీయస్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలోనే భారీ నష్టాలతో ఉన్నప్పటికీ తీవ్ర ఒడిదుడుకుల మధ్య ముగింపులో కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 79 పాయింట్ల లాభంతో 65,401.92 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 19,434 వద్ద ముగిసాయి. దాదాపు 1509 షేర్లు పురోగమించగా, 2101 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో ఎల్టిఐఎండ్ట్రీ, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్యుఎల్, రిలయన్స్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, నష్టపోయిన వాటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, జెఎస్డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, టాటా స్టీల్ ఉన్నాయి. ఐటీ, ఎఫ్ఎంసిజి మినహా మిగిలిన అన్ని సూచీలు మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. పవర్, రియాల్టీ , సీఎస్యు బ్యాంక్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున క్షీణించాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం నష్టపోయింది. శుక్రవారం నాటి 82.85 ముగింపుతోపోలిస్తే 82.95 వద్ద ముగిసింది.బలహీన దేశీయ మార్కెట్లు బలమైన డాలర్ కారణంగా భారత రూపాయి తాజా 10 నెలల కనిష్టానికి పడిపోయింది. బలహీనమైన ఐఐపీ గ్రోత్ కూడా ప్రభావం చూపింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఉద్యోగులకు ఖరీదైన ఫ్లాట్స్: బిలియనీర్ గొప్పమనసు
Savji Dholakia ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఇళ్లు, బంగారం లాంటి భారీ బహుమతులుఇవ్వడంలో సూరత్లోని వ్యాపారుల తరువాతే ఎవరైనా. తాజాగా సూరత్కుచెందిన బిలియనీర్ కార్మికులకు ఫ్లాట్లను బహుమతిగా ఇవ్వడం విశేషంగా నిలిచింది. ప్రతి సంవత్సరం దీపావళికి తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతుల వర్షం కురిపించడం వజ్రాల వ్యాపారికి అలవాటు. (లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించిన ముఖేష్ అంబానీ) సూరత్లో అత్యంత ధనవంతుడు హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా ఏటా తన ఉద్యోగులకు రూ.50 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను అందిస్తారు. ఒకసారి తన కార్మికులకు దీపావళి బోనస్గా 400 ఫ్లాట్లు , 1260 కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాదిదీపావళి బోనస్గా ఉద్యోగులకు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా బహుమతిగా ఇస్తారు. అత్యంత ప్రతిభ చూపించిన వారికి ఖరీదైన వస్తువులు, నగలు కూడా అందిస్తారు. జీవితంలో ఎవరికైనా తొలి కారు కొనుక్కోవడం అంటేచాలా గొప విషయం. తన ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలా ఏటీ బహుమతులు ఇస్తూ ఉంటానని, తద్వారా పనితీరు, జీవనశైలి మెరుగుపడుతుంది,వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతిమంగా అది కంపెనీకి కూడా ఉపయోగపడుతుంది అని ధోలాకియా ఒకసారి చెప్పారు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్) అంతేకాదు ఎనలేని సంపద ఉన్నప్పటికీ మనవడిని సామాన్య జీవనం గడిపేలా చేశాడు. సావ్టీ మనవడు రువిన్ ధోలాకియా, విద్యను పూర్తి చేసిన తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాడు. రోజూ సామాన్య జనం పడుతున్న కష్టాలను నేర్చుకోవాలని, గొప్ప మేనేజ్మెంట్ స్కూల్తో పోలిస్తే మంచి ఉపాధ్యాయుడిచ్చే అనుభవాలు గొప్పవని సావ్జీ ధోలాకియా విశ్వాసం. ధోలాకియా అమెర్లీలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్లకే చదువు మానేశాడు. 1977లో స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులో తన జేబులో టిక్కెట్టు ఛార్జీగా కేవలం పన్నెండు రూపాయల యాభై పైసలతో సూరత్కు వచ్చారు. సూరత్లోని తన మామ వజ్రాల వ్యాపారంలో చేరాడు. అతని సోదరులు కూడా వ్యాపారంలో చేరారు. వీరిద్దరూ కలిసి 1984లో తమ సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. సాధారణ కార్మికుడిగా, కూలిగా జీవనం సాగించి అంచెలంచెలుగా ఎదిగిన సావ్జీ ధోలాకియా ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 12000 కోట్లు. 2014 నాటికి, వారు 6500 మంది ఉద్యోగులను కలిగి ఉన్నారు.2022లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది. అంతేకాతు కుటుంబం తనకు గిఫ్ట్గా ఇచ్చిన హెలికాప్టర్ను సూరత్లో వైద్యం ఇతర అత్యవసర పరిస్థితుల కోసం రూ. 50-కోట్ల బ్రాండ్-న్యూ ఛాపర్ని విరాళంగా అందించాలని(గతంలో) నిర్ణయించడం విశేషం. అలాగే సౌరాష్ట్రలోని అమ్రేలి జిల్లాలోని లాఠీ తాలూకాలోని తన స్వస్థలంలో ఇప్పటికే 75 చెరువులను నిర్మించడమేకాదు 20 లక్షలకుపైగామొక్కల్నినాటారు. మొదట్లో ధోలాకియా మొదట గార్మెంట్ షాపులో సేల్స్మెన్గా, హెటల్లో , వాచ్ అవుట్లెట్లో ఆఖరికి కూలీగా కూడా పనిచేశాడట.. రెండు రోజులు కూలి పని కూడా చేశాడు. చెన్నైలో రోజుకు అతని సంపాదన. కేవలం రూ.200 మాత్రమే. అందుకే జీవితంలో సగటుమనిషి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఎంత ఎదిగినా. తాను నడిచి వచ్చిన త్రోవను మర్చిపోలేదు. అందుకే తన సంపాదనలో సింహ భాగం ఉద్యోగులకు ఇస్తూ తన గొప్పదనాన్ని చాటుకుంటున్నారు. -
ఇక వర్క్ ఫ్రం ఆఫీస్.. ఫ్లాట్ అద్దె రూ.2.5 లక్షలు.. 25 లక్షల అడ్వాన్స్!
బెంగళూరు: ఫ్లాట్ అద్దె అడ్వాన్సు రూ.25 లక్షలంటూ వచ్చిన ట్వీట్పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతరం టెక్ ఉద్యోగులు వర్క్ఫ్రం హోం నుంచి తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో బెంగళూరులో ఇళ్ల అద్దెలు ఏ స్థాయిలో పెరిగాయనేందుకు ఉదాహరణ ఇది. నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఓ ఫ్లాట్కు అద్దె నెలకు రూ.2.5 లక్షలు కాగా, అడ్వాన్స్ రూ.25 లక్షలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్కు పెద్ద సంఖ్యలో యూజర్లు ఛలోక్తులు సంధించడంతోపాటు మండిపోతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అనంతరం ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోంతోపాటు ఆఫీసుల్లోనూ విధులకు హాజరవ్వాలంటూ ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చాయి. చాలా వరకు కంపెనీలు మళ్లీ ఆఫీసులకొచ్చి డ్యూటీ చేయాలంటూ ఆదేశాలిచ్చాయి. ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు చేరుతుండటంతో ఇళ్ల అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఖరీదైన ప్రాంతాల్లోనైతే యజమానులు మరీ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని తేజస్వీ శ్రీవాస్తవ అనే టెక్ కంపెనీ సీఈవో ట్విట్టర్లో ప్రస్తావించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్లోని 4 బీహెచ్కే ఫ్లాట్కు నెల వారీ రెంట్ రూ.2.5 లక్షలు, డిపాజిట్ రూ.25 లక్షలంటూ ఉన్న ప్రకటనను చూసి ఆయన షాకయ్యారు. అడ్వాన్స్కు అవసరమైన మొత్తానికి లోన్ ఆప్షన్ కూడా ఉండటం ఆయన్ను మరింత షాక్కు గురి చేసింది. ఆయన ఈ ప్రకటనను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ‘కిడ్నీ అమ్ముకోవడానికి కూడా ఆప్షన్ ఉంటే బాగుండేది’అంటూ శ్రీవాస్తవ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ట్వీట్లపై కామెంట్లు పోటెత్తాయి. కొందరు నెటిజన్లు ఇంటి అద్దెలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా ఇంకొందరు రుణం కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్పై మండిపడ్డారు. చివరి రెండు సున్నాల ముందు చుక్క పెట్టడం మరిచిపోయారేమో అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. They should add an option: Apply for Kidney Donation.#Bangalore #HouseRent#Bengaluru #HSRLayout@peakbengaluru pic.twitter.com/KPyeKmkfyF — Tejaswi Shrivastava (@trulytazz) July 27, 2023 -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ షాక్: ఫ్లాట్గా స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి.రికార్డు స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 65,485 వద్ద,నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 19397 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ ఇండెక్స్ 0.5 శాతం నష్టల్లోనూ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ ఇండెక్స్లు 0.5-1 శాతం లాభాల్లో ఉన్నాయి. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, హీరో మోటో, ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో టాప్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ,టాటా కన్జ్యూమర్, డా. రెడ్డీస్, అదానీ పోర్ట్స్ నష్టపోతున్నాయి. -
హౌసింగ్ స్కీం: 5500 ఫ్లాట్లు, రూ.9.89 లక్షలకే ఫ్లాట్
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (DDA) గృహకొనుగోలుదారులకు భలే మంచి శుభవార్త అందించింది. వివిధ ప్రదేశాలలో 5,500 ఫ్లాట్లతో కూడిన కొత్త గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రూ. 9.89 లక్షల ప్రారంభ ధరకే ఫ్లాట్ను అందించ నుంది. శుక్రవారం (జూన్ 30) ప్రారంభించిన ఈ పథకంలో ముందుగా వచ్చిన వారికి, ముందుగా కేటాయింపు ప్రాతిపదికన వీటిని విక్రయించ నుంది. ఫ్లాట్లలో 1-BHK, 2-BHK ,3-BHK ఇళ్లు ఉన్నాయి. అత్యున్నత నిర్ణయాధికార సంస్థ జూన్ 14న ఆన్లైన్లో ఫస్ట్-కమ్, ఫస్ట్ సర్వ్ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 4ను ప్రారంభించేందుకు ఆమోదించింది. ఈ పథకం టోకెన్ చెల్లించి తమ కిష్టమైన ప్రాంతంలో ఫ్లాట్ను బుక్ చేసుకోవచ్చు. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) డీడీఏ హౌసింగ్ స్కీమ్లోని ఫ్లాట్ల వివరాలు 1-BHK ఫ్లాట్లు నరేలా, సిరాస్పూర్, రోహిణి, లోక్నాయక్ పురంలో ఉన్నాయి 2-BHK ఫ్లాట్లు నరేలా ,ద్వారకలో ఉన్నాయి 3-BHK ఫ్లాట్లు జసోలాలో ఉన్నాయి (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) ఫ్లాట్లు: ధరలు సుమారుగా 1-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 9.89 లక్షల -రూ. 26.98 లక్షలు, లోక్నాయక్ పురంలో రూ. 28.47 లక్షలకు 2-BHK ఫ్లాట్లు: నరేలాలో రూ. 1 కోటి నుండి రూ. 1.23 కోట్లకు-ద్వారకలో రూ. 1.33 కోట్లు 3-BHK ఫ్లాట్లు: రూ. 2.08 కోట్ల నుండి రూ. 2.18 కోట్లు బుకింక్ అమౌంట్ 1-BHK ఫ్లాట్లు: రూ. 50,000 (ఆర్థికంగా వెనుకబడినవారికి ), రూ. 1 లక్ష (జనరల్) 2-BHK ఫ్లాట్: రూ. 4 లక్షలు 3-BHK ఫ్లాట్: రూ. 10 లక్షలుచెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించి, అవసరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాల్సిఉంటుంది. జూన్ 30 సాయంత్రం 5 గంటల నుంచి రిజిస్ట్రేషన్. జూలై 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి (మరిన్ని అప్డేట్స్కోసం చదవండి: సాక్షిబిజినెస్) -
మాఫియా స్థలాల్లో పేదవారికి ఇళ్ళు.. దటీజ్ యోగి..
లక్నో: ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థలాన్ని హస్తగతం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 76 ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థానాలను తిరిగి గవర్నమెంట్ పరం చేసిన యూపీ ముఖ్యమంత్రి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మొత్తం 76 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి సందర్శించిన యోగి నిర్మాణాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్ల తాళాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫ్లాట్ల కోసం 6000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీకి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ... 2017కు ముందు భూబకాసురులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తుంటే నిర్భాగ్యులైన పేదవారు అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. అలాంటి ల్యాండ్ మాఫియాను అణచి అదే స్థలాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విజయం మరొకటి లేదని అన్నారు. మొత్తానికి దోపిడీదారులు, అక్రమార్కుల ఆటలు కట్టించి దగాపడ్డ వారికి న్యాయం చేస్తూ యూపీ సీఎం యోగి అభినవ రాబిన్ హుడ్ అనిపించుకుంటున్నారు. #Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly. The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj (via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho — Hindustan Times (@htTweets) June 30, 2023 -
సింగిల్ బెడ్రూం ఫ్లాట్ అద్దె రూ.1.2 లక్షలు! ఎక్కడంటే..
దేశంలోని ఖరీదైన ప్రాంతాలలో అపార్ట్మెంట్ల అద్దెలు లక్షల రూపాయలు ఉండటం సహజం. అయితే అలాంటి అపార్ట్మెంట్లు విలాసవంతంగా, విశాలంగా ఉంటాయి. కానీ ముంబైలోని ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఆ ఆలోచనను తారుమారు చేసింది. ఈ ఫ్లాట్ సౌత్ బాంబేలోని కార్మైకేల్ రోడ్లో ఉంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన వీధుల్లో ఇది ఒకటి. ఇక్కడ నివాసమంటున్నవారంతా అగ్ర రాజకీయ నాయకులు, కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఈ వన్ బీహెచ్కే ఫ్లాట్లో అద్దెకుంటున్నది కుష్ భయాని అనే ఆర్కిటెక్ట్. ఆయన ఓపెన్హాస్ అనే స్థిరాస్థి సంస్థ సహ వ్యవస్థాపకుడు. వందేళ్ల నాటిది! ఈ వన్ బీహెచ్కే సాధారణ సింగిల్ బెడ్రూం ఫ్లాట్ లాంటిది కాదు. ఇది 700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంటే ముంబైలో సగటు వన్ బీహెచ్కే కంటే పరిమాణంలో రెండింతలు పెద్దది. పైకప్పు కూడా చాలా ఎత్తులో ఉంది. చేతితో పెయింట్ చేసిన అందమైన టైల్ ఫ్లోర్ ఉన్న ఈ ఫ్లాట్ సుమారు 100 సంవత్సరాల నాటిదని ఇందులో అద్దెకుంటున్న కుష్ భయాని చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం, సహజ కాంతిని అందించేలా దీన్ని నిర్మించారు. బాత్రూమ్ను సైతం గ్రీకు సౌందర్యంతో రూపొందించారు. లివింగ్ రూమ్ కంటే బెడ్ రూమ్ పెద్దదిగా మరో విశేషం. ఈ ఫ్లాట్ ముంబైలో గోవా అనుభూతిని ఇస్తుందని, అపార్ట్మెంట్కు నెలకు రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు కుష్ భయాని పేర్కొంటున్నారు. -
ఇది యోగి మార్క్.. గ్యాంగ్స్టర్ భూమిలో పేదల కోసం ఇళ్లు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్లో హత్యకు గురైన విషయం విదితమే. కాగా ప్రభుత్వం అతని నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు. ప్రయాగ్రాజ్: గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ తీశారు. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగింది. ఈ లాటరీలో ఎన్నికైనవారికి ఫ్లాట్లను అప్పగించనున్నారు. ప్రయాగ్రాజ్ డెవలప్మెంట్ ఆథారిటీ(పీడీఏ) ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అలహాబాద్ మెడికల్ అసోసియేషన్కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ తీశామన్నారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 6,030 మందిలో నుంచి 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామన్నారు. 2021లో శంకుస్థాపన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గదులు కలిగిన ఈ ఫ్లాట్లో ఒక వంటగది, టాయిలెట్ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలని తెలిపారు. ప్రయాగ్రాజ్లోని లూకర్గంజ్ పరిధిలోని అతీక్ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కింద ఈ ప్రాజెక్టు చేపట్టింది. చదవండి: మహారాష్ట్ర రాజకీయంలో కలకలం UP: Flats built on land confiscated from slain gangster Atiq Ahmed allotted to poor in Prayagraj Read @ANI Story | https://t.co/VwutaCV8NN#Prayagraj #atiqahmad #UttarPradesh pic.twitter.com/y0fCo4mhGn — ANI Digital (@ani_digital) June 9, 2023 ముఖ్యమంత్రి యోగి చేతుల మీదుగా.. ఈ ప్రాంతంలో రెండు బ్లాకులుగా మొత్తం 76 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్హులైన పేదలకు ఈ ఇళ్లను అప్పగించనున్నారు. అతీక్ అహ్మద్ 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజూపాల్ హత్య, ఈ కేసులో ప్రత్యక్ష్య సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులలో ప్రధాన నిందితుడు. కాగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్లను ఈ ఏడాది ఏప్రిల్ 15న రాత్రి విలేకరుల రూపంలో వచ్చిన ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. అతీక్ అహ్మద్ను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు! -
ఫ్లాట్ ముగింపు, ఐటీ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. ఫ్లాట్ ఆరంభంనుంచి బలహీనమైన అంతర్జాతీయ ప్రతికేల సంకేతాలతో ప్రధాన సూచీలు మందకొడిగా కొనసాగాయి. మిడ్సెషన్లో భారీగా నష్టపోయింది. చివరి 30 నిమిషాల్లో కొనుగోళ్లతో నష్టాలనుంచి తేరుకుంది. స్వల్ప లాభాలకు పరిమితమైనా కీలక మద్దతుస్థాయిలకుపైన ముగసింది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) 5 పాయింట్ల లాభంతో 62,793 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 18599 వద్ద ముగిసింది. ఆటో, బ్యాంకు రంగ షేర్లు లాభపడగా ఐటీ అమ్మకాల ఒత్తిడి దేశీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్కు దారితీసింది. అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, టైటన్, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి. అటు డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 29 పైసలు పతనమై 82.68 దగ్గర నిలిచింది. -
ఊగిసలాడుతున్న స్టాక్మార్కెట్, అదానీ షేర్లకు ఉత్సాహం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. కానీ కొద్దిసేపటికే అమ్మకాల వెల్లువతో 200 పాయింట్ల లాభంతో ఆరంభంమైన సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. 62422 వద్ద, నిఫ్టీ 19490 వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. హీరోమోటోకార్ప్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటాస్టీల్, టెక్ మహీంద్ర బాగా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, సిప్లా టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. హుషారుగా అదానీ గ్రూపు షేర్లు ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ నుండి అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సెక్యూరిటీలను తొలగించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ దాదాపు 2 శాతం పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్ను మే 24న స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్వర్క్ కింద ఉంచిన సంగతి తెలిసిందే. అదానీ పోర్ట్స్ కూడా స్వల్పంగా లాభపడుతోంది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప లాభంతో 82.32 వద్ద కొనసాగుతోంది. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన స్టార్ హీరో తల్లి.. ఎన్ని కోట్లంటే!
బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో విశాలమైన ఫోర్ బీహెచ్కే అపార్ట్మెంట్ను దాదాపు రూ.17.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మే 10న రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. కేవలం రిజిస్ట్రేషన్కే దాదాపు రూ.1.04 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు. ప్రస్తుతం పాలి హిల్లోని కృష్ణ రాజ్ బంగ్లాలో నివసిస్తున్న నీతు కపూర్ రీసేల్ డీల్లో ఈ ఆస్తిని కొనుగోలు చేశారు. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) సూరజ్ సినిమాతో అరంగేట్రం చేసిన నీతూ కపూర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత దీవార్, ఖేల్ ఖేల్ మే, కభీ కభీ, అమర్ అక్బర్ ఆంథోనీ, ధరమ్ వీర్ చిత్రాల్లో నటించారు. కాలా పత్తర్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది. 1980లో ఆమె నటుడు రిషి కపూర్ను వివాహం చేసుకోగా.. రణబీర్ కపూర్, రిద్దిమా కపూర్ జన్మించారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
ఇదెక్కడి డిమాండ్ మహాప్రభో.. డబుల్ బెడ్ రూం అద్దె రూ.50వేలు!
దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా మారింది. అమాంతం పెరిగిన అద్దె ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలిచే బెంగళూరులో ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్ రీసెర్చ్ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్ మార్కెట్’కు మంచి డిమాండ్ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. -
విలాసవంతమైన ఫ్లాట్ కొన్న సూర్య.. ఎన్ని కోట్లో తెలుసా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. తన సినిమాలతో టాలీవుడ్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా సూర్య ముంబయిలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.70 కోట్లు వెచ్చించి విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలో దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారట. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అపార్ట్మెంట్ ప్రత్యేకతలు సూర్య కొనుగోలు చేసిన అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లో భారీ గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్లు కూడా ఉన్నాయి. ఆ ఫ్లాట్ ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య ప్రస్తుతం తాత్కాలికంగా ప్రకటించిన 'సూర్య 42' విడుదలకు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సిరుత్తై శివ తెరకెక్కించారు.ఈ చిత్రం దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా సూర్య మూవీ 'సూరరై పొట్రు' హిందీ రీమేక్లో ప్రధాన పాత్రలో నటించాడు. -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్పనష్టాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నడుమ కీలక సూచీలు ఒడిదుడుకుల మధ్య ఉన్నాయి. ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోతున్నాయి. రియల్టీ, ఆటో స్టాక్లు లాభాలు మార్కెట్కు సపోర్ట్నిస్తున్నాయి. ఫలితంగా ఆరంభంలో 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 47 పాయింట్ల నష్టంతో 60977వద్ద ఉంది. , నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 17917 వద్ద ట్రేడ్ అవుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచ ఈక్విటీల ఆందోళన నేపథ్యంలో అనిశ్చితి కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐషర్ మెటార్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, మారుతి, రిలయన్స్ లాభపడుతుండగా, ఐటీసీ, హెచ్యూఎల్, లార్సెన్, ఓఎన్జీసీ బ్రిటానియా నష్ట పోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా నష్టాల్లోనే ఉన్నంది. 12పైసల నష్టంతో 82.85 వద్ద ఉంది. -
హైదరాబాద్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు తగ్గాయా? ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నివాస విభాగం నేల చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది తొలి నెలలో గ్రేటర్లో రూ.2,422 కోట్ల విలువ చేసే 4,872 అపార్ట్మెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 34 శాతం తక్కువ. 2021 మొదటి నెలలో రూ.3,269 కోట్లు విలువ చేసే 7,343 యూనిట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగిన వాటిల్లో అత్యధికంగా 54 శాతం గృహాలు రూ.25–50 లక్షలవే. 2021 జనవరిలో ఈ ఇళ్ల వాటా 39 శాతంగా ఉంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 25 శాతం నుంచి 28 శాతానికి పెరిగాయి. ఇక రూ.25 లక్షల లోపు ధర ఉన్న అఫర్డబుల్ ఇళ్ల వాటా 2021 జనవరిలో 36 శాతం కాగా.. గత నెలలో 18 శాతానికి పడిపోయాయి. ఈ జనవరిలో 1,000 నుంచి 2,000 చ.అ. విస్తీర్ణం ఉన్న గృహాలే ఎక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి వాటా 71 శాతం ఉంది. అయితే గతేడాది జనవరిలో వీటి వాటా 72 శాతంగా ఉంది. 2021 జనవరిలో 500–1,000 చ.అ. ఇళ్ల వాటా 15 శాతం ఉండగా.. గత నెలలో 17 శాతానికి పెరిగింది. 2 వేల చ.అ.లకు పైగా విస్తీర్ణం ఉన్న యూ నిట్ల వాటా 9 శాతంగా ఉంది. ఎందుకు తగ్గాయంటే.. ప్రతి ఏటా మొదటి కొన్ని నెలల పాటు స్థిరాస్తి కార్యకలాపాలు మందగిస్తాయని దీంతో విక్రయాలు, రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉంటుందని నైట్ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. గృహ కొనుగోలుదారుల కొనుగోలు నిర్ణయంలో ఊహించని మార్పులు, ధరలలో ప్రతికూలతలుంటాయి. వేతన సవరణలు, రాయితీలు, పండుగ సీజన్ల వంటి వాటితో మార్కెట్లో సానుకూల ధోరణి కనిపించినప్పుడే కొనుగోళ్లకు మొగ్గుచూపుతారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆయా ప్రాపర్టీల డెలివరీకి సమయం పడుతుంది దీంతో విక్రయాలు ఎక్కువ జరిగినా.. ఆయా నెలల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదవుతాయని వివరించారు. -
Today StockMarket: ఫ్లాట్గా సూచీలు, అదానీ షేర్ల అమ్మకాల సెగ
సాక్షి,ముంబై: దేశీయ ఈక్విటీ సూచీలు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 39.34 పాయింట్లు లేదా 0.06 క్షీణించి 60,624.45 వద్ద , నిఫ్టీ 50 34.30 పాయింట్లు లేదా 0.19శాతం పడిపోయి 17,837.40 వద్దకు చేరుకుంది. రెండు రోజుల రికవరీ తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు( ఫిబ్రవరి 9) నష్టాల్లోకి జారుకున్నాయి. పబ్లిక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయడానికి తక్షణమే అందుబాటులో ఉన్న అదానీ గ్రూప్-లింక్డ్ షేర్ల సంఖ్యకు సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ సమీక్ష ప్రకటించనున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఫిబ్రవరిలో సాధారణ సమీక్షలో భాగంగా. గ్లోబల్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ (GIMI)తో అనుసంధానమైన అదానీ స్టాక్ల మార్పులు ఈరోజు తర్వాత ప్రకటించనుంది. దీంతో అదానీ గ్రూప్లోని మొత్తం 10 స్టాక్లు ముఖ్యంగా ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 15 శాతం కుప్పకూలింది. అంతకుముందు రెండు రోజుల్లో 35 శాతం ఎగిసింది. క్షీణించిన ఇతర గ్రూప్ స్టాక్లలో అదానీ పోర్ట్స్ 7 శాతం, అదానీ పవర్ 5 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం, ఏసీసీ 3.7 శాతం, అంబుజా సిమెంట్ 6.3 శాతం, ఎన్డిటివి. 3.7 శాతం ఉన్నాయి. వీటితోపాటు, హీరోమోటో, యూపీఎల్ టాప్ లూజర్స్గా కొనాసగుతున్నాయి సెన్సెక్స్లో దివీస్ ల్యాబ్స్; బజాజ్ ఫైనాన్స్, గ్రాసిం , బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయిలాభాల్లో ఉంది. 82.60 వద్ద కొనసాగుతోంది. -
హైదరాబాద్కు గుడ్ బై.. సమంత షాకింగ్ నిర్ణయం..!
సమంత ఇప్పుడిప్పుడే మెల్లగా సినిమాలపై దృష్టి సారించింది. కొన్ని నెలలుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సామ్ ఆ తర్వాత కోలుకుంది. యశోద మూవీ సక్సెస్ తర్వాత మరే ప్రాజెక్ట్లోనూ నటించలేదు. ప్రస్తుతం సమతం శాకుంతలం, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నా సిటాడెల్ సినిమా కోసం ముంబయిలోనే ఉండనున్నట్లు సమాచారం. గతేడాది యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది సామ్. తాజాగా సమంత ముంబయిలో రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ను కొనుగోలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వర్క్ కమిట్ మెంట్స్ కోసం ముంబైలో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. అందువల్లనే సామ్ ఫ్లాట్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై సమంత నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే గతంలోనూ సమంత ముంబయికి మారుతున్నట్లు వార్తలొచ్చాయి. గతంలో హైదరాబాద్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సామ్ వెల్లడించింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. శాకుంతలం, సిటాడెల్తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ చిత్రంలోనూ కనిపించనుంది. -
TodayStockMarketUpdate నష్టాల్లో స్టాక్మార్కెట్: అదానీషేర్ల లాభాలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా మొదలయ్యాయి. ఆ తరువాత అమ్మకాల ఒత్తిడితో ప్రస్తుతం సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 60,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 17,758 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫైనాన్షియల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, ఎఫ్ఎంసిజి షేర్లు నష్ట పోతున్నాయి. అటు అదానీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. మరోవైపు అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, డా.రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంకు,హెచ్డీఎఫ్స టాప్ గెయినర్స్గా, టాటా స్టీల్, హిందాల్కో, ఐటీసీ, హీరో మోటో, టాటామెటార్స్ టాప్ లూజర్స్గా కొనసాగు తున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 82.75 వద్ద ఫ్లాట్గా ఉంది. -
మార్కెట్లో కొనసాగుతున్న అదానీ సెగ
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బడ్జెట్ రోజు నిన్న (బుధవారం) ఒడిదుడుకులకు లోనైన సూచీలు గురువారం ఆరంభంలో సెన్సెక్స్ ఏకంగా 475 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్లో పుంజుకున్నాయి. అయితే అదానీ గ్రూపు వరుస నష్టాల మార్కెట్ను వెనక్కి లాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 224 పాయింట్లు ఎగిసి 59932 వద్ద, 6 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 16600 స్థాయిని నిలబెట్టుకుంది. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్పీవో ఉపసంహరణ ప్రకటన తర్వాత గ్రూపు షేర్లు మరింత పతనమైనాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఏకంగా 27 శాతం, అదానీ పోర్ట్స్ 7 శాతం కుప్పకూలింది. ఐటీసీ, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గానూ అదానీ గ్రూపు షేర్లతో పాటు,యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో ఆరంభ లాభాలను కోల్పోయి తిరిగి 82 స్థాయికి పడి పోయింది. -
లాభాలన్నీ పాయే: అదానీ, ఇన్సూరెన్స్ షేర్ల షాక్!
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా 1200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ చివరలో లాభాలను కోల్పోయింది. బడ్జెట్ ప్రసంగం తర్వాత మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభాలకు పరిమితమై 59,708వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17616 వద్ద స్థిరపడింది. యూనియన్ బడ్జెట్లో బీమా ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించడంతో బీమా కంపెనీల పతనమైనాయి అలాగే అదానీ గ్రూప్ షేర్ల భారీ నష్టాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేసింది. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ ,మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5శాతం నుండి 11శాతం మధ్య పతనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేయబడిన జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని సీతారామన్ ప్రతిపాదించారు. దీని ప్రకారం పాలసీల మొత్తం ప్రీమియం సంవత్సరానికి 500,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 26 శాతం, అదానీ పోర్ట్స్ 17శాతం కుప్పకూలాయి. మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా టాప్ గెయినర్లుగా ఉన్నాయి. -
ఫ్లాట్ ముగింపు, ఆటో జోరు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. గ్లోబల్ సానుకూల సంకేతాలు, దిగ్గజాల క్యూ3 ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ మంగళవారం నష్టాలనెదుర్కొంది. చివరికి నష్టాలను తగ్గించుకుని ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 60978 వద్ద , నిఫ్టీ ఫ్లాట్గా 18118 వద్ద ముగిసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.2 శాతం ఎగియగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ నష్టపోయాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్ , బ్రిటానియా టాప్ విన్నర్స్గా నిలిచాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, డా.రెడ్డీస్, హిందాల్కో, పవర్ గ్రిడ్, గ్రాసిం టాప్ లూజర్స్గా నిలిచాయి. ఫలితాల నేపథ్యంలో ఆటోమేజర్ మారుతి సుజుకి లాభపడింది. టాటా మోటార్స్ గురువారం ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ జోష్తో పీవీఆర్ షేరు భారీగా లాభపడింది. అటు డాలరు మారకంలో రూపాయి మరింత పతనమైంది. 28 పైసలు కుప్పకూలి 81.71 వద్ద ముగిసింది. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
నష్టాలనుంచి కోలుకుని ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఎప్ఐఐల అమ్మకాలు, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో బలహీనమైన ధోరణి మధ్య బుధవారం ప్రారంభ ట్రేడ్లో ఈక్విటీ బెంచ్మార్క్లు ప్రతికూలంగా ఆరంభమైనాయి. సెన్సెక్స్ 309 పాయింట్లు కక్షీణించి 60 వేల స్థాయినికోల్పోయగా, నిఫ్టీ 89పాయింట్లు క్షీణించి 17,824 వద్దకు చేరుకుంది. ఆ తరువాత నష్టాలను తగ్గించుకుని సెన్సెక్స్ కేవలం 10 పాయింట్ల నష్టంతో 60105 వద్ద,నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 17895 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, సన్ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీపీసీఎల్ లాభపడగా, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, హెచ్యూఎల్ నష్టపోయాయి. గ్రేటర్ నోయిడాలో బుధవారం ఆటో ఎక్స్పో ప్రారంభం నేపథ్యంలో ఆటో స్టాక్స్ పై ఇన్వెస్టర్ల దృష్టి పెట్టారు. వరుసగా మూడో రోజు కూడా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సానుకూలత కొనసాగుతోంది. 25పైసలు ఎగిసి 81.56 వద్ద ఉంది. -
సినీ ఇండస్ట్రీకి పెద్ద నేను కాదు: మెగాస్టార్ చిరంజీవి
-
షార్ప్ రికవరీ, ఆయిల్ షేర్లు జూమ్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ఫ్లాట్గానే ముగిసాయి. ఆరంభంలోనే 450 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ మిడ్సెషన్ తరువాత లాభాల్లోకి మళ్ళింది. సెన్సెక్స్ 51 పాయింట్లు కోల్పోయి 62131 వద్ద, నిఫ్టీ ఫ్లాట్గా 18497 వద్ద స్థిరపడింది. ఆయిల్ రంగ, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీపీసీఎల్, దివీస్ లాబ్స్, కోల్ ఇండియా నెస్లే, యూపీఎల్లాభపడగా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, టైటన్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో 34 పాయింట్లు క్షీణించి 82.54 వద్ద ముగిసింది. -
కోలుకున్న మార్కెట్లు, కుప్పకూలిన రూపాయి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. అయితే ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకోవడం గమనార్హం. 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 62835 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 18701 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, టాటా స్టీల్, యూపీఎల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ భారీ లాభపడగా, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్ర, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 58 పైసలు కుప్పకూలి 81.79 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి ముగింపు 81.32 తో పోలిస్తే సోమవారం స్వల్పంగ నష్టపోయిన రూపాయి ఆతరువాత మరింత పతనమైంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారు. డాలరు బలహీనంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలలో 1.4 శాతం పెరుగుదల కారణంగా రూపాయి సోమవారం కుప్పకూలింది. -
ఆటో షాక్, వరుసగా రెండో రోజూ నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీ బెంచ్మార్క్లు వరుసగా రెండవ రోజు నష్టాల్లో ముగిసాయి. శుక్రవారం మిడ్సెషన్లో బాగా నష్టపోయిన సూచీలు చివరికి స్పల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 87పాయింట్లు లేదా 0.14 శాతం క్షీణించి 61,663, నిఫ్టీ 36 లేదా 0.2 శాతం క్షీణించి 18,308 వద్ద ముగిసింది. దాదాపు అన్నిరంగాల షేర్లు ఫ్లాట్గా ముగిసాయి. ముఖ్యంగా ఆటో రంగ షేర్లు నష్టపోగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభ పడ్డాయి. హెచ్సీఎల్ టెక్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర టాప్ విన్నర్స్గా నిలవగా ఎం అండ్ ఎం, బజాజ్ ఆటో, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి, సిప్లా టాప్ లూజర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి 6పైసల నష్టపోయి 81.70వద్ద ముగిసింది. -
రెండో రోజు అదో ధోరణి, అసలు ఏమైంది?
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం దిగి రావడంతో ఆరంభంలో100 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ వెంటనే సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సోమవారం నాటి ధోరణిని కొటిన్యూ చేస్తున్నాయి. సెన్సెక్స్ 13 పాయింట్ల నష్టంతో 61610 వద్ద,నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 18332 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో ఇండెక్స్ లాభాల్లో ఎఫ్ఎంసిజి, రియాల్టీ సూచీలు నష్టాల్లోనూ ఉన్నాయి. బ ఓఎన్జీసీ, హీరో మోటో, ఐసీఐసీఐ, బజాజ్ ఆటో భారీ లాభాల్లో, కోల్ ఇండియా, ఐటీసీ, టీసీఎస్, సన్ఫార్మ, హెచ్డీఎఫ్సీ టాప్ లూజర్స్గానూ కొనసాగుతున్నాయి. ఎల్టీఐ-మైండ్ట్రీ విలీనం సోమవారం నుంచి అమల్లోకి రావడంతో మైండ్ట్రీ 1 శాతం పెరిగింది. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టాలతో 81.28 వద్ద ఫ్లాట్గా కొనసాగుతోంది. ఆరంభంలోనే 12 పైసలు ఎగిసింది. కాగా మార్కెట్ ముగింపు తర్వాత విడుదలైన డేటాలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో మూడు నెలల కనిష్ట స్థాయి 6.77 శాతానికి తగ్గిందని, సెప్టెంబర్లో ఐదు నెలల గరిష్ఠ స్థాయి 7.41 శాతానికి తగ్గింది. -
లాభాలు పాయే: ఫార్మా డౌన్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. శుక్రవారం నాటి భారీ ర్యాలీకి చెక్ పెట్టిన సూచీలు సోమవారం ఆరంభంలో నష్టాలను చూశాయి. 76 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్ ఆ తరువాత 150 పాయింట్లకు పైగా ఎగిసింది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంకింగ్, ఫార్మరంగ షేర్ల నష్టాలుమార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 65 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం డేటాపై ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. టాటా స్టీల్, పవర్గ్రిడ్,ఎం అండ్ ఎం, కోటక్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. అలాగే హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, జేఎస్డబ్య్లూ స్టీల్, బజాజ్ ఆటో లాభపడుతుండగా డా.రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మ, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. ఎగిసిన రూపాయి అటు మారకంలో రూపాయి ఆరంభంలోనే 25పైసలు ఎగిసిన రూపాయి 80.53 స్థాయికి చేరింది. -
ఆటో షాక్: నష్టాల్లో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో నాలుగు రోజుల లాభాలకు సూచీలు చెక్ చెప్పాయి. ఫలితంగా సెన్సెక్స్ 101 పాయింట్లు క్షీణించి 61019 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు కోల్పోయి 18120 వద్ద కొనసాగుతున్నాయి. షేర్లు నష్టపోతుండగా, మీడియా, ఫార్మా షేర్ల లాభాలకు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. దీంతో నిఫ్టీ 18 వేలకు ఎగువన, సెన్సెక్స్ 61 వేలకు ఎగువన స్థిరంగా ఉన్నాయి. మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ స్టేట్మెంట్ను ప్రకటించనుంది.దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది. సన్ఫార్మా, డా.రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, మారుతి, హీరో మోటార్స్ నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి స్వల్ప నష్టంతో ఉంది. 1 పైసా నష్టంతో 82.70 వద్ద ఉంది. -
ఫ్లాట్ ముగింపు, రూపాయి రికార్డ్ కనిష్టం
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు రెండు రోజుల వరుస లాభాలకు చెక్ పెట్టాయి. ఆరంభ లాభాలను కోల్పోయి వారాంతంలో ఫ్లాట్గా ముగిసాయి. అయితే సెన్సెక్స్ 200 పాయింట్లు పడి 58014 స్థాయిని తాకింది. చివర్లో బాగా పుంజుకుని సెన్సెక్స్ 31 పాయింట్లు నష్టపోయి 58191 వద్ద, నిఫ్టీ 17పాయింట్లు క్షీణించి 17314 వద్ద స్థిరపడ్డాయి. టాటా, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎస్బీఐ, ఎంఅండ్ఎం టాప్ లూజర్స్గా ఉన్నాయి. టైటన్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంకు టాప్ గెయినర్స్గా నిలిచాయి. అటు డాలరు మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి చేరింది. ఏకంగా 54 పైసల నష్టంతో 82.32 ఆల్ టైం కనిష్టం వద్ద ముగిసింది. గత సెషన్లో 81.88 వద్ద క్లోజ్ అయింది. -
వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాలే
సాక్షి,ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకులమధ్య కొనసాగిన సూచీలు చివరికి ఫ్లాట్గా ముగిసాయి.వరుసగా ఐదో రోజు నష్టాలనెదుర్కొన్నాయి. నవంబర్ 2020 నుండి కనిష్ట స్థాయికి కోలుకుని, సెన్సెక్స్, నిఫ్టీ ఆరంభంలో 200 పాయింట్లకు పైగా ఎగిసాయి.చివరికి సెన్సెక్స్ ఇండెక్స్ 38 పాయింట్ల నష్టంతో 57,108 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 9 పాయింట్లు నష్టంతో 17,007వద్ద ముగిసింది. టాటా స్టీల్, టైటాన్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డిఎఫ్సి ట్విన్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు పవర్గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సిఎల్ టెక్,నెస్లే ఇండియా లాభపడ్డాయి. -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్.. ధరెంతంటే?
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ఫోర్ బంగ్లాస్ ప్రాంతంలోని పార్థినాన్ సోసైటీలో ఈ స్థిరాస్తిని కోనుగోలు చేశారని సమాచారం. బహుళ అంతస్తుల భవనంలోని 31వ ఫ్లోర్లో దాదాపు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఫ్లాట్ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫ్లాట్ ఖరీదెంత అనేది విషయం బయటికి రాలేదు. అయితే ఫ్లాట్లో బాలీవుడ్ సూపర్స్టార్ నివాసం ఉండేందుకు కాదట. ఈ ఫ్లాట్ను కేవలం పెట్టుబడి ప్రయోజనాల కోసమే కొనుగోలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్బీ ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన జుహూలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. (చదవండి: వారంటే మా నాన్నకు చాలా గౌరవం: అమితాబ్) ఇటీవల రిలీజైన బ్రహ్మాస్త్రలో అమితాబ్ ప్రధానపాత్రలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో అలియా భట్, రణ్బీర్ కపూర్, నాగార్జున, మోనీరాయ్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభాస్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో బిగ్ బీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు వికాస్ బాహ్ల్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుడ్బై'లోనూ అమితాబ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అమితాబ్కు కూతురిగా నటిస్తోంది. వీటితో పాటు అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి-14 సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతోంది. -
దూసుకుపోతున్న వైజాగ్.. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టులో వెల్లడైన వాస్తవాలు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు దేశాన్ని ముందుకు నడిపే శక్తి కేంద్రాలు. ఈ నగరాల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తుంది విశాఖ మహా నగరం. నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోని మెట్రో సిటీలతో విశాఖ పోటీ పడుతోంది. టైర్–1 సిటీల కంటే ద్వితీయ శ్రేణిలో ఉన్న వైజాగ్, ఇతర నగరాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయంటూ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన సర్వేలో వెల్లడైంది. బెంగళూరు, చెన్నైలను మించి ఇళ్ల ధరలు విశాఖలో పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత అమ్మకాలు పెరగడం విశేషం. సాక్షి, విశాఖపట్నం : అందమైన నగరంలో నివసిస్తే.. అద్భుతమైన జీవితం సొంతమవుతుందనే అభిప్రాయం ఉంది. అవకాశం వస్తే.. విశాఖలోనే నివసించాలని కోరుకునేవారు లక్షల్లో ఉన్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలోని నగరాలతో పోలిస్తే.. విశాఖ విశాలమైన, ప్లాన్డ్ సిటీగా దేశ విదేశీ ప్రముఖులు సైతం కొనియాడారు. భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖ వైపు చూసేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు నివాస యోగ్యమైన నగరంగా విశాఖపట్నం గుర్తింపు పొందింది. తాజాగా ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సర్వేలో నివాసానికి అనువైన నగరాల్లో టైర్–2 సిటీలు మెట్రో సిటీలకంటే ముందు వరుసలో ఉన్నాయని తేల్చి చెప్పింది. ద్వితీయ శ్రేణి నగరాలపైనే ఆసక్తి మహా నగరాల్లో నివసించడమంటే ఒక క్రేజ్గా భావించేవారు ఒకప్పుడు. కానీ.. ఇప్పుడు మెట్రో నగరాలంటే వెగటు పుట్టే స్థాయికి చేరుకుంటోంది. ఎందుకంటే.. పెరుగుతున్న జీవన వ్యయం, పెచ్చరిల్లుతున్న కాలుష్యం, చిన్నవయసులోనే ముంచుకొస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు మెట్రో సిటీలకు ప్రజల్ని దూరం చేస్తున్నాయి. దీంతో అందరూ ఇప్పుడు టైర్–2, టైర్–3 సిటీస్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడిప్పుడే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలవైపు ఆసక్తి చూపుతున్నారు. మెట్రో నగరాల్లో మనం అనుకున్న మొత్తానికి అద్దెకు ఇల్లు దొరకడమే గగనంగా మారింది. ఇక సొంతింటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో సొంతిల్లు అంటే.. అందని ద్రాక్ష మాదిరే. కానీ.. విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో రెక్కల కష్టాన్ని కూడబెట్టుకొని సొంత ఇంటిని కొనుగోలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అత్యంత అందుబాటులో అద్దె ఇళ్ల ధరలు ఉండటం కూడా ఈ పట్టణాలవైపు చూసేలా చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత జోరు కోవిడ్ కారణంగా పని విధానంలో మార్పులు రావడం.. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ద్వారా పనిచేయడంతో ఈ మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఈ విధానంలోనే పనిచేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హైబ్రిడ్ మోడల్కు షిఫ్ట్ అవుతున్నాయని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా క్రమంగా పెరగడం.. లివింగ్ కాస్ట్ ఈ నగరాల్లో తక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో సిటీల నుంచి ఇతర సిటీలకు మారుతున్నారని పేర్కొంది. కొత్త ఇల్లు కొనేందుకు పెద్ద నగరాలతో పోలిస్తే.. టైర్–2 నగరాల్లో ధరలు కాస్తా తక్కువ ఉండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. డిమాండ్ క్రమంగా పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫ్రీలాన్స్ జాబ్స్ ట్రెండ్ కూడా విస్తరించడం.. ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: స్టార్టప్లకు ‘కల్పతరువు’) బెంగళూరును మించి ఆసక్తి... దేశంలో మెట్రో నగరాలతో పోలిస్తే టైర్ 2, 3 సిటీల్లో ఇళ్ల రేట్లు వేగంగా పెరుగుతున్నాయని ఎస్బీఐ సర్వే తెలిపింది. బెంగళూరు, కోల్కతా, పూణే వంటి మెట్రోలతో పోలిస్తే విశాఖపట్నం, లక్నో, రాయ్పూర్, సూరత్, వడోదరా, జైపూర్, గౌహతి, డెహ్రాడూన్ వంటి ద్వితీయ శ్రేణి, కోయంబత్తూర్, నోయిడా వంటి టైర్–3 నగరాల్లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. బెంగళూరు, ముంబై, పూణె, కోల్కతా కంటే ఎక్కువగా విశాఖపట్నంలో నివసించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటం విశేషం. బెంగళూరులో 2018–19లో ఇళ్ల ధరలు 8.7 % పెరగగా, 2019–20 లో పెద్దగా మార్పు కనిపించలేదు. అదే 2020–21లో 6.2 శాతం, 2021–22 లో కేవలం 3.3 % మాత్రమే పెరిగాయి. కానీ విశాఖపట్నంలో మాత్రం 2018–19 లో 4.9 %, 2019–20 లో 10.3 % పెరిగాయి. 2020–21 కోవిడ్ కారణంగా 2.5 % తగ్గినా, 2021–22 లో మాత్రం 11.3 % పెరగడం చూస్తే.. విశాఖపట్నంలో నివసించేందుకు ఎందరు ఆసక్తి చూపుతున్నారో అర్థమవుతోంది. (క్లిక్: విశాఖ to బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్కు ఫుల్ డిమాండ్) ఆహ్లాదకరమైన వాతావరణానికే ఓటు.. టైర్–2 నగరాల్లో నివసించేందుకు ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఓటేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాసమే కాకుండా.. సరికొత్త జీవన సరళికీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన వ్యయం కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యమిస్తుంటారు. ఈ క్వాలిటీలన్నీ ఉన్న నగరాల్లో విశాఖ ముందు వరసలో ఉంటోంది. అందుకే విశాఖ వంటి నగరాలకు డిమాండ్ పెరిగింది. పరిపాలన రాజధానిగా భాసిల్లుతున్న నేపథ్యంలో డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి. ద్వితీయ శ్రేణి నగరమే అయినా.. మహా నగరాలతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు విశాఖ నగరం సొంతం చేసుకోవడం వల్లనే డిమాండ్ ఉంది. – కె.ఎస్.ఆర్.కె.సాయిరాజు, క్రెడాయ్ అధ్యక్షుడు -
నష్టాలను కుదించుకుని ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. ఆరంభంలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టాలకు పరిమితమై 59028 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17624వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఐటీ షేర్లు ఎగిసాయి. సిమెంట్ షేర్లు భారీగా లాభపడ్డాయి. టాటామెటార్స్, బజాజ్ ఆటో, హ్ఎచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా స్టీల్, టాప్ లూజరర్స్గానూ, శ్రీసిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ పోర్ట్స్, సిప్లా,కోల్ ఇండియా , బ్రిటానియా టాప్ గెయినర్స్గానూ నిలిచాయి. -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు అక్కడక్కడే ముగిసాయి. రోజంతా ఫ్లాట్గాకొనసాగిన కీలక సూచీలు ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 59,197 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టంతో 17,656 వద్ద స్థిరపడ్డాయి. ఇది చదవండి: బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచింది. బజాజ్ఫిన్ సర్వ్, టాటా ప్రొడకక్ట్స్, బ్రిటానియా, యూపీఎల్, కోటక్ మహీంద్ర ఇతర టాప్ లూజర్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, భారతిఎయిర్టెల్, ఎన్టీపీసీ, శ్రీసిమెంట్స్, టాటాస్టీల్ లాభపడ్డాయి. -
రోజంతా ఒడిదుడుకులు: చివరికి ఫ్లాట్గా
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి.సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 58803 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 17539 వద్ద స్థిరపడ్డాయి. శుక్రవారం పాజిటివ్నోట్తో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరికి వారాంతంలో ఫ్లాట్గా ముగిసాయి ఇది చదవండి: 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా! రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి లార్జ్ కాప్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్టీ, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, హిందాల్కో, హీరో మోటో, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 79.76 వద్ద 26 పైసలు కోల్పోయింది. ఇదీ చదవండి: WhatsApp: దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్ -
ఫ్లాట్ అమ్ముతున్నారా? అయితే ఈ విషయాలు గమనించండి
ప్రశ్న: నేను హైదరాబాద్లో నా ఫ్లాట్ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్ జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. ♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి. ♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు. ♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి. ♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్లైన్లో దొరుకుతుంది. ♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు. ♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు. ♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి. ♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. ♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి. ♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి. నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త -
కొనసాగుతున్న వోలటాలిటీ, ఆదుకుంటున్న బ్యాంకులు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 60 పాయింట్ల లా భపడగా,నిఫ్టీ 20 పాయింట్లు ఎ గిసి 17597వద్ద ట్రేడ్ అయ్యాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. లాభనష్టాల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 50, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయాయి. ఐటీసీ, అపోలో హాస్పిటల్ సిప్లా,విప్రో, ఇండస్ బ్యాంక్ లాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి. సెభారతి ఎయిర్టెల్, దివీస్, మారుతి గగ్రాసిం, టైటన్, రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్షీణించాయి. -
రెండు రోజుల లాభాలకు చెక్: ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: రెండు రోజుల లాభాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్మార్కెట్లు రెండు రోజుల లాభాలకుచెక్ చెప్పాయి. గురువారం ఆరంభంలో 200 కుప్ప కూలినా, ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 42 పాయింట్లు 59290వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 17650వద్ద ఫ్లాట్గా కొనసాగుతోంది. టాటా స్టీల్, ఎన్టీజీసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యు స్టీల్,ఎన్టీపీసీలాభపడుతున్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, నెస్లే నష్టపోతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ ఇంకా చాలా చేయాల్సి ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
రోజంతా ఒడిదుడుకులు: చివరికి ఫ్లాట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలనుంచి భారీగా పుంజుకుని స్వల్ప నష్టాలకు పరిమితమైనాయి. ముఖ్యంగా ఐటీ, రియల్టీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి చివరికి సెన్సెక్స్ 35 పాయింట్లు క్షీణించి 58,817 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు లాభంతో 17534 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 17500కి ఎగువన,సెన్సెక్స్ 58800కి ఎగువన ముగియడం విశేషం. హిందాల్కో, యూపీఎల్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఆసియన్ పెయింట్స్, అదానీ, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి భారీగా పుంజుకుంది. 24 పైసలు లాభంతో 79.46 వద్ద ఉంది. -
అదానీ టోటల్: ఆసక్తికర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 138 కోట్లకు చేరింది. ఆటోమొబైల్స్కు సీఎన్జీ విక్రయాలు 61 శాతం జంప్చేసి 109 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లను తాకాయి. పైప్డ్ వంట గ్యాస్ అమ్మకాలు 3 శాతం పుంజుకుని 74 ఎంఎంఎస్సీఎంకు చేరాయి. అయితే సీఎన్జీ, వంటగ్యాస్ తయారీకి కొనుగోలు చేసిన సహజవాయు ధరలు మూడు రెట్లు ఎగసి రూ. 785 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. ఈ కాలంలో మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 1,110 కోట్లను తాకింది. నిర్వహణా లాభం 6 శాతం బలపడి రూ. 228 కోట్లుగా నమోదైంది. చదవండి : OnePlus10T 5G: వన్ప్లస్ 10 టీ వచ్చేసింది..ఆఫర్ అదిరింది! -
వరుస లాభాలకు చెక్, బ్యాంకింగ్ ఢమాల్: ఫ్లాట్గా ముగింపు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. రోజు సానుకూలంగా ప్రారంభమైనా తరువాత కీలక సూచీలు ఒడిదుకుకులనుఎదుర్కొన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల నష్టాలు మార్కెట్లను నష్టాల్లోకి మార్చాయి.చివరికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 17,382 వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా షేర్లు లాభపడగా, బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. గురువారం నాటి సెషన్లో ఎన్టీపీసీ, ఎస్బీఐ, రిలయన్స్ క్షీణించగా, సిప్లా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా లాభపడ్డాయి. మరోవైపు అమెరికా-చైనా టెన్షన్తో ఒడిదుడుకులు తగ్గడంతో ఇతర ఆసియామార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. అటు డాలరుమారకంలో రూపాయి మళ్లీ బలహీన ట్రెండ్లోకి మారింది. డాలరు మారకంలో 48పైసలు నష్టంతో 79.54 వద్ద ముగిసింది. -
ఆరంభ నష్టాలనుంచి పుంజుకున్న మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. ప్రారంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే స్థిరపడ్డాయి. ఆటో తప్ప మిగిలిన అన్ని రంగాలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఐటీ ఇండెక్స్ 2.3 శాతం నష్టపోయింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, హెల్త్కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు నష్టపోయాయి. ఉదయం ట్రేడింగ్లో 300 పాయింట్లకు పైగా నష్టపోయి సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టానికి పరిమితమై 54395 వద్ద, నిఫ్టీ కేవలం 4 పాయింట్లు నష్టంతో 16216 వద్ద ముగిసింది. తద్వారా 16200 స్థాయికిపైన స్థిరపడింది. ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, టాటాస్టీల్, ఎంఅండ్ఎం, డా.రెడ్డీస్ లాభాల్లో ముగియగా, భారతి ఎయిర్టెల్, టీసీఎస్, హెచ్సీఎయల్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్ నష్ట పోయాయి. మరోవైపు దేశీయ కరెన్సీ సోమవారం మరో కొత్త కనిష్టానికి చేరింది. డాలరు మారకంలో రూపాయి తొలుత 79.40 వద్ద మరో ఆల్ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు దాని మునుపటి ముగింపు 79.26 కంటే 22 పైసలు తగ్గి 79.48 (తాత్కాలిక) వద్ద రికార్డు కనిష్ట స్థాయి ముగింపుతో స్థిరపడింది. -
రోజంతా ఒడిదుడుకులు: స్వల్ప నష్టాలకు పరిమితం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలో ఫ్లాట్ ఉన్నప్పటికీ ఆ తరువాత కొనుగోళ్ల సందడి నెలకొంది. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి. అయితే కీలక మద్దతు స్థాయిలకుపైన ముగియడం విశేషం. సెన్సెక్స్ 8 పాయింట్ల స్పల్ప నష్టంతో 53018 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 15780 వద్ద పటిష్టంగా ముగిసాయి. ఆటో, పీఎస్యు బ్యాంక్, రియల్టీ, మెటల్ షేర్లు నష్టపోగా, పవర్ , బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. బజాజ్ ఆటో, సిప్లా, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. -
Bandlaguda: రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: బండ్లగూడ, పోచారంలలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలానికి వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు సంబంధించి 39,082 మంది వినియోగదారులు ఆన్లైన్లో బిడ్లు దాఖలు చేశారు. ఇందులో బండ్లగూడలోని 2,246 ఫ్లాట్లకు 33,161 మంది బిడ్లు దాఖలు చేశారు. పోచారంలోని 1470 ఫ్లాట్టకు 5921 మంది బిడ్లు దాఖలు చేశారు. బిడ్లు దాఖలు చేసిన వారిలో లాటరీ ద్వారా ఎంపిక చేసి ఫ్లాట్లను కేటాయించనున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి పోచారం ఫ్లాట్స్ వినియోగదారులకు లాటరీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఫేస్బుక్, యూట్యూ బ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తున్నారు. బండ్లగూడ ఫ్లాట్స్కు మంగళవారం లాటరీ నిర్వహించనున్నారు. బండ్లగూడ డీలక్స్ ఫ్లాట్స్ వినియోగదారులకు బుధవారం లాటరీ నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. (క్లిక్: పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు) -
ఫెడ్ భయం, ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 78 పాయింట్లు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 15,725 వద్ద ట్రేడింగ్ను ఆరంభించాయి. మూడు రోజుల భారీ నష్టాల తరువాత ప్రస్తుతం కీలక సూచీలు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. యూఎస్ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు, ఆందోళన, ప్రపంచ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయి. హింద్మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్, అదానీ పవర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్,బజాజ్ ఆటో లాభాల్లోనూ, టాటా స్టీల్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్రిటానియా టాప్ లూజర్లుగా ఉన్నాయి. -
సిమెంట్ షేర్ల దెబ్బ, లాభాలన్నీ హుష్ కాకి
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు వారాంతంలో ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలో భారీ లాభాలతో మురిపించినసూచీలు మిడ్ సెషన్ సమయానికి స్తబ్దుగా మారిపోయాయి. ఒక్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 55769 వద్ద,నిఫ్టీ 44 పాయింట్లు క్షీణించి 16584 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగాలు మేజర్గా నష్టపోయాయి. రిలయన్స్ 3 శాతం ఎగిసి టాప్ గెయినర్గా నిలిచింది. ఇంకా ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, డా. రెడ్డీస్ లాభాలనార్జించాయి. అటుగ్రాసిం, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్స్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, టాప్లూజర్స్గా ఉన్నాయి. విస్తరణలో రూ. 12,886 కోట్ల పెట్టుబడిని ప్రకటించినప్పటికీ అల్ట్రాటెక్ సిమెంట్ నేడు (జూన్ 3న) 6 శాతం కుప్పకూలింది. తద్వారా 52 వారాల కనిష్టాన్ని తాకింది. అలాగే అంబుజా , రాంకో, ఏసీసీ ఇతర సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిసాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ పతనం, సానుకూల దేశీయ ఈక్విటీల మద్దతుతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి 13 పైసలు పెరిగి 77.47 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. చివరకు 3 పైసలు నష్టపోయి 77.63 వద్ద స్థిరపడింది. గురువారం 77.60 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
నష్టాల్లో ఆటో స్టాక్స్, ఊగిసలాటలో సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మర్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల బలహీన సూచనల సెన్సెక్స్ 62 పాయింట్ల నష్టంతో 55319 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 16492 వద్ద ట్రేడ్ అయింది. ప్రస్తుతం లాభాలతో కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా వోలటాలిటీ ధోరణి కనిపిస్తోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఎఫ్ఎంసిజి, ఆటో వరుసగా 1.17 ,0.76 శాతం వరకు పతనమైనాయి. హీరో మోటోకార్ప్ 3.27 శాతం మేర నష్టపోతుండగా, ఒఎన్జిసి, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్, పవర్గ్రిడ్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, ఎన్టిపిసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ ఇతర లూజర్స్గా ఉన్నాయి మరోవైపు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. -
హాట్ కేకులవుతున్న స్వగృహ ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్: అవన్నీ దాదాపు పదేళ్లకు పైగా వృథాగా పడిఉన్న నివాస భవనాలు. కొనేవారు లేరన్న సాకుతో ఇప్పటివరకు అమ్మకుండా వదిలేశారు. తాజాగా అమ్మకానికి పెడితే అవే ఇప్పుడు హాట్కేకులుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను (ఫ్లాట్లు) కొనేందుకు జనం పోటీ పడుతున్నారు. నగరంలోని బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఇళ్లను ఉన్నవి ఉన్నట్టుగా విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, దానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు ప్రాజెక్టుల్లో కలిపి 3,716 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యా హ్నం నాటికి 18,400 దరఖాస్తులు అందా యి. ఇంకా 18 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇళ్లు అమ్మకా నికి ఉంచటంతో డిమాండ్ బాగా పెరిగింది. బండ్లగూడలో ఒక్కో ఇంటికి 7 దరఖాస్తులు అటు ఎల్బీనగర్.. ఇటు ఉప్పల్.. మెట్రో రైలుతో అనుసంధానమైన ప్రాంతం.. వెరసి బండ్లగూడలోని స్వగృహ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇక్కడ 2,246 ఇళ్లను విక్రయానికి ఉంచగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు 15,600 దరఖాస్తులు అందాయి. ఇక్కడ 2, 3 బీహెచ్కే, సాధారణ, డీలక్స్ మోడల్ ఇళ్లు కలిపి తొలుత 1,501 ఫ్లాట్లను విక్రయానికి ఉంచాలని భావించారు. ఆ తర్వాత 745 సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా చేర్చి నోటిఫికేషన్ జారీ చేశారు. దీని వెనుక భాగాన బాగా పేరున్న ఓ ప్రైవేటు వెంచర్, ఓ పక్కన వందల సంఖ్యలో చెట్లున్న ప్రభుత్వ ఖాళీ స్థలం ఉండగా.. ప్రధాన రహదారికి అతి చేరువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్ కొనేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇప్పటివరకు ఒక ఇంటికి ఏడు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. పోచారంలో రెట్టింపు బండ్లగూడతో పోలిస్తే నగరానికి కాస్త దూరంగా ఉన్న పోచారంలో ఉన్న ఇళ్లకు పోటీ కొంత తక్కువగా ఉంది. ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం వరకు 1,470 ఇళ్లకు గాను 2,800 దరఖాస్తులు అందాయి. అంటే ఇళ్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయన్నమాట. అయితే బండ్లగూడలో పోటీ ఎక్కువగా ఉండి, లాటరీలో ఇల్లు మంజూరు కాని పక్షంలో, కనీసం పోచారంలోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఇందుకోసం దరఖాస్తులో రెండో చాయిస్గా పోచారం ప్రాజెక్టును కూడా సూచిస్తున్నారు. ఇలావుండగా కొందరు బిల్డర్లు కూడా భారీగా ఇళ్లను బుక్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకు ఈ ఇళ్లను దక్కించుకుని వాటిని ముస్తాబు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకునే ఉద్దేశంతో దరఖాస్తు చేస్తున్నారని సమాచారం. వృద్ధుల బ్లాక్కూ నోటిఫికేషన్ బండ్లగూడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వంద ఇళ్లతో ఓ బ్లాక్ను అప్పట్లోనే నిర్మించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడితే, నగరంలో ఉండే వృద్ధులైన తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించారు. నడిచేటప్పుడు పట్టుకోవటానికి వీలుగా గోడలకు హోల్డింగ్ బార్స్, టాయిలెట్లలో జారి పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు, వైద్యుల కోసం ఏర్పాటు, ఓ సమావేశ మందిరం, సొంతంగా వండుకునే ఓపికలేని వారికోసం కామన్ కిచెన్ లాంటి వసతులు ఇందులో ఉన్నాయి. కాగా వీటిని కూడా విక్రయించేందుకు 3 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మూడు రోజుల్లో వీటికి 25 దరఖాస్తులు రావటం విశేషం. మిగతా ఇళ్ల ధరలకే వీటినీ విక్రయిస్తారు. -
ఆరంభ లాభాలు ఆవిరి, ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్ లాభాలతోభారత ఈక్విటీ బెంచ్మార్క్లు లాభపడ్డాయి. బుధవారం మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నిఫ్టీ 79 పాయింట్లు ఎగిసి 16,200 పైన ట్రేడ్ అయింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లు, ప్రపంచ వృద్ధి ఆందోళనలు బలహీన అమెరికా ఆర్థిక డేటా ప్రభావంతో ఆరంభ లాభాలను కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 17పాయింట్లు పరిమిత లాభంతో కొనసాగుతున్నాయి. SBI లైఫ్ 2.64 శాతం ఎగిసి టాప్ గెయినర్గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎన్టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్న్నా భారీ లాభాలతో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బిఐ, ఎన్టిపిసి లాభపడుతుండగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాజిటివ్ నోట్తో ఉంది. మరోవైపు ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, ఎంఅండ్ఎం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
బుల్లితెర నటుడి కొత్త ఇల్లు.. కోట్లల్లో ధర..
Is Karan Kundrra Bought A Flat Worth 20 Crore In Bandra: హిందీ బిగ్బాస్ ఫేం, బాలీవుడ్ టీవీ నటుడు, మోడల్ కరణ్ కుంద్రా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలోని '81 అరీటే' భవనంలో 4 బీహెచ్కే ఫ్లాట్ను కొంటున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. చదవండి: పెళ్లయ్యాక 25 మంది పిల్లలను కంటాం ప్రస్తుతం గోరేగావ్లో ఉంటున్న కరణ్ కుంద్రా చాలా రోజులుగా బాంద్రా, జుహు వైపుకు మారాలని అనుకుంటున్నాడట. కరణ్ కుంద్రా చూస్తున్న ఫ్లాట్ ధర రూ. 20 కోట్లు. ఇందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, బార్బెక్యూ పిట్ మొదలైన విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనం నుంచి బాంద్రా సమీపంలోని సముద్రపు వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుందట. కరణ్ కుంద్రా త్వరలో 'నాగిని' సీరియల్ హీరోయిన్ తేజస్వి ప్రకాష్ను వివాహం చేసుకోనున్నాడని సమాచారం. వారిద్దరి కోసమే ఈ ఫ్లాట్ కొనుగోలు చేస్తున్నాడని బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్బాస్ హౌస్లో లవ్ జర్నీ కొనసాగించిన ఈ జంట బయటకు వచ్చాక వర్క్ షెడ్యూల్స్తో బిజీ అయిపోయింది. అయితే ఇటీవల తేజస్వి ఇంటికి తన పేరెంట్స్ను వెంటబెట్టుకుని వెళ్లిన కరణ్ కుంద్రా నుదుటన కుంకుమతో బయటకు రావడంతో వీరికి రోకా అయిపోయిందని ఫిక్స్ అయ్యారు నెటిజన్లు. దీంతో వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్త చక్కర్లు కొడుతోంది. కాగా రాజ్ కరణ్ కుంద్రా తల్లిదండ్రులు సంవత్సరంలో కొన్ని నెలలు యూఎస్లో నివసిస్తారు. అలాగే వారికి పంజాబ్లో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. చదవండి: ఫొటోలు తీసేందుకు ఇంట్లోకి వచ్చిన మీడియా, క్లాస్ పీకిన ప్రియుడు -
ఫ్లాట్ కంటే.. ప్లాటే బెటర్..? ప్రతియేడు ఇంత పెరుగుదలా!
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, కమర్షియల్ స్పేస్, రిటైల్.. ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్ ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని హౌసింగ్.కామ్ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని నివాస ప్లాట్లకే ఎక్కువ డిమాండ్ ఉందని వెల్లడించింది. స్థలాల కొరతే కారణం... పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్ ప్లాట్లకు, ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్ పునఃప్రారంభమైందని చెప్పారు. కరోనాతో పెరిగిన డిమాండ్.. ఢిల్లీ-ఎన్సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గుచూపుతున్నారు. 13-21 శాతం పెరిగిన ధరలు... హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేశారు. హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ.. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్పేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్ 99, ద్వారకా ఎక్స్ప్రెస్వే, సెక్టార్ 95ఏ, సెక్టార్ 70ఏ, సెక్టార్ 63లలోని నివాస స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. (చదవండి: ఉద్యోగుల కోసం వేల కోట్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన గూగుల్..!) -
తన ఇల్లు అద్దెకిచ్చిన సల్మాన్ ఖాన్.. నెలకెంతో తెలుసా ?
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ముంబైలోని తన ఆస్తుల్లో ఒకటైన ఫ్లాట్ను అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. బాంద్రా వెస్ట్లోని శివ్ అస్థాన్ హైట్స్లో నెలకు రూ. 95,000 చొప్పున సల్మాన్ అపార్ట్మెంట్ను అద్దెకు ఇచ్చాడని పలు నివేదికలు తెలిపాయి. బాంద్రా బ్యాండ్ స్టాండ్కు సమీంపలో ఉన్న గెలాక్సీ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తులో 758 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లాట్ను 33 నెలలకు గాను అద్దెకు ఇస్తున్నట్లుగా డిసెంబర్ 6న ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పత్రాలు Zapkey.com వెబ్సైట్లో పొందుపరిచినట్లు మనీ కంట్రోల్ తెలిపింది. అలాగే ఈ ఒప్పందంలో 5% ఎస్కలేషన్ నిబంధన ప్రకారం అద్దెదారు రూ. 2.85 లక్షలు డిపాజిట్ చెల్లించాడట. సల్మాన్కు ముంబై పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆస్తులు ఉన్నాయి. అతను బాంద్రాలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నెలకు రూ. 8.25 లక్షల ధరకు డూప్లెక్స్ ఫ్లాట్ను అద్దెకు ఇచ్చినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మక్బా హైట్స్లోని 17, 18వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్ బాబా సిద్ధిక్, జీషన్ సిద్ధిక్లు కొనుగోలు చేసినట్లు పత్రాల్లో ఉందని సమాచారం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఒప్పందాన్ని పునరుద్ధరించాడట. సల్మాన్ తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని ఒక వన్ బీహెచ్కే ఇంట్లో నివసిస్తున్నాడని మహేష్ మంజ్రేకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే సల్మాన్కు నగర శివారైన పన్వెల్లో ఒక ఫామ్హౌజ్ ఉందని తెలిపాడు. ఒక ఇంటర్వూలో సిద్ధార్థ్ కన్నన్తో సల్మాన్ గురించి మహేష్ మాట్లాడుతూ 'సల్మాన్ ఎక్కడ ఉంటారో మీకు తప్పక తెలిసే ఉంటుంది. అది ఒక వన్ బీహెచ్కే ఫ్లాట్. నేను ఆయన ఇంటికి వెళ్లినప్పుడు సగం సమయం అతను డ్రాయింగ్ రూమ్లోని ఒక సోఫాలో పడుకుని ఉన్నాడు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఇంతటి మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోయాను.' అని పేర్కొన్నాడు. -
అపార్ట్మెంట్ను అమ్మేసిన హర్భజన్ సింగ్.. లాభం ఎంతో తెలుసా..?
Harbhajan Singh Sells Apartment in Mumbai For Rs 17.58 crore: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ముంబైలో అంధేరిలో ఉన్న తన అపార్ట్మెంట్ను రూ. 17.58 కోట్లకు జేబిసీ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీకి విక్రయించాడు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ "జాప్కీ.కామ్" పత్రాల ప్రకారం.. హర్భజన్ 2018 మార్చిలో రూ.14.5 కోట్లకు తన పేరిట అపార్ట్మెంట్ను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ లావాదేవీపై 87.90 లక్షల స్టాంప్ డ్యూటీని భజ్జీ చెల్లించాడు. దాదాపు నాలుగేళ్లలో మూడు కోట్లకు పైగా హర్భజన్ లాభం పొందాడు. కాగా ఈ అపార్ట్మెంట్ అంధేరీ వెస్ట్లోని రుస్తోమ్జీ ఎలిమెంట్స్ ప్రాజెక్ట్ తొమ్మిదవ అంతస్తులో ఉంది. అదే విధంగా టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబైలోని లోధా వరల్డ్ క్రెస్ట్లో ఓ అపార్ట్మెంట్ను 11.85 కోట్లకు కొనుగోలు చేశాడు. చదవండి: Ind Vs NZ Test Series: మెనూ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ -
ఫ్లాట్గా ప్రారంభం.. నష్టాలతో ముగింపు
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ బుధవారం చివరి గంటలో నష్టాలను మూటగట్టుకుంది. మరో గంటలో మార్కెట్ ముగుస్తుందనగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఉత్సాహం చూపటడంతో సెన్సెక్స్ ఒత్తిడికి లోనైంది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 54,730 పాయింట్లతో ప్రారంభమయ్యింది. తొలి గంట సేపు పాయింట్లను పొందుతూ ఒక దశలో గరిష్టంగా 54,758 పాయింట్లను తాకింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు సూచీ ఫ్లాట్గానే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు ఎక్కువై పోవడంతో వరుసగా పాయింట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. చివరకు మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి 28 పాయింట్లు నష్టపోయి 54,525 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం నష్టాల దిశగా పయణించినా చివరి అరగంటలో కోలుకుంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి కేవలం రెండు పాయింట్లు లాభపడి 16,282 పాయింట్ల వద్ద ఆగిపోయింది. టాటీ స్టీల్, ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు పొందగా కోటక్ మహీంద్రా, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, నెస్టల్ షేర్లు నష్టాలు పొందాయి. బ్యాంకు నిఫ్టీ కిందివైపు 0.63 శాతం నమోదైంది. -
ఫ్లాట్ ఖరీదు రూ.111 కోట్లు
కరోనా మహమ్మారి లగ్జరీ గృహాలను తాకలేదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, లగ్జరీ ప్రాపర్టీ ధరల క్షీణత, కొన్ని నగరాలలో స్టాంప్డ్యూటీ, సర్కిల్ ధరల తగ్గింపులు వంటివి డిమాండ్ వృద్ధికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) మధ్య కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డ్ స్థాయిలో లగ్జరీ ప్రాపర్టీలు రూ.4 వేల కోట్లకు పైగా లావాదేవీలను నమోదు చేశాయని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్లో ప్రీమియం గృహాల విక్రయాలు 158 శాతం వృద్ధిని నమోదు చేశాయని నైట్ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ఆకర్షణీయమైన, ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముంబై ఒకటని మరోసారి రుజువైంది. ఈ ఏడాది హెచ్1లో ముంబైలో రూ.15 కోట్లకు పైగా ధర ఉండే లగ్జరీ గృహాల లావాదేవీలపై స్క్వేర్ యార్డ్స్ నివేదికను విడుదల చేసింది. హెచ్1లోని మొత్తం గృహ విక్రయాలలో రూ.15 కోట్లకు పైగా ధర ఉండే గృహాలు 45 శాతం, రూ.30–40 కోట్ల ధర ఉండేవి 10 శాతం, రూ.50 కోట్లపైగానే ధర ఉండే గృహాలవి 7 శాతం లావాదేవీలు జరిగాయి. 60 శాతం లగ్జరీ గృహాల లావాదేవీలు సౌత్ ముంబైలోని లోయర్ పరేల్లోని నివాస ప్రాజెక్ట్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వం స్టాంప్డ్యూటీని 2 శాతం తగ్గించడం, అధిక విలువ గల గృహాల ధరలలో 15–30 శాతం క్షీణించడం వంటివి లగ్జరీ ప్రాపర్టీల డిమాండ్కు ప్రధాన కారణమని స్క్వేర్ యార్డ్స్ బిజినెస్ హెడ్ ఆనంద్ మూర్తి తెలిపారు. 58 శాతం లావాదేవీలు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో జరగగా.. 14 శాతం తుది దశకు చేరుకున్న నిర్మాణాలలో, 28 శాతం నిర్మాణంలో ఉన్న వాటిల్లో జరిగాయి. స్టాంప్డ్యూటీ తగ్గింపుతోనే జోరు.. ఈ ఏడాది మార్చి 31 వరకు 2 శాతం స్టాంప్డ్యూటీ మినహాయింపు అందు బాటులో ఉండటంతో జనవరి–మార్చి (క్యూ1) వరకు రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. ఆ తర్వాత త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. క్యూ1తో పోలిస్తే క్యూ2లో రిజిస్ట్రేషన్లు 73 శాతం తగ్గాయి. క్యూ1లోని మొత్తం రిజిస్ట్రేషన్ల లావాదేవీలలో లగ్జరీ గృహాల వాటా 79 శాతంగా ఉంది. వీటి విలువ రూ.3 వేల కోట్ల పైమాటే. ఇక క్యూ2 నాటికి వీటి వాటా 21 శాతానికి క్షీణించింది. విలువ రూ.900 కోట్లుగా ఉంది. రూ.50–100 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా క్యూ1లో 4 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 1 శాతం క్షీణించి 3 శాతానికి చేరింది. క్యూ1లో రూ.100 కోట్లకు పైగా విలువ ఉన్న గృహాల వాటా 6 శాతంగా ఉండగా.. క్యూ2 నాటికి 2 శాతానికి చేరింది. ఎవరు కొన్నారంటే? నలభై, అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అపార్ట్మెంట్లలో 34 శాతం లావాదేవీలు జరిగాయి. 43 శాతం ట్రాన్సాక్షన్స్ 4–6 వేల చ.అ. మధ్య విస్తీర్ణ గృహాలవే ఉన్నాయి. 67 శాతం గృహాలు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్లు కొనుగోలు చేయగా.. 40 శాతం లావాదేవీలు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్లే జరిపారు. బాంద్రాలోని మౌంట్మేరీ అపార్ట్మెంట్లో రూ.111 కోట్లతో 59,184 చ.అ.లలో అపార్ట్మెంట్ను అవధర్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేసింది. మలబార్ హిల్స్లోని సీసేన్లో రూ.103 కోట్లతో 7,833 చ.అ. ఫ్లాట్ను అబిస్ రియల్కాన్ కొన్నది. లోయర్ పరేల్లోని రహేజా ఆర్టీసియాలో సుప్రీంకోర్ట్ న్యాయవాది నటాషా ఎస్ దాల్మియా 4,074 చ.అ. రెండు అపార్ట్మెంట్లను ఒక్కోటి రూ.34 కోట్లతో కొనుగోలు చేసింది. ఓశివారాలోని ది అట్లాంటిస్ ప్రాజెక్ట్లో అమితాబ్ బచ్చన్ 5,704 చ.అ. ఫ్లాట్ను రూ.31 కోట్లతో కొనుగోలు చేశారు. ఇదే ప్రాజెక్ట్లో సన్నీలియోన్ 4,365 చ.అ. ఫ్లాట్ను రూ.16 కోట్లతో కొనుగోలు చేసింది. వీరితో పాటు సినీ నిర్మాతలు, దర్శకులు ఎల్ రాయ్, విపుల్ అమృతల్ షా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపఖ్ పరేక్ భార్య స్మిత డీ పరేఖ్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ అండ్ సీఈఓ ధీరజ్ రెల్లీ, మహారాష్ట్ర మంత్రి అశోక్ ఎస్ చవాన్, గోల్డ్మన్ శాక్స్ ఎండీ రజత్ సూద్ వంటి వాళ్లు జాబితాలో ఉన్నారు. రహేజా ఆర్టీసియా ప్రాజెక్ట్లో 18, ఇండియాబుల్స్ బ్లూలో 17, ఓంకార్ 1973, రహేజా వివేరా ప్రాజెక్ట్లలో చెరో 10 లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లోనూ ప్రీమియం జోరు కరోనా మహమ్మారి తర్వాతి నుంచి హైదరాబాద్లోనూ లగ్జరీ గృహాల విక్రయాలు, లాంచింగ్స్ జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది హెచ్1లో 11,974 గృహాలు అమ్ముడుపోగా... రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 44 శాతం, రూ.1–2 కోట్లకు పైన ధర ఉన్న యూనిట్లు 35 శాతం విక్రయమయ్యాయి. కొత్త గృహాల ప్రారంభాలను గమనిస్తే.. గతేడాది హెచ్2లోని మొత్తం లాంచింగ్స్లో లగ్జరీ గృహాల వాటా 18 శాతంగా ఉంది. అంటే మొత్తం 4,422 గృహాలు ప్రారంభం కాగా.. ఇందులో 1,544 యూనిట్లు రూ.1–2 కోట్ల మధ్య ధర ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్లే. ఇక ఈ ఏడాది హెచ్2లో చూస్తే.. మొత్తం 16,712 గృహాలు లాంచింగ్ కాగా 28 శాతం వృది రేటుతో 4,444 యూనిట్లు లగ్జరీ ఇళ్లే ఉన్నాయని నైట్ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గండిపేట, కోకాపేట, మోకిల, శంకర్పల్లి, కొంపల్లి, బాచుపల్లి వంటి ప్రాంతాలలో ప్రీమియం అపార్ట్మెంట్లు, విల్లాలు, శివారు ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 6 వేల చ.అ.ల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా అంతస్తుకు ఒకటే అపార్ట్మెంట్ ఉండే ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఆతిథ్య రంగంలోని కంపెనీలు విస్తరణ లేకపోవటంతో వాటి యజమానులు, క్యాపిటల్ గెయిన్ లాభాలను ఆర్జించే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈ తరహా గృహాలను కొనుగోలు చేస్తున్నారని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఇతర పొదుపు సాధనాల కంటే ఎక్కువ రాబడి, భద్రత, పన్ను ప్రోత్సాహకాలు ఉండటంతో రియల్టీలో పెట్టుబడులు పెరిగాయి. అవసరమైనప్పుడు ఎక్కువ ధరకు విక్రయించుకునే వీలుండటంతో దీని వైపే మొగ్గుచూపుతున్నారు. -
Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ మిశ్రమ సంకేతాల నడుమ సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి వద్ద, నిఫ్టీ పాయింట్లు నష్టపోయి వద్ద కొనసాగుతున్నాయి. ఆటో షేర్లు లాభపడుతున్నాయి. ఎం అండ్ ఎం, ఐసిఐసిఐ బ్యాంక్ రిలయన్స్ ,టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ , అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడుతుండగా, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు పుంజుకున్నాయి. బ్యారెల్కు 5 సెంట్లు పెరిగి 75.28 డాలర్లకు చేరుకుంది. -
stockmarket : బ్యాంకుల దెబ్బ, నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ఓపెనింగ్లో నష్టపోయినా, తరువాత కొద్దిగా పుంజుకున్నాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ కీలక సూచీలు నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్లు నష్టంతో 52607 వద్ద,నిఫ్టీ 56 పాయింట్లు కోల్పోయి 15758వద్ద ట్రేడ్ అవుతున్నాయి. తద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన స్థాయిలను కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బ్యాంకుల షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎల్ అండ్ టీ లాభపడుతుండగా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి కూడా బలహీనంగానే ఉంది. డాలరు మారకంలో సోమవారం నాటి ముగింపు 74.19 తో పోలిస్తే 74.28 వద్ద ట్రేడింగ్ను ఆరంభించింది. -
భారీ ఒడిదుడుకులు : 850 పాయింట్లు రికవరీ
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు చివరకు ఫ్లాట్గా ముగిసింది. రోజంతా కొనసాగిన తీవ్ర ఒడిదుడుకులు సామాన్య ట్రేడర్లను అయోమయంలో పడేశాయి. ఒక దశలో 600 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్ వెంటనే తేరుకుంది. చివరి గంటలో 120 పాయింట్ల మేర లాభపడింది.అంటేడే కనిష్టంనుంచి దాదాపు 850 పాయింట్లు మేర పుంజుకుంది. కానీ వారాంతంలో ఇన్వెస్టర్ల అమ్మకాలతో చివరికి సెన్సెక్స్ 21 పాయింట్ల లాభానికి పరిమితం కాగా, నిఫ్టీ 8 పాయింట్లు నష్టంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ తప్ప దాదాపు అన్నిరంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ప్రధానంగా ఐటీ, మీడియా, ఫార్మా ,మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా సెన్సెక్స్ 52350కి దిగువన, నిఫ్టీ 15700కి దిగువన ముగిసింది. ఓఎన్జిసి, కోల్ ఇండియా, ఎన్టిపిసి, యుపిఎల్, జెఎస్డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అదానీ పోర్ట్స్ 7 శాతం లాభపడి టాప్ విన్నర్గా ఉంది. ఇంకా హెచ్యుఎల్,బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్ మరియు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. డాలరుమారకంలో భారత రూపాయి ఇంట్రాడే నష్టాలనుంచి తేరుకుని డాలర్కు 22 పైసలు ఎగిసి 73.86 వద్ద ముగిసింది. గురువారం నాటి ముగింపు 74.08 తో పోలిస్తే శుక్రవారం 74.10 వద్ద ఫ్లాట్ ప్రారంభమైంది. -
stockmarket: సెన్సెక్స్,నిఫ్టీ కన్సాలిడేషన్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి జారుకున్నాయి. రికార్డు స్తాయిల వద్ద కీలక సూచీలు కన్సాలిడేట్ అవుతున్నాయి. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా ఎసిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 145 పాయింట్లు క్షీణించి 52189 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు నష్టంతో 15694 వద్ద కొనసాగుతోంది. తద్వారా 15700 స్థాయికి కోల్సోయింది. మెటల్, ఎనర్జీ, బేసిక్ మెటీరియల్స్ బ్యాంకింగ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటిసీ, లాభాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ,కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలతో మార్కెట్కు దన్నుగా నిలిచాయి. ప్రస్తుతం హిందాల్కో, జెఎస్డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్, టాటా స్టీల్, ఒఎన్జిసి, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ,ఎస్బీఐ నష్టపోతున్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.186 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 984 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
అమ్మకాల ఒత్తిడి: ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగియగా నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ వెంటనే లాభాలను కోల్పోయి ఫ్లాట్గా మారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1 పాయింట్ల లాభాలకు పరిమితమై 52100 వద్ద, నిఫ్టీ28 పాయింట్లు ఎగిసి 15699 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఐటీసీ, ఎల్అండ్టి, ఎన్టిపిసి, ఒఎన్జిసి లాభపడుతుండగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ , హెచ్డిఎఫ్సి నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. శుక్రవారం నాటి ముగింపు 72.99తో పోలిస్తే 72. 85 వద్ద కొనసాగుతోంది. -
మిశ్రమ ముగింపు : ఐటీ నష్టాలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్పల్ప నష్టాలతో ముగిసాయి. రికార్డు స్థాయి లాభాల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి మళ్లిన సూచీలు మిడ్ సెషన్ నుంచి కోలుకున్నాయి. ఒక దశంలో 300 పాయింట్లకు కోల్పోయినా, చివరికి సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 51849 వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో వద్ద 15576 పటిష్టంగా ముగిసాయి. బ్యాంకింగ్ మెటల్, ఫార్మా ఇండెక్స్ లాభపడగా, ఐటీ , ఎఫ్ఎంసిజి కంపెనీల షేర్లలో అమ్మకాలు కనిపించాయి. రిలయన్స్, ఇండస్ ఇండ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో , మారుతి, అదానీ పోర్ట్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టెక్ మహీంద్రా, ఐటీసి, ఇన్పోసిస్, యాక్సిస్, టైటన్, విప్రో, భారతి ఎయిర్టెల్, తదితరాలు నష్టపోయాయి. అటు డాలరుమారకలో రూపాయి 19పైసలు క్షీణించి 73.09 వద్ద ముగిసింది. చదవండి : Sun Halo: అందమైన రెయిన్బో.. ట్విటర్ ట్రెండింగ్ అద్దె ఇళ్ళు: మోడల్ టెనెన్సీ యాక్ట్కు గ్రీన్ సిగ్నల్ stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్ -
ప్రాఫిట్ బుకింగ్: లాభాలనుంచి వెనక్కి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. లాభాలతో ప్రారంభమై రికార్డు స్థాయి నమోదు తర్వాత కీలక సూచీలు స్పల్పనష్టాల్లోకి జారుకున్నాయి. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మిడ్సెషన్లో ఒక దేశలో 100 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ చివరలో తిరిగి పుంజుకుంది. దీంతో కేవలం 3 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 51934వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 15574 వద్ద ముగిసింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా మెటల్ , ఫార్మా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, పిఎస్యు బ్యాంక్, రియాల్టీ, ఆటో షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో గత ఏడు ట్రేడింగ్ సెషన్లలోని 5 శాతం నిఫ్టీ ర్యాలీకి బ్రేక్లు పడ్డాయి. ఓఎన్జీసీ, బజాజ్ ఫైన్సాస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, టెక్ ఎం, హెచ్యూఎల్ లాభపడగా, జెఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్ , ఐసీఐసీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, ఆక్సిస్ బ్యాంకు, ఐటీసీ, కోటక్ మహీంద్ర, పవర్ గ్రిడ్ తదితరాలు నష్టపోయాయి. చదవండి : కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? -
స్వల్ప నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయ్. సెన్సెక్స్ 80 పాయింట్లు కోల్పోయి 48610 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 14646 వద్ద కొనసాగుతున్నాయి. అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, హిండాల్కో బిఎస్ఇలో ఒక్కొక్కటి 2 శాతం చొప్పున నష్టపోతున్నాయి. యూపిఎల్, టిసిఎన్ఎస్ క్లాతింగ్, ప్రిన్స్ పైప్స్, ఛంబల్ ఫర్టిలైజర్స్, పాలీకేబ్ ఇండియా, వెంకీస్, కేపిఐటి టెక్నాలజీస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రధాన చమురు వినియోగదారుల భారతదేశంలో కరోనావైరస్ కేసులు జోరు, సైబర్ దాడి కారణంగా అమెరికాలో పైపులైన్ మూత తరువాత చమురు ధరలు రోజుకు 3 శాతం పడి పోయాయి. బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ 35 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి బ్యారెల్ 66.70 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 28 సెంట్లు లేదా 0.4 శాతం తగ్గి బ్యారెల్ 63.54 డాలర్లకు పడిపోయింది. -
లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి. ఆరంభంలో 100 పాయింట్లు ఎగిసిన సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 28 పాయింట్లు క్షీణించి 48655 వద్ద,నిఫ్టీ 8 పాయింట్లు పుంజుఉని 14626 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ , ఐటీ నష్టాల్లోనే, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్ స్టాక్స్ లాభాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, ఆటో, ఎఫ్ఎంసిజి, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లు ధోరణి కనిపిస్తోంది. ముఖ్యంగా క్యు4 ఫలితాల జోరుతో ఉన్న టాటా స్టీల్ మరో సారి 52 వారాల గరిష్టాన్ని సృష్టించింది. దాదాపు 5శాతం ఎగసింది. ఇంకా సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బిఐ , ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు యుపిఎల్, పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్ నష్టపోతున్నాయి. చదవండి: కరోనా థర్డ్ వేవ్ తప్పదు: సంచలన హెచ్చరికలు కరోనా విలయం: తండ్రి చితిపై దూకేసిన కుమార్తె కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బలహీనతకొనసాగుతోంది. ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 48603 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పతనమై 14602 వద్ద కొనాసగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ భారీగా నష్టపోతుండగా ఫార్మా స్టాక్స్ కూడా బలహీనంగా ఉన్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ సన్ ఫార్మా ఒక్కొక్కటి 1-3 శాతం నష్టపోయాయి. మరోవైపు మార్చి 2021 తో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో నికర లాభాలు భారీ క్షీణతను నివేదించిన టాటా కెమికల్స్ షేర్లు 7 శాతానికిపైగా నష్టపోయింది. అయితే బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలరు మారకంలో రూపాయి 73.95 వద్ద ఫ్లాట్ ట్రేడవుతోంది. -
చమురు సెగ : ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి, ముంబై : ఆరంభంలో లాభాలతో మురిపించిన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాలను కోల్పోయాయి. ప్రధానంగా అంతర్జాతీయ చమురు ధరలు ఆకాశానికి చేరడంతో ప్రధాన సూచీల్లో అమ్మకాల ఒత్తిడి తలెత్తింది. బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కి 70 డాలర్లు దాటడంతో దేశీయ మార్కెట్లు భారీగా ప్రభావితమైనాయి. దీంతో సెన్సెక్స్ 36 పాయింట్లు లాభానికి పరిమితమై 50441 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 పాయింట్ల లాభంతో 14956 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. తద్వారా నిఫ్టీ 15 వేల పాయింట్ల మార్క్ను కోల్పోయింది. సెన్సెక్స్ కూడా 50500 స్థాయి దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ రోజు అత్యధిక స్థాయిలో 580 పాయింట్లు పెరగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 15,111ను తాకింది. మీడియా, మెటల్, ఐటీ ఫార్మా సూచీలు లాభపడగా, రియాల్టీ, ఎఫ్ఎంసిజి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో షేర్లునష్టపోయాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టిపీసీ, ఎస్బీఐ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ఆ టో, హెచ్డిఎఫ్సి, హెచ్యుఎల్, టైటన్ నష్టపోయాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత మొదటిసారిగా అంతర్జాతీయ బ్రెంట్ చమురు ధరలు బ్యారెల్ 70 డాలర్లకు పెరగడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయి. -
ముంబైలో రష్మిక మందన్నా కొత్త ఇల్లు!
ఛలో సినిమా హిట్ తర్వాత ఏ భాషైనా, ఏ సినిమా అయినా ఆగేది లేదంటూ యమ స్పీడుగా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. తెలుగు, కన్నడ భాషలను సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న ఈ క్యూటీ ఈ మధ్యే మిషన్ మజ్నుతో బాలీవుడ్లోకి ప్రవేశించింది. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్తో బిజీగా ఉన్న ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. దీంతో మొన్నామధ్య లగ్జరీ కారు కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ఓ ఇల్లు కూడా కొందట. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్ తో ‘డాడీ’ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ రెండు చిత్రాల తర్వాత మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు కూడా రష్మిక ప్లాన్ చేసుకుంటోందని భావిస్తున్నారు అభిమానులు. ఎలాగో పాన్ ఇండియా సినిమాల్లో వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నందున రష్మిక ముంబైలో సెటిలవ్వాలనుకుంటోందా? ఏంటని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ముంబైలో ఆమె నిజంగానే కొత్త ఇల్లు కొనుక్కుందా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే రష్మిక దీనిపై స్పందించాల్సిందే. ప్రస్తుతం రష్మిక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప'లో నటిస్తోంది. ఇందులో ఆమె చిత్తూరు యాసలో మాట్లాడే పల్లెటూరి యువతిలా కనిపించనుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. మరోవైపు 'ఆడాళ్లు మీకు జోహార్లు' సినిమాలో శర్వానంద్తో జోడీ కడుతోంది. అలాగే మెగాపవర్ స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. చదవండి: ఆ వార్తలు నిజమైతే బాగుండు.. అదే నా కల: రష్మిక బిజీ బిజీగా మన స్టార్ హీరోయిన్లు.. -
ఫ్లాట్గా కొనసాగుతున్న స్టాక్మార్కెట్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత కారణంగా ప్రస్తుతం సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 51727 వద్ద నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 15233 కొనసాగుతోన్నాయి. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మాత్రం అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఐటీ, పీఎస్ఈ కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, ఓఎన్జీసీ , పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఐఓసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లాభంతోనూ ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్ నష్టంతో ఉన్నాయి. -
వారాంతంలో ఫ్లాట్గా
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ముగిసింది. రోజంతా పటిష్టంగా కదలిన స్టాక్మార్కెట్ వారాంతంలో మిశ్రమంగా స్థిరపడింది. డే హై నుంచి 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 13 పాయింట్ల లాభంతో 51544 వద్ద,నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 15163 వద్ద ముగిసాయి. దీంతో నిఫ్టీ 15200దిగువన ముగిసినట్టైంది. అయితే నిఫ్టీ బ్యాంకు ఒక శాతం లాభపడటం విశేషం. బ్యాంకింగ్, ఐటీ, రియల్టీరంగ షేర్లు లాభపడగా, మెటల్, ఫార్మా, ఎఫ్ఎసీజీ నష్టపోయాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్ లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయికి చేరింది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాల దెబ్బతో ఐటీసీ భారీ నష్టాలను మూట గట్టుకుంది. ఐటీసీ నికరలాభం 12 శాతం పడిపోయి 3,663 కోట్ల రూపాయలకు చేరుకుంది. కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, హిందూస్తాన్ యూనిలీవర్ నష్టాల్లో ముగిసాయి. -
రాణా కపూర్ రూ.127 కోట్ల ఫ్లాట్... ఈడీ జప్తు
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన కేసు విచారణలో భాగంగా యస్బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్కు శుక్రవారం రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. లండన్లో ఉన్న రూ.127 కోట్లు (13.5 మిలియన్ పౌండ్లు) విలువచేసే ఫ్లాట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మరోవైపు పలు కీలక లావాదేవీల విషయాన్ని వెల్లడించనందుకుగాను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రాణా కపూర్కు రూ.కోటి జరిమానా విధించింది. ఈడీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లండన్, 77 సౌత్ ఆడ్లీలో అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ ఉంది. డీఓఐటీ క్రియేషన్స్ జర్సీ లిమిటెడ్ పేరుతో 2017లో రూ.93 కోట్లకు (9.9 మిలియన్ పౌండ్లు) రాణా కపూర్ ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశారు. రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ముడుపులు తీసుకుని పలు సంస్థలకు యస్బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా రుణాలు ఇప్పించారని సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. దీని ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. రాణా కపూర్తో పాటుఆయన భార్య, ముగ్గురు కుమార్తెలపై మనీలాండరింగ్ కేసు నమోదయ్యింది. ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల విలువ దాదాపు రూ.2,011 కోట్లు. సెబీ జరిమానా ఎందుకంటే..: రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ (ఇప్పుడు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్) నుంచి యస్బ్యాంక్ అన్లిస్టెడ్ ప్రమోటర్ సంస్థ అయిన మోర్గాన్ క్రెడిట్స్ రూ.950 కోట్లను సమీకరించింది. 2018లో అన్లిస్టెడ్ జీరో కూపన్ నాన్–కన్వెర్టబుల్ డిబెంచర్ల ద్వారా ఈ నిధుల సమీకరణ జరిగింది. యస్బ్యాంక్ ప్రమోటర్ కూడా అయిన కపూర్, గ్యారంటార్గా ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఈ లావాదేవీకి సంబంధించి పూర్తి వివరాలు బ్యాంక్ డైరెక్టర్లకు తెలియజేయలేదు. ఈ వ్యవహారం మార్కెట్ క్యాపిటలైజేషన్కు సంబంధించి యస్బ్యాంక్పై ప్రతికూల ప్రభావం చూపింది. నంజున్దయా ఆయన కుటుంబ సభ్యుల రూ.255.17 కోట్ల ఆస్తులపైనా కొరడా... కాగా, ఇన్వెస్టర్లను భారీగా మోసం చేసిన కేసులో కన్వా గ్రూప్ కంపెనీల వ్యవస్థాపకుడు ఎన్ నంజున్దయా ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.255.17 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ శుక్రవారం విడుదల చేసిన మరో ప్రకటనలో తెలిపింది. కర్ణాటకలోని స్థిరాస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. బెంగళూరులోని కార్పొరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈడీ తాజా చర్యలు తీసుకుంది. శ్రీ కన్వా సౌహార్థ సహకార క్రెడిట్ లిమిటెడ్ ద్వారా అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి రూ.650 కోట్లు వసూళ్లు జరిపారని, ఈ విషయంలో నియమ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఆగస్టు 25న నంజున్దయా అరెస్టయ్యారు. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి నిందితుడు రూ.120 కోట్ల రుణాలను పొందినట్లు కూడా కేసు నమోదయ్యింది. -
నేడు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు!
వరుసగా నాలుగు రోజులపాటు లాభాలతో ముగిసిన దేశీ స్టాక్ మార్కెట్లు నేడు (27న) అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ యథాతథంగా 11,553 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,554 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో వరుసగా నాలుగో రోజు బుధవారం యూఎస్ ఇండెక్సులు ఎస్అండ్పీ, నాస్డాక్ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. నేడు ఎఫ్అండ్వో ముగింపు కారణంగా మార్కెట్లలో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సెన్సెక్స్-6 నెలల గరిష్టం రెండు రోజులుగా కన్సాలిడేట్ అయినప్పటికీ బుధవారం వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు జంప్చేసి 39,074 వద్ద ముగిసింది. వెరసి ఆరు నెలల తదుపరి 39,000 పాయింట్ల మార్క్ ఎగువన స్థిరపడింది. ఇక నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 11,550 వద్ద ముగిసింది. నిఫ్టీ కదలికలు? నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,488 పాయింట్ల వద్ద, తదుపరి 11,424 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,587 పాయింట్ల వద్ద, ఆపై 11,624 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,187 పాయింట్ల వద్ద, తదుపరి 22,960 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,547 పాయింట్ల వద్ద, తదుపరి 23,680 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కనిపించవచ్చని భావిస్తున్నారు. ఎఫ్పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,581 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,195 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్పీఐలు 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
షార్ప్ రికవరీ : స్పల్ప నష్టాలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనుంచి తేరుకుని స్వల్ప నష్టాలతో ముగిసాయి. జూన్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడిన కీలక సూచీలు చివరి గంటలో పుంజుకుని స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ఒక దశలో 350 పాయింట్లకుపైగా కుప్పకూలిన సెన్సెక్స్ 27 పాయింట్ల స్పల్ప నష్టంతో 34842 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు నష్టంతో 10288 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హిందాల్కో, ఇండియన్ ఆయిల్, ఐషర్ మోటార్స్, ఇన్ఫోసిస్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్ర నష్టపోయాయి. ఎఫ్ఎంసిజి ఇండెక్స్ 2 శాతం పెరిగి టాప్ గెయినర్ గా వుంది. ఐటీసీ టాప్ విన్నర్ గా నిలవగా, సన్ ఫార్మ, నెస్లే, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గెయిల్ ఇండియా, వేదాంత, హిందూస్తాన్ యూనిలీవర్, సిప్లా, ఐసీఐసీఐబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి. -
మెటల్, రిలయన్స్ అండ : కోలుకున్న మార్కెట్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కోలుకుని ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా కోల్పోయిన మార్కెట్లో రోజంతా తీవ్రంగా ఊగిసలాట ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టంతో 31097 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 9136 వద్ద ముగిసింది. తద్వారా కీలక సూచీలురెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన ముగిసాయి. మెటల్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. (లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం ) అయితే మిడ్ సెషన్ తరువాత నుంచి రిలయన్స్, భారతి ఎయిర్టెల్ కొనుగోళ్లతో మార్కట్ నష్టాల నుంచి కోలుకుంది. దాదాపు బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ నష్టాల్లో ముగిసాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ ,యాక్సిస్, ఫెడరల్, కెనరా బ్యాంకు, సన్ ఫార్మ, ఎం అండ్ ఎం, హీరో మోటో, బజాజ్ ఆటో, భారతి ఇన్ఫఫ్రాటెల్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మరోవైపు వేదాంతా, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూస్టీల్, టాటాస్టీల్, బ్రిటానియా, హిందాల్కో, ఓఎన్జీసీ లాభపడ్డాయి. -
మెటల్ దెబ్బ: మిశ్రమంగా ముగిసిన సూచీలు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. భారీ లాభాలనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరకు మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుని 31648వద్ద ముగియగా, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9261వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ముగిసాయి. అయితే హెచ్డీఎఫ్ సీ, ఇన్ఫోసిస్ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐటీ, ప్రభుత్వ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఆటో ఎఫ్ఎంసిజి , మెటల్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. (భారీ లాభాలు, ఒత్తిడిలో సూచీలు) టాటా మోటార్స్, సన్ ఫార్మ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, రిలయన్స్, ఐవోసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్ టాప్ విన్నర్స్ గా నిలిచాయి. హిందాల్కో, జెఎస్ డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ ఫ్రా టెల్, యాక్సిస్ బ్యాంకు,గ్రాసిం, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, విప్రో, మారుతి సుజుకి, వేదాంతా, కోల్ ఇండియా నష్టపోయాయి. కానీ సెన్సెక్స్ వరుసగా మూడవ రోజు లాభాలతో ముగిసింది. -
ఫ్లాట్ ముగింపు, యస్ బ్యాంకు జంప్
సాక్షి,ముంబై: తీవ్ర ఒడిదుడుకుల మధ్యసాగిన దేశీయ స్టాక్మార్కెట్లలో ఆరంభ లాభాలన్నీ అవిరైపోయాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో కీలక సూచీలు ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు లాభంతో 35697 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 10458 వద్ద ముగిసాయి. సోమవారం నాటి భారీ నష్టాలు, మంగళవారం హోలీ సెలవు తరువాత బుధవారం ఆరంభంలో నష్టాలను చవి చూశాయి. వెంటనే పుంజుకుని 300 పాయింట్లకు పైగా ఎగిసాయి. కానీ మిడ్ సెషన్నుంచి లాభాలను నిలబెట్టుకోలేక నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే యస్బ్యాంకు ఏకంగా 36శాతం జంప్ చేయగా, సోమవారం నాటి భారీ నష్టాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడింది. గెయిల్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, హిందాల్కో, ఎస్బీఐ. ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయాయి. జీ ఎంటర్టైన్మెంట్, భారతి ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, హీరోమోటో, రిలయన్స్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంకు లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్లో కనిపించని గ్లోబల్ జోష్
సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్, కరోనా వైరస్ బలహీనపడిందన్న సమాచారం స్టాక్ మార్కెట్లో ఉత్సాహం నింపలేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ఫ్లాట్గా సాగుతోంది. మెటల్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 41,302 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. చదవండి : బడ్జెట్ నష్టాలు భర్తీ -
లాభాల స్వీకరణ, ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడింగ్ను ఆరంభించాయి. దాదాపు ఈ వారమంతా లాభాల్లోనే సాగిన మార్కెట్లు వారాంతంలో బలహీనంగా ఉన్నాయి. ట్రేడర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 69 పాయింట్లు క్షీణించి 41239 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 12124 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లలోను ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. హీరో మోటో, ఎన్టీపీసీ, టైటన్, హెచ్సీఎల్టెక్, ఐటీసీ, బజాజ్ ఆటో, ఏషియన పెయింట్స్ టాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సన్ఫార్మ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, రిలయన్స్, కోటక్ మహీంద్ర నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి 71.26 వద్ద బలహీనంగా ట్రేడింగ్ను ఆరంభించింది. గురువారం నాటి ముగింపు 71.19 తో పోలిస్తే శుక్రవారం ఉదయం 6 పైసలు క్షీణించింది. -
పాలసీ రివ్యూ, అప్రమత్తంగా సూచీలు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా ఉత్సాహంగా మొదలైనాయి. ఒక దశలో డబుల్ సెంచరీకిపైగా లాభాలతో దూసుకుపోయినా, ఆర్బీఐ పాలసీ రివ్యూ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంతో 41211 వద్ద నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 12115 వద్ద కొనసాగుతున్నాయి. రియల్టీ తప్ప దాదాపు అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. ప్రధానంగా మెటల్, ఫార్మా, మీడియా, ఐటీ, పీఎస్యూ బ్యాంక్స్ లాభాల్లో ఉన్నాయి. జీ, యస్ బ్యాంక్, ఐవోసీ, వేదాంతా, సిప్లా, హెచ్సీఎల్ టెక్, హీరో మోటో, విప్రో, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ లాభపడుతుండగా, అయితే టాటా మోటార్స్, టైటన్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, యూపీఎల్, హిందాల్కో, నష్టపోతున్నాయి. -
ఐకానిక్ స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. 'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్, అత్యాధునిక, విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్ ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్ పాపర్టీస్ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. 3, 4 పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్లను ప్రారంభించింది. 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది. చెంబూర్లోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్ నటుటు రాజ్ కపూర్ ఆర్కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్ కుటుంబం గత ఏడాది జీపీఎల్కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
బలహీనంగా స్టాక్ మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టంతో , నిఫ్టీ 30 పాయింట్లు బలహీనంతో వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫలితాల ప్రభావంతో విప్రో నష్టపోతుండగా, మిగిలిన ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. టైటన్, రిలయన్స్, గెయిల్, భారతి ఎయిర్టెల్, సన్ఫార్మా టాప్ విన్నర్గా కొనసాగుతోంది. టాటా స్టీల్ , సెయిల్ తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పాఠకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు -
దలాల్ స్ట్రీట్లో ధరల ‘మంట’
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ముఖ్యంగా ఆసియా మార్కెట్లు రికార్డు లాభాలతో ఉంటే, దలాల్ స్ట్రీట్ మాత్రం చిన్న బోయింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ధరల షాక్తో కీలక సూచీలు రెండూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 69 పాయింట్లు నష్టంతో 41791 వద్ద, నిఫ్టీ పాయింట్లు 11 బలహీనతతో 12319 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ , ఆటో రంగాలు నష్టపోతున్నాయి. సన్ఫార్మా, టీసీఎస్, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్,ఎన్టీపీసీ లాభపడుతుండగా , యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రబ్యాంకు, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ నష్టపోతున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు చల్లబడటంతో ఆయిల్ రంగ షేర్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. -
మరదు ఫ్లాట్స్ కూల్చివేత
-
కోలుకున్న సూచీలు, ఫ్లాట్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. గత వారం అంతా రికార్డు స్థాయిలను నమోదు చేసిన కీలక సూచీలు ఆరంభం నుంచి నెగిటివ్గా ఉన్నాయి. ఒక దశలో 200 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోకి జారుకున్నాయి. అత్యంత గరిష్ట స్థాయిల్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. అయితే మిడ్ సెషన్ తరువాత భారీగా పుంజుకున్న సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టాలకు పరిమితమైంది. నిఫ్టీ కూడా కేవలం 9 పాయింట్ల నష్టంతో 12262 వద్ద ముగిసింది. వేదాంతా, మారుతి సుజుకి, హీరో మోటో, హెచ్డీఎఫ్సీ, ఆసియన్ పెయింట్స్ లాభపడగా, యస్బ్యాంకు, నెస్లే, కోల్ ఇండియా, రిలయన్స్;ఎస్బీయై, అదానీ పోర్ట్స్ , బ్రిటానియా టాప్ లూజర్స్గా నిలిచాయి. -
ఫ్లాట్గా సూచీలు, టెలికం షేర్లు లాభాల్లో
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మారాయి. ఆరంభ లాభాలను కోల్పోయిన కీలక సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆ తరువాత మిడ్ సెషన్నుంచి స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు నష్టపోయి 40788 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు కోల్పోయి 12046 వద్ద కొనసాగుతున్నాయి. టారిఫ్ రేట్లు పెరగనున్నాయన్న వార్తలతో టెలికాం షేర్లు లాభ పడుతున్నాయి. భారతి ఎయిర్టెల్ 6.5 శాతం, వొడాఫోన్ ఐడియా 17 శాతం, జియో ఇన్ఫోకామ్ 2.4 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతోపాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, గ్రాసిమ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జెఎస్డబ్ల్యు స్టీల్, భారతి ఇన్ఫ్రాటెల్ లాభపడుతుండగా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఒఎన్జీసీ, జీ నష్టపోతున్నాయి. -
రియల్టీ షాక్, ఆరంభ లాభాలు ఆవిరి
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గరిష్టాలనుంచి వెనక్కి తగ్గాయి. రియల్టీ సూచికలలో భారీ అమ్మకాల ఒత్తిడి మధ్య ఆరంభ లాభాలనుంచి కీలక సూచీలు ఫ్లాట్గా మారాయి. దీంతో సెన్సెక్స్ 41 వేల దిగువకు చేరింది. అయితే నిఫ్టీ మాత్రం 12070కి ఎగువన కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 101 పాయింట్లు ఎగిసి 40923 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 12075 వద్ద కొనసాగుతున్నాయి. రియాల్టీ మినహా ఐటి, ఆటో, మీడియా లాభపడుతున్నాయి. మెటల్, ఫార్మా స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యుపిఎల్, టాటా మోటార్స్ మారుతి లాభపడుతుండగా, సిప్లా, ఎల్ అండ్ టీ, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్ నష్టపోతున్నాయి. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 40557 వద్ద,నిఫ్టీ 12 నష్టంతో 11956 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్నిరంగాల షేర్లు స్తబ్దుగానే కొనసాగుతున్నాయి.భారతిఇన్ఫ్రాటెల్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్మహీంద్ర, యూపీఎల్, హెచ్సీఎల్టెక్ నష్టపోతున్నాయి. మరోవైపు ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, సన్ఫార్మ, యస్బ్యాంకు, వేదాంతా, రిలయన్స్, ఓఎన్జీసీ, టాటాస్టీల్ లాభపడుతున్నాయి. మరోవైపు యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 71.70కు చేరుకుంది. స్వల్ప నష్టంతో 71.77 వద్ద ప్రారంభమైన రూపాయి విదేశీ నిధుల ప్రవాహం, ముడి చమురు ధర సడలింపుల మధ్య భారత రూపాయి శుక్రవారం పుంజుకుంది. గురువారం 71.76 వద్ద ముగిసింది. -
ఫ్లాట్ ఆరంభం, జీఎంటర్టైన్మెంట్ జూమ్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నామమాత్రపు లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 40681 వద్ద, నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 12006 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కీలక సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. ముఖ్యంగా భారతీయ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం నుంచి ప్యాకేజీ ఊరట లభించడంతో టెల్కో షేర్లు గురువారం కూడా లాభపడుతున్నాయి. మీడియా , ఐటీ షేర్లు కూడా లాభపడుతున్నాయి. 13 శాతం ఎగిసి జీ ఎంటర్టైన్మెంట్ టాప్ విన్నర్గా ఉండగా, సన్ టీవీ లాభాల్లో కొనసాగుతోంది. వీటితోపాటు హెచ్సీఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్ లాభపతుండగా, భారతి ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, యస్ బ్యాంకు, సిప్లీ, గెయిల్, కోల్ ఇండియా, గ్రాసిం నష్టపోతున్నాయి. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అనంతరం పుంజుకుని సెన్సెక్స్ 73 పాయింట్లు లాభపడి 40418 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభతో 11934వద్ద కొనసాగుతున్నాయి. జీ, సన్టీఈవీ, గెయిల్, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, సిప్లా నష్టపోతుండగా బ్రిటానియా , టీసీఎస్ ,యస్ బ్యాంకు, రిలయన్స్, కోల్ఇండియా, ఇన్ఫో ఎడ్జ్, పిరామల్ లాభపడుతున్నాయి. "గురు నానక్ జయంతి" ని పురస్కరించుకుని మంగళవారం ఈక్విటీ,కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో బలహీనంగా ప్రారంభమైంది. ఇంటర్బ్యాంక్ రూపాయి డాలర్తో పోలిస్తే 71.75 వద్ద ప్రారంభమైంది, తరువాత 71.77 కు పడిపోయింది, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసల క్షీణించిఇంది. సోమవారం. 71.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
లాభాల స్వీకరణ: ఫ్లాట్గా సూచీలు
సాక్షి, ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల గరిష్ట స్థాయిల న ఉంచి వెనక్కి తగ్గాయి. మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ వేస్తూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణవైపు మొగ్గు చూపారు. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 89 పాయింట్లు క్షీణించి 40,565 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు నీరసించి 11,980 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా స్వల్పంగా లాభపడుతుండగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా బలహీనంగా ఉంది. యస్ బ్యాంక్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, ఎంఅండ్ఎం, జీ, కోల్ ఇండియా, టెక్ మహీంద్రా, బ్రిటానియా, హీరో మోటో, హెచ్సీఎల్ టెక్ లాభాల్లోనూ, ఇన్ఫ్రాటెల్, యూపీఎల్, సన్ ఫార్మా, సిప్లా, టాటాస్టీల్, ఎయిర్టెల్, గెయిల్, ఆర్ఐఎల్, డాక్టర్ రెడ్డీస్, వేదాంతా నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.మరోవైపు వాణిజ్య వివాద పరిష్కారానికి ఒప్పందం కుదరనున్న సంకేతాల కారణంగా గురువారం అమెరికా స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టం వద్ద ముగిశాయి. -
ఫ్లాట్ ముగింపు : బ్యాంక్స్ జూమ్
సాక్షి, ముంబై: లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట మధ్య రోజంతా కొనసాగిన దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభంతో 39,058 వద్ద నిఫ్టీ ఒక పాయింటు నామమాత్రపు లాభంతో 11,584 వద్ద ముగిసింది. మొత్తానికి సెన్సెక్స్ 39వేల ఎగువన, నిఫ్టీ 11500కిపైన స్థిరపడ్డాయి. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్ 3.4 శాతం జంప్చేయగా, ఐటీ 0.8 శాతం ఎగసింది. మరోవైపు మెటల్, ఆటో నీరసించాయి. క్యూ2 ఫలితాలతో ఎస్బీఐ 8శాతాని కిపైగా లాభపడగా, యస్బ్యాంక్ 11 శాతం జంప్ చేసింది. ఇంకా ఐసీఐసీఐ, సిప్లా, సన్ఫార్మా, బీపీసీఎల్, టీసీఎస్, ఐషర్, విప్రో, హెచ్సీఎల్ టెక్ ,మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల, టాటా స్టీల్ లాభాల్లో ముగిసాయి. ఇన్ఫ్రాటెల్ 8.6 శాతం, టాటా మోటార్స్, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్, వేదాంతా, హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, హీరో మోటో నష్టాల్లో ముగిసాయి. మరోవైపు దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం గంటపాటు సంవత్ 2076 స్పెషల్ మూరత్ ట్రేడింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
అమ్మకాల దెబ్బ : ఫ్లాట్గా మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గామళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసినప్పటికీ తరువాత బలహీనపడ్డాయి.ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో అమ్మకాలు జోరు కొనసాగడంతో ఒక దశలో సెన్సెక్స్ డే హై నుంచి 250 పాయింట్లు కుప్ పకూలింది. సెన్సెక్స్ ప్రస్తుతం 15 పాయింట్ల నామమాత్రపు లాభంతో 38517వద్ద, నిఫ్టీ 14పాయింట్ల లాభంతో1144 వద్ద కొనసాగుతున్నాయి. ప్రధానంగా మీడియా, బ్యాంక్స్, రియల్టీ, ఐటీ స్వల్ప లాభాలతో, మెటల్ స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్ 4.2 శాతం లాభపడగా, జీ, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, విప్రో, యస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫిన్, ఐవోసీ, అల్ట్రాటెక్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు వేదాంతా, ఐషర్, ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, సిప్లా, గెయిల్, ఐటీసీ, ఎంఅండ్ఎం, టాటా స్టీల్ నష్టపోతున్నాయి. -
ఫ్లాట్ ప్రారంభం : యస్ బ్యాంకు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 37541 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 11118 వద్దకొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నేడు కీలక సూచీలు రెండూ ఊగిసలాట మధ్య కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టుల అంచనా. ఫార్మ, ఆటో తప్పదాదాపు అన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ , ఎన్టీపీసీ, మారుతి లాభపడుతున్నాయి. బలహీన త్రైమాసిక ఫలితాల అంచనాలతో టైటన్ భారీగా నష్టపోతోంది. యస్ బ్యాంకు తాజాగా మరో 8 శాతం కుప్పకూలింది. దీంతోపాటు హెచ్సీఎల్, టీసీఎస్, యూపిఎల్, గ్రాసిం,యాక్సిస్, సన్ ఫార్మ, ఓఎన్జీసీ నష్టపోతున్నాయి. మరోవైపు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ బలహీనంగా ఉంది. బుధవారం ఉదయం 16 పైసల నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించింది. సోమవారం నాటి 71.02తో పోలిస్తే 71.18 వద్ద వుంది. కాగా మంగళవారం విజయదశమి పర్వదినం సందర్భంగా మార్కెట్లకు సెలవు. -
లాభనష్టాల ఊగిసలాట, యస్ బ్యాంకు జంప్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతున్నాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 100పాయింట్లకు పైగా ఎగిసింది. కానీ అంతలోనే నష్టాల్లోకి జారుకుంది. తిరిగి స్వల్పంగా పుంజుకున్నా, ప్రస్తుతం సెన్సెక్స్27 పాయింట్లు క్షీణించి 37646 వద్ద,నిప్టీ 20 పాయింట్లు కోల్పోయి 11155 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్ (10) బీపీసీఎల్, ఇండస్ ఇండ్, సన్ఫార్మ, హీరో మోటో, ఎల్ అండ్టీ, ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోతుండగా, యస్ బ్యాంకు 4 శాతం , వేదాంతా, భారతి ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా లాభపడుతున్నాయి. -
ప్రారంభ లాభాలు ఆవిరి, ఫ్లాట్గా సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆర్బీఐ వడ్డీరేటు కోత అంచనాలతో ఆరంభంలోనే 200 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ అనంతరం స్వల్ప లాభాలకు పరిమితమై కొనసాగుతోంది. 49 పాయింట్ల లాభంతో 38711 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల స్వల్ప లాభంతో11489 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఆయిల్ రంగ షేర్లుమాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్,కోల్ ఇండియా, హెచ్సీఎల్టెక్, టీసీఎస్; గ్రాసిం, భారతి ఇన్ఫ్రాటెల్ నష్టపోతుండగా బీపీసీఎల్, ఐవోసీ, యస్బ్యాంకు, ఎంఅండ్ఎం, హెచ్యూఎల్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి. -
విస్తీర్ణం తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో 2014లో అపార్ట్మెంట్ సగటు విస్తీర్ణం 1,400 చ.అ.గా ఉండేది. కానీ, 2019 నాటికది 1,020 చ.అ.లకు తగ్గింది. అత్యధికంగా ముంబైలో ఫ్లాట్ల సైజ్లు 45 శాతం మేర తగ్గిపోయాయి. 2014లో ఇక్కడ ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 960 చ.అ. కాగా.. ఇప్పుడది 530 చ.అ. పడిపోయింది. పుణేలో అయితే క్షీణత 38 శాతంగా ఉంది. ప్రస్తుతమిక్కడ సగటు విస్తీర్ణం 600 చ.అ.లుగా ఉంది. ఇక, ఎన్సీఆర్లో 6 శాతం క్షీణతతో 1,390 చ.అ.లకు, బెంగళూరులో 9 శాతం క్షీణించి 1,300 చ.అ.లకు, చెన్నైలో 8 శాతం క్షీణతతో అపార్ట్మెంట్ సగటు సైజ్ 1,190 చ.అ.లకు చేరింది. హైదరాబాద్లో సగటు అపార్ట్మెంట్ విస్తీర్ణం 1,570 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అతిపెద్ద విస్తీర్ణం. ఐదేళ్ల క్రితం కోల్కతాలో ఫ్లాట్ సైజ్ 1,230 చ.అ.లుగా ఉండేది. ఇప్పుడక్కడ సగటు విస్తీర్ణం 9 శాతం క్షీణించి 1,120 చ.అ.లుగా ఉంది. విభాగాల వారీగా విస్తీర్ణం ఎంత తగ్గిందంటే.. రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విస్తీర్ణం ఐదేళ్లలో 28 శాతం తగ్గాయి. 2014లో 750 చ.అ.లుగా ఉన్న అఫడబుల్ హౌజ్ సైజ్లు 2019 నాటికి 540 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి గృహాల విస్తీర్ణం 17 శాతం తగ్గాయి. 2014లో 1,150 చ.అ.లు కాగా.. ఇప్పుడవి 950 చ.అ.లకు క్షీణించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ధర ఉన్న ప్రీమియం హోమ్స్ విస్తీర్ణం 21 శాతం తగ్గాయి. 2014లో 1,450 చ.అ.లుండగా.. ఇప్పుడవి 1,140 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల సైజ్ 18 శాతం క్షీణించాయి. 1,640 చ.అ. నుంచి 1,350 చ.అ.లకు తగ్గాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాల విస్తీర్ణం 8 శాతం తగ్గాయి. ఐదేళ్ల క్రితం ఆయా ఫ్లాట్ల సైజ్ సగటు 2,400 చ.అ.లు ఉండగా.. ఇప్పుడవి 2,200 చ.అ.లకు తగ్గిపోయాయి. తక్కువ విస్తీర్ణం గృహాలకే డిమాండ్.. ప్రధాన నగరాల్లో అందుబాటు గృహాలకు డిమాండ్ పెరగడమే అపార్ట్మెంట్ల విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అఫడబుల్ హౌసింగ్కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఈ గృహాల వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. అయితే ఆయా అఫడబుల్ గృహాలు రూ.45 లక్షల లోపు ధర 850 చ.అ. బిల్టప్ ఏరియాను మించకూడదు. అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయి. అంతేకాకుండా అఫడబుల్ గృహాలకు జీఎస్టీ కూడా తక్కువే. ఇతర గృహాలకు జీఎస్టీ 5 శాతం ఉంటే అఫడబుల్ ప్రాజెక్ట్లకు ఒక్క శాతమే ఉంది. -
ఫ్లాట్ ఆరంభం: ఊగిసలాట
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడింగ్ను ఆరంభించాయి వరుస రికార్డు లాభాలనుంచి స్వల్పంగా శాంతించిన మార్కెట్లు మంగళవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, కొనుగోళ్లు మద్య కన్సాలిడేట్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 120 పాయింట్లుఎగిసి 39210 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభంతో11628 వద్ద స్థిరంగా ట్రేడ్ అవుడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. రిలయన్స్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, టీసీఎస్, వేదాంతా, ఎం అండ్ ఎం, సన్ఫార్మ, కోల్ఇండియా, ఇండస్ ఇండ లాభపడుతున్నాయి. మరోవైపు ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యు స్టీల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఐవోసీ టైటన్, భారతి ఇన్ఫ్రాటెల్ నష్టపోతున్నాయి. -
ఫ్లాట్గా ప్రారంభం : లాభాల యూ టర్న్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ పాయింట్ల 19 పాయింట్లు నష్టంతో, నిఫ్టీ 6 పాయింట్ల బలహీనంగా మొదలయ్యాయి. వెంటనే సూచీలు లాభాల్లోకి మళ్లాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 124 పాయింట్లు, ఎగియగా, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11018 వద్ద కొనసాగుతోంది. టాటామెటార్స్, మారుతి, టైటన్, ఐవోసీ, అదానీపోర్ట్స్ లాభాల్లో కొనసాగుతుండగా, యస్ బ్యాంకు, ఇండియా బుల్స్ ఫైనాన్స్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా నష్టపోతున్నాయి. అటు దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించింది. డాలరు మారకంలో 70.92 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం 70.96 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. -
ఫ్లాట్ ప్రారంభం
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడింగ్ను ఆరంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ప్రస్తుతం సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 37306 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 10998 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 11వేల స్థాయి వద్ద ఊగిసలాడుతోంది. ఆటో, ఐటీ లాభపడుతున్నాయి. దువ్వాడ అబ్జర్వేషన్స్ కారణంగా డా.రెడ్డీస్, అలాగే ఒబెరాయ్ రియల్టీ, భారీగా నష్టపోతోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్,మారుతి, ఐషర్, సన్ఫార్మ, హీరోమోటోకార్స్,ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఎస్బీఐ,పవర్గ్రిడ్ లాభపడుతుండగా, యస్ బ్యాంకు మరోసారి 52 వారాల కనిష్టాన్ని తాకి మరింత బలహీనపడింది. ఇంకా బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్, వేదాంతా, హిందాల్కో, బీపీసీఎల్ ,టాటామోటార్స్ నష్టాల్లో ఉన్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ పాజిటివ్గా ట్రేడింగ్ను ఆరంభించింది. మంగళవారం నాటి ముగింపు 71.70 తో పోలిస్తే 71.45 వద్ద కొనసాగుతోంది. అమెరికా-చైనా ట్రేడ్వార్పై అంచనాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. -
ఇళ్లున్నాయ్.. కొనేవాళ్లే లేరు!
7,97,623 : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూన్ వరకు అమ్మకాలకు నోచుకోని ఇళ్లు 4,13,000 : వీటిల్లో మధ్యతరగతి వర్గాల కోసం సరసమైన ధరల్లో ఉన్న ఇళ్లు సాక్షి, హైదరాబాద్: రండి బాబు.. రండి... సరసమైన ధరల్లో ఇళ్లు కావాలా.. వెంటనే సంప్రదించండి.. అంటూ నిర్మాణసంస్థలు కొనుగోలుదారుల వెంట పడాల్సి వస్తోంది. స్థిరాస్తిరంగం ఊపు మీదున్నా.. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం మాత్రం మందకొడిగా నడుస్తోంది. ప్లాట్ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా.. ఫ్లాట్ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా, రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉంది. అయితే ఇక్కడ కూడా కాంక్రీట్ నిర్మాణాల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. భూముల విలువలు నింగినంటడం, ముమ్మర నిర్మాణాలు, నిర్మాణ వ్యయం పెరగడంతో విల్లాలు, ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో వృద్ధి తగ్గింది. ప్రాప్ టైగర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సర్వే ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల తాకిడితో రాజధాని పరిసర ప్రాంతం రియల్ రంగానికి చోదకశక్తిగా మారింది. ఇతర మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్తోపాటు చదరపు అడుగు ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితి మన దగ్గర తక్కువ కాబట్టి అమ్ముడుకాని ఇండ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేంద్ర బడ్జెట్లో గృహ రుణాల వడ్డీ తగ్గింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం వల్ల ఇళ్ల ఖరీదు ఊపందుకుంటుందని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం నిలకడ కనిపిస్తోంది. నేల చూపులు.. నింగిలో ధరలు రెరా చట్టం అమలు.. నిర్మాణ వ్యయం పెరగడం.. డెవలప్మెంట్లో భూ యజమానికి ఇచ్చే నిష్పత్తి శాతం పెరగడం కూడా ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరగడానికి కారణం. భూయజమానికి లెక్కకు మించి ఫ్లాట్లు ఇవ్వాల్సి రావడం, గుడ్విల్ కూడా చెల్లించాల్సి రావడంతో ఫ్లాట్ల ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు తగిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా అమ్మకాలు జరగడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలోనూ పెరుగుదల వస్తోంది. ఈ కారణాలన్నింటితో సదరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధరలు క్రమేణా పెంచాల్సి వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోందన్నది ఓ ప్రముఖ బిల్డర్ అభిప్రాయం. గతంతో పోలిస్తే కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థ గురించి వాకబు చేస్తున్నారు. అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్ల నాణ్యత, సమయానికి ఇస్తారా.. లేదా.. వంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే కొనేందుకు ముందుకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు కడుతున్నారా.. లేదా.. తెలుసుకున్న అనంతరం అడుగు వేస్తున్నారు. ఈ మార్పులు మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయని బిల్డర్లు చెపుతున్నారు. దీంతో పాటు బడా బడా సంస్థలు స్థిరాస్తి వ్యాపారంలోకి రావడంతో భూముల విలువలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు లాభాపేక్షతో ధరలు పెంచేయడం.. సౌకర్యాలకు తగ్గట్టుగా చదరపు అడుగుల చొప్పున ధరలను నిర్దేశించడంతో ఫ్లాట్లు అందుబాటులో లేకుండాపోయాయి. దీనికితోడు గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మేడ్చల్, కొంపల్లి, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, నెక్నాంపూర్, మణికొండ, హైదర్షాకోట్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల తాకిడితో టెకీలు వ్యయం ఎక్కువైనా ఫ్లాట్ల కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో గేటెడ్ కమ్యూనిటీ, బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లో విల్లాలను కొనేందుకు సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మాత్రం వాటిని అమ్మడం బిల్డర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇక, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాలు, అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గిపోవడం గమనార్హం. ఇళ్ల స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలు డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపడంలేదు. విల్లాలు, ఫ్లాట్ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో కొనుగోలుదారులు స్థలాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్లో మాత్రం ఆసాధారణంగా పెరిగిన ధరలు రియల్ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తుండటంతో నల్లధనం కూడా వెల్లువలా వస్తోంది. దీంతో భూముల విలువలు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆషాఢమాసంలో రూ.500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారాప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంటే అంతా స్థలాలు, సాగు భూముల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మందగించినా.. ట్రెండ్ మారుతోంది: రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు గ్రేటర్హైదరాబాద్లో నిర్మాణ రంగం శరవేగంగా పురోగమించడంతోపాటు స్థిరంగా వృద్ధిరేటు సాధిస్తోంది. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మందగించినప్పటికీ ఇప్పడు ట్రెండ్ మారుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్, ఐటీ, హార్డ్వేర్ పాలసీలతో పలు ప్రముఖ సంస్థలు నగరం వైపు దృష్టిసారించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ ఫ్లాట్ల ధరలు నగరంలోనే అందుబాటు ధరల్లో ఉన్నాయి. -
ఫ్లాట్ ప్రారంభం : 38 వేల ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. ఆరంభంలో 30పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 92 పాయింట్లుఎగిసి 38074 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 11351వద్ద కొనసాగుతున్నాయి. తద్వార కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన కొనసాగుతున్నాయి. డాలరు బలపడటంతో ఐటీ సెక్టార్ పుంజుకోగా, బ్యాంకింగ్,ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నష్టపోతోంది. జీ, బీఎఫ్ యుటిలిటీస్, డీహెచ్ఎఫ్ఎల్, టొరంటొ ఫార్మ, లాభపడుతున్నాయి. ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, మారుతి సుజుకి, సిప్లా, ఐసీఐసీఐ, లూజర్గా కొనసాగుతున్నాయి. డాలరు మారకంలో రూపాయి బలహీనంగా ఉంది. 14పైసలు బలహీనపడిన రూపాయి 69.08 వద్ద ట్రేడ్ అవుతోంది. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయస్టాక్మార్కెట్లు స్వల్ప ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 2 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 2 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ 11600 దిగువనే ఉంది. ఆటో సెక్టార్లు బాగా నష్టపోతుండగా, ఫార్మ స్వల్పంగా నష్టపోతోంది. ఉత్పత్తికోత అంచనాలతో అశోక్లేలాండ్ భారీగా నష్టపోతోంది. అలాగే క్రిసిల్ రేటింగ్ షాక్తో ఇండియాబుల్స్ ఫైనాన్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. టాటామోటార్స్, సన్పార్మ,ఎస్బీఐ, టీసీఎస్ తదితర షేర్లు బాగా నష్టపోతున్నాయి. ఇన్ఫోసిస్, యస్ బ్యాంకు, డిష్మెన్ ఫార్మ, జూబ్లియెంట్ ఫుడ్ లాభపడుతున్నాయి. -
పీఎస్యూ బ్యాంక్స్ అండతో ప్లాట్ ముగింపు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి బాగా కోలుకున్నా రోజంతా వోలటైల్గా కొనసాగింది. చివరికి మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 10 పాయింట్లు మేర లాభపడగా, నిఫ్టీ 2 పాయింట్ల నష్టాలకు పరిమితమై 11555 వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంకులు భారీగాకోలుకోవడంతో మార్కెట్ నష్టాలనుంచి తెప్పరిల్లింది. ఫార్మ, ప్రభుత్వ రంగ బ్యాంకు, రియల్, ఇన్ఫ్రా సెక్టార్లలోకొనుగోళ్ల ఆసక్తి నెలకొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. బజాన్ ఫిన్, హీరోమోటోకార్ప్, రిలయన్స్ అదానీ పవర్, సన్ ఫార్మ , భారతి ఎయిర్టెల్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. గెయిల్, టైటన్, యూపీఎల్, టీసీఎస్, హెచ్సీఎల్టెక్, ఐటీసీ, మారుతి నష్టపోయాయి. -
బడ్జెట్ అప్రమత్తత : స్వల్ప లాభాలు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో ఒడిదొడుకులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి స్వల్పలాభాలతో ముగిసాయి. రోజంతా స్తబ్దుగా కొనసాగిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 39839 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభాలకు పరిమితమై 11916వద్ద ముగిసింది. అయితే 11900 స్థాయిని నిలబెట్టుకుంది. యూరోపియన్ దిగుమతులపై 2 బిలియన్ డాలర్ల టారిఫ్లను విధించనున్నట్లు ట్రంప్ సర్కార్ వెల్లడించడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు, ఆసియాలో బలహీన ట్రెండ్ నెలకొంది. మరోవైపు మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, రియల్టీ స్వల్పంగా లాభపడగా, ఫార్మా, ఐటీ నష్టాలతో ముగిశాయి. ఇండస్ఇండ్, ఐబీ హౌసింగ్, బ్రిటానియా, ఓఎన్జీసీ, జీ, ఐవోసీ, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్అండ్టీ, బీపీసీఎల్ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు ఐషర్, వేదాంతా, గెయిల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, యూపీఎల్, సిప్లా, విప్రో టాప్ లూజర్స్గా ఉన్నాయి. -
ఐటీ దెబ్బ: నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ పాయింట్లు 35 బలహీనంతో నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించాయి. అనంతరం సెన్సెక్స్ మరింత దిగజారి 170 పోయింట్లు పతనమై 39వేల దిగువకు, 54 పాయింట్లు క్షీణించి నిఫ్టీ 11650 దిగువకు చేరి బలహీన సంకేతాలందించాయి. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై వస్తున్న వార్తలు, కరెన్సీ బలం నేపథ్యంలో ఐటీ నష్టపోతోంది. ఇంకా ఫార్మా , బ్యాంకింగ్, మెటల్ షేర్లు నష్టపోతున్నాయి. విప్రో , టాప్ లూజర్స్గా ఉన్నాయి. అడాగ్ షేర్లు నష్టపోతున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ, అయిల్ రంగ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్గా డాలర బలహీనత కారణంగా దేశీయ కరెన్సీ పాజిటివ్గా ఆరంభమైంది. 0.23 శాతం ఎగిసి 69.52 వద్ద కొనసాగుతోంది. -
నష్టాలకు చెక్ : చివరికి లాభాలు
సాక్షి, ముంబై : ఆరంభంలో బలహీనంగా దేశీయ స్టాక్మార్కెట్ల చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఒక దశలో 100 పాయింట్లకు పైగా ఎగిసింది. చివరికి సెన్సెక్స్ 86 పాయింట్లు ఎగిసి 39,616వద్ద నిఫ్టీ 27 పాయింట్ల లాభానికి పరిమితమై11,871 వద్ద స్థిరంగా ముగియడం విశేషం. తద్వారా రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు వారాంతంలో పాజిటివ్గా నోట్తో ముగిసాయి. ఫార్మా, మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, ఆటో నష్టపోగా, ఐటీ బలపడింది. అయితే చివరలో కొనుగోళ్లు కనిపించాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాభపడ్డాయి. ఇన్ప్రాటెల్, బీపీసీఎల్, విప్రో, ఎంఅండ్ఎం, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. మరోవైపు రిలయన్స్ పవర్ గ్రిడ్, యాక్సిస్, ఎస్ బ్యాంకు డాక్టర్ రెడ్డీస్, ఐబీ హౌసింగ్, గెయిల్, సిప్లా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ క్షీణించాయి. -
నష్టాల బాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఆర్బీఐ విధాన భేటీకి ముందు స్టాక్ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ధోరణితో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పలు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 40,000 పాయింట్ల దిగువన, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంలో 12వేల పాయింట్ల దిగువన ట్రేడవుతోంది. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ తదితర షేర్లు నష్టపోతున్నాయి. -
ఫ్లాట్నుంచి సెంచరీ లాభాల్లోకి..
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో నిన్న వెనక్కి తగ్గిన సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో తో ట్రేడింగ్ను ఆరంభించాయి. ఆరంభంలోనే తీవ్ర ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈ క్రమంలో సెన్సెక్స్ నష్టాలనుంచి లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్ ఒక్కసారిగా 105 పాయింట్లు ఎగిసి 39084 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11741 వద్ద ట్రేడ్ అవుతుంది. రేపు (గురువారం) 2019 ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు హువావేపై ఆంక్షలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా సడలించడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. డీహెచ్ఎఫ్ఎల్ 14 శాతం కుప్పకూలి టాప్ లూజర్గా ఉంది. ఐటీసీ, బ్లూ డార్ట్, ఐషర్ టాప్ విన్సర్న్గా ఉన్నాయి. మారుతి, టాటామోటార్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు ఎగిసివద్ద, నిఫ్టీ 22 పాయింట్లు లాభంతోవద్ద ట్రేడ్ అయ్యాయి. కానీ వెంటనే ఫ్లాట్గా మారాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు లాభంతో 37135 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 11162 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్ సెక్టార్లాభపడుతోంది. టాటా గ్రూపు షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా టాటా కెమికల్, టాటా గ్లోబల్, టాటా మోటార్స్, ఎస్బ్యాంకు లాభపడుతున్నాయి. మరోవైపు లుపిన్ 4 శాతానికి పైగా నష్టపోతోంది. అలాగా ఇండిగో యాజమాన్యం వద్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇండిగో నష్టపోతోంది. అటు ఆర్థిక వ్యవస్థ నీరసిస్తున్న సంకేతాల నేపథ్యంలో కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నట్లు వెలువడ్డ వార్తలు మార్కెట్లుకు సానుకూలంగా ఉన్నాయి. డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయ 6 పైసలు బలపడి 70.26 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. -
చివరికి నష్టాలే
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగినా చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ పాయింట్లు క్షీణించి వద్ద, నిఫ్టీ పాయింట్లు నష్టపోయి వద్ద ముగిశాయి. లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లలో చివర్లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు క్షీణించి 39 వేల స్థాకియిక దిగువన, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11750కి దిగువన ముగిసాయి. ఐటీ, ఫార్మా నష్టాల్లో ముగియగా, రియల్టీ లాభపడ్డాయి. సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ ఈ రోజు మరింత కుదేలవ్వగా, ఇటీవల బాగా పడిపోయిన ఎస్బ్యాంకు షేరు టాప్ విన్నర్గా నిలిచింది. ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ గెయిల్, బయోకాన్, టీవీఎస్ మోటార్ తదితర షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు బాగా నష్టపోయాయి. రిలయన్స్ ఆల్టైం గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఫ్లాట్గా మార్కెట్లు : నిఫ్టీ 11750 దిగువకు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 25 పాయింట్లు పుంజుకుని 39,059 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు నష్టంతో 11,745 వద్ద ట్రేడవుతోంది. తద్వారా 11750 స్థాయి దిగువకు చేరింది. ప్రధానంగా ఐటీ , ఫార్మా నష్టపోతుండగా, రియల్టీ 0.4 శాతం పుంజుకుంది. యస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, పవర్గ్రిడ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటో, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో లాభాల్లోనూ, బ్రిటానియా, టీసీఎస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, గెయిల్, ఐసీఐసీఐ, హెచ్సీఎల్ టెక్, ఇండస్ఇండ్, విప్రో, జీ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. -
మార్కెట్ల రీబౌండ్ : ఫ్లాట్ ముగింపు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు చివరికి స్వల్పలాభాలకు పరిమితమయ్యాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరి అర్థగంటలో రీబౌండ్ అయ్యాయి. సెన్సెక్స్22 పాయింట్ల స్వల్ప లాభంతో 38607 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో 11596 వద్ద ముగిశాయి. మెటల్, రియల్టీ, ఐటీ 1.1-0.7 శాతం మధ్య నీరసించగా.. ఎఫ్ఎంసీజీ, ఆటో 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, డా. రెడ్డీస్, ఆర్ఐఎల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్యూఎల్, ఎస్బీఐ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ బాగా నష్టపోయాయి. ఇంకా ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, వేదాంతా, ఎన్టీపీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు దారితీసింది. -
ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సూచీలు
సాక్షి, ముంబై : సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలో ఫ్లాట్గా ఉన్నా స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 56 పాయింట్లు క్షీణించి 38,528 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 11,568 వద్ద ట్రేడవుతోంది. ట్రేడర్లు లాభాల స్వీకరణ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. రియల్టీ, ఎఫ్ఎంసీజీ 0.6-0.4 శాతం చొప్పున పుంజుకోగా, మెటల్స్, ఐటీ 0.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ఐవోసీ, ఎయిర్టెల్, బీపీసీఎల్, ఐబీ హౌసింగ్, గెయిల్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో లాభాల్లోనూ, వేదాంతా, జీ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, హిందాల్కో, హెచ్సీఎల్ టెక్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. -
లాభాల స్వీకరణ : ఊగిసలాటలో సూచీలు
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మారాయి. రికార్డు లాభాలతో వరుసగా మూడో రోజూ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించినా, మిడ్ సెషన్నుంచి ఫ్లాట్గా మారాయి. బుధవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ తొలుత 39,270 వద్ద సరికొత్త గరిష్టాన్ని(ఇంట్రాడే) తాకింది. అలాగే నిఫ్టీ 11,761 వద్ద రికార్డ్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సెన్సెక్స్ 35 లాభాలకు పరిమితమై 39,092 వద్దకు నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి 11,709 కి చేరింది. రియల్టీ, మెటల్, పీఎస్యూ బ్యాంక్స్, ఫార్మా నష్టపోతున్నాయి. ఐబీ హౌసింగ్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, మారుతీ, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతుండగా, పీసీఎల్, ఐవోసీ, గెయిల్, ఎల్అండ్టీ, ఐషర్, జీ, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ నష్టపోతున్నాయి. -
‘ఫ్లాట్ రెంట్ రూ 64..అయినా పదేళ్లుగా ఖాళీ’
ముంబై : దక్షిణ ముంబైలోని అత్యంత ఖరీదైన తార్ధే ప్రాంతంలో ఓ చిన్న గది దొరకడమే గగనం కాగా, నెలకు కేవలం రూ 64కే 800 చదరపు అడుగుల అపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. చదరుపు అడుగు రూ 60,000 పలికే ఈ ప్రాంతంలో ఇంత తక్కువ అద్దెకే లభిస్తున్నా 11 ఏళ్లుగా ఈ ఫ్లాట్లో రెంట్కు దిగే వారే కరువయ్యారు. ఈ భవనాన్ని నిర్మించిన ఆర్డీ మహలక్ష్మీవాలా ఛారిటీ బిల్డింగ్ ట్రస్ట్ విధించిన ప్రత్యేక నిబంధనతో ఈ ఫ్లాట్ పదేళ్లకు పైగా ఖాళీగా పడిఉంది. పార్శీ కమ్యూనిటీకి చెందిన ఈ ట్రస్ట్ సదరు ఫ్లాట్ను కేవలం పార్శి పోలీస్ అధికారికే కేటాయించాలని ముంబై పోలీసులతో 1940లో ఒప్పందం చేసుకోవడంతో ఈ చిక్కు వచ్చి పడింది. కాగా ప్రస్తుతం ముంబై పోలీస్ విభాగంలో ఇద్దరు పార్శి కమ్యూనిటీ పోలీస్ అధికారులున్నా వారిలో ఒకరు ముంబై వెలుపల పోస్టింగ్లో ఉండగా, మరో అధికారికి ఇప్పటికే ముంబైలో ఫ్లాట్ ఉంది. ముంబై అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పార్శీలు ఒకప్పుడు స్ధానిక యంత్రాగంలో, పోలీస్ విభాగంలో పెద్దసంఖ్యలో పనిచేసేవారు. రానురాను పార్శీల జనాభా తగ్గుతూ వస్తోంది. దీంతో ఫ్లాట్ను కేవలం పార్శీ పోలీస్ అధికారికే అద్దెకు ఇవ్వాలన్న నిబంధనను తొలగించాలని ముంబై పోలీసులు ట్రస్టుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఫ్లాట్ కోసం పెద్దసంఖ్యలో పార్శీయేతర పోలీసు అధికారులు దరఖాస్తు చేసుకున్నా ట్రస్ట్ నిబంధనతో వారికి ఫ్లాట్ అందుబాటులోకి రావడం లేదు. -
లాభాలకు బ్రేక్ : వీక్గా రూపాయి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ లాభాల నుంచి బ్రేక్ తీసుకుంది. డాలరు మారకంలో వరుసగా ఆరు రోజులపాటు లాభాల బాటలో సాగిన రూపాయి బుధవారం ట్రేడింగ్ ఆరంభంలోనే బలహీన పడింది. 43 పైసలు నీరసించి 68.96 వద్ద నిన్న ముగింపు నుంచి మరింత నష్టపోయింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14 పైసలు క్షీణించి 69.10 వద్ద ప్రారంభమైంది. ఇటీవల లాభాల బాట పట్టిన రూపాయి మంగళవారం 68.36 వద్ద 2019.. గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల్లో రూపాయి ఏకంగా 160 పైసలు పురోగమించింది. ఫెడ్ పాలసీ, ముడిచమురు ధరలు జోరందుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు కారణమైనట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అటు దేశీయ స్టాక్మార్కెట్లు కూడా ఆరంభంలోనే బలహీనపడ్డాయి. 21 సెషన్స్లో భారీ లాభాలను ఆర్జించిన కీలక సూచీల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. లాభనష్టాల మధ్య సెన్సెక్స్, నిఫ్టీ కొనసాగుతున్నాయి. -
లాభాలకు బ్రేక్: ఐటీ అప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో బలహీనంగా ప్రారంభమైనాయి. ప్రపంచ మార్కెట్లు కూడా ఇదే ధోరణిలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం మన మార్కెట్లపైనా పడింది. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో సెన్సెక్స్ 1 పాయింట్ క్షీణించి 38,362వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు బలహీనపడి 11,524 వద్ద ట్రేడవుతోంది. తద్వారా వరుసగా ఏడు రోజులు లాభాల పరుగుకు బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రియల్టీ అత్యధికంగా 2 శాతం పుంజుకోగా.. ఐటీ 1 శాతం బలపడింది. అయితే మీడియా, పీఎస్యూ బ్యాంక్స్ నష్టపోతున్నాయి. రియల్టీ స్టాక్స్లో ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్, ఒబెరాయ్, ఫీనిక్స్ 3-1 శాతం మధ్య లాభపడుతుండగా, మీడియా కౌంటర్లలో జీ, డిష్ టీవీ, యుఫో, జీ మీడియా, జాగరణ్, ఐనాక్స్ లీజర్, టీవీ 18, ఈరోస్, డీబీ కార్ప్ నష్టపోతున్నాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, ఇన్ఫోసిస్, హిందాల్కో, విప్రో, వేదాంతా, ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఎల్అండ్టీ టాప్ విన్నర్స్గా కొనసాగుతుండగా, ఐవోసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టాలతో కొనసాగుతున్నాయి. -
ఫ్లాట్గా మొదలైన రూపాయి
సాక్షి, ముంబై : దేశీయ కరెర్సీ రూపాయి ఫ్లాట్గా మొదలైంది. వరుస లాభాలతో పటిష్టంగా ఉన్న రుపీ మంగళవారం అప్రమత్త ధోరణిలో ట్రేడింగ్ను ఆరంభించింది. సోమవారం నాటి ముగింపు 68.52 పొలిస్తే. 68.55 వద్ద మొదలైంది. ఫెడ్ సమావేశం నేడు ప్రారంభం కానున్ననేపథ్యంలో అమెరికా డాలరు బలహీనంగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు బాగా పుంజుకున్నాయి. -
స్టూడియో అపార్ట్మెంట్ రూ.11.20 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, అందుబాటు ధరల్లో నివాస, లే అవుట్ ప్రాజెక్ట్లను నిర్మించే శ్రీ శ్రీ గృహ నిర్మాణ్ ఇండియా.. ఎయిరో సిటీ పేరిట సుందరమైన ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. ఇబ్రహీంపట్నం మంగల్పల్లిలో 6 ఎకరాల్లో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తామని కంపెనీ ఎండీ భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి వివరాలు... ►6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో 620 గృహాలను నిర్మిస్తున్నాం. 10 బ్లాక్లు. ఒక్కో బ్లాక్ సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 7 అంతస్తుల్లో ఉంటుంది. 350 చ.అ. స్టూడియో అపార్ట్మెంట్స్, 750 చ.అ.లలో సింగిల్ బెడ్ రూమ్, 1000 చ.అ.ల్లో 2 బీహెచ్కే, 1450 చ.అ.ల్లో 3 బీహెచ్కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3500. సింగిల్ బెడ్ రూమ్ ధర రూ.31.25 లక్షలు, స్టూడియో అపార్ట్మెంట్ ధర సౌకర్యాలతో (పార్కింగ్ రూ.2.50 లక్షలు, వసతులకు రూ.2.50 లక్షలు) రూ.16.20 లక్షలు. ► 2016లో ఎయిరో సిటీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల ముగింపు నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 50, 40, 30 ఫీట్ల రోడ్లు, 24 గంటల పాటు సెక్యూరిటీ, ఇంటర్కామ్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటాయి. సగానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ ప్రాజెక్ట్కు ఎదురుగానే 34 ఎకరాల్లో ఎయిరో పార్క్ సౌత్ పేరిట లే అవుట్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నాం. రోజూ 25 వేల మంది ఉద్యోగులు.. ►తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిభట్ల, పటేల్గూడ, రావిర్యాల, కొంగర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ, ఎయిరో స్పేస్ కంపెనీలతో పాటూ కొంగరలో కలెక్టరాఫీసు ఏర్పాటుతో స్థిరమైన అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగా పెద్దగా గృహ అవసరాలు లేకపోవటంతో ప్రతి రోజు టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా అడ్వాన్స్, బీడీఎల్, ఆక్టోపస్ వంటి కంపెనీలకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు 25 వేల మంది హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ►18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్ ఉంటుంది. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మెడిటేషన్, పార్టీ హాల్స్, మినీ థియేటర్, షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, విజిటర్స్ లాంజ్ వంటి ఏర్పాట్లుంటాయి. ప్రాజెక్ట్ ఆవరణలో అపోలో ఆసుపత్రి క్లినిక్ను ఏర్పాటు చేసింది. 24 గంటలు డాక్టర్, నర్సు అందుబాటులో ఉంటారు. -
ర్యాలీకి బ్రేక్ : ఊగిసలాటలో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలనుంచి కాస్త విరామనం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఆరంభంనుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అక్కడక్కడే కదులుతున్నాయి. గత రెండురోజులుగా హెవీ వెయిట్ షేర్లన్ని ఆల్ టైం గరిష్టాలను నమోదు చేయడంతో, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. సెన్సెక్స్ 37 పాయింట్లు పెరిగి 37,785వద్ద. నిఫ్టీ 2 పాయింట్ల నామమాత్రపు లాభాలతో 11,342 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు తొలుత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించింది. ఫార్మా 0.8 శాతం పుంజుకోగా.. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్ 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. సన్ ఫార్మా, ఇండస్ఇండ్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఎయిర్టెల్, ఐబీ హౌసింగ్, ఎన్టీపీసీ, వేదాంతా, ఏషియన్ పెయింట్స్, ఎల్అండ్టీ 2.4-0.7 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు అల్ట్రాటెక్, హెచ్సీఎల్ టెక్, గ్రాసిమ్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టైటన్, హిందాల్కో, హీరో మోటో, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోతున్నాయి. -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.వరుస లాభాలకు చెక్పెడుతూ ట్రేడింగ్ ఆరంభంలో 11వేల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ ఆ తరువాత పుంజుకుంది. సెన్సెక్స్ 40 పాయింట్లు బలహీనడి 36695 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 11042వద్ద కొనసాగుతోది. రుపీ బలహీనత నేపథ్యంలో బ్యాంకింగ్ సెక్టార్ వెనుకడుగులో ఉంది. విప్రో, హిందాల్కో, ఐవోసీ, హెచ్సీఎల్, ఓఎన్జీసీ, అశోక్లేలాండ్ నష్టపోతున్నాయి. ఎన్టీపీసీ, భారతి ఎయిర్టెల్, ఇండియాముల్స ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు లాభపడుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనంగా ప్రారంభమైంది. వరుసలాభాలకుచెక్ పెడుతూ శుక్రవారం 18పైసలు క్షీణించింది. -
10800కి ఎగువన ముగిస్తేనే...
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాల్లో మొదలైన సూచీలు, ఆ తర్వాత పుంజుకున్నా మళ్లీ నెగిటివ్ జోన్లోకి మారి ఊగిసలాడుతున్నాయి. వారాంతంలో షార్ట్ కవరింగ్స్ కారణంగా మార్కెట్లో లాభాలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు తెలిపారు. బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాల ధోరణి నెలకొంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 35861 వద్ద, 5 పాయింట్లు నష్టంతో నిఫ్టీ 10785 వద్ద ట్రేడవుతోంది. అయితే 10800 స్థాయి వద్ద నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని, దీన్ని అధిగమించి నిలబడితేనే, మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నెలకొంటుందని టెక్నికల్ ఎనలిస్ట్లు భావిస్తున్నారు. లేదంటే మరింత బలహీనత తప్పదని , ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
ఫ్లాట్గా స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాలతో బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ 43 పాయింట్లు క్షీణించి 35849 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలహీన పడి 10773 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం బాగా లాభపడిన బ్యాంకింగ్ సెక్టార్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ముత్తూట్ ఫైన్సాన్స్, మారుతి సుజుకి, టెక్ మహీంద్ర తోపాటు ఇన్ఫ్రా షేర్లు టాప్ వినర్స్గా ఉన్నాయి. కోటక్, ఇండస్ ఇండ్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ బ్యాంకు , డిష్టీవీ తదితరాలు నష్టపోతున్నాయి. అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రుపీ కూడా ఫ్లాట్గా కొనసాగుతోంది. -
ఫ్లాట్గా మార్కెట్లు : ప్రభుత్వ బ్యాంక్స్ అప్
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. స్పల్ప లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు నష్టాల్లోకి మళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 7పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 6 పాయింట్లు నీరసించింది. పీఎస్యూ బ్యాంక్స్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. పీఎన్బీ, ఐసీఐసీఐ, ఐవోబీ, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంకు, అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ బ్యాంకుతోపాటు కోటక్ బ్యాంకులు లాభపడుతున్నాయి. ఇంకా గెయిల్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్,సన్ఫార్మ, అల్ట్రా టెక్ సిమెంట్, ఓఎన్జీసీ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. మరోవైపు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ భారతి ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, భారతి ఇన్ఫ్రాటెల్ వోడాఫోన్, యస్ బ్యాంకు నష్టపోతున్నాయి.