మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే? | Kriti Sanon Buys Luxury Plot In Alibaug And Cost Details | Sakshi
Sakshi News home page

Kriti Sanon: అమితాబ్ బచ్చన్ కొన్న చోటే యంగ్ హీరోయిన్ పెట్టుబడి

Jul 12 2024 8:21 AM | Updated on Jul 12 2024 8:58 AM

Kriti Sanon Buys Luxury Plot In Alibaug And Cost Details

'ఆదిపురుష్' సినిమాతో సీతమ్మగా మనందరికీ తెలిసిన హీరోయిన్ కృతి సనన్ మరో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఓవైపు నటిగా హిట్స్ కొడుతున్న ఈమె.. మరోవైపు బిజినెస్‌లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ సొంతం చేసుకుంది. ఇంతకీ దీని రేట్ ఎంత? ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటి?

(ఇదీ చదవండి: రామ్‌ చరణ్‌ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ధర ఎంతంటే?)

బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా కృతి సనన్ బాగానే కలిసి వస్తోంది. 2023లో ఈమె చేసిన మూడు సినిమాలు సరిగా ఆడనప్పటికీ.. ఈ ఏడాది మాత్రం 'తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' చిత్రాలతో హిట్ కొట్టింది. గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది.

ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఫ్లాట్ ఉంది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్టులోని ఫ్లాట్ ఇది. మొన్నీమధ్య అమితాబ్ బచ్చన్ కూడా ఇందులోనే ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి కృతి సనన్ చేరింది. ఏదేమైనా చేతిలో డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నట్లుంది!

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement