
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్ లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగియగా నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ వెంటనే లాభాలను కోల్పోయి ఫ్లాట్గా మారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1 పాయింట్ల లాభాలకు పరిమితమై 52100 వద్ద, నిఫ్టీ28 పాయింట్లు ఎగిసి 15699 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ఉన్నాయి. ఐటీసీ, ఎల్అండ్టి, ఎన్టిపిసి, ఒఎన్జిసి లాభపడుతుండగా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ , హెచ్డిఎఫ్సి నష్టపోతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. శుక్రవారం నాటి ముగింపు 72.99తో పోలిస్తే 72. 85 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment