ఆల్ ఇన్ వన్ ప్లాన్: రూ.279 రీఛార్జ్‌తో ప్రయోజనాలెన్నో.. | Airtel All in One Plan Included OTT Price Starts at Rs 279 | Sakshi
Sakshi News home page

ఆల్ ఇన్ వన్ ప్లాన్: రూ.279 రీఛార్జ్‌తో ప్రయోజనాలెన్నో..

May 27 2025 8:38 PM | Updated on May 27 2025 8:42 PM

Airtel All in One Plan Included OTT Price Starts at Rs 279

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ యూజర్ల కోసం పోటాపోటీగా సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. తాజాగా ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ ఆల్-ఇన్-వన్ ఓటీటీ రీఛార్జ్ ప్లాన్‌ల పేరుతో రూ. 279 నుంచి ప్రారంభమయ్యే కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే.. యూజర్లు నెట్‌ఫ్లిక్స్, జియోసినిమా, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి భారతదేశంలోని 25 కంటే ఎక్కువ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ లభిస్తుంది.

రూ.279 ప్లాన్: ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. ఒక నెల వ్యాలిడిటీ లభిస్తుంది. మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాప్ ద్వారా లేదా కంటెంట్ ఓన్లీ ప్యాక్ ద్వారా OTT యాక్సెస్ పొందవచ్చు. కంటెంట్ ప్యాక్‌లో 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే 1GB డేటా లభిస్తుంది.

రూ. 598 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్స్ వంటివి మాత్రమే కాకుండా.. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జీ5, జియోహాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లు పొందవచ్చు.

రూ. 1,729 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా కూడా.. అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్స్ వంటి వాటితో పాటు నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌, జీ5, జియోహాట్‌స్టార్‌, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం వంటివాటికి యాక్సెస్ లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement