new plan
-
జియో కొత్త ప్లాన్.. జియోహాట్స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్స్టార్లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్: సింగిల్ పేమెంట్.. జీవితాంతం ఆదాయం!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియా 'స్మార్ట్ పెన్షన్' (Smart Pension) ప్లాన్ను ప్రారంభించింది. పదవీ విరమణ సమయంలో ఆర్థిక భద్రతను అందించే లక్ష్యంతో సంస్థ ఈ ప్లాన్ స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తరువాత కూడా.. క్రమం తప్పకుండా ఆదాయం వస్తే బాగుంటుందని, ఇలాంటి ప్లాన్స్ కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి ఎల్ఐసీ ప్రారంభించిన ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది సింగిల్-ప్రీమియం, నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్ సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ యాన్యుటీ వంటి ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఎంచుకోవచ్చు. జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, పిల్లలు, మనవరాళ్ళు, తోబుట్టువులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యుల కోసం జాయింట్ లైఫ్ యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే.. ప్రియమైనవారికి ఆర్థిక స్థిరత్వాన్నిఅందించవచ్చు.నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఇలా మీకు తగిన విధంగా యాన్యుటీ చెల్లింపులు ఎంచుకోవచ్చు. కొన్ని షరతులకు లోబడి.. కొంత మొత్తం లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్లాన్ను.. పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్-లైఫ్ ఇన్సూరెన్స్ (POSP-LI) మరియు కామన్ పబ్లిక్ సర్వీస్ సెంటర్స్ (CPSC-SPV) వంటి ఏజెంట్ల ద్వారా ఆఫ్లైన్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.అర్హత & ప్లాన్ వివరాలు18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఎవరైనా ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే యాన్యుటీ ఆప్షన్లను బట్టి.. అర్హత మారుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఒకసారి యాన్యుటీ ఆప్షన్ ఎంచుకున్న తరువాత, దానిని మళ్ళీ మార్చలేము. ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవాలి.స్మార్ట్ పెన్షన్ ప్లాన్కు.. మార్కెట్తో సంబంధం లేదు. మార్కెట్లు లాభాల్లో ఉన్నా.. నష్టాల్లో ఉన్న మీ డబ్బుకు గ్యారెంటీ లభిస్తుంది. నెలకు రూ. 1,000, మూడు నెలలకు రూ. 3,000, ఏడాది రూ. 12,000 చొప్పున పాలసీదారు యాన్యుటీని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ కోసం కనీస కొనుగోలు మొత్తం రూ. 1 లక్ష. గరిష్ట కొనుగోలుకు ఎలాంటి పరిమితి ఉండదు.ఇదీ చదవండి: అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?5, 10, 15, 20 సంవత్సరాలు.. ఇలా ఎంచుకున్న కాలమంతా స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ద్వారా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ప్రతి ఏటా 3 శాతం లేదా 6 శాతం పెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. జీవితాంతం పెన్షన్ అందుకునే యాన్యుటీనికి కూడా ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ పరిచయం చేస్తూ.. ''పదవీ విరమణ అనేది సంపాదనకు ముగింపు కాదు, ఇది ఆర్థిక స్వేచ్ఛకు ప్రారంభం'' అని ఎల్ఐసీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.Retirement isn’t the end of earning—it’s the beginning of financial freedom! With LIC of India’s Smart Pension, enjoy a lifetime of steady income and stress-free golden years.https://t.co/YU86iMOu9M#LIC #SmartPension #PensionPlan pic.twitter.com/4bXUXbz90g— LIC India Forever (@LICIndiaForever) February 19, 2025 -
జియో కొత్త ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునేవారి కోసం రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటి గురించి తెలుసుకుందాం.జియో ప్రవేశపట్టిన కొత్త ప్లాన్ల జాబితాలో 84 రోజుల ప్లాన్, 365 రోజుల ప్లాన్ ఉన్నాయి. వీటి రీఛార్జ్తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు, డేటా లభించదు. ఇవి కీ ప్యాడ్ మొబైల్ లేదా.. డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి మంచి ఆప్షన్.రూ.458 : 84 రోజులుజియో యూజర్లు రూ. 458తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. అంతే కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.రూ.1,958 : 365 రోజులుజియో అందిస్తున్న మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ పొందుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. 3,600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.జియో రెండు ప్లాన్లను తొలగించిందిజియో ఇప్పుడు తన జాబితా నుంచి రెండు పాత రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. 1899 రూపాయల ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించింది. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్లో 50 శాతం తగ్గింపు -
ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కీప్యాడ్ మొబైల్స్ లేదా 2జీ మొబైల్స్ వాడేవారికి డేటాతో పనిలేదు. అయినప్పటికీ వారు రీఛార్జ్ చేసుకోవాలంటే డేటాకు కూడా కలిపి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ట్రాయ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో.. టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రారంభించాల్సి ఉంది.రీఛార్జ్ ప్లాన్లు రూ. 10 నుంచికొత్త నిబంధనల ప్రకారం Airtel, Jio, BSNL, Vodafone Idea (Vi) 10 రూపాయల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండే టాప్ అప్ వోచర్లను పరిచయం చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ట్రాయ్ రూ. 10 డినామినేషన్కు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని తొలగించింది. దీంతో ఏదైనా విలువ కలిగిన టాప్ అప్ వోచర్లను జారీ చేయడానికి ఆపరేటర్లను అనుమతిస్తుంది.ఆన్లైన్ రీఛార్జ్లకు పెరుగుతున్న ప్రాధాన్యతకు దృష్టిలో ఉంచుకుని.. కలర్ కోడెడ్ ఫిజికల్ రీఛార్జ్ సిస్టమ్ను తొలగించాలని రెగ్యులేటర్ నిర్ణయించింది. ప్రత్యేక టారిఫ్ వోచర్ల చెల్లుబాటును కూడా 90 రోజుల నుంచి 365 రోజులకు పెంచింది. ఇంటర్నెట్ సేవలు అవసరం లేని 2G ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాయిస్.. ఎస్ఎంఎస్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం ఆపరేటర్లకు సూచించింది.ఇదీ చదవండి: సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే ఆఫర్స్: రూ. 209తో..ట్రాయ్ మార్గదర్శకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. కానీ కంప్లైంట్ రీఛార్జ్ ప్లాన్లను రూపొందించడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాల సమయం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, జనవరి చివరి నాటికి సరసమైన రీఛార్జ్ ప్లాన్లు మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. -
ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తున్నాయి. అంతే కాకుండా అవి టారిఫ్లను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలకు సూపర్ ప్లాన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల 14 నెలల వ్యాలిడిటీతో ఓ ప్లాన్ అందించడం ప్రారంభించింది.14 నెలల ప్లాన్ప్రైవేట్ టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందిస్తున్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను ప్రారంభించనే లేదు. అయితే ప్రస్తుతం చాలామంది బీఎస్ఎన్ఎల్ సేవలకు మారిపోవడానికి ప్రధాన కారణం తక్కువ ధరకే ప్లాన్స్ అందించడం.ఇప్పుడు పరిచయం చేసిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ 14 నెలల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. నిజానికి ఈ ప్లాన్ కేవలం 13 నెలలు లేదా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉండేది. ఇప్పుడు దీనిని ఒక నెల పెంచి 14 నెలల వ్యాలిడిటీకి మార్చారు. అంటే ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 425 రోజులు చెల్లుబాటు అవుతుందన్నమాట.ప్రయోజనాలురూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా లోకల్, రోమింగ్ కాల్స్తో సహా అపరిమిత కాల్లను ఆస్వాదించవచ్చు. 425రోజులు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే వినియోగదారుడు మొత్తం 850 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 2జీబీ డేటా పూర్తయిపోయినప్పటికీ.. 4kbps వేగంతో అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు ఉచితం.జియో, ఎయిర్టెల్ (Airtel) వంటి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తరువాత.. చాలామంది బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు మారిపోయారు. ఆ తరువాత రీఛార్జ్ ప్లాన్స్ ధరలను కొంత తగ్గించడంతో.. కొందరు మళ్ళీ జియో, ఎయిర్టెల్ వైపు తిరిగారు. ప్రస్తుతం జియో కూడా వార్షిక ప్లాన్స్ రూ. 3,599 ధరతో అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లు ఉన్నాయి.. ఏం చేయాలో తెలియట్లేదు!జియో (Jio) వార్షిక ప్లాన్ (రూ.3599)తో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ (రూ. 2399) చాలా తక్కువ. కాబట్టి ధరలను దృష్టిలో ఉంచుకుని యూజర్లు తమకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 14 నెలల ప్లాన్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఎన్ని ప్రయోజనాలో..
కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్తో రూ. 2025 ప్లాన్ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.రూ.2025 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2025 ప్లాన్తో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ ఇంటర్నెట్ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.రూ.2150 విలువైన కూపన్లుజియో భాగస్వామి బ్రాండ్ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్మైట్రిప్లో (EaseMyTrip) విమాన బుకింగ్లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్: హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ
ప్రముఖ టెలికాం దిగ్గజం 'భారతి ఎయిర్టెల్' తన యూజర్ల కోసం సరికొత్త, సరసమైన ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 398తో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు మాత్రమే కాకుండా.. రోజుకు 2జీబీ అపరిమిత 5జీ డేటా వంటి వాటిని పొందవచ్చు.ఎయిర్టెల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ద్వారా హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, పాపులర్ వెబ్ సిరీస్లతో సహా ప్రయాణంలో ప్రీమియం వినోదాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీని కలిగి ఉంది.భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం రోజుకు 2జీబీ డేటాతో రూ. 379 ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. అదే విధంగా రూ. 349 ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా కూడా అందిస్తోంది. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్లాన్ 398 రూపాయలు. దీని ద్వారా అదనపు ఖర్చు లేకుండా నెలకు ఒక ట్యూన్ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్
రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతున్నకొద్దీ కస్టమర్లు టెన్షన్ పడుతూ ఉంటారు. అధిక వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు రీచార్జ్ చేసుకుందామంటే ధర ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వారి కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాన్లను పరిచయం చేస్తోంది.ప్రైవేట్ టెలికాం సంస్థలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్ల కోసం అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. లక్షల మంది వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక చెల్లుబాటు ప్లాన్లను చేర్చింది. తాజాగా 105 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ను తీసుకొచ్చింది.105 రోజుల వ్యాలిడిటీ ప్లాన్బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు అధిక వ్యాలిడిటీని అందిస్తూ రూ. 666 ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో 105 రోజుల పాటు ఏదైనా నెట్వర్క్కి అపరిమిత కాలింగ్ ఉంటుంది. అదనంగా ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా చెల్లుబాటు వ్యవధికి మొత్తం 210 జీబీ డేటాను అందిస్తోంది. అంటే రోజువారీ 2జీబీ హై-స్పీడ్ డేటాకు సమానం. ఈ ధరతో ఇతర ప్రైవేటు టెలికాం కంపెనీల్లో విస్తృతమైన వ్యాలిడిటీ ప్లాన్లు లేవు. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ'
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.ఈ ప్లాన్లో భారతదేశం అంతటా ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. -
సైలెంట్గా వచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్! అధిక వ్యాలిడిటీతో..
అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్గా వెబ్సైట్లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది.సాధారణంగా చాలా రీచార్జ్ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
జియో కొత్త ప్లాన్.. అదనపు డేటాతోపాటు 14 ఓటీటీలు ఫ్రీ!
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రూ. 1198 ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్వర్క్లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఉచిత ఓటీటీలు ఇవే.. ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 10 సూత్రాల అమలు
తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగంగా పూర్తిచేస్తోంది. షెడ్యూల్ వెలువరించకముందే.. ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోనూ త్వరలోనే పోల్ ప్రిపేరేషన్పై రివ్యూ మీటింగ్ పెట్టనుంది. ఈ సందర్భంగా కీలక అంశాలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. సమర్ధ ఎన్నికల నిర్వహణకు పది సూత్రాలను అమలు చేయనుంది. ఈసీ టెన్–కమాండ్మెంట్స్తో ఉల్లంఘనలకు చెక్పెట్టి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు వీలుకలగనుంది. (నాగిళ్ల వెంకటేష్, డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్–సాక్షిటీవీ, న్యూఢిల్లీ అందిస్తోన్న స్పెషల్ రిపోర్ట్) 1.ఓటర్ల తొలగింపు అంశం ఓటర్ల తొలగింపుపై ఎన్నికల సంఘం ఫోకస్పెట్టింది. కేవలం ఫాం–7 రిసీవ్ అయిన తర్వాతే ఓటు తొలగింపు ఉండాలని స్పష్టం చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్ తనిఖీ లేకుండా సుమొటాగా ఓటు తొలగించవద్దని పేర్కొంది. ఓటరు చనిపోతే, డెత్ సర్టిఫికెట్ అందిన తర్వాతే ఆ ఓటును డిలీట్ చేయాలని మార్గదర్శకాలు ఇచ్చింది. అలాగే మొత్తం తొలగించిన ఓట్లలో పదిశాతం ఓట్లను ర్యాండమ్గా సిస్టం ద్వారా ఎంపిక చేసి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో తొలగించిన ఓట్లు రెండుశాతానికి మించితే వాటిని ఈఆర్ఓ వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. ఓటరు చనిపోయిన సందర్భాల్లో మినహా ఇతర కారణాలుంటే వాటిని తప్పనిసరిగా తనిఖీ చేసిన తర్వాతే ఓటు తొలగింపు ఆదేశాలు ఇవ్వాలి. 2. ఎన్నికల ఖర్చుపై 20శాఖల నిఘా ఎన్నికల సమయంలో పెరిగిపోతున్న ఖర్చుపై నిఘా పెట్టేందుకు ఎన్నడూ లేనంతగా ఈసారి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. దాదాపు 20 ప్రభుత్వ శాఖలతో స్పెషల్ కోఆర్డినేషన్ను ఏర్పాటు చేసింది. ఈ కో–ఆర్డినేషన్లో ఈడీ, ఐటి, రెవెన్యూ ఇంటలిజెన్స్, జిఎస్టీ, పోలీస్, కస్టమ్స్, ఎక్సైజ్, సిఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సివిల్ ఏవియేషన్, పోస్టల్, ఆర్బిఐ, ఎస్ఎల్బిసి, ఎన్సిబి, రైల్వే, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ పనిచేయనున్నాయి. ఈ శాఖలన్నీ ఎవరికి వారు ఒంటరిగా పనిచేయకుండా, సమన్వయంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల, పార్టీల ఖర్చుపై నిఘా పెడతారు. సరిహద్దుల గుండా వెళ్లే మద్యం, నగదు, ఉచితాలు, డ్రగ్స్ తదితర అంశాలపై మరింత ఫోకస్ ఉంటుంది. వీటితో పాటు రాష్ట్రంలోని ఎయిర్స్ట్రిప్లు, హెలిప్యాడ్లపై కన్నేసి ఉంచుతారు. లిక్కర్ కింగ్పిన్స్, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లపై తీవ్రమైన చర్యలు ఉండనున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారు. 3. సీ విజిల్తో 50 నిమిషాల్లోనే యాక్షన్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నేరుగా ఫిర్యాదు చేయడానికి ఎన్నికల సంఘం సీ–విజిల్ యాప్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఎవరైనా పౌరుడు ఎన్నికల కోడ్ఉల్లంఘనపై సీ–విజిల్ యాప్లో ఫోటో, వీడియో, ఇతర సమాచారం అప్లోడ్ చేయాలి. ఆ వెంటనే ఆ సమాచారం డిస్ట్రిక్ కంట్రోలర్కు చేరుతుంది. చేరిన అయిదు నిమిషాల్లోనే ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం ఫ్లయింగ్ స్కాడ్కు అప్పగిస్తారు. 15 నిమిషాల వ్యవధిలో ఎలక్షన్కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి చేరుకుని విచారణ చేస్తారు. మరొక 30 నిమిషాల్లోనే ఫిర్యాదుదారుకు తాము తీసుకున్న చర్యల సమాచారాన్ని పంపిస్తారు. అంటే ఫిర్యాదు చేసిన 50 నుంచి 100 నిమిషాల్లోనే వాటిపై యాక్షన్ తీసుకునేలా సి–విజిల్ తయారు చేశారు. 4. ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటరు సేవలన్నీ ఆన్ లైన్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేయవచ్చు. ఓటరు లిస్ట్లో పేరు తనిఖీ చేసుకోవచ్చు. పోలింగ్ బూత్ వివరాలు, బిఎల్ఓ, ఈఆర్ఓ డిటెయిల్స్, ఎన్నికల ఫలితాలు, ఈవిఎంల సమాచారం, ఓటరు కార్డు డౌన్లోడింగ్ తదితర సేవలన్నీ ఈ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా పొందే అవకాశం కల్పించారు. 5. సువిధ పోర్టల్.. నామినేషన్లు, అఫిడవిట్ల దాఖలు కోసం అభ్యర్థులు సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మీటింగ్లు, ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతుల కోసం ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. 6. సక్షం యాప్.. వికలాంగులు, వలస ఓటర్లు, తప్పుల సవరణల కోసం వికలాంగులు, వలస ఓటర్ల కోసం ఈసీ సక్షం యాప్ను తయారుచేసింది. ఓటరు జాబితాలో కరెక్షన్ల కోసం ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఓటింగ్ సమయంలో వీల్చైర్ అవసరమైతే రిక్వెస్ట్ ను ఈ యాప్ ద్వారా పంపాలి. 7. కెవైసీ యాప్ పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు తెలుసుకోవడానికి కెవైసి యాప్ ను రూపొందించారు. ఇందులో అభ్యర్థుల నేర చరిత్ర సహా ఇతర వివరాలను ఉంచుతారు. అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తమ అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్సైట్లో, సోషల్ మీడియాలో పెట్టాలి. 8. యూత్ ఓటింగ్ పెరిగేలా.. యువత ఓటింగ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులకు ఓటింగ్కు అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చివరి మైలులో ఉన్న గ్రామాలలో సైతం సజావుగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా చర్యలుండాలి. 9.సరిహద్దులో చెక్పాయింట్లు ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పొలీస్, ఎకైజ్, ట్రాన్స్పోర్ట్, స్టేట్ ఫారెస్ట్ డిపార్టు మెంట్ల ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులలో నిఘా ఉంటుంది. 10. ఉన్నతాధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో నమోదు, తొలగింపులను జిల్లా ఎన్నికల అధికారులు తప్పనిసరిగా చెక్చేయాలి. రాజకీయ పార్టీల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి. పోలింగ్ పనులకు కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించొద్దు. పార్టీ క్యాంపెయిన్ మెటీరియల్ వాహనాల సంఖ్య ఒకటి నుంచి నాలుగుకు పెంపు. ఫేక్ న్యూస్ నియంత్రణకు ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు. -
ఆ పాపులర్ ‘జియో ప్లాన్’ ఇక లేదు
Reliance Jio New Plan: ఆధునిక కాలంలో ఎక్కువమంది వినియోగించే నెట్వర్క్లలో రిలయన్స్ జియో (Reliance Jio) ఒకటని అందరికి తెలుసు. అయితే ఇప్పుడు సంస్థ ఇప్పటి వరకు అందించిన ఒక ప్రీపెయిడ్ ప్లాన్ నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటి వరకు అందిస్తున్న రూ. 119 ప్లాన్ నిలిపివేసి, ఆ స్థానంలో రూ. 149 ప్లాన్ తీసుకువచ్చింది. సాధారణంగా రూ. 119తో రీఛార్జ్ చేసుకుంటే 14 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే కాకుండా, ప్రతి రోజూ 1.5 జీబీ డేటా, 100 మెసేజులు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ ప్లాన్ స్థానంలో కొత్త ప్లాన్ పుట్టుకొచ్చింది. రూ. 119 స్థానంలో వచ్చిన రూ. 149 ప్లాన్ వ్యాలిడిటీ ఇప్పుడు 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే రోజుకి 1 జీబీ డేటాతో సహా 100 మెసేజిలు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ప్లాన్ ద్వారా యూజర్లు జియో టీవీ యాప్, జియో సినిమాల్లో కార్యక్రమాలను చూసే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఇదిలా ఉండగా.. ఇటీవల జియో తన యూజర్లకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో మొదటిసారి రెండు ప్లాన్స్ లాంచ్ చేసింది. దీంతో ఒక ప్లాన్ రూ. 1099 (84 రోజుల వ్యాలిడిటీ) కాగా, మరో ప్లాన్ రూ. 1499 (84రోజుల వ్యాలిడిటీ). ఈ రెండింటిలోనూ వినియోగదారుని లభించే డేటా ప్యాక్ వేరువేరుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ మొబైల్స్ ప్లాన్ ధర రూ. 149 కాగా, బేసిక్ ప్లాన్ ధర రూ. 199గా ఉంటుంది. -
వందేళ్ల వరకు ఆదాయాన్నిచ్చే జీవిత బీమా పథకం
బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ఏస్ పేరిట జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటు జీవిత బీమా అటు దీర్ఘకాలం అంటే వందేళ్ల వరకు ఆదాయాన్ని ఆఫర్ చేసే పథకం ఇది. పాలసీ ప్రారంభమయ్యాక తొలి నెల/సంవత్సరం నుంచి లేదా అయిదేళ్ల తర్వాత నుంచి కూడా ఆదాయాన్ని అందుకోవడాన్ని ఎంచుకోవచ్చు. అలాగే పాలసీ కాల వ్యవధిని కనీసం 10 ఏళ్ల నుంచి తమకు 100 సంవత్సరాలు వచ్చే దాకా ఎంచుకోవచ్చని సంస్థ ఎండీ తరుణ్ చుగ్ తెలిపారు. తమ ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఎప్పుడు, ఎంతకాలం పాటు, రాబడిని ఎలా అందుకోవాలనుకుంటున్నదీ కూడా కస్టమర్లు తామే నిర్ణయించుకోవచ్చని ఆయన వివరించారు. వార్షిక ప్రీమియానికి సమ్ అష్యూర్డ్ 11 రెట్లు ఉంటుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణించిన పక్షంలో నామినీకి డెత్ బెనిఫిట్, ప్రీమియంల చెల్లింపు నుంచి మినహాయింపుతో పాటు రాబడి కొనసాగడం, మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళా పాలసీదారులకు అదనంగా 2 శాతం ఆదాయ ప్రయోజనం ఉంటుంది. -
దిమ్మ తిరిగి బొమ్మ కనపడేసరికి చంద్రబాబు కొత్త నాటకం
-
జియో ఫైబర్ రూ. 398 ప్లాన్, ఆఫర్లేంటో తెలుసా?
హైదరాబాద్: బ్రాడ్బ్యాండ్ సంస్థ రిలయన్స్ జియో ఫైబర్ కొత్తగా నెలకు రూ. 398 ప్లాన్ను ఆవిష్కరించింది. జియో ఫైబర్ టీవీ ప్లాన్ ప్రకారం 750 పైచిలుకు లైవ్ టీవీ ఛానెల్స్ను వీక్షించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్స్టార్ వంటి 14 ప్రీమియం ఓటీటీ ప్లాట్ఫాంలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా యాక్సెస్ పొందవచ్చని పేర్కొంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలను పొందవచ్చని జియో ఫైబర్ వివరించింది. అలాగే మాన్సూన్ ఆఫర్ కింద కస్టమర్లు ఉచిత 4కే సెట్–టాప్ బాక్స్తో పాటు ఉచిత గిగా ఫైబర్ రూటర్ను కూడా అందుకోవచ్చని తెలిపింది. వీటి మొత్తం విలువ రూ. 10,000 ఉంటుంది. అదనంగా జీరో ఇన్స్టాలేషన్ చార్జీలు, జీరో డిపాజిట్ సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నట్లు జియో ఫైబర్ పేర్కొంది. ఈ ఆఫర్ కోసం 6 నెలల వ్యవధికి ముందస్తు రీచార్జ్ను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపింది. (బ్లాక్రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) -
ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్త సబ్సిడీ విధానం.. కేంద్ర ప్రభుత్వం కసరత్తు!
ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి సంబంధించిన ఫేమ్ పథకం మూడో విడత (ఫేమ్ 3)పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సారి ఈ పథకాన్ని కింద ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం మొదటి విడతలో కేవలం ద్విచక్ర వాహనాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఆయా వాహనాల ధరలపై అత్యధికంగా 40 శాతం సబ్సిడీ అందించేది. తర్వాత రెండో విడత (ఫేమ్ 2)లో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది. తాజా నివేదికల ప్రకారం.. మూడో విడతలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను చేర్చనుంది. ఇక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీని తగ్గించి త్రిచక్రవాహనాలకు సబ్సిడీని పెంచే అవకాశం ఉంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 3 పథకాన్ని ఇంకా రూపొందించనప్పటికీ ఇందుకోసం ఆయా పరిశ్రమల వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొత్త సబ్సిడీ విధానం వెల్లడైతే ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కొనసాగుతుందా? -
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
ఐపీఎల్ దెబ్బకి లక్షన్నర మొక్కలు..!
-
ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!
మనదేశంలో ప్రముఖ టెలికాం సర్వీసులైన జియో, ఎయిర్ టెల్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పుట్టుకొస్తున్నాయి. 5జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలతో పోటీ పడటంలో వోడాఫోన్ ఐడియా కొంత వెనుకపడ్డాయి. ఈ కారణంగా ఈ సర్వీసులు ఉపయోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వోడాఫోన్, ఐడియా కొత్త ప్లాన్లు, ఆఫర్స్ తీసుకువచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువగా జియో సేవలకు ఆసక్తి చూపుతున్న కస్టమర్లను తమవైపు ఆకర్శించడానికి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా 5జీబీ డేటా ఉచితంగా పొందే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఆఫర్ కింద రూ. 299తో గానీ అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఆఫర్ పొందవచ్చని వోడాఫోన్ ఐడియా ప్రకటించాయి. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ రీఛార్జ్ చేసుకున్న మూడు రోజుల వ్యాలిడిటీతో 5జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 199 నుంచి రూ. 299 మధ్య ఉన్న వివిధ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకున్న వారికి 2జీబీ డేటా ఫ్రీగా వస్తుంది. దీని వ్యాలిడిటీ కూడా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ డేటాతో మీరు వీఐ మూవీస్, టీవీ, వీఐ మ్యూజిక్, వీఐ గేమ్స్, ఆండ్రాయిడ్ గేమ్స్ మొదలైనవి వినియోగించుకోవచ్చు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) ఇటీవల రూ. 549 ప్రీపెయిడ్ ప్లాన్ తొలగించి, దీని ద్వారా 180 రోజుల వ్యాలిడిటీ అందించింది. ఇందులో అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఓటీటీ బెనిఫీట్స్ వంటివి ఇందులో అందుబాటులో ఉండేవి, దీనికి ఆశించినంత ఆదరణ లేకపోవడం వల్ల సంస్థ దీనిని నిలిపివేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!
అమెజాన్ ప్రైమ్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వల్ల ప్రారంభ ప్లాన్ ధరలు భారీ స్థాయికి చేరుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. అమెజాన్ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ధరలను అధికం చేసింది. ఇందులో నెల, మూడు నెలల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే రూ. 179 ఉన్న అమెజాన్ నెల వారీ మెంబర్షిప్ ఇప్పుడు రూ. 299 కి చేరింది. అంటే ఈ ధర ఒక్క సారిగా రూ. 120 పెరిగింది. దీని ప్రకారం కొత్త అమెజాన్ ప్రైమ్ తీసుకోవాలనుకునే కస్టమర్లు ఖచ్చితంగా రూ. 299 చెల్లించాల్సిందే. ఇక మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే, రూ. 499 గా ఉన్న మూడు నెలల ప్లాన్ ఇప్పుడు రూ. 599కి చేరింది. ఈ ధరలు కూడా రూ. 140 వరకు పెరిగాయి. ముందుగానే నెల, 3నెలలు ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, ఆటో రెన్యూవల్ సెట్ చేసుకున్న వారు పాత ధరలకే ఈ ప్లాన్స్ పొందవచ్చు. ఇవి 2024 జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత కొత్త ధరలు వర్తిస్తాయి. (ఇదీ చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) కొత్తగా అమెజాన్ ప్రైమ్ పొందాలనుకునే వారు కొత్త ధరలకే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు, సినిమాలు టీవీషోలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ప్రైమ్ మెంబర్షిప్ లో షాపింగ్ బెనిఫీట్స్ కూడా లభిస్తాయి. అంతే కాకుండా అమెజాన్ మ్యూజిక్ ఉచితంగానే ఎంజాయ్ చేయవచ్చు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
‘జీవో 111’ ట్రబుల్ వన్.. ఆ 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జారీ చేసిన 111 జీవోను రద్దు చేసి కొత్త మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది కావస్తున్నా.. నేటికీ అడుగు ముందుకుపడలేదు. ప్రస్తుతం రాజధాని దాహార్తిని తీర్చేందుకు ఈ జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచి్చన 111 జీవోను రద్దు చేస్తూ గతేడాది ఏప్రిల్ 19న జీవో నంబర్ 69ను విడుదల చేసింది. జీవో పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని ప్రకటించింది. కానీ నేటికీ ఆయా గ్రామాలు హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ ప్రకారం జీవసంరక్షణ మండలి(బయో కన్జర్వేషన్ జోన్)లోనే కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఆంక్షలే ఇప్పటికీ అమలులో ఉండడంతో నిర్మాణదారులకు ఇక్కట్లు తప్పడంలేదు. చిత్తశుద్ధిలేని కమిటీ.. కొత్త మాస్టర్ ప్లాన్ను సాధ్యమైనంత త్వరగా రూపొందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందుకోసం సీఎస్ నేతృత్వంలో కమిటీని వేసింది. పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీ.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను కూడా ఖరారు చేసింది. రెండు రిజర్వాయర్ల పరిరక్షణ, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను సూచించాలని అలాగే ప్రధాన మౌలిక సదుపాయాల కల్పనకు విధానాలను రూపొందించాలని ఆదేశించింది. మురుగు, వరద కాల్వల నిర్మాణం, మురుగునీటి నిర్వహణ ప్లాంట్ల (ఎస్టీపీలు) ఏర్పాటు, నిధుల సమీకరణ, లేఅవుట్లు, నిర్మాణాల అనుమతికి సంబంధించిన విధివిధానాలతో పాటు న్యాయపరమైన అంశాలనూ పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు తొలిసారి భేటీ అయిన కమిటీ కేవలం ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించి మమ అనిపించింది. మాస్టర్ప్లాన్ రూపకల్పన బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో జీవో 69 అమలుపై ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణదారులకు ఇక్కట్లు.. జంట జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఆయా భూముల్లో ఇప్పటికే సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు తక్కువ ధరకు పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి ఫామ్హౌస్లు, రిసార్ట్లను నిర్మించుకున్నారు. ఇవే కాకుండా అనధికారిక లే–అవుట్లూ వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం 111 జీవో ఎత్తివేసినందున నిర్మాణాలపై ఆంక్షల్లేవని భావించి అనుమతుల కోసం స్థానిక పట్టణ, పంచాయతీలను ఆశ్రయిస్తున్న రియల్టర్లు/భవన నిర్మాణదారులకు నిరాశే మిగులుతోంది. పర్మిషన్లు జారీ చేయకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, 111 జీవో ఇంకా మనుగడలోనే ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించడంతో 69 జీవో అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు ఏదైనా నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కోసం వెళితే ఆంక్షల నెపంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, అదే పలుకుబడి ఉన్న నాయకులు, ఆమ్యామ్యాలు సమర్పించుకునే డెవలపర్లకైతే ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
జియో మైండ్బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
నన్ను చంపించేందుకు జర్దారీ కుట్ర: ఇమ్రాన్
ఇస్లామాబాద్: మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపించేందుకు ఉగ్రవాదులకు ముడుపులిచ్చారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(70) ఆరోపించారు. ఇప్పటికే తనపై జరిగిన రెండు హత్యాయత్నాలు విఫలం కావడంతో ఈ కొత్త పథకం వేశారని పేర్కొన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బు జర్దారీ వద్ద చాలానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా కుట్రలో జర్దారీతోపాటు మరో ముగ్గురికి కూడా భాగముందని ఇమ్రాన్ విమర్శించారు. వజీరాబాద్ హత్యాయత్నంతో ఏర్పడిన బుల్లెట్ గాయాలు మానాక తిరిగి పోరాటం మొదలుపెట్టడం ఖాయమన్నారు. తనకు ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిని దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరని ఇమ్రాన్ అన్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక పేర్కొంది. -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ కొత్త వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్నగర్ పేరును పాలమూరుగా, వికారాబాద్ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్ పేరును కరినగర్గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది. చదవండి: ‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్నే’ -
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ సుఖ్ సమృద్ధి
ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సుఖ్ సమృద్ధి పేరుతో దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. పన్ను రహిత గ్యారంటీ ఇన్కం లేదా ఏక మొత్తంలో మెచ్యూరిటీ కార్పస్ పొందవచ్చు. పాలసీ వ్యవధిలో ఏ సమయంలోనైనా ఆదాయాన్ని కూడబెట్టుకోవడానికి, సేకరించిన కార్పస్ను ఉపసంహరించుకోవడానికి సేవింగ్స్ వాలెట్ వీలు కల్పిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా కస్టమర్లకు అధిక మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించడంతోపాటు ఆదాయ కాలంతో సహా పాలసీ మొత్తం వ్యవధిలో లైఫ్ కవర్ కొనసాగుతుంది. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
పని వారి కోసం ‘సిప్’
ముంబై: ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్యోగ్’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! -
ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే అఫర్లను ప్రకటిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. ఈ సారి తన వినియోగదారుల కోసం ఒకే ప్లాన్లో బోలెడు ప్రయోజనాలను అందివ్వాలని నిర్ణయించుకుంది. అందుకే కొత్తగా ప్రవేశపెట్టిన ప్లాన్లో.. డీటీహెచ్, బ్రాడ్బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్, ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్, బ్రాడ్బ్యాండ్, DTH ప్రయోజనాలను ఒక రీచార్జ్తో కస్టమర్లకు సొంతం చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ను ఎయిర్టెల్ బ్లాక్ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇప్పటికే ప్రీపెయిడ్ లేదా పోస్ట్పెయిడ్ కనెక్షన్పై ఒకే బిల్లులో ఫైబర్, డీటీహెచ్ మొబైల్తో సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎయిర్టెల్ సర్వీసులను కలిపేందుకు ఎయిర్టెల్ బ్లాక్ యూజర్లకు అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ ద్వారా జీరో-స్విచింగ్ ఇన్స్టాలేషన్ ఖర్చులతో పాటు జీవితకాలపు ఉచిత సర్వీస్ కూడా పొందవచ్చు. వీటిని రూ. 699 నుంచి 2,999 వరకు వివిధ రకాల ప్లాన్లతో అందిస్తోంది. వీటిపై ఓ లుక్కేద్దాం! రూ. 699 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఇది ఎయిర్టెల్ అందించే ఎంట్రీ-లెవల్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ల్యాండ్లైన్ కనెక్షన్, ఫైబర్ ద్వారా 40Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్తో పాటు DTH కనెక్షన్లో రూ. 300 విలువైన టీవీ ఛానెల్లకు యాక్సెస్ పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో డిస్నీ హాట్ స్టార్( Disney Hotstar), సోనీ లివ్( Sony Liv), Airtel XStream యాప్తో పాటు మరో 12 ఓటీటీ యాప్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్లాన్ పోస్ట్పెయిడ్ కనెక్షన్ను అందించదు, కాబట్టి దీనిని ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కూడా కొనుగోలు చేయవచ్చు. రూ. 899 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్లో 105 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్తో రెండు పోస్ట్పెయిడ్ కనెక్షన్లను అందిస్తోంది ఎయిర్టెల్. ఈ ఆఫర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీంతో పాటు 12 ఇతర యాప్లకు సబ్స్క్రిప్షన్, రూ. 350 విలువైన (డీటీహెచ్) DTH టీవీ ఛానెల్లు ఉన్నాయి. రూ. 1098 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ప్లాన్లో 100Mbps స్పీడ్తో ఫైబర్, ల్యాండ్లైన్ కనెక్షన్ లభిస్తుంది. 75 GB ఇంటర్నెట్తో పాట అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్స్టార్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. రూ. 1099 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ సబ్స్క్రిప్షన్ ల్యాండ్లైన్ ద్వారా అపరిమిత కాలింగ్, ఫైబర్పై 200Mbps వరకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్, మరో 13 యాప్లతో సహా రూ.350 విలువైన OTT ఛానెల్లకు కూడా కస్టమర్లు యాక్సెస్ పొందుతారు. రూ. 1599 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: అన్లిమిటెడ్ కాలింగ్, 300Mbps ఇంటర్నెట్ స్పీడ్తో పాటు ఫైబర్, ల్యాండ్లైన్ కనెక్షన్తో వస్తుంది. ఇందులో రూ. 350 విలువైన టీవీ ఛానెల్లతో డీటీహెచ్ కనెక్షన్ వస్తుంది. ఈ ప్లాన్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, మరిన్ని OTT ప్రయోజనాలు ఉంటాయి. రూ. 1799 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్: ఈ ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్తో కూడిన ల్యాండ్లైన్ వస్తుంది అది కూడా గరిష్టంగా 200Mbps స్పీడ్తో ఉపయెగించుకోవచ్చు. ఈ ప్లాన్లో 190GB డేటా , 4 పోస్ట్పెయిడ్ కనెక్షన్లతో అపరిమిత కాలింగ్ ఉంది. అదనంగా OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్స్టార్, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, ఇతర సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. రూ. 2299 ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ : ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 300 Mbps డేటాతో ఫైబర్, ల్యాండ్లైన్ కనెక్షన్ను అందించే అత్యంత ఖరీదైన ప్లాన్. 240 GB డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్తో 4 పోస్ట్పెయిడ్ కనెక్షన్లు పొందవచ్చు. అంతేనా ఇంకా రూ. 350 విలువైన టీవీ ఛానెల్లతో DTH కనెక్షన్ లభిస్తుంది. నెట్ఫ్లిక్స్( Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియోలు (Amazon Prime Videos), డిస్నీ+ హాట్స్టార్ (Disney Plus Hotstar) ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, (Airtel Xstream) మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. -
బోలెడు బెనిఫిట్స్తో ఎల్ఐసీ కొత్త పాలసీ!
హైదరాబాద్: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన్ వర్ష’ బీమా ప్లాన్ను (ప్లాన్ నంబర్ 866) ప్రవేశపెట్టింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని), నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, సింగిల్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్పాలసీ అని ఎల్ఐసీ ప్రకటించింది. జీవిత బీమా రక్షణ, పొదుపులను ఈ ప్లాన్లో భాగంగా ఆఫర్ చేస్తోంది. పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లిస్తుంది. పాలసీ కాల వ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే ఏక మొత్తంలో హామీ మేరకు చెల్లిస్తుంది. ఈ ప్లాన్ 2023 మార్చి వరకే అందుబాటులో ఉంటుంది. 10, 15 ఏళ్ల కాలాన్ని పాలసీ టర్మ్గా ఎంపిక చేసుకోవచ్చు. కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.1.25 లక్షలు కాగా, గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 ఏళ్ల వయసున్న చిన్నారి వయసు నుంచి ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టర్మ్లో ఏటా గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ ప్లాన్కు అనుబంధంగా తీసుకునేందుకు ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అందుబాటులో ఉన్నాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
‘సోలార్’కు రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే. మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది. భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు. రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ పీఎల్ఐలో మార్పులు సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్వర్క్ చైన్లో చిప్ ఫ్యాబ్లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్లో సెమీకండక్టర్స్, డిస్ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. -
ఎక్సైడ్ లైఫ్ స్మార్ట్ ఇన్కం ప్లాన్
ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా స్మార్ట్ ఇన్కం ప్లాన్ను ఆవిష్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ సంజయ్ తివారీ తెలిపారు. సాధారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే ఆర్థిక లక్ష్యాలను సాధించుకునేందుకు, ఒకవేళ అప్పటికే రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకున్నా సరిపోకపోవచ్చని, స్థిరంగా మరో ఆదాయం కూడా ఉంటే సహాయకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాన్లో ఎన్హాన్స్డ్ ఇన్కం, ఎన్హాన్స్డ్ మెచ్యూరిటీ అని రెండు వేరియంట్స్ ఉంటాయని తివారీ తెలిపారు. ప్రీమియం చెల్లింపు వ్యవధితో పోలిస్తే పాలసీదారు ఆదాయం పొందే వ్యవధి రెట్టింపుగా ఉండటం, జీవిత బీమా కవరేజీ తదితర ప్రయోజనాలు ఇందులో ఉంటాయని పేర్కొన్నారు. స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి తోడ్పడగలవన్నారు. చదవండి: తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. -
కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పిన స్విగ్గీ..! ఇక అన్లిమిటెడ్..!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన కస్టమర్లకు గుడ్న్యూస్ అందించింది. కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలను అందించేందుగాను ‘స్విగ్గీ వన్’ అనే అప్గ్రేడ్ మెంబర్షిప్ ప్రోగ్రాంతో స్విగ్గీ ముందుకొచ్చింది. ఈ మెంబర్షిప్తో వినియోగదారులకు అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్లు, మరిన్ని ప్రయోజనాలను స్విగ్గీ అందించనుంది. ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉన్న ‘స్విగ్గీ సూపర్’ ప్లాన్తో కేవలం పరిమిత సంఖ్యలోనే ఉచిత డెలివరీలను పొందే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 70 వేల కంటే ఎక్కువగా రెస్టారెంట్ల నుంచి అపరిమిత ఉచిత డెలివరీలను కస్టమర్లు పొందవచ్చును. అలాగే రూ. 99 కంటే ఎక్కువ గ్రాసరీ ఆర్డర్స్పై అపరిమిత ఉచిత ఇన్స్టామార్ట్ డెలివరీలను కూడా అందించనుంది. దాంతోపాటుగా స్విగ్గీ భాగస్వామి రెస్టారెంట్ల నుంచి కస్టమర్లు పుడ్ ఆర్డర్స్పై 30శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చును. చదవండి: పాతికేళ్ల ఫ్యాషన్ డిజైనర్ కేరాఫ్ బంజారా మార్కెట్ స్విగ్గీ వన్ మెంబర్షిప్ రేట్స్ ఏంతంటే..! మూడు నెలలకుగాను రూ. 299, ఏడాది గాను రూ. 899 చెల్లించి స్విగ్గీ వన్ మెంబర్షిప్ను కస్టమర్లు పొందవచ్చును. స్విగ్గీ వన్ సేవలు ప్రస్తుతం లక్నో, పూణే, త్రివేండ్రం, విజయవాడలో అందుబాటులో ఉంది. రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలకు స్విగ్గీ వన్ మెంబర్షిప్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వారికి అప్గ్రేడ్..! ఇప్పటికే స్విగ్గీ సూపర్ మెంబర్స్గా ఉన్నవారు ‘స్విగ్గీ వన్’ మెంబర్షిప్కు ఏలాంటి ఖర్చులేకుండా ఉచితంగా అప్గ్రేడ్ అవుతారని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా స్విగ్గీ సూపర్ మెంబర్స్కు కాంప్లిమెంటరీగా నెల రోజుల పొడిగింపు కూడా రానుంది. చదవండి: పేటీఎం అట్టర్ ప్లాప్షో.. 63 వేల కోట్లు మటాష్! ఇన్వెస్టర్లు లబోదిబో -
18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు..! కొత్త వ్యూహంతో మైక్రోసాఫ్ట్..!
నేటి టెక్నాలజీ యుగంలో సోషల్మీడియా, ఇతర యూపీఐ యాప్స్, మరికొన్ని యాప్స్లను మనలో చాలా మంది వాడుతుంటాం. మనకు సంబంధించిన ఫోటోలను, డాక్యుమెంట్లను, ఇతర సీక్రెట్ అంశాలను స్మార్ట్ఫోన్లలో, లేదా ఆన్లైన్ యాప్స్లో, ఇతరులనుంచి రక్షణ పొందేందుకుగాను ఆయా యాప్స్కు, ఆన్లైన్ సర్వీసులకు పాస్వర్డ్లను కచ్చితంగా ఏర్పాటుచేస్తాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనో, లేక పిన్తో బలమైన పాస్వర్డ్లను ఏర్పాటుచేస్తాం. చదవండి: భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..! సెకనుకు 579పాస్వర్డ్లపై దాడి..! మనం ఎంత బలమైన పాస్వర్డ్ను ఏర్పాటుచేసిన హ్యాకర్లు వాటిని సులువుగా ట్రేస్ చేసి ఆయా వ్యక్తులు సమాచారాన్ని లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానోక సందర్భంలో ప్రతి సెకనుకు 579పాస్వర్డ్లపై హ్యాకర్లు దాడి చేస్తోన్నట్లు మైక్రోసాఫ్ట్ తన నివేదికలో పేర్కొంది. ఒక ఏడాది చూసుకుంటే మొత్తంగా 18 వందల కోట్ల పాస్వర్డ్లపై దాడులు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త వ్యూహం..! పాస్వర్డ్లకు స్వస్తి పలుకుతూ నూతన ఒరవడి సృష్టించాలని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలను మైక్రోసాఫ్ట్ ముమ్మరం చేస్తోంది. ఇకపై పాస్వర్డ్స్లేకుండా మైక్రోసాఫ్ట్ యాప్స్లో, ఖాతాలో లాగిన్ అయ్యేలా మైక్రోసాఫ్ట్ దృష్టిసారించింది. పాస్వర్డ్స్లకు స్వస్తి పలుకుతూ మైక్రోసాఫ్ట్ అథనిటికేటర్, విండోస్ హలో, లేదా వెరిఫికేషన్ కోడ్ ద్వారా లాగిన్ అయ్యే విధానాలను మైక్రోసాఫ్ట్ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఈ లాగిన్ ఫీచర్ విధానంతో మైక్రోసాఫ్ట్కు సంబంధించిన యాప్స్కు వర్తించేలా చేయనుంది. అందులో ఔట్లూక్ ,వన్డ్రైవ్ , మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సెఫ్టీ, ఇతర మైక్రోసాఫ్ట్ యాప్స్కు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్స్ లేకుంగా లాగిన్ అయ్యే ఫీచర్ను 2019లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్స్లో కమర్షియల్ యూజర్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజర్లు యూజర్లు అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఆప్షన్లో, అడిషనల్ సెక్యూరిటీ ఆప్షన్స్లో పాస్వర్డ్లెస్ అకౌంట్ ఆప్షన్ను టర్నఆన్ చేయడం ద్వారా మైక్రోసాఫ్ట్ అథనికేటర్ యాప్స్నుంచి వచ్చే ఆన్స్క్రీన్ ప్రామ్ట్స్ తో లాగిన్ అవ్వచును. ఈ ఫీచర్ ప్రస్తుతం కమర్షియల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! -
ఎయిర్టెల్ నుంచి కొత్త డేటా టాప్అప్ ప్లాన్
కొంత కాలంగా స్థబ్ధుగా ఉన్న ఓటీటీలోకి ఈవారం నుంచే కొత్త సినిమాలు సందడి మొదలైంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతీ వారం మూడునాలుగు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో మూవీస్ చూడాలంటే మొబైల్ డేటాతో చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఎయిర్టెల్ సంస్థ కొత్త డేటా టాప్ అప్ ప్లాన్ని అమల్లోకి తెచ్చింది. డేటా ప్యాక్ రూ. 119 ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే రూ. 119 ప్యాక్ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ టాప్ అప్ ప్యాక్తో 15 జీవీ 4జీ డేటా లభిస్తుంది. వినియోగదారులు ప్రస్తుతం ఏ ప్యాకేజీలో ఉన్నారో ఆ ప్యాకేజీ గడువు ముగిసే వరకు ఈ డేటా అందుబాటులో ఉంటుంది. కాల్స్, వ్యాలిడిటీలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా డేటాను అందివ్వడానికే ఈ ప్యాక్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. చదవండి : డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’ -
ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ
ముంబై: ప్రైవేట్ రంగ బీమా రంగ సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘ఈషీల్డ్ నెక్ట్స్’ ప్లాన్ ఆవిష్కరించింది. జీవితంలో వివిధ దశలకు (వివాహం, ఇంటి కొనుగోలు మొదలైనవి) అనుగుణంగా కవరేజీ పెరిగే సౌలభ్యం ఉండటం ఈ పాలసీ ప్రత్యేకత. లెవెల్ కవర్, పెరిగే కవరేజీ ప్రయోజనం, ఫ్యూచర్ ప్రూఫింగ్ ప్రయోజనంతో లెవెల్ కవర్ అంటూ మూడు ఆప్షన్లలో ఇది లభిస్తుంది. పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న ఆప్షనే చివరిదాకా కొనసాగుతుంది. మధ్యలో మార్చుకోవడానికి ఉం డదు. రెగ్యులర్గా లేదా ఏకమొత్తంగా లేదా పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుందని సంస్థ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం కొత్త ప్లాన్ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ను తీసు కొచ్చింది. ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్ను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన రూ.108 ల తాజా ప్లాన్లో 1జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్ ఆఫర్ను కూడా అందిస్తోంది. నిర్దేశిత రోజువారి డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్లోడింగ్, అప్లోడింగ్ స్పీడ్ను 80కేబీపీఎస్కు పరిమితం కానుంది. అయితే ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్లో లభ్యం. అలాగే రూ.47కే ఫస్ట్ రీచార్జ్, రూ.109 ప్లాన్ వోచర్, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది. -
ఎల్ఐసీ నుంచి మరో కొత్త పథకం
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నాన్లింక్డ్, నాన్పార్టీస్ పేటింగ్ వ్యక్తిగత పొదుపు పథకమిది. ఈ పథకం ద్వారా బీమా రక్షణతోపాటు పొదుపును సైతం కలిపిస్తునట్లు ఎల్ఐసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వివరాల ప్రకారం పథకం గడువు ముగిశాక హామీ ఇస్తున్న మొత్తాన్ని పాలసీదారుడికి ఎల్ఐసీ చెల్లించనుంది. ఒకవేళ గడువుకంటే ముందుగా దురదృష్టవ శాత్తూ పాలసీదారు మరణిస్తే ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక మద్దతును అందివ్వనుంది. హామీలో భాగంగా తీసుకున్న పాలసీ(బేసిక్) విలువపై ప్రతీ ఏడాది చివర్లో రూ. 1,000కి రూ. 50 చొప్పున జమ (గ్యారంటీడ్ ఎడిషన్స్) చేయనుంది. రిస్క్ ప్రారంభమయ్యాక పాలసీ కాలంలో దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే.. నిబంధనల ప్రకారం బీమా విలువతోపాటు, అప్పటివరకూ జమ అయిన అదనపు మొత్తాన్ని చెల్లించనుంది. చదవండి: ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ కొత్త నిబంధనలు పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
ప్రజల్లో ఆర్థిక విజ్ఞానం పెంచాలి
ముంబై: ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు.. ఆర్థిక విద్యను ప్రోత్సహించేందుకు ఐదు ప్రధాన అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఆర్బీఐ ముందుకు వచ్చింది. ‘నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020– 2025’ (ఎన్ఎస్ఎఫ్ఈ) పేరుతో ఆర్బీఐ గురువారం డాక్యుమెంట్ను విడుదల చేసింది. దేశ ప్రజ ల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు, సాధికార భారత్ కోసం ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సంస్థలు వేటికవే విడిగా కాకుండా, కలసికట్టుగా (బహుళ భాగస్వాములతో) పనిచేసే విధానం అవసరమని సూచించింది. తన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న ఐదు ప్రధాన అంశాలు.. కంటెంట్ (విషయాలు), కెపాసిటీ (సామర్థ్యం), కమ్యూనిటీ (సంఘం), కమ్యూనికేషన్ (సమాచారం), కొలాబరేషన్ (సహకారం)ను ప్రధానంగా ఆర్బీఐ ప్రస్తావించింది. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆర్థిక నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ ప్రధాన ఎజెండాగా ఉన్న విషయం గమనార్హం. ‘‘ఆర్థిక అక్షర జ్ఞానం ఆర్థిక సేవల విస్తృతికి తోడ్పడుతుంది. అదే విధంగా కస్టమర్లు అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడుతుంది’’ అంటూ ఆర్బీఐ ఎన్ఎస్ఎఫ్ఈ నివేదిక వివరించింది. ఎన్ఎస్ఎఫ్ఈలో పేర్కొన్న అంశాలు ► వివిధ వర్గాల ప్రజల్లో (విద్యార్థులు, టీచర్లు, యువత, మహిళలు, ఉద్యోగాల్లో కొత్తగా చేరే వారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వృద్ధు లు, వికలాంగులు తదితర) ఆర్థిక అంశాల పట్ల అవగాహనకు ప్రత్యేకంగా పాఠాలు బోధించాలి. ► ఆర్థిక లక్ష్యాలకు వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో పాల్గొనేలా చేయాలి. పొదుపును ప్రోత్సహించాలి. ► రుణాలకు సంబంధించి క్రమశిక్షణను అభివృద్ధి చేయాలి. నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్న సంస్థల ద్వారానే రుణాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. ► డిజిటల్ ఆర్థిక సేవలను మరింత భద్రమైన, సురక్షితంగా వాడుకునేలా మెరుగుపరచాలి. ► జీవితంలోని వివిధ దశల్లో వచ్చే సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా (రిస్క్ మేనేజ్మెంట్) తగినంత బీమా కవరేజీ, వృద్ధాప్య జీవనం కోసం అనుకూలమైన పెన్షన్ ఉత్తులను తీసుకునే ప్రణాళిక అవసరాన్ని తెలియజేయాలి. ► స్కూల్ పాఠ్యాంశాల్లో ఆర్థిక విద్యను భాగం చేయాలి. ఇందుకు సంబంధించి 9, 10వ తరగతుల్లో కంటెంట్ను మెరుగుపరచాలి. బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో సమగ్ర ఆర్థిక విద్యను భాగం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్లకు సైతం ఆర్థిక విషయాలపై శిక్షణ ఇవ్వాలి. ► ఆర్బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ (ఎన్సీఎఫ్ఈ) సంస్థ ఎన్ఎస్ఎఫ్ఈ 2020–25ని రూపొందించింది. ► ప్రభుత్వ లక్ష్యాలకు మద్దతు..: ‘‘ఎన్ఎస్ఎఫ్ఈ డాక్యుమెంట్ ఉద్దేశం.. భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థల లక్ష్యానికి మద్దతునివ్వడమే. వివిధ వర్గాల్లోని ప్రజల్లో తగినంత విజ్ఞానాన్ని, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వారిలో ప్రవర్తనపరమైన మార్పులు తీసుకురావడం వల్ల.. తమ ద్రవ్యపరమైన అంశాలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడంతోపాటు, భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకోగలరు’’అని ఆర్బీఐ పేర్కొంది. -
జియో ఫైబర్: రూ.199కే 1000 జీబీ డేటా
సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ ఆంక్షలతో దాదాపు ప్రజలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు తమ ఇంటర్నెట్, డేటా ప్లాన్లను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో ఫైబర్ (ఫైబర్-టు-హోమ్) వినియోగదారులకోసం ఒక అద్భుతమైన కాంబో ప్లాన్ ను ప్రకటించింది. రూ.199 లకు వేగవంతమైన 1000 జీబీ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే 7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. ఈ కాంబో ప్లాన్ ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్కు పడిపోతుందని వెల్లడించింది. పాత కస్టమర్లతోపాటు కొత్త వారికి కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ .234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మైజియో యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ లేదా ఉచిత ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ కాంబో ప్లాన్ లో లభించవు. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం) కాగా కోవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇంటర్నెట్ పైనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. పెరిగిన డేటా వినియోగాన్ని అందిపుచ్చుకునే క్రమంలో టెలికాం దిగ్గజాలు తమ డేటాప్లాన్లను సమీక్షిస్తుండటంతో పాటు రీఛార్జ్ సౌకర్యాన్ని సులభతరం చేశాయి. జియో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా చందాదారులు ఏటీఎం సెంటర్లలో రీఛార్జ్ చేసుకునే వెసులుబాటును ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. (రూపాయికి ఆర్బీఐ 'శక్తి') -
అమెజాన్కు షాక్: నెట్ఫ్లిక్స్ కొత్త ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులకు అత్యంత చవక ధరకే నెలవారీ ప్లాన్ను లాంచ్ చేసింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకు షాకిచ్చేలా రూ.199లకే నెలవారీప్లాన్ను బుధవారం ప్రకటించింది.మొబైల్, లేదా ట్యాబ్ సేవలకు మాత్రమే ఈ ప్లాన్ పరిమితం. నెలకు రూ. 500 బేసిక్ ప్లాన్తో వినియోగదారులకు ఆకట్టుకోలేకపోతున్ననెటిఫిక్ల్స్ ప్రధాన ప్రత్యర్థులు అమెజాన్, హాట్స్టార్ అందిస్తున్న ప్లాన్లకు ధీటుగా అత్యంత తక్కువ ధరకే తాజా ప్లాన్ను ప్రకటించడం విశేషం. తాజా ప్లాన్లో ఒకేసారి ఒక స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్లో ఎస్డి కంటెంట్ను వీక్షిచేందుకు ఈ ప్లాన్ వినియోగదారులను అనుమతిస్తుంది. 499, 649 , 799 రూపాయల మధ్య ఉన్న ప్రస్తుత, బేసిక్, ప్రీమియం ప్రణాళికలతో పాటు నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చిన నాల్గవ ప్లాన్ ఇది. ఫిక్కి నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు ప్రయాణంలోనే చూస్తున్నారనీ, 30 శాతం ఫోన్ సమయంలో 70శాతం మొబైల్ డేటాను ఎంటర్టైన్మెంట్లో గడుపుతున్నారనీ, దీంతో సాధ్యమైనంత ఎక్కువ డివైస్లకు చేరుకోవడమేతమ లక్ష్యమని నెట్ఫ్లిక్స్ పార్టనర్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ నిగెల్ బాప్టిస్ట్ చెప్పారు. దాదాపు పదమూడు కొత్త చిత్రాలు, తొమ్మిది కొత్త ఒరిజినల్ సిరీస్లు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. అలాగే కొన్ని దేశాలలో మొబైల్ ఓన్లీ ప్లాన్ను మార్చి మాసంనుంచి పరీక్షించనుంది. ప్రస్తుతం అమెజాన్, హాట్స్టార్ తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్లలో చాలా తక్కువ ధరకే నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
హాట్స్టార్ బంపర్ ఆఫర్ : రోజుకు ఒక రూపాయే
భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్స్టార్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో లాంటి విదేశీ సంస్థలకు షాకిస్తూ విఐపీ సబ్స్క్రిప్షన్ పేరుతో ఓ సరికొత్త ఆఫర్ను తీసుకొచ్చింది. సంవత్సరానికి రూ.365 సబ్స్క్రిప్షన్తో విఐపి ప్లాన్ను హాట్స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఇందులో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది. వివో ఐపిఎల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట. హాట్ స్టార్ విఐపి సబ్స్క్రైబర్స్కి స్టార్ నెట్వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం. అలాగే ఇప్పటికే చందాదారులుగా వున్నవారు ఈ ప్లాన్తో అప్డేట్ చేసుకోవచ్చు. అయితే, హాట్స్టార్ స్పెషల్స్ లేబుల్స్ కింద లభ్యమయ్యే వీడియోలు మాత్రమే ఈ హాట్స్టార్ విఐపి ప్లాన్ ఆఫర్ పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్కి వర్తించకపోవడం గమనార్హం. -
బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్
సాక్షి, ముంబై: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం సరికొత్త కాంబో ఎస్టీవీని ప్రకటించింది. ఎస్టీవీ-269 పేరుతో ఒక ప్యాక్ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్లో ఏ నెట్వర్క్కు అయినా 2600 నిమిషాల టాక్టైం, 260 మెసేజ్లు, 2.6 జీబీ డేటా వంటి ప్రయోజనాలను అందిస్తోంది. ప్లాన్ వాలిడిటీ 26 రోజులు. దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. 70వ రిపబ్లిక్ డే సందర్భంగా వినియోగదారులకు శుభాకాంక్షలు అందిస్తూ బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, ఎండీ అనుపమ శ్రీవాస్తవ మీడియా ప్రకటన జారీ చేశారు. -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త పోస్ట్పెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం రంగంలో ఏర్పడిన విపరీతమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.299 పోస్ట్పెయిడ్ రీచార్జ్పై నెలకు 31జీబీ 4జీ డేటాను అందిస్తోంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజులు 100ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రత్యేకంగా కొత్త వినియోగదారులకోసం ఈ ప్లాన్ను లాంచ్ చేసింది. అయితే దీనికి అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డేటా క్యారీ ఫార్వర్డ్ అవకాశం కూడా ఈ ప్లాన్లో లేదు. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ , వోడాఫోన్ ఐడియా ప్లాన్లకు సవాల్గా బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త పోస్ట్పోయిడ్ ప్లాన్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్ : 105జీబీ డేటా
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, తన ప్రత్యర్థి రిలయన్స్ జియోకు షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. జియోకు పోటీగా మరో సరికొత్త ప్లాన్తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్టెల్. 419 రూపాయలతో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ప్లాన్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్టెల్ అందిస్తుందంటే... రూ.419తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.4జీబీ డేటాను, 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 75 రోజులు. రీఛార్జ్ చేసుకున్న సమయం నుంచి వాయిస్ కాల్స్పై ఎలాంటి ఎఫ్యూపీ పరిమితి ఉండదు. ఒకవేళ 4జీ కవరేజ్ ఏరియా బయట ఈ ప్లాన్ను వాడుకోవాలంటే, 3జీ, 2జీ నెట్వర్క్లపై అదే డేటా వాడుకోవచ్చు. ఎయిర్టెల్ ఇటీవలే రూ.97 ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.35తో ప్రారంభమయ్యే కోంబో ప్లాన్లకు ఈ ప్లాన్ను జత చేర్చింది. రూ.97పై 1.5 జీబీ 3జీ లేదా 4జీ డేటా, 350 నిమిషాల లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ అందిస్తోంది. దీనిలోనే 200 లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ ప్రయోజనాలు యూజర్లకు దక్కుతున్నాయి. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు మాత్రమే. ఎయిర్టెల్ వెబ్సైట్, మైఎయిర్టెల్ యాప్ ద్వారా ఈ ప్యాక్ను కస్టమర్లకు పొందవచ్చు. -
వోడాఫోన్ కొత్త ప్లాన్: సరికొత్త ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్ను అందు బాటులోకి తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం 597 రూపాయల రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్కాల్స్, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం విశేషం. ముఖ్యంగా వాయిస్ కాలింగ్లో పరిమితి పెట్టింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్ పరిమితం. అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్లో 100 యూనిక్ నెంబర్లకు మాత్రమే కాల్ చేసుకునే అవకాశం ఉంది. అంతేనా..ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా నిర్ణయించింది. -
జియోకి షాక్ : వోడాఫోన్ న్యూ రూ. 99 ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ప్రత్యర్థులనుంచి ఎదురవుతున్నసవాళ్లను ఎదుర్కొనేందుకు మరో టెలికాం సంస్థ వొడాఫోన్ సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో 98, ఎయిర్టెల్ 99రూపాయల రీచార్జ్ ప్లాన తరహాలో కొత్త ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే ఎయిర్టెల్, జియో తరహాలో డేటా, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ను ఈ ప్లాన్లో అందించడం లేదు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులు. కస్టమర్లు రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ ఈ ప్లాన్ స్పెషాలిటీగా చెప్పాలి. వొడాఫోన్ వెబ్సైట్, యాప్లో ఈ ప్లాన్ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్ కల్పించింది. మరోవైపు 99 రూపాయలకు ఎయిర్టెల్ 1 జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో రూ. 98 ప్లాన్లో 1 జీబీ డేటా, రోజుకు 300ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. -
ఓన్లీ కాలింగ్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, వొడాఫోన్ల నుంచి వస్తున్న గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది. ఇన్ని రోజులు డేటా టారిఫ్ ప్లాన్లతో పోటీ పడ్డ కంపెనీలు, తాజాగా కాలింగ్ ప్రయోజనాలతో కూడా పోటీపడుతున్నాయి. ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ను ఆవిష్కరించింది. అదే 299 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం.. ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్లకు రూ.299 ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందజేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కాలింగ్లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి, ఇది ఎలాంటి ఎఫ్యూపీ పరిమితులను విధించడం లేదు. అయితే ఈ ప్లాన్లో మేజర్ విషయం కస్టమర్లకు ఎలాంటి డేటాను అందించకపోవడం. ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా.. కేవలం అపరిమిత కాలింగ్ ప్లాన్గానే దీన్ని తీసుకొచ్చింది. ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది. ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్ ప్లాన్ను కూడా ఎయిర్టెల్ సమీక్షించింది. ఈ అప్గ్రేడేషన్తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్టెల్ పెంచింది. -
జియో ఎక్స్క్లూజివ్ రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో కంపెనీ తన జియోఫోన్ యూజర్ల కోసం ఎక్స్క్లూజివ్గా సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. 99 రూపాయలతో ఈ కొత్త జియోఫోన్ రీఛార్జ్ ప్లాన్ను ఆవిష్కరిస్తున్నట్టు తెలిపింది. దీని కింద 28 రోజుల పాటు రోజుకు 500 ఎంబీ డేటాను కస్టమర్లకు జియో ఆఫర్ చేయనుంది. ప్రస్తుతమున్న 49 రూపాయల, 153 రూపాయల ప్యాక్లకు ఈ ప్లాన్ అదనం. ఈ ప్లాన్ను, కంపెనీ జియోఫోన్ మాన్సూన్ హంగామా ఎక్స్చేంజ్ ఆఫర్తో పాటు తీసకొచ్చింది. కొత్త రూ.99 జియోఫోన్ రీఛార్జ్, యూజర్లు నెలవారీ ఖర్చులను సుమారు 50 శాతం తగ్గించింది. డేటాతో పాటు ఎస్ఎంఎస్లను జియో 300కు పెంచింది. వాయిస్ కాల్స్ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రూ.594 రీఛార్జ్ ప్యాక్ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. దీని కింద ఆరు నెలల పాటు అపరిమిత డేటాను, అపరిమిత కాల్స్ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ప్యాక్లో ఎలాంటి టెక్ట్స్ మెసేజ్లు రావడం లేదు. కాగ, జియో తీసుకొచ్చిన మాన్సూన్ హంగామా ఆఫర్ కింద, రూ.501 రీఫండబుల్ డిపాజిట్ కింద కొత్త జియోఫోన్ను తీసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ చేసే ఫీచర్ ఫోన్, వర్కింగ్ కండీషన్లో ఉండి, మూడేళ్ల కంటే తక్కువ వాడినదై ఉండాలి. ఈ హ్యాండ్సెట్ను ఎవరైతే పొందాలనుకుంటున్నారో, వారికి 101 రూపాయల విలువైన 6 జీబీ కాంప్లిమెంటరీ డేటాను జియో ఆఫర్ చేయనుంది. ఈ హ్యాండ్సెట్తో పాటు, కొత్త జియో సిమ్ కూడా కస్టమర్లకు వస్తుంది. అయితే పాత నెంబర్ను మొబైల్ పోర్టబులిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. -
ఎయిర్టెల్ లాంగ్ టర్మ్ ప్లాన్
రిలయన్స్ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, కొత్త కొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా మరో కొత్త రీఛార్జ్ ప్లాన్ను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. 597 రూపాయలతో ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది. తాజాగా ఆఫర్ చేసిన ఈ ప్లాన్ కింద దీర్ఘకాలికంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను ఎయిర్టెల్ అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 168 రోజులు. కాలింగ్తో పాటు డేటా ప్రయోజనాలను, ఎస్ఎంఎస్ సౌకర్యాలను ఇది ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్లకు, ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్తో ఎయిర్టెల్ గట్టి కౌంటర్ ఇస్తోంది. కొన్ని రీజన్లలో ఎంపిక చేసిన సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ కింద ఎలాంటి రోజువారీ పరిమితులు లేకుండా 168 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 10 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అయితే డేటా ప్రయోజనాలు అన్ని ప్లాన్లతో పోలిస్తే చాలా తక్కువే. ఈ ప్లాన్ను కేవలం వాయిస్ కాల్ యూజర్లను టార్గెట్గా చేసుకుని తీసుకొచ్చింది. ఎయిర్టెల్ అంతకముందు కూడా అపరిమిత వాయిస్ కాల్స్తో రూ.995 రీఛార్జ్ ప్లాన్ను లాంచ్చేసింది. ఆ ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, నెలకు 1జీబీ డేటాను 180 రోజుల పాటు అందిస్తోంది. ప్రస్తుతం లాంచ్ చేసిన రూ.597 ప్లాన్, జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్కు డైరెక్ట్ పోటీగా ఉంది. -
రూ.9లకే వోడాఫోన్ రీచార్జ్ ప్లాన్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాంరంగంలో జియో ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యర్థి కంపెనీలు ఎయిర్టెల్, ఐడియా లాంటి కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు వస్తున్నాయి. తాజాగా వోడాఫోన్ కూడా ఇలాంటి ఆఫర్నే ప్రకటించింది. ఎయిర్టెల్, జియో లాంటి ప్లాన్ల తరహాలోనే కేవలం రూ. 9ల కే ఒక రీచార్జ్ ప్లాన్ను శుక్రవారం వెల్లడించింది. ఇందులో వొడాఫోన్ ప్రీపెయిడ్ చందాదారులు రోజుకు అపరిమిత స్థానిక , ఎస్టీడీ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, 100ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే కొత్త ప్యాక్ ప్రత్యేకంగా యుపి ఈస్ట్ లో వోడాఫోన్ చందాదారుల కోసం ఈప్లాన్ను తీసుకొచ్చింది. అయితే తాజా రూ. 9 వొడాఫోన్ ప్యాక్ను కేవలం యూపీకే పరిమితం చేయగా.. మరోవైపు 9 రూపాయల ప్యాక్లో ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా రోజుకు అన్లిమిటెడ్ కాలింగ్ 100ఎస్ఎంఎస్లు, 100ఎంబీ డేటాను అందిస్తోంది. జియో రూ. 19 రోజువారీ ప్యాక్లో అపరిమిత వాయిస్ కాల్స్, 20 ఎస్ఎంఎస్లు, 150 ఎంబీ డేటాను ఆఫర చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వోడాఫోన్ కూడా ఈ ప్లాన్ను దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. -
ఎయిర్టెల్కు పోటీ : ఐడియా కొత్త ప్లాన్
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రూ.249 ప్యాక్కు పోటీగా ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్యాక్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఎయిర్టెల్ మాదిరి ప్రయోజనాలతో ఎయిర్టెల్ టారిఫ్ మాదిరిగానే 249 రూపాయలతో ఐడియా ఈ కొత్త ప్యాక్ను తీసుకొచ్చింది. ఈ ప్యాక్ కింద ఐడియా రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్ను(రోమింగ్ కలిపి), ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తంగా ఐడియా తన కస్టమర్లకు 56జీబీ డేటాను అందించనుంది. వాయిస్కాల్స్లో రోజుకు 250 నిమిషాలను, వారానికి 1000 నిమిషాలను మాత్రమే వెసులుబాటును ఐడియా కల్పిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాక్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ తాజాగా లాంచ్ చేసిన ఈ రూ.249 ప్యాక్లోనే ఐడియా మాదిరి ప్రయోజనాలనే లభిస్తున్నాయి. రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీని వాలిడిటీ కూడా 28 రోజులే. రిలయన్స్ జియో ఇవే ప్రయోజనాలను రూ.198కే అందిస్తోంది. అయితే ఐడియా తన రూ.249 ప్యాక్పై రోజువారీ, వారం వారీ కాలింగ్ పరిమితులను విధించగా.. ఎయిర్టెల్, జియోలు మాత్రం ఎలాంటి పరిమితులు విధించకుండా అపరిమిత కాల్స్ను ఆఫర్ చేస్తున్నాయి. వొడాఫోన్ కూడా వీటికి పోటీగా తన ప్యాక్ను తీసుకు రావాల్సి ఉంది. ఐడియా తన ప్రీపెయిడ్ యూజర్లు ఇటీవలే రోజుకు 5జీబీ డేటా అందించేలా రూ.998 ప్యాక్ను ప్రకటించింది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్ : 1200జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన తొలి 300ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను సోమవారం ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్ రూ.2199తో ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ఫైబర్-టూ-ది-హోమ్(ఎఫ్టీటీహెచ్) సర్వీసు సబ్స్క్రైబర్లను టార్గెట్గా చేసుకుని ఈ ప్లాన్ను ఎయిర్టెల్ స్పెషల్గా రూపొందించింది. ఈ కొత్త ప్లాన్ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాలింగ్ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ కొత్త 300ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను ఎంచుకునే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు, ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ వంటి ఓటీటీ యాప్స్కు ఉచిత సబ్స్క్రిప్షన్ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ను యూజర్లు పొందనున్నారు. ఈ ప్లాన్ డేటా రోల్అవుట్ ప్రయోజనాలను, ఎయిర్టెల్ సర్ప్రైజ్, మైహోమ్ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్ డేటా కూడా అక్టోబర్ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్ను ఆన్లైన్ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే. ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్టెల్ తెలిపింది. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ సైట్ను విజిట్ చేసి, సబ్స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. హై స్పీడు డేటా ఆశించే వారికి ఈ కొత్త ఎఫ్టీటీహెచ్ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని భారతీ ఎయిర్టెల్ సీఈవో జార్జ్ మతేన్ అన్నారు. వచ్చే రోజుల్లో ఎఫ్టీటీహెచ్ ఆఫర్స్ను మరింత పెంచుతామన్నారు. -
ఐడియా యూజర్లకు రోజుకి 5జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్కు, రిలయన్స్ జియోకు ఐడియా సెల్యులార్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 998 రూపాయలతో సరికొత్త ప్యాక్ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద రోజుకు 5జీబీ 4జీ/2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 35 రోజుల పాటు అందిస్తోంది. ఇది ఐడియా మ్యాజిక్ ఆఫర్తో వచ్చింది. అంటే ఐడియా యాప్, వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకునే తన ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లకు రూ.3,300 వరకు క్యాష్బ్యాక్ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాక్పై ఒక వారంలో 100 యూనిక్ నెంబర్లకు మాత్రమే కాల్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక వారానికి 1000 నిమిషాలు, రోజుకు 250 నిమిషాలను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్యాక్ తొలుత ఒడిశా సర్కిల్కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐడియా మ్యాజిక్ క్యాష్బ్యాక్ ఆఫర్ లేకుండా ఇదే రకమైన ప్రయోజనాలను కర్నాటక సర్కిల్ వారికి కూడా 28 రోజుల పాటు ఐడియా ఆఫర్ చేస్తోంది. అయితే ఐడియా రూ.998 ప్యాక్ మాదిరిగా కాకుండా... జియో తన సబ్స్క్రైబర్లకు రోజుకు 5జీబీ 4జీ డేటాను, అపరిమిత కాల్స్ను రూ.799కే 28 రోజుల పాటు అందిస్తోంది. ఎయిర్టెల్ కూడా రూ.799 ప్లాన్పై రోజుకు 3.5జీబీ 4జీ డేటాను తన వినియోగదారులు కూడా వాడుకునేలా వీలు కల్పించింది. రూ.998 ప్యాక్తో పాటు ఎంపిక చేసిన సర్కిల్స్ వారికి ఐడియా రోజుకు 7జీబీ డేటా అందించే రూ.1,298 ప్యాక్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టెలికాంటాక్ రిపోర్టు చేసింది. ఈ ప్యాక్ను కూడా 35 రోజుల పాటు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది. రూ.1,298 ప్యాక్లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఐడియా ఆఫర్ చేస్తోంది. అంతేకాక రూ.3,300 రూపాయల విలువైన ప్రయోజనాలతో ఐడియా మ్యాజిక్ క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. -
జియోకు కౌంటర్: వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్లాన్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ కొత్త రీఛార్జ్ ప్యాక్ను ప్రకటించింది. ముఖ్యంగా జియో ప్యాక్కు దీటుగా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ సరికొత్త ప్లాన్నులాంచ్ చేసింది. 24 గంటల వాలిడిటితో రూ.21లకు గంటకు అన్లిమిటెడ్ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు వోడాఫోన్ ఒక "సూపర్ అవర్" రీఛార్జ్ ప్లాన్ను కూడా ప్రారంభించింది. ఇందులో కస్టమర్ కేవలం 16 రూపాయలు రీఛార్జ్పై అపరిమిత డేటాను పొందవచ్చు. కాగా రిలయన్స్ జియో 19 రూపాయలకే ఒక రోజు వ్యాలిడిటీతో 150 ఎంజీ 4జీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు .అంతేకాదు 20 లోకల్ ఎస్ఎంఎస్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ 'హోలీ ధమాకా' : 30జీబీ డేటా
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ డేటా టారిఫ్లకు గట్టి పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు''హోలీ ధమాకా'' పేరుతో 399 రూపాయల ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద పోస్టుపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 30 జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కస్టమర్లందరూ ఈ కొత్త ప్లాన్ను 2018 మార్చి 1 నుంచి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 30జీబీ డేటాలో రోజువారీ పరిమితులను విధించలేదు. కొత్త, పాత కస్టమర్లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. హోమ్ సర్కిల్ వెలుపలు చేసుకునే రోమింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద ఉచితం. బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కేరళ సర్కిల్లో మాత్రమే 4జీ ఇంటర్నెట్ను అందిస్తోంది. మిగతా సర్కిళ్లన్నింటిలో 3జీ ఇంటర్నెటే. ఇటీవలే బీఎస్ఎన్ఎల్, నోకియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో 10 టెలికాం సర్కిళ్లలో 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ సర్వీసులను ఆవిష్కరించబోతుంది. కాగ, ప్రత్యర్థ కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా రూ.399 ప్లాన్ను తన కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే అవి ఈ ప్లాన్ కింద కేవలం 20జీబీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. జియో కూడా 30జీబీ డేటాను రూ.409కు అందిస్తోంది. -
వొడాఫోన్ రోజుకు 4.5 జీబీ డేటా
దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్, రిలయన్స్ జియోకి గట్టి పోటీ ఆఫర్ని ప్రకటించింది. 799 రూపాయలతో సరికొత్త ప్యాక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్యాక్ డైరెక్ట్ జియో రూ.799 ప్లాన్కు పోటీగా ఉంది. జియో తన రూ.799 ప్లాన్ కింద రోజుకు 5జీబీ డేటా ఆఫర్ చేస్తుండగా... దీని కంటే 0.5 జీబీ తక్కువగా రోజుకు 4.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు వొడాఫోన్ తెలిపింది. ఈ ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. దీంతో మొత్తంగా 28 రోజుల పాటు 126 జీబీ డేటా యూజర్లకు లభించనుంది. అదనంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్స్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా లభించనున్నాయి. రూ.549తో కూడా వొడాఫోన్ మరో ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 3.5జీబీ డేటాను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా యూజర్లు పొందనున్నారు. మొత్తంగా యూజర్లకు 28 రోజులకు 98జీబీ డేటా అందుబాటులోకి రానుంది. వొడాఫోన్ ఇటీవలే రూ.158 ప్లాన్ను పునరుద్ధరించింది. ఈ ప్లాన్ కింద కూడా 28 రోజులకు అపరిమిత వాయిస్ కాల్స్, 1జీబీ 3జీ లేదా 4జీ డేటాను వొడాఫోన్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్పై రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ కూడా డైరెక్ట్ జియో రూ.149 ప్లాన్కు గట్టి పోటీగా ఉంది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూ.151 సూపర్ప్లాన్ను కూడా వొడాఫోన్ ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్లాన్స్ కూడా కేవలం కేరళ సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ : ప్రత్యేకత అదే!
టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీకర వాతావరణంలో, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ మరో సరికొత్త ప్లాన్ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ను 84 రోజుల పాటు ఉచితంగా అందించేందుకు రూ.1,099 ప్లాన్ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కేవలం తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ''స్పీడు పరిమితి లేకుండా అపరిమిత డేటా'' అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. రూ.1,099 ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన వివరాలు.. వాయిస్ కాల్స్ : ఈ రూ.1,099 ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ఓచర్ కింద అపరిమిత కాల్స్ను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. హోమ్ సర్కిల్కు, నేషనల్ రోమింగ్కు ఈ కాల్స్ను సద్వినియోగం చేసుకోవచ్చు. రూ.1,099 ప్రీపెయిడ్ డేటా ఓచర్లో 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందించనుంది. అంటే వాలిడిటీ పిరియడ్ అయిపోయేంత వరకు రోజుకు 100 ఎస్ఎంఎస్లను సబ్స్క్రైబర్లు పంపించుకోవచ్చు. 84 రోజుల తర్వాత డేటా వాడకంపై యూజర్లకు 10 కేబీ డేటాకు 3 పైసల ఛార్జీ విధించనుంది. రూ.1,099 రీఛార్జ్ ప్యాక్లో పీఆర్బీటీ(పర్సనలైజడ్ రింగ్ బ్యాక్ టోన్ ఫెసిలిటీ) అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసే ఈ స్పెషల్ సర్వీసు ద్వారా డిఫాల్ట్ రింగ్నే కాకుండా యూజర్లు సరికొత్త ట్యూన్ను సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. -
మీకు జియోఫోన్ ఉందా, అయితే...
50 శాతం అదనపు డేటాతో ఇటీవలే రిపబ్లిక్ డే ఆఫర్లు ప్రకటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబేలు పుట్టించిన రిలయన్స్ జియో... మరో సంచలనానికి తెరతీసింది. రిపబ్లిక్ డే ఒక్క రోజు ముందు జియోఫోన్ యూజర్లకు కొత్త ప్రీ-పెయిడ్ టారిఫ్ ప్లాన్ను ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్, 1జీబీ 4జీ డేటాతో సరికొత్తగా రూ.49 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల పాటు ఈ టారిఫ్ ప్లాన్ వాలిడ్లో ఉంటుందని నేడు(గురువారం) జియో తెలిపింది. శుక్రవారం నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. అదనపు డేటా కోసం చూస్తున్న కస్టమర్ల కోసం జియో రూ.11, రూ.21, రూ.51, రూ.101లలో కొత్త డేటా ఆడ్-యాన్లను ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫీచర్ ఫోన్లలో జియోఫోన్ స్మార్టర్గా పేరుతెచ్చుకుంది. స్మార్ట్ఫోన్ మాదిరి ఇంటర్నెట్ డివైజ్గా దీన్ని వాడుకునే అవకాశాన్ని రిలయన్స్ జియో కల్పించింది. 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈని ఇది ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ను బీట్ చేసి మరీ ఫీచర్ఫోన్ మార్కెట్లో 27శాతం వాటాతో రిలయన్స్ 'జియోఫోన్' బ్రాండ్ అగ్రస్థానాన్ని సాధించినట్లు కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. దీంతో రిలయన్స్ రీటైల్ మార్కెట్ లీడర్గా నిలిచింది. వచ్చే ఏళ్లలో 99 శాతం దేశీయ జనాభాను కవర్ చేయాలని రిలయన్స్ జియో ప్లాన్చేస్తోంది. ఈ ప్లాన్లో భాగంగానే 10వేల ఆఫీసులను, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ కోసం 10 లక్షల అవుట్లెట్లను ఇది ప్రారంభించబోతుంది. కాగ, జియోఫోన్ రూ.153 ప్లాన్తో తొలుత ప్రారంభమైంది. ఈ ప్లాన్లో ఉచిత వాయిస్, అపరిమిత డేటా, జియో యాప్స్ను ఉచితంగా అందిస్తోంది. -
జియోకు కౌంటర్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్
టెలికాం మార్కెట్లో ధరల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రిలయన్స్ జియో ఎఫెక్ట్తో టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు రోజుకో కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ 59 రూపాయలతో ఓ కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. రిలయన్స్ జియో ప్లాన్ 52 రూపాయలకు డైరెక్ట్గా అటాక్గా ఈ కొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ 59 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు.... ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అయిన ఇది... ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 500 ఎంబీ 3జీ లేదా 4జీ డేటాను వాడుకోవచ్చు. రోజు వారీ వాడకంపై ఎలాంటి పరిమితి లేదు. అంతేకాక ఈ 59 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్పై అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ను ఉచితంగా అందించనుంది. అయితే ఈ ప్లాన్పై ఎలాంటి ఎస్ఎంఎస్లను ఆఫర్ చేయదు.కేవలం ఎంపిక చేసిన సర్కిళ్లలోనే ఇది అందుబాటులో ఉంటుంది. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా ఈ ప్లాన్ ఎవరెవరికి అందుబాటులో ఉంటుందో తెలుసుకోవచ్చు. జియో రూ.52 ప్లాన్ వివరాలు... చౌవకైనా ప్లాన్ల కింద రిలయన్స్ జియో తీసుకొచ్చిన రూ.52 ప్రీపెయిడ్ ప్లాన్పై 1.05 జీబీ హైస్పీడ్ 4జీ డేటా, ఫ్రీగా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, 70 ఎస్ఎంఎస్ను అందిస్తుంది. ఈ ప్యాక్ వాలిడిటీ కూడా 7 రోజులే. అయితే ఈ ప్యాక్ కింద రోజుకు 0.15జీబీ డేటా మాత్రమే వాడుకునే వీలుంటుంది. -
ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
సాక్షి, ముంబై : జియో రాకతో మార్కెట్లో నిలబడటానికి టెలికం కంపెనీలు రోజుకో కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్శించడానికి సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ జియో రూ.98 ఆఫర్కు పోటీగా రూ.93కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పదిరోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. రీచార్జ్: రూ.93 కాల్స్: అన్లిమిటెట్ డేటా: 1జీబీ 3జీ/4జీ డేటా కాలపరిమితి: పది రోజులు -
ఎయిర్టెల్ మరో బెస్ట్ ప్లాన్: రూ198
లీడింగ్ టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ మరో ఆఫర్ను ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. 28 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డేటా ప్లాన్ అందిస్తోంది. రోజుకి 1 జీబీ, 3జీ/4జీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలతో ఈ ప్లాన్లను అందిస్తోంది. అయితే అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ మార్కెట్ ప్లాన్మాదిరిగా కాకుండా ప్రస్తుతం, ఈ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా సర్కిల్స్లో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది. రూ. 198 రీచార్జ్పై రోజుకి 1 జీబీ డేటా 28 రోజుల వేలిడిటీ. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సెలెక్టెడ్ యూజర్లకి మాత్రమే ఇది లభ్యం . ఈ ప్లాన్కి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎయిర్ వినియోగదారులు మై ఎయిర్టెల్యాప్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్టెల్ యాప్లో బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ లో రూ.198 ఆఫర్ కనిపిస్తోంది. మరోవైపు రూ.199 రీచార్జ్పై అన్లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను అందిస్తోంది. -
వొడాఫోన్ సరికొత్త ఆఫర్, ప్లాన్ అప్డేట్
రిలయన్స్ జియో దెబ్బకు, టెల్కోలు రోజుకో కొత్త ప్లాన్తో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. తాజాగా వొడాఫోన్ ఢిల్లీ-ఎన్సీఆర్ సర్కిల్లోని ప్రీపెయిడ్ యూజర్లకు కొత్త రీఛార్జ్ ప్యాక్ను లాంచ్ చేసింది. 199 రూపాయలతో ఈ ప్లాన్ను వొడాఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ కింద ఉచిత కాల్స్ను, 1జీబీ డేటాను 28 రోజుల పాటు అందించనుంది. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలను మాత్రమే ఉచిత కాల్స్ను వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఈ పరిమితి మించితే నిమిషానికి 30 పైసలను చెల్లించాల్సి వస్తుంది. నియమ, నిబంధనల ప్రకారం ఏడు రోజుల వ్యవధిలో 300పైగా యూనిక్ నెంబర్లకు కాల్స్ చేసుకోవడానికి వీలులేదు. 300 నెంబర్ల మార్కు దాటినా నిమిషానికి 30 పైసలు చెల్లించాల్సిందే. ఇతర టెలికాం ఆపరేటర్ల మాదిరిగా వొడాఫోన్ కూడా కొత్త కొత్త ఆఫర్లతో రిలయన్స్ జియోకు షాకిస్తోంది. అంతేకాక రూ.349 ప్లాన్ను కూడా అప్డేట్ చేసింది. ఈ అప్డేట్ చేసిన ప్లాన్ కింద అంతకముందు రోజుకు 1జీబీ డేటా వాడుకునే సౌకర్యాన్ని ప్రస్తుతం 1.5జీబీ డేటాకు పెంచింది. ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్లు కూడా రూ.350 ప్లాన్ కింద రోజువారీ డేటాగా 1.5జీబీని అందిస్తున్నాయి. -
వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్, నేడు(సోమవారం) ఓ స్పెషల్ వాయిస్, డేటా ప్యాక్ను లాంచ్ చేసింది. మధ్య ప్రదేశ్, చత్తీష్ఘర్, బిహార్, జార్ఖాండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 38 రూపాయలకే 100 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని, 100ఎంబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. వొడాఫోన్ తన కస్టమర్లకు ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలు అందిస్తూ ఉంటుందని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అవ్నీష్ కోస్లా తెలిపారు. ఈ విధంగా అందిస్తున్న ఆవిష్కరణలో భాగమే వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్యాక్ అని, తక్కువ ధరలో నెలంతా ప్రయోజనాలను అందించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. అదనంగా కస్టమర్లకు 100ఎంబీ డేటాను అందిస్తున్నామని, ఇక ఎంతో విశ్వాసంతో కస్టమర్లు తమకు కనెక్ట్ అయి ఉంటారన్నారు. ఇటీవలే వొడాఫోన్ తన కొత్త ఫస్ట్ రీఛార్జ్ కూపన్(ఎఫ్ఆర్సీ)ని రూ.496కు లాంచ్చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని కొత్త వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్, రిలయన్స్ జియో రూ.459 ప్లాన్కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్ ఎఫ్ఆర్సీ 177 ప్లాన్ను లాంచ్చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. -
వొడాఫోన్ దివాళి ఆఫర్
టెలికాం దిగ్గజాలు పండుగ సీజన్ను ప్రారంభించాయి. ఆఫర్లు, టారిఫ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వొడాఫోన్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద వొడాఫోన్ యూజర్లు కేవలం రూ.399కే ఆరు నెలల పాటు 90జీబీ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందనున్నారు. రిలయన్స్, ఎయిర్టెల్ రూ.399 ప్లాన్కు కౌంటర్గా వొడాఫోన్ ఈ సరికొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే. అంతేకాక కేవలం 4జీ సర్కిళ్ల వారికి మాత్రమేనని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండు కూడా వొడాఫోన్ 2జీ సర్కిళ్లు మాత్రమే. దివాళి గిఫ్ట్గా తన కస్టమర్లకు వొడాఫోన్ ఈ ఆఫర్ను ప్రవేశపెట్టింది. జియో ఆఫర్ చేసే రూ.399 ప్లాన్ కింద 84 రోజుల పాటు 84జీబీ 4జీ డేటా, అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ పొందనున్నారు. అదేవిధంగా ఎయిర్టెల్ ఆఫర్ చేసే రూ.399 ప్లాన్ కింద కూడా అదే రకమైన ప్రయోజనాలను తమ కస్టమర్లు పొందుతున్నారు. జియో తన కస్టమర్లకు దివాళి ఆఫర్ ప్రకటించగానే వొడాఫోన్ కూడా ఈ ప్లాన్ను ప్రకటించింది. జియో ప్రకటించిన దివాళి ఆఫర్లో రూ.399 రీఛార్జ్పై 100 శాతం క్యాష్బ్యాక్ పొందనున్నారు. -
ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ కొత్త ప్లాన్
-
జియో ఎఫెక్ట్: ఎయిర్సెల్ మరో కొత్త ఆఫర్
రిలయన్స్ జియో ఎఫెక్ట్తో ఎయిర్సెల్ మరోసారి తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సోమవారం రోజు రూ.333తో కొత్త డేటా ప్లాన్ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. తను ఆఫర్ చేసే ప్లాన్లతో ఎంతో ఉన్నతమైన ప్లాన్గా దీన్ని అభివర్ణించింది. ఎయిర్సెల్ అందిస్తున్న రూ.333 ప్యాక్పై యూజర్లు 30జీబీ 3జీ డేటాను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై ఎలాంటి రోజువారీ వాడక పరిమితులు లేవు. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం కర్ణాటక ప్రాంత ప్రజలకు మాత్రమే కంపెనీ ప్రకటించింది. ఇంకా అన్ని రాష్ట్ర కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం లేదు. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఉన్న ఎయిర్సెల్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఈ డేటా ప్లాన్ 3జీ స్పీడుకు మాత్రమే పరిమితం చేశామని కంపెనీ తెలిపింది. ఈ-రీఛార్జ్ ద్వారా లేదా USSD - 121333# కు డయల్ చేసి ఈ కొత్త ప్లాన్ను యూజర్లు యాక్టివేట్ చేసుకోవచ్చని చెప్పింది. గత వారమే ఈ టెలికాం కంపెనీ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.348 ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84 రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్సెల్ తాజాగా తీసుకొస్తున్న ఈ ప్యాక్లు ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్కు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. రూ.333 ప్లాన్ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన కర్ణాటక ప్రాంత ఎయిర్సెల్ సర్కిల్ బిజినెస్ హెడ్ కన్వర్బీర్ సింగ్...తాము కొత్తగా తీసుకొచ్చిన రూ.333 డేటా రీఛార్జ్ ప్యాక్, తమ కస్టమర్లకు ఎలాంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ సేవలను ఎంతో ఉన్నతమైన విలువలతో అందిస్తుందని తెలిపారు. అన్వేషించలేని ప్రపంచ వీడియోలు, మ్యూజిక్, మూవీలు, ఎంటర్టైన్మెంట్లను ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఉత్తమమైన ప్లాన్గా చెప్పారు. -
జియోకు షాక్: ఎయిర్టెల్ కొత్త ఆఫర్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఎఫెక్ట్తో అంతకంతకూ దిగివస్తున్న టెలికం కంపెనీలు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్ లీడర్ భారతి ఎయిర్టెల్ అతి చవకైన రెండు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది.ఇటీవల రిలయన్స్ జియో లాంచ్ ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి తీసుకు రానున్న సేవలను ఎయిర్టెల్ ప్రకటించింది. 3జీ, 4 జీ ధరల్లో కోత పెట్టింది. అంతేకాదు జియో ను మించి చవకైన ప్లాన్ ను ఎయిర్టెల్ అందించింది. జియో తరహాలో ప్రతీనెల రూ.300లకు 30 జీబీ కాకుండా.. రూ.145ల చిన్న ప్యాక్ ఆఫర్ చేస్తోంది. రూ.145 14జీబీ 3జీ / 4జీ డ్యాటా అందిస్తోంది 145 రీచార్జ్పై 14జీబీ, 3/4 జీ డ్యాటాను అందిస్తోది. అంతేకాదు ఈ ప్లాన్ లో ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం. 349 రీచార్జ్ ప్యాక్లో 14జీబీ, 3/4 జీ డ్యాటాతో పాటు అన్ లిమిటెడ్ (అన్ని నెట్ వర్క్స్)కాలింగ్ సదుపాయం. కాగా జియో హ్యాఫీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే అన్నిటికన్నా ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే. -
పెంచేద్దాం.. పంచేద్దాం