![Domestic air passenger traffic surges in May 2024 says ICRA](/styles/webp/s3/article_images/2024/06/7/AIR.jpg.webp?itok=aHTMCcB5)
మే నెలలో 1.39 కోట్ల మంది ప్రయాణం
గతేడాదితో పోలిస్తే 5.1 శాతం అధికం
ఇక్రా రేటింగ్స్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మే నెలలో 1.39 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023 మే నెలతో పోలిస్తే ఇది 5.1 శాతం అధికం. కోవిడ్ ముందస్తు కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్లో 1.32 కోట్ల మంది రాకపోకలు సాగించారు. 2024–25లో ట్రెండ్ కొనసాగుతుందని ఇక్రా భావిస్తోంది.
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్లో సానుకూల ధోరణి కొనసాగుతుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. గత నెలలో వియానయాన సంస్థల సామర్థ్యం 2023 మే నెలతో పోలిస్తే 6 శాతం, 2024 ఏప్రిల్తో పోలిస్తే 2 శాతం పెరిగింది. భారత్ నుంచి 2023–24లో 24 శాతం అధికంగా 2.97 కోట్ల మంది విదేశీయానం చేశారు. పరిశ్రమ కోవిడ్కు ముందు స్థాయిల కంటే అధిక రాబడి అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment