బంగారం ఎక్కడ కొన్నా ఒకే రేటు.. | Gold industry seeks 'One Nation One Gold Rate' | Sakshi
Sakshi News home page

బంగారం ఎక్కడ కొన్నా ఒకే రేటు..

Oct 24 2024 2:39 PM | Updated on Oct 24 2024 2:52 PM

Gold industry seeks 'One Nation One Gold Rate'

దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధర లక్ష్యంతో ‘వన్‌ నేషన్‌ వన్‌ గోల్డ్‌ రేట్‌’ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) ప్రకటించింది. ‘‘మేము ఒకే ధర వద్ద బంగారం దిగుమతి చేసుకుంటాము, కానీ దేశీయ రిటైల్‌ ధరలు ఒక నగరం నుండి మరొక నగరానికి భిన్నంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఒకే రేటు కొనసాగాలని మేము కోరుకుంటున్నాము’’ అని జీజేసీ సెక్రటరీ మితేష్‌ ధోర్డా పేర్కొన్నారు.

మండలి సభ్యులతో ఇప్పటికే ఈ విషయంపై 50కుపైగా సమావేశాలను నిర్వహించడం జరిగిందని, తమ ప్రతిపాదనకు ఇప్పటికే దాదాపు 8,000 జ్యూవెలర్స్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపారని వివరించారు. అక్టోబర్‌ 22 నుంచి డిసెంబర్‌ 9 వరకు జరగనున్న వార్షిక  గోల్డ్‌ ఫెస్టివల్‌ ‘లక్కీ లక్ష్మీ’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

ఈ లక్కీ లక్ష్మీ ఉత్సవంలో 1,500 మంది రిటైలర్లు అలాగే 9 వరకూ చైన్‌ స్టోర్స్‌ పాల్గొననున్నాయి.  కొనుగోళ్లకు సంబంధించి రూ. 10 కోట్ల విలువైన బహుమతులను అందజేయడం జరుగుతుంది. బంగారంపై రూ. 25,000 కంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లు పండుగ కాలంలో ఖచ్చితమైన బహుమతులు అందుకుంటారు. బాలీవుడ్‌ నటి ముగ్దా గాడ్సే సీనియర్‌ జీజేసీ సభ్యులతో కలిసి ఈ ఉత్సమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement