
భారత్లో పర్యటిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..కేంద్రమంత్రి ఎస్.జైశంకర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతున్న తీరు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి చర్చించారు. మారుతున్న డిజిటల్ అవసరాల కోసం ఏఐతో కలిసి కృషిచేస్తున్నట్లు ప్రకటించిన గూగుల్.. భవిష్యత్లో టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం నుంచి యూపీఐ పేమెంట్స్ వరకు ఎలాంటి మార్పులు చేయబోతున్నామో స్పష్టం చేశారు.
►ఈ సందర్భంగా.. ఏఐ ద్వారా వ్యవసాయ భూముల డిజిటైజేషన్ కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది
►భారతీయులకు ఇంటర్నెట్ మరింత సహాయకారిగా ఉండటానికి అన్ని జిల్లాల్లో భారతదేశ భాషావైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని ప్రారంభించింది
►భారతదేశపు మొట్టమొదటి బాధ్యతాయుతమైన ఏఐ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో సహాయపడటానికి ఐఐటీ మద్రాస్కు 1 మిలియన్ అమెరికన్ డాలర్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది
►ప్రారంభ దశ, మహిళల నేతృత్వంలోని స్టార్టప్ లకు గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ మద్దతును ప్రకటించింది
►ద్విభాషా వినియోగదారుల అవసరాలు, కెమెరా, వాయిస్తో కొత్త శోధన సామర్థ్యాలపై దృష్టి సారించే సెర్చ్ కోసం అనేక కొత్త ఇండియా-ఫస్ట్, ఇండియా-ఫోకస్డ్ ఆవిష్కరణలను ప్రకటించింది
►ఆండ్రాయిడ్ పై గూగుల్ యాప్ ద్వారా నేరుగా ఫైళ్లలో డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ను ప్రకటించింది. ఇది కీలక డిజిటల్ డాక్యుమెంట్లను ప్రైవేటుగా, సురక్షితంగా, సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి అనుమతిస్తుంది
► గూగుల్ పే ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో జరిగే మోసాలను గుర్తించే కొత్త మోడల్ ను ప్రారంభించింది
Comments
Please login to add a commentAdd a comment