-
భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారత్లోని ఐఫోన్ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) మెసేజింగ్ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్సీఎస్ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్సీఎస్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్ల వంటి ఫైళ్లను ఆర్సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్టైమ్లో చూడవచ్చు. ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది. -
అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.శివ్జీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్కేర్, గేమ్ రూమ్లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shivangi Gupta | Content creator 🌶️ (@shivjeee) -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: మరికొంతమంది ఉద్యోగులపై వేటు!
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ ఉంటే.. మరికొన్ని దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్ ఒకటి. ఈ కంపెనీ తాజాగా తన క్లౌడ్ డివిజన్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.గూగుల్ ఉద్యోగులను తొలగించిన విషయం వెల్లడైనప్పటికీ.. ఎంతమంది ఉద్యోగులను తొలగించారు అనేదానికి సంబంధించిన విషయం వెల్లడికాలేదు. అయితే తొలగింపులు కొన్ని విభాగాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది. సంస్థ దీర్ఘకాలిక విజయాల కోసం కంపెనీ కీలకమైన కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి యోచిస్తోంది. ఈ సమయంలో కొన్ని సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగానే.. కొంతమంది ఉద్యోగులను తొలగించినట్లు గూగుల్ ప్రతినిధి వెల్లడించారు.బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్టెక్ దిగ్గజం గూగుల్ (Google) బెంగళూరులో తమ కొత్త క్యాంపస్ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు కూడా పెట్టింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న.. భారీ ఆఫీసులలో ఇది ఒకటని పేర్కొంది. -
మా తప్పు వల్లే గూగుల్ సక్సెస్!
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.చేజారిన అవకాశం..వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.గూగుల్ దూరదృష్టిసెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.నేర్చుకున్న పాఠాలుసాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. -
ఆహా అనిపిస్తున్న.. బెంగళూరులోని గూగుల్ కొత్త ఆఫీస్ (ఫోటోలు)
-
బెంగళూరులో గూగుల్ కొత్త ఆఫీస్ - ఇదే..
టెక్ దిగ్గజం గూగుల్ (Google) బుధవారం బెంగళూరులో తమ కొత్త క్యాంపస్ను ప్రారంభించింది. దీనికి ’అనంత’ అని పేరు పెట్టినట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. అంతర్జాతీయంగా తమకున్న భారీ కార్యాలయాల్లో ఇది కూడా ఒకటని పేర్కొంది.నేవిగేషన్కి సులభంగా ఉండేలా అనంతలోని ప్రతి ఫ్లోరు.. వీధుల నెట్వర్క్లాగా ఉంటుందని పేర్కొంది. చిరకాలంగా టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, దేశీయంగా అంకుర సంస్థలు .. యాప్ వ్యవస్థలు వృద్ధి చెందుతున్న తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు కోట్ల మంది జీవితాల్లో పరివర్తన తెస్తున్నాయని వివరించింది.వివిధ ఉత్పత్తులు, ప్లాట్ఫాంలతో కోట్ల మంది యూజర్లకు చేరువ కావడానికి తమకు భారత్లో ప్రత్యేక అవకాశం లభించిందని తెలిపింది. అనంత అంటే 'అపరిమితం' అని అర్థం. ఇది టెక్నాలజీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అపరిమితమైన అవకాశాలను సూచిస్తుంది.గూగుల్ అనంతలో 100 శాతం మురుగునీటి రీసైక్లింగ్, వర్షపునీటి సేకరణ.. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి పెద్ద స్మార్ట్ గ్లాస్ ఇన్స్టాలేషన్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ మెటీరియల్స్ కోసం దాదాపు పూర్తిగా స్థానికంగా ఉన్నవాటినే ఉపయోగించారు. భారతదేశం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైన అవకాశాన్ని సూచిస్తుందని కంపెనీ వెల్లడించింది. -
భారత్ ఏఐకి అనుకూలం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధికి భారత్లో అనువైన పరిస్థితులు ఉన్నాయని టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ హెడ్ (గవర్నమెంట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ) కరణ్ భాటియా తెలిపారు. దేశీయంగా ఫౌండేషన్ మోడల్స్ను రూపొందించుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసేందుకు గూగుల్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సర్వే ప్రకారం ఎకానమీపై ఏఐ సానుకూల ప్రభావాలు అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్లోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడైనట్లు భాటియా చెప్పారు. దేశీయంగా పలు భాషలు ఉన్నందున స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాధనాలను రూపొందించడం కోసం దేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వీటి రూపకల్పనలో గూగుల్ కూడా ముఖ్యపాత్ర పోషించగలదని వివరించారు.ఇప్పటికే ఐఐఎస్సీతో కలిసి ’ప్రాజెక్ట్ వాణి’పై పని చేస్తున్నామని, గూగుల్ ట్రాన్స్లేట్ను ప్రవేశపెట్టామని భాటియా వివరించారు. -
గూగుల్ ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరు మార్పు
అమెరికాలోని యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ్ మెక్సికో(Gulf of Mexico) పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా(Gulf of America)గా మార్చాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్(Google Maps) ఇటీవల ముఖ్యమైన అప్డేట్ను ప్రకటించింది. పేర్ల మార్పునకు సంబంధించి జియోగ్రాఫిక్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఎన్ఐఎస్)కు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ సమాచారం అందించింది. దాంతో గూగుల్ మ్యాప్స్లో ఈ మేరకు త్వరలో అప్డేట్ చేస్తామని ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది.అమెరికా యూజర్ల కోసం గల్ఫ్ ఆఫ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ అనే కొత్త పేరును ప్రతిబింబించేలా గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్లో అప్డేట్ అందించనుంది. అధికారిక ప్రభుత్వ వర్గాలు పేరు మార్చిన తర్వాత ఈ మార్పు అమల్లోకి రానునున్నట్లు పేర్కొంది. యూఎస్ వెలుపల వినియోగదారుల కోసం, గూగుల్ మ్యాప్స్ స్పష్టత, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి పాత పేరు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను, కొత్త పేరు ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ను రెండింటినీ డిస్ప్లే చేయనుంది.ఇదీ చదవండి: చైనా ఏఐ డీప్సీక్పై ఓపెన్ఏఐ సీఈఓ స్పందనఅధికారిక ప్రభుత్వ వర్గాల్లో పేరు మార్పులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ సదరు పేరు మార్పులు చేయడం ఆనవాయితీ. గల్ఫ్ ఆఫ్ అమెరికా అప్డేట్తో పాటు, గూగుల్ మ్యాప్స్ అమెరికా వినియోగదారుల కోసం మౌంట్ మెకిన్లీని డెనాలీగా పేరు మార్చనుంది. ఒబామా హయాంలో మౌంట్ మెకిన్లీని డెనాలీగా పిలిచేవారు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఖచ్చితమైన, సమగ్రమైన భౌగోళిక సమాచారం అందించేందుకు గూగుల్ మ్యాప్స్ సేవలందిస్తోంది. గతంలో సీ ఆఫ్ జపాన్(ఈస్ట్ సీ), పర్షియన్ గల్ఫ్ (అరేబియా గల్ఫ్)ల పేర్లు మార్చడం వల్ల కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది. -
విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి
సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్రో కెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూల పేట ఇందుకు అనుకూలమని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. బిల్గేట్స్తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది. బ్యూటీ పోర్ట్ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు. -
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్లైన్లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
డాక్టర్.. C/O గూగుల్
సాక్షి, అమరావతి: ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలు వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి మానసిక వైద్యులను సంప్రదించాలంటే భయం, బెరుకు ఉంటాయి. ఎవరైనా చూస్తే పిచ్చోళ్ల కింద లెక్క కడతారనే అపోహలతో చాలా మంది ఆ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలా భావించే వారిసంఖ్య తగ్గుతోంది. మానసిక సమస్యలపై నిర్భయంగా వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో మానసిక వైద్యుల సమాచారం కోసం ఇంటర్నెట్లో శోధించిన వారి సంఖ్య 41 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అక్షరాస్యులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–అక్టోబర్ నెలల మధ్య మానసిక వైద్యుల కోసం అన్వేషిoచిన వారి సంఖ్య కోల్కతాలో 43 శాతం, ముంబై 36, కోజికోడ్ (క్యాలికట్)లో 29 శాతం చొప్పున పెరిగింది. ఈ అంశం జస్ట్ డయల్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హెల్త్ కేర్ సెర్చ్లలో మెట్రో నగరాల్లో మొత్తంగా 15 శాతం వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 20, హైదరాబాద్ 17, చెన్నై వంటి నగరాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది. ఆరోగ్య సమస్యలపై 23 శాతం పెరిగిన అన్వేషణ ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇంటర్నెట్లో అన్వేషించిన వారి సంఖ్య ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 23 శాతం పెరిగినట్టు తేలింది. ఆధునిక జీవన శైలి నేపథ్యంలో మధ్య వయసు్కల్లోనూ ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఆర్థోపెడిక్ సెర్చ్లు 38 శాతం పెరిగినట్టు వెల్లడైంది. అత్యధికంగా లక్నోలో 37, ఢిల్లీలో 36 శాతం చొప్పున పెరిగినట్టు తేలింది. బెంగళూరు, పాట్నా నగరాల్లో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్ల కోసం శోధనలు 28 శాతం పెరిగాయి. ఈ తరహా వృద్ధి హైదరాబాద్లో 31 శాతం, పూణేలో 33, ముంబైలో 29 శాతం నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం ఆయుర్వేద వైద్యుల కోసం శోధనలు పెరిగాయి. ఢిల్లీలో 29 శాతం, ముంబైలో 21 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. సంప్రదాయ వైద్య పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తిని ఈ పెరుగుదల సూచిస్తోంది. అవగాహన పెరిగిందిగతంలో ప్రజలు మానసిక సమస్యలపై వైద్యులను సంప్రదించాలంటేనే ఎంతో భయపడేవాళ్లు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో మాదిరిగా భూత వైద్యం, మంత్ర, తంత్రాలను నమ్మే పరిస్థితులు పోతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం పిచ్చే కాకుండా ఆందోళన, అసహనం, భావోద్వేగ సమస్యలన్నీ మానసిక అనారోగ్యం కిందకే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులున్న వారు బయటకు చెప్పుకుంటే ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు. తమ సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, కౌన్సెలింగ్ పొందాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ -
అప్పుడు బెంగళూరు.. ఇప్పుడు మరోచోట గూగుల్ భారీ ఆఫీస్!
గూగుల్ (Google) గురుగ్రామ్లో 550,000 చదరపు అడుగుల భారీ ఆఫీస్ స్థలాన్ని (office space) లీజుకు తీసుకుంది. ఇది దేశంలోని అతిపెద్ద వర్క్స్పేస్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని, గురుగ్రామ్లోని మొత్తం టవర్ను లీజుకు తీసుకోవడానికి టెక్ దిగ్గజం చర్చలు జరుపుతున్నట్లు ఒక నివేదిక తెలిపింది.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గూగుల్ ప్రముఖ మేనేజ్డ్ వర్క్స్పేస్ ప్రొవైడర్ అయిన టేబుల్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆఫీస్ స్థలాన్ని భవిష్యత్తులో అదనంగా 200,000 చదరపు అడుగుల వరకు విస్తరించుకునే అవకాశాన్ని కూడా ఈ సంస్థ గూగుల్కు అందిస్తుందని సమాచారం.ఆసక్తికరంగా గూగుల్ గురుగ్రామ్లో 700,000 చదరపు అడుగుల లీజును 2022లో ముగించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు భారీ ఆఫీస్ స్పేస్ కోసం అన్వేషిస్తుండటం గమనార్హం. గూగుల్ గతేడాదే బెంగళూరులోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్తో చదరపు అడుగుకి నెలవారీ అద్దె రూ.62 చొప్పున డీల్ కుదిరినట్లు సమాచారం.2022లో హైదరాబాద్లో 600,000 చదరపు అడుగుల లీజు పునరుద్ధరణ, బెంగళూరులోని బాగ్మేన్ డెవలపర్లతో 1.3 మిలియన్ చదరపు అడుగుల ఒప్పందంతో సహా భారతదేశంలో గూగుల్ గణనీయమైన విస్తరణల శ్రేణిని గురుగ్రామ్లో ఈ తాజా లీజింగ్ అనుసరించింది. -
డాక్టర్ ‘గూగుల్’!
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా వెనకాముందూ ఆలోచించడం లేదు.. పరిష్కారం కావాలంటే.. గూగుల్ అన్వేషిస్తున్నారు. ఎలాంటి జబ్బుకైనా చికిత్స విధానాల కోసం ఆన్లైన్లో అన్వేషిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల ప్రాధాన్యం రోజురోజుకు పెరిగిపోతోంది. అదెంతవరకు పోయిందంటే.. తలనొప్పి, పంటి నొప్పి వంటి చిన్న అనారోగ్యాలు మొదలుకుని పెద్ద పెద్ద జబ్బుల దాకా ఆన్లైన్లో శోధించడం చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. దేనికైనా గూగుల్ ఉందిగా..సాధారణంగా మొబైల్ ఫోన్, టీవీ, వాషింగ్ మెషీన్, డెస్క్టాప్ కంప్యూటర్, లాప్టాప్లు మొదలుకుని కార్లు, ఇతర పరికరాలు, మెషీన్లలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురుకావడం తెలిసిందే. కానీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు తలెత్తగానే.. వాటిపై అవగాహన ఉన్నవారు, నిపుణులను సంప్రదించడానికి ముందే వెంటనే గూగుల్లోనో, యూ–ట్యూబ్లోనో, మరే ఇతర సోషల్మీడియా ప్లాట్ఫామ్పైనో శోధించడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇలా ఇంటర్నెట్, వివిధ సామాజిక మాధ్యమాలు అనేవి పలురకాల సమాచారం, వివరాల సేకరణకు చిరునామాగా మారిపోయాయి. అన్ని వర్గాల వారు వివిధ అంశాలపై తరచూ సోషల్మీడియాను ఆశ్రయించడం ఇటీవల మరింతగా పెరిగిపోయింది. మిగతా విషయాలు ఎలా ఉన్నా.. ఆరోగ్యంతో ముడిపడిన విషయాలు, చికిత్స విధానాలు, అనారోగ్య సమస్యల పరిష్కారం వంటి వాటికి కూడా గూగుల్, వివిధ సామాజిక మాధ్యమాల్లో శోధిస్తున్నారు. ఏ అనారోగ్య సమస్య తలెత్తినా.. ఏ మందు వేసుకోవాలి, చికిత్సకు ఏం చేయాలి అనేది కూడా ఆన్లైన్లో తెలుసుకోవడం ఆందోళనకు కారణమౌతోంది. ఈ ధోరణి మరింత పెరగడంతో.. ఇతరులకు వైద్యపరమైన సలహాలు గట్రా అందజేస్తున్నవారు క్రమంగా ‘గూగుల్ డాక్టర్లు’గా చెలామణి అవుతున్నారు. ముందుగా ఏదైనా అనారోగ్య సమస్య లక్షణాలను, దానికి సంబంధించిన చికిత్స పద్ధతుల గురించి గూగుల్లో శోధించి, ఆ తర్వాత సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.ఎవరైనా రోగులు తమకు కలిగిన చిన్న సమస్యకు సైతం.. అతిగా భయపడిపోయి ఆన్లైన్లో వాటికి చికిత్స లేదా పరిష్కారాలు కనుక్కునే ప్రయత్నాలు మంచిది కాదని వైద్యులు, వైద్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.వెర్టిగో.. పెనుసమస్యే..ఇటీవల కాలంలో ‘వెర్టిగో’తో బాధపడుతున్న వారు అధికంగా సోషల్మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం, చికిత్స విధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ స్కిల్స్’లో ప్రచురితమైన ఈ పరిశీలనలో వెర్టిగో చికిత్సకు అందుబాటులో ఉన్న పద్ధతులు, విధానాలను తెలుసుకునేందుకు 51 శాతం ‘వెర్టిగో’ రోగులు మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. పరిసరాలు తిరుగుతున్నట్టు, కళ్లు తిరిగి పడిపోతున్నట్టు, ఒకచోట నిలబడలేక పడిపోతున్న భావనకు గురికావడం, విడవకుండా తలనొప్పి రావడం, నడిచేటప్పుడు ఇబ్బంది ఎదురుకావడం, శరీర బరువులో మార్పులు రావడం, వణుకుతున్న భావన కలగడం, స్వల్పకాలానికే కొన్ని విషయాల్లో మరుపు వంటివి ‘వెర్టిగో’ లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మధ్యవయసు వారు (54 శాతం), పిల్లలు (27 శాతం), పెద్దవయసు వారు (19 శాతం) ప్రయత్నించినట్టు ఈ సర్వేలో వెల్లడైంది. అన్ని వయసుల వారిని కలుపుకొంటే.. వారిలో 65 శాతం మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రాండ్వాచ్ (ఎంటర్ప్రెజ్–గ్రేడ్ సోషల్ లిసనింగ్ టూల్) అనేదాన్ని వినియోగించారు. దీనిద్వారా ట్విటర్ (ఎక్స్), యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, మెడికల్ ఫోరమ్స్, బ్లాగ్లు, ఈ–కామర్స్ సమీక్షలను పరిశీలించారు. ప్రధానంగా వీరంతా కూడా వివిధ సాధనాల ద్వారా వెర్టిగో సమస్యకు సమర్థవంతంగా ఎలా చికిత్స చేయాలి?, అందుకు నిపుణులైన వైద్యులెవరనే అంశంపై దృష్టి పెట్టారు.సోషల్ మీడియా.. రెండంచుల కత్తిఈ అధ్యయనం ద్వారా చివరకు తేల్చింది ఏమిటంటే.. సామాజిక మాధ్యమం రెండంచుల కత్తి లాంటిదని, ఏదైనా విషయమై సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదం చేయడమేకాక, ఆయా అంశాలపై సమాచారం తెలుసుకోవడంలో అంతరాలు ఏర్పడి కొన్ని తప్పుడు భావనలు, అభిప్రాయాలు, సూత్రీకరణలు చేసేందుకు కూడా దారి తీస్తున్నట్టు పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయంలోనూ ప్రజలను చైతన్యపరిచేందుకు సోషల్మీడియాను వైద్యులు, నిపుణులు ఉపయోగించుకోవలసిన ఆవశ్యకత పెరిగిందంటున్నారు. ఈ మాధ్యమాల్లో ట్రెండింగ్గా మారుతున్న అంశాలను పరిశీలించి.. ఏవైనా తప్పుడు భావనలు, అభిప్రాయాలు వ్యక్తమైతే వాటిని దూరం చేసేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇన్స్ట్రాగామ్ వంటి ప్లాట్ఫామ్స్లో వైద్యులు ఆయా ముఖ్యమైన అంశాలకు సంబంధించిన చిన్నచిన్న వీడియోలను పెట్టడం ద్వారా.. లక్షలాది మందిలో చైతన్యాన్ని కలిగించి, చికిత్సా పద్ధతులపై విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని ఒక వైద్యుడు పేర్కొన్నారు. -
‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణ
‘గూగులీనెస్’ అనే పదాన్ని చాలా కాలంగా గూగుల్ ఉద్యోగులు ఉపయోగిస్తున్నారు. మళ్లీ గూగుల్లో లేఆఫ్స్ ఉంటాయని ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ పదం మరోసారి వైరల్గా మారింది. ఉద్యోగులు గూగుల్ సంస్కృతి, విలువలకు సరిపోతారా లేదా అని తనిఖీ చేయడంలో ఈ పదం ఉపయోగపడుతుందని సంస్థలో ఉన్నతాధికారులు నమ్ముతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన కంపెనీ వైడ్ ఫోరమ్ సమావేశంలో ఈ పదానికి సంబంధించి మరింత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆరు కీలక అంశాలపై గూగులీనెస్ ఆధారపడి ఉంటుందని చెప్పారు.మిషన్ ఫస్ట్: గూగుల్ మిషన్కు, ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ప్రాజెక్ట్కు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఆయా ప్రాజెక్ట్ల్లో భారీ లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. ఫ్యూచర్ విజన్ కోసం పని చేయాలి.అందరికీ ఉపయోగపడే వాటిపై దృష్టి: ప్రజల జీవితాలను నిజంగా మెరుగుపరిచే ఉత్పత్తులను సృష్టించాలి. అందరికీ ఉపయోగపడే వాటిపై ఉద్యోగులు దృష్టి సారించాలి.ధైర్యంగా, బాధ్యతాయుతంగా ఉండడం: ఏ పని చేస్తున్నప్పుడైనాసరే మీరు చేస్తున్నది బలంగా నమ్మి ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వచ్చే ఫలితాలకు సైతం బాధ్యత తీసుకునేటప్పుడు సాహసోపేతమైన ఆలోచనలను ప్రోత్సహించవచ్చు.వనరులను సద్వినియోగం చేసుకోవడం: మనం చేయాలనుకుంటున్న పనులకు అన్ని సందర్భాల్లోనూ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. చాలా వనరులు అవసరం అవ్వొచ్చు. కానీ పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని మెరుగైనా ఫలితాలు రాబట్టేలా పని చేయాలి.వేగంగా.. సరదాగా..: చేసేపనిని నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలి. దాంతోపాటు భారంగా కాకుండా, సరదాగా పని చేయాలి.టీమ్ గూగుల్: టీమ్ వర్క్ చాలా ముఖ్యం. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..10 శాతం మందికి లేఆఫ్స్..కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది. గూగుల్ రానున్న రోజుల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. -
అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్లో జాబ్: జీతం తెలిస్తే..
జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్పూర్లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్లో డేటా సైంటిస్ట్గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.స్నేహితుల స్ఫూర్తితో..పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్లోని జసిదిహ్లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.రూ.39 లక్షల ప్యాకేజీగూగుల్లో డేటా సైంటిస్ట్గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. -
టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు
గత కొంతకాలంగా ఎలాంటి తొలగింపులు లేకుండా నిశ్చలంగా ఉన్న టెక్ రంగంలో మళ్ళీ లేఆప్స్ అలజడి మొదలైంది. గూగుల్ కంపెనీ మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్దమైంది. ఈ ప్రభావం మేనేజర్ స్థాయి ఉద్యోగులపైన, డైరెక్టర్లపైన, వైస్ ప్రెసిడెంట్ల మీద పడనుంది.గ్లోబల్ టెక్ దిగ్గజం 'గూగుల్' ఇప్పుడు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు.. సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో నెలకొన్న పోటీని ఎదుర్కోవడానికి, ఓపెన్ఏఐ వంటి వాటిని గట్టి పోటీ ఇవ్వడానికి కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మీరు అమెజాన్ ప్రైమ్ యూజర్లా.. కొత్త రూల్స్ చూసారా?గూగుల్ కంపెనీ 20 శాతం మరింత శక్తివంతంగా మారాలని సుందర్ పిచాయ్ 2022లోనే ఆకాక్షించారు. ఆ తరువాత ఏడాది 12,000 మంది ఉద్యోగులను గూగుల్ తొలగించారు. కాగా ఇప్పుడు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంత మందిని తొలగిస్తారు అనే విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్గా ఎదిగారు. తన పోస్ట్లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
మస్క్ హింట్ ఇచ్చారా!.. దిగ్గజాల కథ కంచికేనా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ 'ఎక్స్ మెయిల్' పేరుతో ఈమెయిల్ ప్రారభించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.ఎక్స్ (ట్విటర్) వేదికగా ఒక యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎక్స్.కామ్ ఈమెయిల్ కలిగి ఉండటం ఒక్కటే, నన్ను జీమెయిల్ ఉపయోగించకుండా ఆపగలదని పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ.. ఈమెయిల్తో సహా మెసేజింగ్ మొత్తం ఎలా పని చేస్తుందో మనం పునరాలోచించాలని మస్క్ అన్నారు.2024 సెప్టెంబర్ నాటికి గ్లోబల్ ఈమెయిల్ మార్కెట్లో.. యాపిల్ మెయిల్ 53.67 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత జీమెయిల్ 30.70 శాతం, అవుట్లుక్ 4.38 శాతం, యాహూ మెయిల్ 2.64 శాతం, గూగుల్ ఆండ్రాయిడ్ 1.72 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇప్పుడు మస్క్ కూడా ఎక్స్.మెయిల్ ప్రారంభించే యోజనలో ఉన్నారు. కాబట్టి ఈ రంగంలో కూడా మస్క్ తన హవా చూపించడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతోంది.Interesting. We need to rethink how messaging, including email, works overall. https://t.co/6wZAslJLTc— Elon Musk (@elonmusk) December 15, 2024 -
ట్రాన్స్జెండర్తో మార్కెటింగ్... గూగుల్ క్రిస్మస్ ప్రకటనపై వివాదం
మహిళల సంబంధ వస్తువులకు సంబంధించిన ప్రకటనను ట్రాన్స్జెండర్తో రూపొందించాలన్న టెక్ దిగ్గజం గూగుల్ ‘వినూత్న’ ఐడియా బెడిసికొట్టింది. దానిపై మహిళాలోకంలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. క్రిస్మస్ వేళ ఇలాంటి యాడ్ ఎందుకు తెచ్చారంటూ దుమ్మెత్తిపోశారు. అందమైన మహిళలే లేనట్టు ట్రాన్స్జెండర్తో యాడ్ చేస్తారా అంటూ నెటిజన్లు కూడా గూగుల్పై మండిపడుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా గూగుల్ తన సొంత షాపింగ్ వేదిక ‘గూగుల్ షాపింగ్’లో మహిళల ఉత్పత్తులను ప్రమోషన్కు ఒక యాడ్ సిద్ధం చేసింది. టిక్టాక్లో పేరొందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ 30 ఏళ్ల సైరస్ వెస్సీని ప్రచారకర్తగా ఎంచుకుంది. చంపేసే చలిలో అత్యంత నాణ్యమైన మేకప్, చర్మ సంబంధ ఉపకరణాలు, దుస్తులను తక్కువ ధరకే కొనుక్కోండంటూ వెస్సీతో ఒక యాడ్ డిజైన్ చేసి ఆన్లైన్ ప్రసారాలు మొదలెట్టారు. కానీ అందులో ట్రాన్స్జెండర్ నటించడంతో ఆదరణ దేవుడెరుగు, విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘ఇది దారుణమైన అజెండాతో రూపొందించిన యాడ్. అమ్మాయిలను అవమానించాలని చేసినట్టుగా ఉంది’’ అంటూ పలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత ఓలీ లండన్ అన్నారు. దాంతో, మహిళలను కించపరచాలనే దురుద్దేశమేదీ లేదంటూ గూగుల్ వివరణ ఇచి్చంది. సోషల్ మీడియాలో పేరొందిన ‘విభిన్న’ వ్యక్తులతో యాడ్ చేద్దామనే ఉద్దేశంతోనే అలా రూపొందించినట్టు చెప్పుకొచ్చింది. – వాషింగ్టన్ -
‘సానుకూల శక్తి’కి నిలువెత్తు నిదర్శనం ఆమె..!
చెడు కాలం చెప్పి రాదు. కెరీర్లో బిజీగా ఉన్న టైమ్లో అలాంటి కాలం ఒకటి బాలీవుడ్ నటి హీనాఖాన్కు వచ్చింది. అయితే అది చెడు కాలం అని ఆమె అనుకోలేదు. ‘ఇది పరీక్ష కాలం’ అని మాత్రమే అనుకుంది. పరీక్షకు నిలబడాలంటే ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహమే శక్తి అవుతుంది. ఉత్సాహం దండిగా ఉన్న హీనాఖాన్ ఆ పరీక్షను తట్టుకొని నిలబడుతూ ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ గ్లోబల్ లిస్ట్–2024’లో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల్లో హీనాఖాన్ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎంతో మంది ఖాన్ను అభినందిస్తున్నారు. ఆమె మాత్రం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘చాలా మంది నన్ను అభినందించడం చూస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే ఇది విజయం, గర్వించదగిన విషయం అనుకోవడం లేదు’ అని రాసింది. ఆరోగ్య సవాళ్ల కంటే వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పింది ఖాన్.‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ అనే సీరియల్లో అక్షర పాత్రలో నటించి పాపులారిటీని పెంచుకున్న ఖాన్ బిగ్ బాస్, ఖత్రోస్ కే ఖిలాడీలాంటి రియాలిటీ షోలలో పాల్గొని పాపులారిటీని మరింత పెంచుకుంది. జూన్ 2024లో రొమ్ము క్యాన్సర్ గురించి బహిరంగంగా వెల్లడించింది హీనాఖాన్. ‘ఇది సవాలుతో కూడినది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. చికిత్స ఇప్పటికే మొదలైంది. దీని నుంచి మరింత బలంగా బయటపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఖాన్ ఇన్స్టాగ్రామ్లో రాసింది.ప్రస్తుతం కీమో థెరపీ చేయించుకుంటున్న ఖాన్ తన చికిత్స గురించి, తన ఛాలెంజింగ్ జర్నీ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో అప్డేట్స్ పంచుకుంటోంది. వృత్తిపరమైన విజయాలతోనే తనను గుర్తించాలని హీనాఖాన్ కోరుకుంటున్నప్పటికీ క్లిష్టమైన సమయాల్లో ఆమె చూపిన ధైర్యానికి ఎంతో మంది అభిమానులు అయ్యారు. సినిమా కష్టాలు ఖాన్కు నిజంగానే వచ్చినప్పటికీ సానుకూల శక్తితో పెదవులపై చిరునవ్వు కోల్పోలేదు.గుండెలో ధైర్యం కోల్పోలేదు.అందుకే నటిగానే కాదు ‘సానుకూల శక్తి’ విషయంలోనూ హీనాఖాన్కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ‘హీనాఖాన్ అసాధారణ ధైర్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. కారుచీకట్లో కూడా కాంతిని కనుగొనే సామర్థ్యం ఆమెలో ఉంది’ అంటూ నెటిజనులు ప్రశంసిస్తున్నారు.ఎంత బిజీగా ఉంటే అంత సంతోషంగా ఉంటాను!మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మంచి రోజుల్లో ఎలా ఉన్నా చెడు రోజుల్లో మాత్రం ఉత్సాహంగా ఉండాలి. ఆ ఉత్సాహమే సానుకూల శక్తి ఇస్తుంది. సానుభూతి మాటలు విని బేలగా మారిపోకూడదు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. నాకు ఖాళీగా కూర్చోవడం కంటే పని చేయడం, బిజీగా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది.– హీనాఖాన్ (చదవండి: భారతీయ రెస్టారెంట్కు ప్రతిష్టాత్మక మిచెలిన్ స్టార్ పురస్కారం!) -
టెక్ దిగ్గజాలపై ఆ్రస్టేలియా కొరడా
కాన్బెర్రా: టెక్ దిగ్గజాలపై కొరడా ఝళిపించేందుకు ఆ్రస్టేలియా సిద్ధమైంది. వార్తలు ప్రచురించినందుకు స్థానిక మీడియాకు చెల్లింపులు చేసేందుకు ఉద్దేశించిన కఠిన చట్టం త్వరలో అమలవనుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. 2025 జనవరి నుంచి ఇది అమలవుతుందని, ఫిబ్రవరిలో పార్లమెంట్ ఆమోదం తెలుపుతుందని పేర్కొంది. మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు తమ వేదికలపై ప్రచురించే వార్తలకుగాను ఫీజు చెల్లించాలంటూ 2021లో ఆ్రస్టేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చట్టం తీసుకువచ్చింది. తాజా నిర్ణయం ఈ చట్టానికి కొనసాగింపేనని చెబుతున్నారు. అయితే, ఆస్ట్రేలియా వార్తా సంస్థలతో ఉన్న చెల్లింపు ఒప్పందాలను పునరుద్ధరించబోమని ఇటీవల ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల యాజమాన్య సంస్థ మెటా చేసిన ప్రకటన ఆ్రస్టేలియా పార్లమెంట్తో ప్రతిష్టంభనకు కారణమైంది. గురువారం ఆ్రస్టేలియా ప్రభుత్వం ‘న్యూస్ బార్గెనింగ్ ఇన్సెంటివ్’పేరుతో ప్రకటించిన నూతన నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.1,350 కోట్ల కలిగిన టెక్ కంపెనీలు మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పరిశ్రమకు సబ్సిడీ ఇచ్చేందుకు మరో పరిశ్రమపై భారం మోపుతోందని మెటా దీనిపై వ్యాఖ్యానించింది. ‘డిజిటల్ వేదికలు ఆ్రస్టేలియా నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో నాణ్యమైన జర్నలిజం సేవలను పొందుతున్నందుకు తోడ్పాటు నివ్వాల్సిన సామాజిక, ఆర్థిక బాధ్యత వాటిపై ఉంది’అని ప్రభుత్వం అంటోంది. డిజిటల్ వేదికలు పెరిగిపోవడంతో సంప్రదాయ మీడియా సంస్థలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలోనే పబ్లిషర్లు, టెక్ కంపెనీల మధ్య సమతూకం పాటించేందుకు నిబంధనలు తెచి్చనట్లు అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఆ మేరకు మెటా తదితర కంపెనీలు ఆస్ట్రేలియా మీడియా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాల గడువు పూర్తి కావొచ్చింది. ఫేస్బుక్ కంటెంట్లో వార్తలు, రాజకీయ సంబంధ అంశాల వాటా 3 శాతం కంటే తక్కువగా ఉంటుందని మెటా అంటోంది. అందుకే, తిరిగి ఒప్పందాలను కుదుర్చుకోబోమని, బదులుగా వార్తల ట్యాబ్లను తొలగిస్తామని చెబుతోంది. ఈ చర్యతో ఆ్రస్టేలియా మీడియా సంస్థలు సుమారు రూ.1,700 కోట్ల మేర నష్టపోయే అవకాశముంది. దీనిపై ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ఆ్రస్టేలియా వినియోగదారుల పట్ల మెటా ప్రాథమిక బాధ్యతలను సైతం విస్మరిస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిబంధనలన్నీ కేవలం ఆ్రస్టేలియా జర్నలిజానికి సాయం పడేందుకే తప్ప తాము ఆదా యం పెంచుకునేందుకు కాదని పేర్కొన్నారు. -
గూగుల్ కొత్త చిప్: సూపర్ కంప్యూటర్ కంటే ఫాస్ట్
టెక్ దిగ్గజం 'గూగుల్'.. క్వాంటం కంప్యూటింగ్లో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త క్వాంటం చిప్ విల్లోను ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ ల్యాబ్లో అభివృద్ధి చేసిన ఈ కొత్త చిప్, కేవలం ఐదు నిమిషాల్లో సంక్లిష్టమైన గణిత సమస్యను విజయవంతంగా పరిష్కరించగలిగింది.గూగుల్ పరిచయం చేసిన ఈ విల్లో చిప్.. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. విల్లో చిప్ ఐదు నిమిషాల్లో పరిష్కరించగలిగిన సమస్యను.. వేగవంతమై సూపర్ కంప్యూటర్ పరిష్కారించాలంటే 10 సెప్టిలియన్ (ఒకటి తరువాత 25 సన్నాలు ఉన్న సంఖ్య) సంవత్సరాలు పడుతుంది. ఇది విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువని గూగుల్ వెల్లడించింది.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!విల్లోని పరిచయం చేస్తున్నాము, ఇది మా కొత్త లేటెస్ట్ క్వాంటం కంప్యూటింగ్ 'చిప్' అని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. వావ్ అని కామెంట్ చేశారు. ఆ తరువాత వీరిరువురి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఇదంతా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.Introducing Willow, our new state-of-the-art quantum computing chip with a breakthrough that can reduce errors exponentially as we scale up using more qubits, cracking a 30-year challenge in the field. In benchmark tests, Willow solved a standard computation in <5 mins that would…— Sundar Pichai (@sundarpichai) December 9, 2024Wow— Elon Musk (@elonmusk) December 9, 2024 -
మైక్రోసాఫ్ట్కు, గూగుల్కు తేడా అదే..
మైక్రోసాఫ్ట్ ఏఐ వ్యూహంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సూక్ష్మంగా స్పందించారు. ది న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్లో ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీదారులతో పోలిస్తే ఏఐలో గూగుల్ (Google) పురోగతి గురించి అడిగినప్పుడు, పిచాయ్ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేశారు. గూగుల్ సొంత ఏఐ మోడల్లను అభివృద్ధి చేస్తుంది.. కానీ మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ వంటి కంపెనీల బాహ్య మోడల్లపై ఆధారపడుతుందని చెప్పుకొచ్చారు.సత్య నాదెళ్ల మాటకేమంటారు..?పోటీదారులతో పోలుస్తూ ఏఐలో గూగుల్ పురోగతి గురించి ఇంటర్వ్యూయర్ ప్రశ్నించారు. ఏఐ రేసులో గూగుల్ గెలవాలని సవాలు విసురుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గతంలో చేసిన వ్యాఖ్యను కూడా ఆయన గుర్తుచేశారు. పిచాయ్ స్పందిస్తూ మైక్రోసాఫ్ట్ బాహ్య ఏఐ మోడల్స్పై ఆధారపడుతుందని, కానీ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేస్తుందని ఎద్దేవా చేశారు.చాట్జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంటే మైక్రోసాఫ్ట్కు సవాలు విసురుతున్నారా.. అని ప్రశ్నించగా పిచాయ్ నవ్వుతూ, "అలా కాదు.. వారి పట్ల, వారి టీమ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల వ్యాఖ్యలపై పిచాయ్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ ఏఐ- పవర్డ్ బింగ్ సెర్చ్ ఇంజిన్ను ప్రారంభించిన తర్వాత సెర్చ్ వ్యాపారం పరంగా గూగుల్ ఎడ్జ్ గురించి నాదెళ్ల మాట్లాడారు. సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో గూగుల్ను '800-పౌండ్ల గొరిల్లా' అని అభివర్ణించారు. తమ ఆవిష్కరణలతో గూగుల్ను ఆట ఆడిస్తామని చెప్పారు. బ్లూమ్బెర్గ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్.. మైక్రోసాఫ్ట్ బాస్కు కౌంటర్ ఇచ్చారు. తాము వేరొకరి మ్యూజిక్కు ఆడబోమంటూ బదులిచ్చారు. -
హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)’ హైదరాబాద్లో ఏర్పాటుకానుంది. ఈ మేరకు గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఏర్పాటవుతున్న ఈ ‘గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్’మొత్తంగా ఐదోదికాగా.. ఆసియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఇదే రెండో సెంటర్ కావడం గమనార్హం. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబుతో భేటీ అయింది. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.అమెరికా పర్యటనలో సంప్రదింపుల నేపథ్యంలో..ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్.. సంస్థ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో జీఎస్ఈసీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. అక్టోబర్ 3న జరిగిన ‘గూగుల్ ఫర్ ఇండియా–2024’ సదస్సులో జీఎస్ఈసీ ఏర్పాటుపై గూగుల్ కీలక ప్రకటన చేసిందని... పలు రాష్ట్రాలు పోటీపడినా హైదరాబాద్లో ఏర్పాటుకే గూగుల్ సంస్థ మొగ్గు చూపిందని తెలిపింది. అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్గా పనిచేసే జీఎస్ఈసీ.. అధునాతన ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించింది.ఐటీ, ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్: సీఎం రేవంత్గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు రావడంపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో ఐటీ, ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హాన్సెన్ వ్యాఖ్యానించారు. జీఎస్ఈసీ ద్వారా సైబర్ సేఫ్టీ సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సెంటర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. -
గూగుల్ క్రోమ్ను అమ్మాల్సిందే..!
వాషింగ్టన్: ఆన్లైన్ సెర్చ్లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఆ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్ను విక్రయించాల్సిందేనంటూ అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ తన స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసినట్లు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)లో దాఖలు చేసిన 28 పేజీల ఫైల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ‘‘గుత్తాధిపత్యం’’ చేస్తోందన్న ఇటీవలి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, టెక్ దిగ్గజాన్ని దాని ఆధిపత్య మార్కెట్ స్థానం నుండి తొలగించే చర్యలను అమెరికా న్యాయశాఖ సూచించింది. న్యాయశాఖ ప్రతిపాదనతో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) న్యాయమూర్తి మెహతా అంగీకరిస్తే, క్రోమ్ను గూగుల్ విక్రయించాల్సి రావచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గూగుల్ చట్టవిరుద్ధ గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఉన్న మార్గాల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్ను విక్రయించడం ఒకటని అమెరికా న్యాయశాఖతో పాటు పలు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పెట్టడం గమనార్హం. ‘‘గూగుల్ ఒక గుత్తాధిపత్య సంస్థ. దాని గుత్తాధిపత్యం కొనసాగడానికి ఈ గుత్తాధిపత్యమూ పనిచేసింది’’ అని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తి అమిత్ మెహతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జరిగేదేమిటి? జడ్జి మెహతా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదిస్తే, తుది తీర్పు వెలువడిన ఆరు నెలల్లోపు గూగుల్ తన 16 ఏళ్ల క్రోమ్ బ్రౌజర్ను విక్రయించాల్సి వస్తుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది. ‘‘కానీ కంపెనీ ఖచి్చతంగా అప్పీల్కు వెళుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే నాలుగేళ్లుగా సాగిన ఈ వివాదం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పొడిగించే అవకాశం ఉంది. ఇది యూట్యూబ్ వంటి దాని స్వంత సేవలను విస్తృత పరచకుండా గూగుల్ను నిలువరిస్తుంది’’ అని కూడా ప్రెస్ నివేదిక వ్యాఖ్యానించింది. గూగుల్ మాతృ సంస్థ ఖండన కాగా తాజా పరిణామాలపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కెంట్ వాకర్ ఒక బ్లాగ్లో వ్యాఖ్యానిస్తూ, న్యాయశాఖ ప్రతిపాదనను ఒక సంస్థను ‘‘అస్థిరపరిచేది‘గా అలాగే ‘‘అనవసర జ్యోక్యం ఎజెండా‘ను ముందుకు తెచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. న్యాయశాఖ విధానం ప్రభుత్వ విపరీత జోక్యానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి అమెరికన్ వినియోగదారులకు, డెవలపర్లకు, చిన్న వ్యాపారాలకు హాని కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక నాయకత్వాన్ని అవసరమైన సమయంలో ప్రమాదంలో పడేసే విధానంగా విశ్లేషించారు. ఇతర టెక్ దిగ్గజాలపైనా ఇవే కేసులు ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ సంస్థలు ‘గుత్తాధిపత్యానికి సంబంధించి’ ఇదే తరహా కేసులు నమోదు చేశాయి. ఆయా సంస్థలు గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయని, మార్కెట్లోని ఇతర సంస్థల పోటీని అణిచివేస్తున్నాయని ఈ కేసుల సారాంశం. ఆపిల్, శామ్సంగ్ వంటి సంస్థలకు వాటి స్మార్ట్ఫోన్లు, వెబ్ బ్రౌజర్లపై ఆటోమేటిగ్గా తన సెర్చ్ ఇంజన్ లింక్ వచ్చే విధంగా గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు 2020లోనే అమెరికా న్యాయశాఖ, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూజెర్సీ మరియు న్యూయార్క్సహా పలు అమెరికా రాష్ట్రాలు కేసులు దాఖలు చేశాయి. గూగుల్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ జడ్జి మెహతా ఆగస్టులో చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తాజా పరిణామాలకు దారితీశాయి. సంస్థ గుత్తాధిపత్యాన్ని సరిదిద్దడాదనికి పరిష్కారాలను సమర్పించమని జడ్జి మెహతా న్యాయశాఖ అలాగే రాష్ట్రాలకు సూచించడం గమనార్హం. -
సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుంది
ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్లో ఏదైనా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి.. ఇతరత్రా వంటి వాటికోసం ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు సంస్థ తాజాగా ఎయిర్ క్వాలిటీని చెక్ చేయడానికి 'ఎయిర్ వ్యూ ప్లస్' (Air View+) అనే తీసుకువచ్చింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..ఈ వారం ప్రారంభంలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 491 గరిష్ట స్థాయికి చేరుకోవడంతో.. సంస్థ గాలిలోని ఎయిర్ క్వాలిటీ తెలుసుకోవడం ముఖ్యమని భావించింది. ఈ కారణంగానే ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ తీసుకువచ్చింది. ఇది ఏఐ ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలోని గాలి నాణ్యతను గురించి తెలుసుకోవచ్చు.గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ ఇండియాలోని వంద నగరాల్లోని గాలి నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. సాధారణంగా.. గాలిలోని ఎయిర్ క్వాలిటీని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు గూగుల్ పరిచయం చేసిన కొత్త ఫీచర్ సాయంతో ఎప్పుడైనా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'గూగుల్ ఎయిర్ వ్యూ ప్లస్ ఫీచర్ కోసం.. క్లైమేట్ టెక్ సంస్థలు, ఆరస్సూర్, రెస్పిరర్ లివింగ్ సైన్సెస్ వంటివి కీలక పాత్ర పోషించాయి. అంతే కాకుండా ఈ ఫీచర్ను ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సీఎస్టీఈపీ వంటివి టెస్ట్ చేసి ధ్రువీకరించినట్లు సమాచారం.'ఎయిర్ వ్యూ ప్లస్'లో ఎయిర్ క్వాలిటీ కనుక్కోవడం ఎలా?•మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయాలి.•సెర్చ్ బార్లో ఏదైనా లొకేషన్పై ట్యాప్ చేయాలి.•ఆలా చేసిన తరువాత లొకేషన్ పక్కనే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (NAQI) కనిపిస్తుంది.•దానిపైన క్లిక్ చేసిన తరువాత టెంపరేషన్ కనిపిస్తుంది, దాని కిందనే ఎయిర్ క్వాలిటీ కూడా కనిపిస్తుంది. -
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్లోని మిడ్వెస్ట్ స్టేట్కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్కు గురై డివైజ్లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
అమెరికా పోలింగ్.. మస్క్కు గూగుల్ క్లారిటీ
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల పోలింగ్ సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు టెక్ దిగ్గజం గూగుల్పై టెస్లా అధినేత, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ గట్టి మద్దతుదారు ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఫిర్యాదు చేశారు. ట్రంప్కు ఎక్కడ ఓటేయ్యాలి(వేర్ టు ఓట్ ట్రంప్) అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే హారిస్ అని చూపిస్తోందని రిపబ్లికన్ మద్దతుదారులు చేసిన పోస్టును మస్క్ రీపోస్టు చేశారు.Are others seeing this too? https://t.co/mlwRY08hgo— Elon Musk (@elonmusk) November 5, 2024గూగుల్ కమలాహారిస్కు కావాలనే మద్దతిస్తోందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ విషయమై సోషల్మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. గూగుల్పై దుమ్మెత్తిపోశారు. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.టెక్సాస్లో ఒక కౌంటీ పేరు హారిస్ అవడం వల్లే సెర్చ్ ఇంజిన్ అలా చూపిస్తోందని,హారిస్ కౌంటీలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉందని క్లారిటీ ఇచ్చింది.ఈ లొకేషన్లో ఓటు వేయాలని సెర్చ్ ఇంజిన్ చూపిస్తోందని గూగుల్ తెలిపింది. క్లారిటీ ఇచ్చినందుకుగాను గూగుల్కు మస్క్ థ్యాంక్స్ చెప్పారు.Thanks for the clarification https://t.co/JReZUGiWF8— Elon Musk (@elonmusk) November 5, 2024 ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్ -
గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా..! ఏ కోర్టు ఫైన్ వేసిందో తెలుసా..?
-
గూగుల్ ఆస్తులమ్మినా తీరనంత జరిమానా!
గూగుల్కు రష్యా కోర్టు భారీ షాకిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు (20,000,000,000,000,000,000,000,000,000,000,000 డాలర్లు) జరిమానా చెల్లించాలని మాస్కో కోర్టు టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ను ఆదేశించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో సంస్థ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఇందుకు కారణమని కోర్టు తెలిపింది. ఈమేరకు రష్యా మీడియా సంస్థ ఆర్బీసీ(రాస్బైజెన్స్ కన్సల్టింగ్) వివరాలు వెల్లడించింది.ఆర్బీసీ తెలిపిన వివరాల ప్రకారం..‘మాస్కో కోర్టు గూగుల్కు భారీ జరిమానా విధించింది. కంపెనీ 20 డెసిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ రష్యాకు చెందిన 17 టీవీ ఛానెళ్లు, మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో ఉక్రెయిన్పై దాడికి ఆదేశించిన తర్వాత ఈ ఛానెళ్లపై వేటు వేశారు. అందుకు వ్యతిరేకంగా మీడియా ఛానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు న్యాయపరమైన అంశాలకు లోబడి గూగుల్కు భారీ జరిమానా విధించింది. కోర్టు తీర్పు ప్రకారం గూగుల్ బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్లను తొమ్మిది నెలల్లోపు పునరుద్ధరించవలసి ఉంటుంది’ అని పేర్కొంది.‘గూగుల్ మరింత మెరుగవ్వాలి’క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ అంశంపై మాట్లాడారు. ‘గూగుల్పై నిర్దిష్టంగా ఎంతమొత్తం జరిమానా విధించారో కచ్చితంగా చెప్పలేను. గూగుల్ మా దేశ కంపెనీలపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదు. మీడియా సంస్థలు, బ్రాడ్కాస్టర్ల హక్కులను హరించకూడదు. కోర్టు నిర్ణయంతో గూగుల్ తన పరిస్థితిని మరింత మెరుగు పరుచుకునేందుకు వీలుంటుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.2020లోనే కొన్ని ఛానెళ్లపై వేటుగూగుల్ రష్యాలోని ప్రైవేట్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ మెర్సెనరీ చీఫ్ ప్రిగోజిన్, ఒలిగార్చ్ మలోఫీవ్లకు చెందిన ఛానెళ్లను 2020లో బ్లాక్ చేసినట్లు రష్యాకు చెందిన ఎన్బీసీ న్యూస్ ఛానల్ తెలిపింది. 2022లో రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ మరిన్ని ఛానెళ్లను నిషేధించిందని పేర్కొంది.రష్యా గూగుల్ ఎల్ఎల్సీ దివాలా!గూగుల్ మార్కెట్ విలువ మొత్తంగా అక్టోబర్ నాటికి 2.15 ట్రిలియన్ డాలర్లు(రూ.179 లక్షల కోట్లు)గా ఉంది. కానీ కంపెనీకి విధించిన జరిమానా చాలా రెట్లు ఎక్కువ. గూగుల్ రష్యాలోని తన అనుబంధ సంస్థ ‘గూగుల్ ఎల్ఎల్సీ’ దివాలా కోసం జూన్ 2022లో దాఖలు చేసింది. కానీ దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని కోర్టు పేర్కొంది.(Apple: భారత్లో కొత్తగా నాలుగు అవుట్లెట్లు!)గూగుల్ స్పందన ఇదే..‘రష్యాతో కొన్ని చట్టపరమైన అంశాలపై చర్చించాల్సి ఉంది. బ్లాక్ చేసిన ఛానెళ్లకు సంబంధించి కోర్టు కాంపౌండింగ్ పెనాల్టీలను విధించింది. అదే తుది నిర్ణయంగా జరిమానా కట్టాలని పేర్కొంటుంది. దీనిపై రష్యా జ్యుడిషియరీలో చర్చించాల్సి ఉంది. ఈ అంశాలు కంపెనీ విధానాలపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని తెలిపింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్స్కేప్లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్పై బ్లాగ్ పోస్ట్లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
మైక్రోసాఫ్ట్పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
గూగుల్కు రూ. 26వేల కోట్ల ఫైన్.. ఎందుకంటే?
ఓ చిన్న వెబ్సైట్ మీద గూగుల్ కంపెనీ చూపిన నిర్లక్ష్యం భారీ జరిమానా చెల్లించేలా చేసింది. 2006లో యూకేకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్ 'ఫౌండమ్' ప్రారంభించారు. కానీ దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తరువాత గూగుల్లో విజిబిలిటీ తగ్గడం మొదలైంది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ.. వెబ్సైట్ కనిపించకపోవడాన్ని ఫౌండర్స్ కనిపెట్టారు.తమ వెబ్సైట్ గూగుల్కు చెందిన ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్స్ విధించిన పెనాల్టీ కారణంగా పడిపోతుండటం గమనించిన.. ఆ వ్యవస్థాపకులు గూగుల్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గూగుల్ రెండేళ్ళైనా పెనాల్టీ తొలగించలేదు. ఇక చేసేదేమీ లేక ఆ దంపతులు యూరోపియన్ కమిషన్ను 2010లో సంప్రదించారు.ఫౌండమ్ వ్యవస్థాపకులు ఫిర్యాదును కమిషన్ అధికారులు దర్యాప్తు చేసి.. గూగుల్ కంపెనీ తన షాపింగ్ సర్వీసును ప్రమోట్ చేసుకోవడానికే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవరించి అన్యాయం చేసిందని గుర్తించింది. గూగుల్ చేసిన ఈ అన్యాయానికి 2.4 బిలియన్ ఫౌండ్స్ (సుమారు రూ. 26వేల కోట్లు) జరిమానా విధిస్తూ కమిషన్ 2017లో తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: డిజిటల్ కామ్డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..యూరోపియన్ కమిషన్ తీర్పు ఇచ్చిన తరువాత గూగుల్ అప్పీల్కు వెళ్ళింది. సుమారు ఏడేళ్ల తరువాత కమిషన్ ఇచ్చిన తీర్పును 2024లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సమర్థించింది. తీర్పు చాలా ఆలస్యమైందని శివన్, ఆడమ్ రాఫ్ స్పందించారు. ఆలస్యమైనా.. పోరాటానికి ఫలితం దక్కిందని అన్నారు. -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు. మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్పై షార్ట్కట్స్గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్లను వదిలించుకోవాలి. అయితే యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్ను ఆండ్రాయిడ్ 15తో ఇన్బిల్ట్గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్లో చేరిన మొదట్లో కేఫ్లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.గూగుల్లో జాబ్ కోసం..ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు. -
గూగుల్ 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు చాలామంది కొంతకాలంగా ‘గూగుల్ క్లౌడ్ స్టోరేజ్’తో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, వీడియోలు, బ్యాకప్ ఫైళ్లు ఎక్కువగా ఉన్నవారికి తమ క్లౌడ్ స్లోరేజ్ నిండిపోయినట్లు పాప్అప్ మెసేజ్లు వస్తుండడం గమనిస్తున్నాం. అయితే ఇప్పటివరకు గూగుల్ 15జీబీ స్టోరేజీను ఉచితంగా అందించింది. ఇకపై స్టోరేజీ కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందనేలా పాప్అప్ కనిపిస్తుంది. అయితే కాసేపు స్టోరేజీలోని డేటాపై సమయం వెచ్చిస్తే ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచితంగా గూగుల్ సేవలు పొందే వీలుంది. అది ఎలాగో తెలుసుకుందాం.గూగుల్ ఆండ్రాయిడ్ 1.0 వర్షన్ను 2008లో లాంచ్ చేసింది. దాంతో స్మార్ట్ఫోన్లకు భారీగా గిరాకీ ఏర్పడింది. అయితే ఈ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేయాలంటే జీమెయిల్ లాగిన్ అవసరం అవుతుంది. దాంతో చాలామంది గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. గూగుల్ తర్వాతి కాలంలో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర బ్యాకప్ ఫైళ్ల కోసం ఉచితంగా 15 జీబీ క్లౌడ్స్టోరేజీ అందించింది. ఈ తరుణంలో చాలాఏళ్లుగా ఒకే గూగుల్ అకౌంట్ వాడుతున్న వారికి చెందిన క్లౌడ్ స్టోరేజీ ఇటీవల కాలంలో ఫుల్ అయింది. దాంతో కంపెనీ కొంత డబ్బు చెల్లిస్తే మరింత ఎక్కువ ఆన్లైన్ స్టోరేజీని ఇస్తామన్నట్లు ఆఫర్లు పెడుతోంది. ఒకవేళ స్టోరేజీ పూర్తయితే గూగుల్ వన్ అకౌంట్ తీసుకుని నెలకు రూ.30(మొదటి మూడు నెలలు మాత్రమే రూ.30. తర్వాత ధరలో మార్పు ఉంటుంది) చెల్లిస్తే 100 జీబీ స్పేస్ లభిస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించి తిరిగి గూగుల్ స్టోరేజీను ఉచితంగా పొందవచ్చు.ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ దూసుకెళ్లాలంటే ఇవి పాటించాల్సిందే..గూగుల్ స్టోరేజీలోని క్లీనప్ స్పేస్ ఆప్షన్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్, ఫొటోస్, జీమెయిల్ వంటి వివిధ సర్వీసుల్లో ఉన్న అనవసర డేటాను తొలగించాలి.ఎప్పుడో మీరు మొదటగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓపెన్ చేసిన గూగుల్ అకౌంట్ కాబట్టి ఒకసారి అనవసర డేటా ఏదైనా ఉందో చూసుకోండి. వాటి అవసరం లేదంటే డేటా డిలీట్ చేయండి.కొన్ని ఫైళ్ల సైజ్(ఎంబీ, జీబీ) ఎక్కువగా ఉంటుంది. వాటిని తొలగించవచ్చు.ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్ కంటే కూడా డెస్క్టాప్/ ల్యాప్టాప్ వినియోగించడం మంచిది. ఇందుకోసం ముందుగా గూగుల్ వన్ స్టోరేజీ మేనేజర్కి వెళితే దేనికంత స్టోరేజీ అవుతుందో చూపిస్తుంది. ఏయే సర్వీసుల్లో పెద్ద ఫైల్స్ ఉన్నాయో రివ్యూ చేయొచ్చు. ఆయా సర్వీసులపై క్లిక్ చేస్తే డిలీట్ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్ దర్శనమిస్తాయి. వాటిని సులువుగా డిలీట్ చేయొచ్చు.నిత్యం ఎన్నో వెబ్సైట్లను సందర్శిస్తుంటాం. అవి ఎప్పటికప్పుడు వాటి ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. దాంతో జీమెయిల్ ఇన్బాక్స్ నిండిపోతూ ఉంటుంది. ఈ తరహా మెయిల్స్ను తొలగించడం ద్వారా కొంత స్పేస్ను పొందవచ్చు. ఇందుకోసం జీమెయిల్ ఇన్బాక్స్లో చెక్బాక్స్ పక్కనే ఉన్న డ్రాప్డౌన్ మెనూపై క్లిక్ చేసి అన్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కామన్ బాక్స్ ఎంచుకుంటే అన్ని అన్రీడ్ మెసేజ్లు సెలక్ట్ అవుతాయి. పక్కనే ఉన్న డిలీట్ బటన్పై క్లిక్ చేయాలి.మెయిల్లోని ప్రైమరీ విభాగం కాకుండా పక్కనే ఉన్న ప్రమోషన్స్, సోషల్ విభాగంలోని మెయిళ్లును తొలగించవచ్చు.పాత మెయిల్స్ను తొలగించడానికి జీమెయిల్ సెర్చ్లో ఉదాహరణకు before:2018 అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. 2018 కంటే ముందున్న మెయిళ్లన్ని దర్శనమిస్తాయి. వాటిని డిలీట్ చేయవచ్చు.లార్జ్ మెయిళ్లను డిలీట్ చేయాలంటే సెర్చ్ బార్లో క్లిక్ చేసిన వెంటనే కింద has attachment అని వస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్లో 4m అని టైప్ చేయాలి. దాంతో 4 ఎంబీ సైజ్ ఉన్న అన్ని ఫైళ్లకు సంబంధించిన మెయిళ్లు డిస్ప్లే అవుతాయి. అనవసరమైతే వాటిని డిలీట్ చేసుకోవచ్చు.గూగుల్ ఫొటోస్, వీడియోల్లో లార్జ్ ఫైళ్లు ఉంటాయి. కాబట్టి వేరే తాత్కాలిక అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో కొన్ని ఫైళ్లను కొత్త అకౌంట్లోకి మార్చుకోవచ్చు. లేదంటే వాటిలో కొన్నింటిని పూర్తిగా డిలీట్ చేసుకోవచ్చు. -
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్షాట్ను ‘ఎక్స్’లో పోస్ట్చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
గూగుల్ కొత్త చీఫ్ టెక్నాలజిస్ట్: ఎవరీ ప్రభాకర్ రాఘవన్..
గూగుల్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్గా 'ప్రభాకర్ రాఘవన్' నియమితులైనట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గత 12 సంవత్సరాలుగా కంపెనీకి సేవలందిస్తున్న రాఘవన్.. గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్ వంటి వాటికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు.ఎవరీ ప్రభాకర్ రాఘవన్?భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రభాకర్ రాఘవన్ 1981లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత 1982లో శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. 1986లో బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ పూర్తి చేశారు.2012లో ప్రభాకర్ రాఘవన్ గూగుల్లో చేరారు. అంతకంటే ముందు ఈయన యాహూలో పనిచేశారు. యాహూ నుంచి గూగుల్లో చేరిన తరువాత సెర్చ్ అండ్ యాడ్ ర్యాంకింగ్తో పాటు యాడ్ మార్కెట్ప్లేస్ డిజైన్లో పనిచేశారు. ఆ తరువాత గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్లలోనూ పనిచేసారు. ఈ సమయంలోనే ఈయన స్మార్ట్ రిప్లై అండ్ స్మార్ట్ కంపోజ్ వంటి ఏఐ ఫీచర్స్ ప్రారంభిచడంలో కీలకపాత్ర పోషించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..ప్రభాకర్ రాఘవన్ వివిధ విభాగాల్లో పనిచేస్తూ 2018లో గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, జియో, యాడ్స్, కామర్స్, పేమెంట్స్ ప్రొడక్ట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. రాఘవన్ నాయకత్వంలోనే ఏఐ ఓవర్వ్యూస్, సర్కిల్ టు సెర్చ్, లెన్స్లో మీరు చూసే వాటిని షాపింగ్ చేయండి వంటి ఫీచర్స్ ప్రారంభమయ్యాయి. కాగా ఇప్పుడు ఈయన గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్గా నియమితులయ్యారు. -
ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్ఎంఆర్ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.గూగుల్ సంస్థ కైరోస్ పవర్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్కు చెందిన ఎస్ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్లో రియాక్టర్ను పునరుద్ధరించడంలో కాన్స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
గూగుల్లో జాబ్ కోసం ఇవి తప్పనిసరి: సుందర్ పిచాయ్
గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయాలని చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కలలు కంటారు. అయితే కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ ఉండాలనే విషయాన్ని సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.ది డేవిడ్ రూబెన్స్టెయిన్ షో, పీర్ టు పీర్ కన్వర్జేషన్స్లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు.గూగుల్ కంపెనీలో సుందర్ పిచాయ్ ప్రారంభ రోజులను గురించి కూడా వెల్లడించారు. కేఫ్లో ఊహించని సంభాషణలు ఎలా ఉత్తేజకరమైన ప్రాజెక్ట్లకు దారితీస్తాయో గుర్తుచేసుకున్నారు. టెక్ ప్రపంచం సవాళ్లతో కూడుకున్నదిగా ఉన్నప్పటికీ.. ప్రతిభావంతులకు గూగుల్ గమ్యస్థానంగా నిలుస్తుందని పిచాయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: సూరత్లో వజ్రాల పరిశ్రమకు ఏమైంది? కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఇదేనా..2024 జూన్ నాటికి గూగుల్ కంపెనీలో 1,79,000 మంది ఉన్నట్లు వెల్లడించారు. టెక్ పరిశ్రమ అంతటా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో గూగుల్లో ఉద్యోగం పొందటం కొంత కష్టమని అన్నారు. మాజీ గూగుల్ రిక్రూటర్ నోలన్ చర్చ్ కూడా నియామక ప్రక్రియపై గురించి వివరించారు. గూగుల్ సంస్థ విలువలను, మిషన్ను అర్థం చేసుకోవడానికి సంబంధించిన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ.. ఇంటర్వ్యూలకు బాగా సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. -
‘చివరిసారి ఏం మాట్లాడామంటే..’
రతన్ టాటా మృతిపట్ల ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ రతన్ టాటాతో చివరిసారిగా గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆ వివరాలు పంచుకుంటూ టాటా మృతికి సంతాపం తెలియజేశారు.‘గూగుల్ క్యాంపస్లో రతన్ టాటాను చివరిసారి కలిసినప్పుడు ‘వేమో’(అధునాతన అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ) పురోగతి గురించి మాట్లాడాం. ఈ విభాగంలో ఆయన ఆలోచన విధానాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అసాధారణమైన వ్యాపార, దాతృత్వ వారసత్వం ఆయన సొంతం. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. భారత్ను ఆర్థికంగా మరింత మెరుగుపరిచేందుకు ఆయన ఎంతో శ్రద్ధ చూపారు. అతని మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సుందర్ తెలిపారు.My last meeting with Ratan Tata at Google, we talked about the progress of Waymo and his vision was inspiring to hear. He leaves an extraordinary business and philanthropic legacy and was instrumental in mentoring and developing the modern business leadership in India. He deeply…— Sundar Pichai (@sundarpichai) October 9, 2024రతన్ టాటాపై ఇలోన్మస్క్టాటా ప్రపంచ ప్రఖ్యాత సంస్థల సారథులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికన్ జర్నలిస్ట్ చార్లీ రోస్తో 2009లో ఇలోన్మస్క్తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా దూరదృష్టిని మస్క్ ప్రశంసించారు. ఇంటర్వ్యూలో భాగంగా భారతీయ మార్కెట్లో టాటా తక్కువ ధరకే కారు(నానో) అందిస్తున్నారని మస్క్ దృష్టికి తీసుకొచ్చారు. ‘రతన్ టాటా ఇండియాలో విప్లవాత్మక మార్పునకు తెరతీశారు. కేవలం రూ.ఒక లక్షకు కారు అందించడం గొప్ప విషయం. కారు సామాన్యుడికి అందుబాటులో ఉండాలనే దూరదృష్టి టాటాది’ అని మస్క్ బదులిచ్చారు.He fulfilled his promise to build the world's cheapest car.- Ratan Tata wanted to build a car, which the middle class of India could afford and so he delivered on his promise and launched Tata Nano for just $1,200 (₹1 lakh) in 2008.- @ElonMusk also shared his views on the… pic.twitter.com/QqTY5KuQLK— Nico Garcia (@nicogarcia) August 26, 2024రతన్ టాటాపై బిల్ గేట్స్‘రతన్ టాటా దూరదృష్టి కలిగిన నాయకుడు, సామాన్యుల జీవితాలను మెరుగుపరచడంలో అతని అంకితభావం ఎనలేనిది. అతడి వ్యక్తిత్వం భారతదేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేసింది. ప్రజలకు సేవ చేసేందుకు రతన్ టాటాతో కలిసి అనే సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. అతడి మరణం రాబోయే తరాలకులోటు. కానీ అతడు అనుసరించిన విలువలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని బిల్గేట్స్ తెలిపారు.ఇదీ చదవండి: సినీనటి సంతాపం.. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రేమ?మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా, ముఖేష్ అంబానీ వంటి వ్యాపార ప్రముఖులు, రాజకీయ, సినీ దిగ్గజాలు ఆయనకు సంతాపం తెలిపారు. బుధవారం రాత్రి 11.30 గంటలకు దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో టాటా తుది శ్వాస విడిచారు. -
జీపే ద్వారా ‘బంగారు’ రుణాలు
న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మొబైల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ జీపే బంగారు ఆభరణాలపై రుణాలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు ముత్తూట్ ఫైనాన్స్తో చేతులు కలిపినట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ను హిందీ భాషలో ప్రారంభించినట్లు తెలియజేసింది. తదుపరి దశలో మరో 8 ప్రాంతీయ భాషలలో జెమినీ సేవలు లభ్యంకానున్నట్లు వెల్లడించింది. గూగుల్ ఫర్ ఇండియా 10వ సదస్సులో ఇంకా పలు విషయాలను తెలియజేసింది. వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలు చౌక వడ్డీ రేట్లలో గోల్డ్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకొవచ్చు. ఇందుకు రుణగ్రహీతలకు సౌకర్యవంతమైన అవకాశాలను కల్పిస్తోంది. మరోపక్క రుణదాతలకు సెక్యూరిటీని అందిస్తోంది. కాగా.. ప్రపంచ పసిడిలో ఇండియా వాటా 11 శాతమని గూగుల్ ఇండియా ఎండీ రోమ దత్త చోబే తెలియజేశారు. తెలుగులోనూ.. ఏఐ అసిస్టెంట్ జెమినీ లైవ్ యూజర్లలో 40శాతానికిపైగా వాయిస్ ద్వారానే సేవలను వినియోగించుకుంటున్నట్లు గూగుల్ ఇండియా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సీనియర్ డైరెక్టర్ హేమ బూదరాజు పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ భాషలో జెమినీ లైవ్ను ఆవిష్కరించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుసహా మలయాళం, తమిళ్, బెంగాలీ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషలలో ఏఐను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గూగుల్ సెర్చ్ లో జెన్–ఏఐ ఆధారిత ఏఐ ఓవర్వ్యూను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ గూగుల్ సెర్చ్ను తెలుగు, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. రానున్న రెండు నెలల్లో దేశీయంగా జెమినీ ఫ్లాష్ 1.5ను ఆవిష్కరించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీంతో వివిధ సంస్థలు క్లౌడ్, ఏఐ సొల్యూషన్లను భద్రంగా అమలు చేయవచ్చని తెలిపింది. తద్వారా డేటాను భద్రపరచుకోవడంతోపాటు.. దేశవ్యాప్తంగా మెషీన్ లెరి్నంగ్ ప్రాసెస్కు తెరతీయవచ్చని వివరించింది. 2025లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. -
ఆయన కోసం గూగుల్ రూ. వేలకోట్ల ఆఫర్!.. ఏకంగా..
ఈ రోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా ఉండలేము. అంతలా ఎదిగిన ఈ ఏఐను దిగ్గజ కంపెనీలు సైతం మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ నిపుణుడు 'నోమ్ షజీర్'ను తిరిగి నియమించుకోవడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేసింది.గూగుల్ కంపెనీ నోమ్ షజీర్ను తిరిగి నియమించుకోవడానికి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈయన మళ్ళీ గూగుల్ జెమినీలో పనిచేయడానికి జాయిన్ అవుతున్నట్లు సమాచారం.నిజానికి నోమ్ షజీర్ గూగుల్ మాజీ ఉద్యోగి. ఈయన 2000లో గూగుల్ కంపెనీలో పనిచేశారు. అప్పట్లోనే తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్తో కలిసి డెవలప్ చేసిన ‘చాట్ బాట్’ను విడుదల చేయాలన్నఅభ్యర్థనను కంపెనీ తిరస్కరించడంతో.. 2021లో గూగుల్ వదిలి వెళ్లారు.ఇదీ చదవండి: నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రానోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రీటాస్ Character.AI కనుగొన్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే సిలికాన్ వ్యాలీలో గొప్ప ఏఐ స్టార్టప్లలో ఒకటిగా మారింది. ఇది గతేడాది ఒక బిలియన్ విలువకు చేరుకుంది. ఆ తరువాత వీరిరువురు గూగుల్ ఏఐ యూనిట్ డీప్మైండ్లో చేరుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. -
ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.2004 - జీమెయిల్ ప్రారంభం2005 - గూగుల్ మ్యాప్స్2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్ను గూగుల్ కొనుగోలు చేసింది2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం2015 - సీఈఓగా సుందర్ పిచాయ్2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇదీ చదవండి: నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్ఫోన్ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
ఏఐ ఫండ్కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..
యూఎస్లో జరిగిన ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ పేరుతో గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ 120 మిలియన్ డాలర్ల(రూ.వెయ్యి కోట్లు) నిధిని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.న్యూయార్క్లో జరిగిన 79వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు. ‘యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా ‘గ్లోబల్ ఏఐ ఆపర్చునిటీ ఫండ్’ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ సీఈఓ సుందర్పిచాయ్ ప్రకటించారు. గూగుల్ తరఫున ఈ ఫండ్లో భాగంగా 120 మిలియన్ డాలర్లు(రూ.వెయ్యి కోట్లు) సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిటీల్లో ఏఐ ఎడ్యుకేషన్, ట్రెయినింగ్ కోసం దీన్ని ఖర్చు చేస్తామన్నారు. ఇందుకోసం లాభాపేక్షలేని సంస్థలు, ఎన్జీఓలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని తెలిపారు. ఈ ఏఐ ఎడ్యుకేషన్, శిక్షణను స్థానిక భాషల్లో అందిస్తామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్!ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా 15 గూగుల్ ఉత్పత్తులు ఒక్కోటి 50 కోట్ల వినియోగదారుల చొప్పున సేవలందిస్తోంది. వాటిలో ప్రధానంగా గూగుల్ సెర్చింజన్, మ్యాప్స్, డ్రైవ్ ఉన్నాయి. కంపెనీ రెండు దశాబ్దాలుగా ఏఐ సెర్చ్, టెక్నాలజీ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడుతోంది. ఏఐని ఉపయోగించి గతేడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి అందుబాటులో ఉండే 110 కొత్త భాషల్లోకి గూగుల్ ట్రాన్స్లేట్ను విస్తరించాం. దాంతో ప్రస్తుతం గూగుల్ సేవలందించే ఈ భాషల సంఖ్య 246కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 1,000 భాషల్లో గూగుల్ ట్రాన్స్లేట్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నాం. ఏఐ ప్రపంచ శ్రామిక ఉత్పాదకతను 1.4 శాతం పాయింట్లకు పెంచుతుంది. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రపంచ జీడీపీ ఏడు శాతం పెరిగేలా తోడ్పడుతుంది. ఉదాహరణకు ప్రపంచంలో కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రద్దీ పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో కార్యకలాపాలు, లాజిస్టిక్లను మెరుగుపరచడంలో ఏఐ సాయం చేస్తోంది’ అన్నారు. -
డ్రీమ్ జాబ్ : అమ్మకోసం రూ.2 కోట్ల జాక్ పాట్ కొట్టిన టెకీ
ఇంజనీరింగ్ చదివి గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఒక కల. కలలు అందరూ కంటారు. సాధించేది మాత్రం కొందరే. అందులోనూ ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన వేళ అలాంటి డ్రీమ్ జాబ్ సాధించడం అంటే కత్తి మీద సామే. కానీ ప్రతిష్టాత్మక కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగాన్ని సంపాదించాడో యువకుడు. బీహార్లోని జముయి జిల్లాకు చెందిన కంప్యూటర్ ఇంజనీర్ జాక్ పాట్ కొట్టేశాడు. గూగుల్లో రూ. 2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. దీంతో అతని కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది.జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం. ఆకర్షణీయమైన జీతం. అయినా అక్కడితో ఆగిపోలేదు అభిషేక్. తన డ్రీమ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. బీటెక్ తరువాత 2022లో అమెజాన్లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో కొలువు సాధించాడు. అక్కడ 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్లో చేరాడు. ఇక్కడ పనిచేస్తూనే ఇంటర్వ్యూలకు కష్టపడి చదివి గూగుల్లో ఏడాదికి 2.07కోట్ల రూపాయల జీతంతో ఉద్యోగాన్ని సాధించాడు. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్లో విధుల్లో చేరనున్నాడు.అభిషేక్ మాటల్లో చెప్పాలంటే ఒక కంపెనీలో 8-9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్లో ఇంటర్వ్యూలకోసం ప్రిపేరయ్యేవాడు. ఇది గొప్ప సవాలే. ఎట్టకేలకు అభిషేక్ పట్టుదల కృషి ఫలించింది. "నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చా.. నా మూలాలు ఎక్కడో గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే, ఇపుడిక నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను." అన్నాడు సంతోషంగా.అంతేకాదు “అన్నీ సాధ్యమే. చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను’’ అంటూ తన తోటివారికి సందేశం కూడా ఇచ్చాడు. అభిషేక్ తల్లి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. ఆమెకు మెరుగైన జీవితాన్ని అందించాలనే కోరికే కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించడానికి ప్రేరేపించిందంటాడు అభిషేక్. ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలుతెలిపాడు. తల్లితండ్రులు, సోదరులే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పాడు. అభిషేక్ తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ముగ్గురి సంతానంలో చివరివాడు అభిషేక్. -
వేల కోట్ల రూపాయల ఫైన్!
లండన్: యూరోపియన్ కమిషన్ విధించిన 2.4 బిలియన్ యూరో(రూ.22 వేలకోట్లు)ల జరిమానాను సవాల్ చేస్తూ గూగుల్ దాఖలు చేసిన కేసు వీగిపోయింది. గూగుల్ సెర్చ్లో గూగుల్ సొంతంగా షాపింగ్ సిఫారసులు చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన ప్రయోజనం పొందిందంటూ.. 2.4 బిలియన్ యూరోల జరిమానా చెల్లిచాలంటూ 2017లో యూరోపియన్ కమిషన్ ఆదేశించింది. విజిటర్లను అనుచితంగా తన సొంత షాపింగ్ సేవల వైపు మళ్లించడం పోటీదారులకు నష్టం కలిగించడమేనని పేర్కొంది. ఈ ఆదేశాలను యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా సమర్థించింది.గూగుల్ ఈ అప్పీల్ను తిరస్కరించింది. కోర్టు నిర్ణయం తమను నిరాశపరిచినట్టు, ఈ తీర్పు కేవలం కొన్ని వాస్తవాల ఆధారంగానే ఉన్నట్టు గూగుల్ ప్రకటన విడుదల చేసింది. పోటీదారులను సమానంగా చూడాలన్న యూరోపియన్ కమిషన్ నిర్ణయానికి అనుగుణంగా తాము 2017లో ఎన్నో మార్పులను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. షాపింగ్ సెర్చ్ లిస్టింగ్లకు సంబంధించి వేలం నిర్వహించినట్టు వివరించింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, యాడ్సెన్స్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించి మరో రెండు ఈయూ యాంటీట్రస్ట్ కేసుల్లోనూ గూగుల్కు వ్యతిరేకంగా ఆదేశాలు రాగా, వీటిపై అప్పీల్కు గూగుల్కు ఇప్పటికీ అవకాశం మిగిలే ఉంది.ఇదీ చదవండి: పీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయాల్సిందేనా..?ఇదిలాఉండగా, గూగుల్లో యాడ్ ఇవ్వాలనుకునే ప్రకటన ఏజెన్సీలు కీవర్డ్లకు సంబంధించిన బిడ్ను వేలంలో గెలుపొందాల్సి ఉంటుంది. వినియోగదారులు సెర్చింజన్లో ఏదైనా సమాచారాన్ని తెలుసుకుంటున్నప్పుడు సెర్చ్ కీవర్డ్లకు అనుగుణంగా యాడ్స్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. అలా సెర్చ్ చేసేవారి అభిరుచులకు తగిన యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, షాపింగ్ యాడ్స్.. వంటి వివిధ రూపాల్లో ప్రకటనలు ఇస్తూంటారు. -
ఏకకాలంలో మూడు యాప్లు: గూగుల్ ప్లే స్టోర్లో కొత్త ఫీచర్
సాధారణంగా గూగుల్ ప్లే స్టోర్లో ఒకసారికి ఒక యాప్ను మాత్రమే ఇన్స్టాల్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు యాప్ మేనేజ్మెంట్ మరింత వృద్ధి చెందింది. కాబట్టి ఏకకాలంలో మూడు యాప్లు లేదా గేమ్లను ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవచ్చు.ఈ కొత్త ఫీచర్ భారతదేశంతో సహా ఎంపిక చేసిన ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్లోని ఈ అప్డేట్ మునుపటి సిస్టమ్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా? గూగుల్ ఏప్రిల్లో మొదటిసారి రెండు యాప్లను ఏకకాలంలో ఇన్స్టాల్ లేదా అప్డేట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఇప్పుడు ఆ సంఖ్య మూడుకు చేరింది. యూజర్ ఒకేసారి మూడు యాప్స్ ఇన్స్టాల్/అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 'అప్డేట్ ఆల్' అనే ఫీచర్ ఎంచుకోవాలి ఉంటుంది. ఇలా సెలక్ట్ చేసుకున్న తరువాత యాప్స్ అప్డేట్లు ప్రాసెస్ అవుతాయి. అయితే ఈ ఫీచర్ కొన్ని పరికరాల్లోనూ అందుబాటులో లేదు. కానీ రాబోయే రోజుల్లో అన్ని పరికరాల్లోనూ అందుబాటులో వస్తుందని సమాచారం. -
తమిళనాడు ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం: ఎందుకో తెలుసా?
తమిళనాడులో ఏఐ ల్యాబ్లను ఏర్పాటు చేయడానికి గూగుల్, రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ ఎనేబుల్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించి.. రాష్ట్రంలో బలమైన ఏఐ ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్ను నిర్మించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టీఆర్బీ రాజాల సమక్షంలో.. గూగుల్ మౌంటైన్ వ్యూ కార్యాలయంలో ఈ ఒప్పందం జరిగింది. గూగుల్ క్లౌడ్ జీఎ అండ్ హెడ్ ఆఫ్ ప్లాట్ఫారమ్ అమిత్ జవేరీ, గూగుల్ పిక్సెల్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ నందా రామచంద్రన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల మంత్రి డాక్టర్ టిఆర్బి రాజా మాట్లాడుతూ.. గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుంది, భవిష్యత్తులో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గూగుల్ సహకారం ఉంటుందని అన్నారు.గూగుల్ క్లౌడ్ జీఎ అండ్ హెడ్ ఆఫ్ ప్లాట్ఫారమ్ అమిత్ జవేరీ మాట్లాడుతూ.. ఏఐలో ముందుకు సాగటానికి.. భవిష్యత్తు వైపు వారి ప్రయాణంలో మేము తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాము. సాంకేతిక పురోగతిని పెంపొందించడానికి ఈ సహకారం ఉపయోగపడుతుందని అన్నారు.గూగుల్, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఏర్పడిన సహకారం అనేక కీలక అంశాల మీద దృష్టి సారిస్తుంది. ఇప్పటికే మేడ్ ఇన్ ఇండియా పిక్సెల్ 8 పరికరాల తయారీ తమిళనాడు ప్రభ్యత్వ భాగస్వామ్యం ద్వారా జరుగుతోంది. ఇప్పుడు ఏర్పరచుకున్న కొత్త భాగస్వామ్యం ఏఐ రంగంలో మరింత ముందుకు వెళ్లేలా చేస్తుంది. -
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్ ఎక్కడంటే?
కోల్కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..దక్షిణాఫ్రికాఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి రక్షణ విషయంలో చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.భారతదేశంఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్గా మారింది. భారత్లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.సిరియామహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.సోమాలియామహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.సౌదీ అరేబియామహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.పాకిస్తాన్ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.యెమెన్తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.నైజీరియా నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది. -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్: స్విచ్ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్పుట్కు సపోర్ట్ చేస్తుందికొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లు యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్పుట్కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్బీ-సీ ద్వారా డిస్ప్లే పోర్ట్తో స్క్రీన్ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చుసాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్ఫోన్లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్ఫోన్కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. -
ఏఐ రంగంలో వెనుకపడ్డ గూగుల్.. కారణం ఇదే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో టెక్ దిగ్గజం గూగుల్ వెనుకపడి ఉంది. దీనికి ప్రధాన కారణం రిమోట్ వర్క్ & కాంపిటీటివ్ డ్రైవ్ కంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్కి ప్రాధాన్యమివ్వడమే అని గూగుల్ మాజీ సీఈఓ 'ఎరిక్ స్మిత్' (Eric Schmidt) ఆరోపించారు.స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఎరిక్ స్మిత్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి స్టార్టప్లు ఏఐ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తున్నాయని వెల్లడించారు. అయితే గూగుల్ ఏఐ రంగంలో విజయం సాధించడం కంటే కూడా వర్క్-లైఫ్ బ్యాలెన్స్, త్వరగా ఇంటికి వెళ్లడం & వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి చాలా ముఖ్యమని గూగుల్ భావించిందని ఆయన అన్నారు.2001 నుంచి 2011 వరకు గూగుల్ సీఈఓగా వ్యవహరించిన ఎరిక్ స్మిత్ వేగవంతమైన సాంకేతిక పరిశ్రమలో పోటీ పడేందుకు అవసరమైన విధానాలను గురించి వెల్లడించారు. ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి లేదా అనువైన షెడ్యూల్లను నిర్వహించడానికి అనుమతించడం వల్ల ప్రత్యర్థుతో పోటీ పడలేమని పేర్కొన్నారు.గతంలో స్మిత్ ఆఫీస్ నుంచి పని చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సమర్థవంతమైన నిర్వహణను నిర్మించడానికి.. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది కీలకమని వాదించారు. అయిత్ గూగుల్ ప్రస్తుత పని విధానాలు స్మిత్ క్యారెక్టరైజేషన్కు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో చాలామంది ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉంటుంది. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్డాగ్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. విండోస్, మ్యాక్ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్లపై గూగుల్ క్రోమ్ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.క్రోమ్ బ్రౌజర్లో బగ్లు ఉన్నాయని, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకునే అవకాశం ఉందని.. సిస్టమ్లో స్టోర్ చేసి పెట్టుకున్న ముఖ్యమైన డేటాను, పాస్వర్డ్లను సైతం వారు కాపీ చేసుకునే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ బ్రౌజర్ ఉపయోగించేవారు వెంటనే దాన్ని అప్డేట్ చేయాలని సంస్థ పేర్కొంది.ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లతో సహా అనేక రకాల ఆండ్రాయిడ్ పరికరాలను గూగుల్ క్రోమ్ ప్రభావితం చేస్తుందని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. కాబట్టి యూజర్లు తప్పకుండా క్రోమ్ అప్డేట్ చేసుకోవాలి.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, క్రోమ్ బ్రౌజర్లో ఈ భద్రతా లోపం సుమారు 18 సంవత్సరాల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని డెవలపర్లు గుర్తించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ సమస్యను వెలికితీశారు. -
ఎన్వీడియా ఏఐ చిప్.. దిగ్గజ కంపెనీలపై ప్రభావం
నేడు దిగ్గజ కంపెనీలు చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఈ జాబితాలో ఎన్వీడియా కూడా ఉంది. సంస్థ ఏఐ ద్వారా చిప్లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ప్రారంభంలో ఉత్పత్తి కొంత తక్కువగా ఉండొచ్చని, సరఫరాలలో కొంత ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.ఎన్వీడియా చిప్ల తయారీ ఆలస్యం.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి వాటిపైన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ గ్రేస్ హాప్పర్ AI సూపర్చిప్ను అనుసరించి మార్చిలో.. తన బ్లాక్వెల్ ఏఐ చిప్లను ఆవిష్కరించింది. ఇది ఉత్పత్తిని వేగవంతం చేస్తుందని సమాచారం. ఆ తరువాత సరఫరా వేగవంతం అవుతుంది.మార్కెట్లో హాప్పర్ డిమాండ్ ఎక్కువగా ఉంది, కాబట్టి ఉత్పత్తిని వేగవంతం చేయడానికి సంస్థ శ్రమిస్తోంది. అయితే ఈ వారం మైక్రోసాఫ్ట్, మరొక ప్రధాన క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కు చిప్ల సరఫరా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎన్వీడియా తెలిపింది. -
షట్డౌన్ అవుతుంది జాగ్రత్త.. గూగుల్కు ట్రంప్ వార్నింగ్!
రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్పై విరుచుకుపడ్డారు. గూగుల్ చాలా చెడ్డది, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోంది. షట్డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలంటూ గూగుల్ను పరోక్షంగా హెచ్చరించారాయన. ట్రంప్పై ఇటీవలె హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత బైడెన్ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి గూగుల్ ట్రంప్ వ్యతిరేక సమాచారం అందిస్తోందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ సైతం ఈ విషయంలో ఓ ట్వీట్ కూడా ఇచ్చారు. అయితే.. జులై 13న తనపై హత్యాయత్నం జరిగితే.. దానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్రా సమాచారం గూగుల్లో అందుబాటులో లేదని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆరోపణను తోసిపుచ్చిన గూగుల్.. ఆ హత్యాయత్నానికి సంబంధించిన ప్రశ్నలకు ఆటోకంప్లీట్ అంచనాలను అందించడం లేదని వివరణ ఇచ్చింది. రాజకీయ హింసకు సంబంధించిన సమాచారం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ట్రంప్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తే.. కమలా హారిస్కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని కూడా కొందరు చెబుతున్నారు. ఇది రాజకీయ స్పెక్ట్రమ్లో విస్తరించిన సమస్య కావొచ్చని, కొన్ని వార్తలు స్వయంచాలకంగా రూపొందించబడి, కాలక్రమేణా మారుతూ ఉంటాయని గూగుల్ తెలిపింది. మొత్తంమీద, ఈ రకమైన ప్రిడిక్షన్, లేబులింగ్ సిస్టమ్లు అల్గారిథమిక్ అని గూగుల్ పేర్కొంది.మా సిస్టమ్లు బాగా పనిచేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కారాయించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని గూగుల్ పేర్కొంది. సమస్య పరిష్కారమైన తరువాత మీకు సెర్చ్ చేసే సమాసం సులభంగా కనిపిస్తుందని స్పష్టం చేసింది. -
స్కూల్ టైమ్ ఫీచర్.. తల్లిదండ్రులకు వరం!
మార్కెట్లో స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నేడు స్మార్ట్ఫోన్ జీవితంలో ఓ భాగమైపోయింది. పెద్దవారి విషయం పక్కన పెడితే.. పిల్లలు కూడా వీటికి అలవాటైపోతున్నారు, గంటలకొద్దీ వాటికే అతుక్కుపోతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి, వారికి ఫోన్ ఎంతవరకు అవసరమో.. అంతవరకు మాత్రమే ఉపయోగించేలా గూగుల్ ఓ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది.గూగుల్ త్వరలోనే పిల్లలు ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడానికి 'స్కూల్ టైమ్' ఫీచర్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా టాబ్లెట్ ఓఎస్ వాచ్లలో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.ఏమిటి ఈ స్కూల్ టైమ్ ఫీచర్స్మార్ట్ఫోన్ వినియోగాన్ని తగ్గించడానికి, పిల్లలు పరిమిత సమయం మాత్రమే ఉపయోగించడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. స్మార్ట్ఫోన్ నుంచి పిల్లలను ఎలా దూరం చేయాలని ఆలోచించే తల్లితండ్రులకు ఇప్పుడు ఈ ఫీచర్ ఓ చక్కని పరిష్కారం అనే చెప్పాలి.ఎలా ఉపయోగించాలి స్మార్ట్ఫోన్ లేదా స్మార్ట్ఫోన్ వాచ్లలో స్కూల్ టైమ్ ఫీచర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్యామిలీ లింక్ ద్వారా తేదీ, టైమ్ వంటి వాటిని షెడ్యూల్ చేయాలి. దీని ద్వారా నిర్దిష్ట కాంటాక్ట్ నుంచి కాల్స్, మెసేజస్ అనుమతించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడ్ ఎప్పుడైనా లాక్ చేయవచ్చు, అన్లాక్ కూడా చేయవచ్చు.గూగుల్ ఈ ఫీచర్ను వచ్చే ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత పిల్లలు స్మార్ట్ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు యూట్యూబ్ యాక్టివిటీ ఫీచర్ కూడా లాంచ్ చేయడానికి సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.స్కూల్ టైమ్ ఫీచర్ ఉపయోగాలుపిల్లలు తమ స్కూల్స్లో కూడా తరగతుల మీద దృష్టి సారించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. -
నిమిషానికి రూ.2 కోట్లు!.. గూగుల్ ఎలా సంపాదిస్తుందో తెలుసా?
ఏ విషయం తెలుసుకోవాలన్నా.. వెంటనే గూగుల్ సెర్చ్ చేసేస్తారు. ఆలా నేడు గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్గా మారిపోయింది. ఇంతలా అభివృద్ధి చెందిన గూగుల్ నిమిషానికి ఏకంగా రూ.2 కోట్లు సంపాదిస్తుందని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం..గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది యూజర్లను కలిగి ఉంది. స్మార్ట్వాచ్లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అయినప్పటికీ గూగుల్ భారీ మొత్తంలో సంపాదించడానికి ప్రధాన కారణం 'యాడ్స్' (ప్రకటనలు).మనం ఏమైనా తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేసినప్పుడు, కావలసిన సమాచారంతో పాటు యాడ్స్ కూడా కనిపిస్తాయి. ఈ ప్రకటలను ఇచ్చే కంపెనీలు గూగుల్కు డబ్బు చెల్లిస్తాయి. దీంతో పాటు గూగుల్ క్లౌడ్ వంటి సేవలను అందిస్తుంది. వీటిని ఉపయోగించుకోవడానికి కూడా యూజర్లు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.గూగుల్ యూట్యూబ్, ప్లే స్టోర్, మ్యాప్స్ వంటి సేవల ద్వారా భారీగానే డబ్బు సంపాదిస్తుంది. ఇలా గూగుల్ ఒక్క సెకనుకు ఏకంగా 333333.33 రూపాయలు, నిమిషానికి రూ. 2 కోట్లు సంపాదిస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన గూగుల్ రోజుకు, నెలకు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించుకోవచ్చు. -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ సెర్చ్తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్లో చాట్జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
పారిస్ ఒలింపిక్స్ 2024.. గూగుల్ ప్రత్యేక డూడుల్!
పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ను డిజైన్ చేసింది. యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే ఒలింపిక్ 2024కి సంబంధించిన తాజా అప్డేట్లు వచ్చేలా పేజీ సిద్ధం చేశారు. నదిలో జీవులు సేదతీరుతున్నట్లు ఈ డూడుల్ను ఏర్పాటు చేశారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్లు ఉన్నపుడు గూగుల్ వాటిని తెలియజేసేలా సృజనాత్మకంగా డూడుల్లను రూపొందిస్తోంది. జులై 26న పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం అవుతుండడంతో ఈ ఈవెంట్ను తెలియజేసేలా డూడుల్ను సిద్ధం చేసింది. పారిస్ వెంబడి ప్రవహించే ‘సీన్ నది’ని తలపిస్తూ ఐదు ఖండాల క్రీడాకారులను రిప్రజెంట్ చేసేలా వివిధ జీవులతో డూడుల్ను రూపొందించింది. ప్రస్తుతం పారిస్లో వేసవికాలం ఉండడంతో అవి నదిలో సేదతీరుతున్నట్లు ఈ డూడుల్లో చూడవచ్చు.పారిస్ ఒలింపిక్ 2024 ప్రారంభ వేడుకలకు రెండు రోజుల ముందే జులై 24న ఆర్చరీ, సాకర్, హ్యాండ్బాల్, రగ్బీలో ప్రాథమిక రౌండ్ను మొదలుపెట్టారు. 69 ఈవెంట్లలో 117 మంది భారతీయ పోటీదారులు 95 పతకాల కోసం పోటీపడబోతున్నారు. ఇందులో 70 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారు. పారిస్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారుల్లో జావెలిన్థ్రో స్టార్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్లు పీజీ సింధు, సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను వంటి ప్రముఖ క్రీడాకారులున్నారు.ఇదీ చదవండి: ఒలింపిక్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నికైన నీతా అంబానీఒలింపిక్ 2024 ప్రారంభ వేడుక తర్వాత జులై 27న శనివారం న్యూజిలాండ్తో భారత పురుషుల హాకీ జట్టు పోటీపడనుంది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్లు కూడా అదే రోజున జరుగుతాయి. ఈ ఈవెంట్స్ స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్వర్క్తో అనుసంధానం కలిగిన ఛానల్స్తో పాటు, జియో సినిమా యాప్లో ప్రసారం చేస్తున్నారు. -
గూగుల్ ‘మ్యాప్’ వార్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఓలా మ్యాప్స్ నుంచి పోటీ తీవ్రతరం కావడంతో గూగుల్ జోరు పెంచింది. భారత్లో యూజర్లను ఆకట్టుకోవడం కోసం గురువారం పలు సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్లతో పాటు కారు డ్రైవర్లు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా ఏఐ ఆధారిత రూటింగ్ సమాచారం వంటివి ఇందులో ఉన్నాయి. ఓలా ఫౌండర్, సీఈఓ భవీశ్ అగర్వాల్ దేశీ డెవలపర్ల కోసం ఓలా మ్యాప్స్ను అందుబాటులోకి తీసుకొచి్చన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, గూగుల్ మ్యాప్స్ను వాడొద్దని కూడా ఆయన పిలుపునివ్వడంతో మ్యాప్స్ వార్కు తెరలేచింది. దేశీ డెవలపర్లకు గాలం వేయడానికి ఏడాది పాటు ఓలా మ్యాప్స్ను ఉచితంగా వాడుకునే సదుపాయాన్ని కూడా అగర్వాల్ ప్రకటించడం విశేషం. దీంతో గూగుల్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. గూగుల్ మ్యాప్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించే డెవలపర్లకు ఆగస్ట్ 1 నుంచి 70 శాతం వరకు ఫీజులను తగ్గిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీ యూజర్లకు మేలు చేసేందుకే... ఓలా పోటీ కారణంగానే ధరల కోత ప్రకటించాల్సి వచి్చందా అన్న ప్రశ్నకు గూగుల్ మ్యాప్స్ వైస్ ప్రెసిడెంట్, జీఎం మిరియమ్ డేనియల్ స్పందిస్తూ... వాస్తవానికి పోటీ సంస్థలపై మేము దృష్టి సారించమని, తమ యూజర్లు, డెవలపర్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘మా పార్ట్నర్స్ చాన్నాళ్లుగా ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మా యూజర్లతో పాటు డెవలపర్లకు మేలు చేయడంపై దృష్టి సారించాం. అందులో భాగంగానే రేట్ల కోతను ప్రకటించాం. వ్యాపార సంస్థలు, డెవలపర్లు, ప్రజలకు డిజిటల్ మ్యాపింగ్ను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దడం కోసమే ఏఐ ఆధారిత రూటింగ్ తదితర కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టాం’ అని వివరించారు. భారత్లో ఇరుకు రోడ్లు అనేవి కారు డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతుంటాయని, అందుకే వాటిని తప్పించుకునే విధంగా ఏఐ ఆధారిత రూటింగ్ ఆల్గారిథమ్ వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూతో పాటు భవనాల మధ్య దూరం, రోడ్ల రకాల వంటి సమాచారంతో రోడ్ల కచి్చతమైన వెడల్పును మ్యాప్స్లో చూడొచ్చని, తద్వారా సాధ్యమైనంత వరకు ఇరుకు సందుల్లో చిక్కుకోకుండా తప్పించుకునేందుకు వీలవుతుందని బ్లాగ్ పోస్ట్లో వివరించారు. మరోపక్క, బైకర్లు, పాదచారులు, ఇతర ప్రయాణికులు ఇప్పుడు ఈ ఇరుకు రోడ్లలో మరింత సురక్షితంగా, నమ్మకంగా వెళ్లొచ్చని చెప్పారు. అలాగే సంబంధిత రూట్లో ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు ఉన్నాయో కూడా ముందుగానే తెలియజేసే ఫీచర్ కూడా భారత్లో యూజర్లకు చాలా బాగా ఉపయోగపడుతుందన్నారు.ముందుగా ఎనిమిది నగరాల్లో... హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి మొత్తం 8 నగరాల్లో ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ పరికరాల్లో ఈ వారంలోనే అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాలతో పాటు ఐఓఎస్, కార్ప్లే సపోర్ట్ను కూడా త్వరలో తీసుకొస్తామని గూగుల్ పేర్కొంది. టూవీలర్ ఈవీ యూజర్లు చార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేందుకు ఎలక్ట్రిక్ పే, అథర్, కాజామ్, స్టాటిక్ వంటి దిగ్గజ చార్జింగ్ ప్రొవైడర్లతో గూగుల్ జట్టు కట్టింది. తద్వారా 8,000 చార్జింగ్ స్టేషన్ల సమాచారం దేశీయంగా గూగుల్ మ్యాప్స్తో పాటు గూగుల్ సెర్చ్లో కూడా లభిస్తుంది. కాగా, ఈ ఫీచర్ను తొలిసారిగా భారత్లోనే ప్రవేశపెట్టడం గమనార్హం. -
రూ.2 లక్షల కోట్ల గూగుల్ ఆఫర్.. తిరస్కరించిన విజ్
సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ 'విజ్' (Wiz)ను కొనుగోలు చేయడానికి గూగుల్ 23 మిలియన్ డాలర్లు (రూ. 2 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఈ భారీ ఆఫర్ను విజ్ సున్నితంగా తిరస్కరించింది. ఈ ఆఫర్ను తిరస్కరించడానికి గల కారణాన్ని కంపెనీ కో ఫౌండర్ 'అసాఫ్ రాపాపోర్ట్' మెమోలో వెల్లడించారు.గూగుల్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్ను తిరస్కరించడం కష్టమే.. కానీ కంపెనీ ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం, యాన్యువల్ రికావరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లను సాధించాలని విజ్ కో-ఫౌండర్ అసాఫ్ రాపాపోర్ట్ మెమోలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ డీల్ గురించి గూగుల్ కంపెనీగానీ, విజ్ గానీ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.విజ్ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియా, ఇజ్రాయెల్ దేశాల్లో 900 కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మోర్గాన్ స్టాన్లీ, డాక్యుసైన్తో సహా ప్రముఖ క్లయింట్లను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. ఈ కంపెనీ ప్రస్తుతం ఫార్చ్యూన్ 100 కంపెనీలలో 40 శాతం వాటాను కలిగి ఉంది. -
దొంగలించి పడ్డ మీఫోన్ ఎలా గుర్తించాలి...!
-
వ్యవసాయం కోసం ఏఐ టూల్.. అధిక దిగుబడికి సరికొత్త మార్గం!
గూగుల్ ఎప్పటికప్పుడు యూజర్లకు అవసరమైన ఫీచర్స్ అందించడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రైతులకు వ్యవసాయ సమాచారాన్ని అందించడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి గూగుల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ అండర్స్టాండింగ్ (ALU) టూల్ పరిచయం చేయనుంది.అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ అండర్స్టాండింగ్ టూల్ అనేది.. పంట రకం, పొలం పరిమాణం (ఫీల్డ్ సైజ్), నీటి లభ్యత, మార్కెట్లకు సంబంధించిన అనేక వివరాలను అందిస్తుంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి దేశాలు వ్యవసాయంలో ఏఐను ఉపయోగిస్తున్నారు. భారత్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి సిద్దమవుతోంది.రైతులు సకాలంలో పంటలు పండించడానికి, మంచి దిగుబడిని పొందడానికి నేల నాణ్యతను, వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి రైతుల కోసం ఆరా తీసేందుకు ప్రభుత్వం కిసాన్-ఈ-మిత్ర, ఏఐ పవర్డ్ చాట్బాట్ని వివిధ భాషల్లో ప్రవేశపెట్టింది.భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, అయితే టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో కూడా పంట దిగుబడి తగ్గుతోంది. ఎక్కువ దిగుబడి పొందటానికి రాతులకు టెక్నాలజీ కూడా ఉపయోగపడాలి. అప్పుడే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి ఏఐ చాలా ఉపయోగపడుతుంది. -
మరిన్ని భాషల్లో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్
గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చింది. గతంలో కేవలం 13 భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 21కి చేరింది. ఇంతకీ ఇప్పుడు అందుబాటులో ఉన్న భాషలు ఏవి, అందులో భారతీయ భాషలు ఎన్ని అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో కొత్తగా చేరిన భాషలు మొత్తం ఎనిమిది. అవి అరబిక్, గుజరాతీ, కొరియన్, పర్షియన్, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్. ఇప్పటికే 13 భాషల్లో ఇది వినియోగంలో ఉంది. దీంతో మొత్తం భాషలు 21కి చేరాయి. అంటే గూగుల్ సెర్చ్ ఫలితాలు అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియా, కన్నడ, కొరియన్, మలయాళం, మరాఠీ, పర్షియన్, పోర్చుగీస్, స్పానిష్, తమిళం, తెలుగు, థాయ్, టర్కిష్, ఉర్దూ, వియత్నామీస్ భాషల్లో కూడా పొందవచ్చు.ఈ మొత్తం 21 భాషల్లో భారతీయ భాషలు.. బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ. సెర్చ్ రిజల్ట్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల మరింత మంది యూజర్స్ దీన్ని ఉపయోగించే అవకాశం ఉంది. -
ఇడియెట్ సిండ్రోమ్ అంటే ఏంటి? మీకూ ఉందేమో చెక్ చేసుకోండి!
గూగుల్ చేసి చూడకు. రాసిచ్చిన మందులు వాడు’ అని డాక్టర్ పేషెంట్తో చెప్పాల్సి వస్తోంది. కారణం -ప్రిస్కిప్షన్ తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఆ మందులను గూగుల్ చేసి వాటి గుణాలు, సైడ్ ఎఫెక్ట్లు, వాటిని ఏయే జబ్బులకు వాడతారు అన్నీ పేషెంట్ తెలుసుకోవడమే. తెలుసుకున్న తర్వాత ఎన్నో డౌటానుమానాలు తెచ్చుకొని కొన్ని మందులు వాడకపోవడం, కొన్ని డోస్ తగ్గించమనడం ఇలా చేస్తూ ఆరోగ్యానికి హాని చేసుకుంటున్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేసే స్వభావానికి ‘ఇడియట్ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. కొన్ని నెలల క్రితం ఒక యువతి కిడ్నీలు ఫెయిలయ్యే స్థితిలో హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు మందులు పని చేయని స్థితిని గమనించారు. కారణం ఆమె యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పినప్పుడల్లా తండ్రి ఇంటర్నెట్లో చూసి మందులు తెచ్చి వాడటమే. అతను డాక్టర్ని కలవాలనుకోలేదు. డాక్టర్ కంటే గూగుల్ని నమ్మాడు. ఇలా చేయడం వల్ల ప్రాణాంతకమైతే తిరిగి డాక్టరే రక్షించాల్సి వచ్చింది గూగుల్ కాదు.డాక్టర్కు తెలుసు డాక్టర్లు తమ డాక్టర్ పట్టా కోసం ఐదేళ్లు చదువుతారు. ఆ తర్వాత తర్ఫీదు అవుతారు. ఆ తర్వాత ప్రాక్టీసు మొదలెడతారు. దేహ గుణాలు, మందు గుణాలు పేషెంట్ను బట్టి జబ్బును బట్టి తమ అనుభవం కొద్దీ రాస్తారు. పేషెంట్ను కాపాడటమే డాక్టర్ లక్ష్యం. గతంలో డాక్టర్ రాసింది పేషెంట్లు నమ్మకంగా ఫాలో అయ్యేవారు. మహా అయితే మందుల షాపువాణ్ణి ఈ మందులు మంచివేనా అని అడుగుతారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. విస్తృతంగా వచ్చిన ఇంటర్నెట్ వల్ల ప్రతి దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం, ప్రతి దాన్నీ సందేహించే స్వభావం ఏర్పడ్డాయి. డాక్టర్ రాసిన మందులను తమ ఇష్టానుసారం మార్చు కుంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ చదివి బెంబేలు పడి కొన్ని వాడటమే లేదు. పైగా మందుచీటిని తిరిగి తీసుకొచ్చి ప్రశ్నలతో వేధిస్తున్నారు. పేషెంట్ల ఇలాంటి రుగ్మతకు డాక్టర్లు పెట్టిన పేరే ‘ఇడియట్ సిండ్రోమ్’!శంక వద్దంటున్నారుఇటీవల సీఎస్ మంజునాథ్ అనే వైద్యుడు ‘మీ గూగుల్ పరిజ్ఞానంతో అయోమయానికి గురై... నా మెడికల్ డిగ్రీని శంకించకండి’ అంటూ బోర్డు పెట్టుకున్న దృశ్యం వైరల్ అయ్యింది. ఆయన దగ్గరే కాదు... ఈ తరహా బోర్డులు మరెన్నో ఆసుపత్రుల్లో కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో వంటలూ, వార్పులూ, కామెడీ ఎంత చూసినా పర్లేదు. కానీ వ్యాధులూ, వైద్యాలు చూస్తూ తమ జబ్బులతో తామే పేషెంట్లు చెలగాటాలాడుతున్నారని డాక్టర్ల ఆవేదన. ‘ఈ మందును ఎక్కువ వాడితే సైడ్ఎఫెక్ట్స్ వస్తాయట’ అంటూ డాక్టర్లకే వైద్యం నేర్పుతున్నారు. ‘పానీపూరీ, ఫాస్ట్ఫుడ్డూ తినేప్పుడు ఇలాగే సైడ్ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారా’ అంటూ డాక్టర్లు చీవాట్లు పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. నిజానికి ‘పేషెంట్’ అనే మాటకు ‘రోగి’ అన్న పదం అంత గౌరవప్రదంగా లేదంటూ ‘బాధితుడు’ అని వాడటం పరిపాటి అయ్యింది. ఇడియెట్ సిండ్రోమ్ వల్ల పేషెంట్ల చేతిలో డాక్టర్లు బాధితులవుతున్నారనేది వైద్యుల ఆవేదన.నెట్ జ్ఞానం సరికాదు...‘ఇడియట్ సిండ్రోమ్’తో రోగులు వైద్యుల్ని ప్రశ్నించడం, సొంతవైద్యం చేసుకోవడం సరికాదు. ఇంటర్నెట్ సమాచారంతో వ్యాధి నిర్ధారణ సమంజసం కాదు. నెట్ చూసి మందులు వాడితే ఒక్కోసారి ప్రాణాలమీదికి రావచ్చు. వైద్యాన్ని వైద్యుడు తన పరిజ్ఞానంతో, అనుభవంతో, నైపుణ్యంతో వ్యాధి నిర్ధారణ చేసి, ఏయే మందులు ఏయే మోతాదులో వాడాలో నిర్ణయిస్తాడు. గూగుల్ సమాచారంతో ఎవరికి వారు నిర్ధారణలూ, మందుల నిర్ణయాలూ సరికాదని తెలుసుకోవాలి.- డాక్టర్ పావనీ ప్రియాంక కార్యదర్శి, ఐఎంఏ, తెనాలి డాక్టర్ షాపింగ్వాస్తవానికి వ్యాధి ఏమిటనేది అనుభవంతో కూడిన వైద్యులు, ఎన్నో కోణాల నుంచి పరిశోధన, ఎన్నో పరీక్షలు చేశాక నిర్థారణ చేస్తారు. తర్వాత తగిన మోతాదులో మందులిస్తారు. అప్పుడు ‘ఈ ఫలానా ఇంజెక్షనే ఎందుకు? దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్ ఉందిగా’ అంటూ అడుగుతున్న పేషెంట్లు... అంతటితో ఆగకుండా... ఆ డాక్టర్ను వదిలి మరో డాక్టర్ దగ్గరికి మరో ఒపినీయన్, ఇంకో ఒపీనియన్ అంటూ తిరుగుతున్నారు. ఇలా తిరగడాన్నే వైద్య పరిభాషలో ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. దీని తర్వాత సొంతంగా మందుల్ని కొని వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న దాఖలాలూ ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఇటీవల ఓ భర్త ఇంటర్నెట్ చూస్తూ పురుడు పోస్తూ తన భార్య మరణానికి కారణమయ్యాడు. అందుకే ‘ఇడియట్ సిండ్రోమ్’ ధోరణి వద్దంటున్నారు. – బి.ఎల్. నారాయణ, సాక్షి, తెనాలి. -
Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్..
వీలైనన్ని చోట్ల ఏఐ ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది గూగుల్. గూగుల్ జెమిని యాప్స్, మోడల్స్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని..హెల్ప్ మీ రైట్: రాసేటప్పుడు కొన్నిచోట్ల ఏం రాయలో తెలియక స్ట్రక్ అవుతుంటాం. ఇలాంటి సందర్భంలో రచన ముందుకు సాగడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఏఐ టెక్ట్స్ను జెనరేట్ చేస్తుంది.ఏఐ వాల్పేపర్ అండ్ బ్యాక్గ్రౌండ్స్: ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు కొత్త వాల్పేపర్, బ్యాక్స్గ్రౌండ్స్కు ఉపయోగపడే ఏఐ ఫీచర్ ఇది. ఉదా: ఏ క్యాబిన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఏ పీస్ఫుల్ మెడో.మ్యాజిక్ ఎడిటర్: గూగుల్ ఫొటోస్లోని మ్యాజిక్ ఎడిటర్ ఇప్పుడు క్రోమ్ బుక్లో కూడా అందుబాటులో ఉంది. చిత్రంలోని వ్యక్తులు, వస్తువులను మూవ్ చేయడానికి, పూర్తిగా తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: Jasleen Royal: ఒకే సమయంలో.. ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేసి.. వావ్! -
ఆహా నా డ్రెస్ అంటా.... ఏఐ డ్రెస్ అంటా...
గూగుల్ సాప్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ సృష్టించిన ‘వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డ్రెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోబోటిక్ మిదాస్ డ్రెస్ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఈ బ్లాక్ డ్రెస్లో ఎన్నో రోబోటిక్ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్కు ‘ఎక్స్ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్’ అని పెదవి విరిచారు. -
గూగుల్ మ్యాప్స్లో ఏఐ.. ఎలా పనిచేస్తుందంటే..?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో న్యావిగేషన్ చాలా సులభమైపోయింది. ఇది (న్యావిగేషన్) కేవలం స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా బైకులు, కార్లలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో కొత్త ప్రాంతాలకులు వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఆన్ చేసి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. దీనికి ఏఐ తోడైతే.. యూజర్ మరింత గొప్ప అనుభూతిని పొందవచ్చు. ఈ కథనంలో ఏఐ బేస్డ్ గూగుల్ మ్యాప్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.మరింత వివరంగా సెర్చ్ చేసేలా..సాధారణంగా గూగుల్ మ్యాప్ అనగానే ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దారి చూపిస్తుందని తెలుసు. కానీ కొత్త ఏఐ ఆధారిత కన్వర్జేషనల్ సెర్చ్ ద్వారా మరింత వివరణాత్మకమైన శోధన సాధ్యమవుతుంది. మనం వెళ్లాల్సిన ప్రాంత్రాలను టెక్ట్స్, వాయిస్ రూపంలో అందిస్తే ఏఐ సహాయంతో లోకేషన్ను చూపిస్తుంది. పిల్లలకు ఇష్టమైన ప్రదేశాలు ఎక్కడున్నాయి, సమీపంలోని క్రీడా ప్రదేశాలు ఏవి అనే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.3డీ వ్యూఈ రకమైన గూగుల్ మ్యాప్ సాయంతో 3డీ నమూనాలతో ఏదైనా స్థానాన్ని (ప్లేస్) కనుక్కోవచ్చు. ఇందులో లైవ్ ట్రాకింగ్, వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ వంటి వాటిని తెలుసుకోవచ్చు. కొత్త ప్రదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ 3డీ వ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది.లైవ్ వ్యూగూగుల్ మ్యాప్ లైవ్ వ్యూ ఫీచర్ ద్వారా ఏటీఎమ్, రెస్టారెంట్లు, పార్కులు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వంటివి కూడా కనుగొనవచ్చు. కెమెరా ఆన్ చేసిన తరువాత సమీపంలో ఉన్న ఈ స్థలాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అవి ఎంతసేపు అందుబాటులో ఉంటాయి (పని గంటలు), రేటింగ్ ఏంటి అనే వివరాలు కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు.ఫోటోల ద్వారా సెర్చ్ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్ ద్వారా ప్రదేశాలను సెర్చ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సెర్చ్ విత్ ఫోటోస్ ద్వారా ప్రదేశాలను తెలుసుకోవచ్చు. ఇందులో మీరు ఎక్కువ ఫోటోలను ఉపయోగించి ప్రదేశాలను కనుగొనవచ్చు. అయితే ఒక ల్యాండ్మార్క్ కనుక్కోవడానికి ఈ ఫీచర్ చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది.మ్యాప్స్లో లెన్స్ ఉపయోగించడంసమీపంలోని ఏటీఎమ్, రెస్టారెంట్లు, కాఫీ షాపులు, స్టోర్ల వద్ద మీ కెమెరాను చూపడం ద్వారా లొకేషన్ గురించి వివరణాత్మక సమాచారాన్ని కనుగొనవచ్చు. ఈ ఫీచర్ కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి.. వాటి గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోకరంగా ఉంటుంది. -
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!) -
గూగుల్ ట్రాన్స్లేట్లో మరో 110 కొత్త భాషలు
ఏదైన ఒక భాష నుంచి మరో భాషకు అనువాదం (ట్రాన్స్లేట్) చేయాలంటే అందరికి గూగుల్ ట్రాన్సలేట్ గుర్తొస్తుంది. ఇప్పటికే సుమారు 243 భాషలకు సపోర్ట్ చేస్తున్న గూగుల్ ట్రాన్స్లేట్ ఇప్పుడు మరో 110 భాషలకు సపోర్ట్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ కొత్త భాషలను విస్తరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నట్లు గూగుల్ తెలిపింది.2006లో ప్రారంభమైన గూగుల్ ట్రాన్స్లేట్ 2022లో జీరో-షాట్ మెషిన్ అనువాదాన్ని ఉపయోగించి 24 కొత్త భాషలను జోడించింది. కాగా 2024 జూన్ నాటికి 243 భాషలల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1000 భాషలకు మద్దతు ఇచ్చే AI మోడల్లను రూపొందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచ జనాభాలో ఎనిమిది శాతం మందికి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని 100 మిలియన్లకు పైగా మాట్లాడే ప్రధాన భాషలు, మరికొన్ని స్థానిక ప్రజల చిన్న భాషలు ఉన్నాయి. తాజాగా గూగుల్ యాడ్ చేసిన కొత్త భాషల జాబితాలో ఫాన్, లువో, గా, కికోంగో, స్వాతి, వెండా, వోల్ఫ్ వంటి మరిన్ని ఆఫ్రికన్ భాషలతో పాటు అవధి, బోడో, ఖాసి, కోక్బోరోక్, మార్వాడీ, సంతాలి, తుళు వంటి ఏడు భారతీయ భాషలు ఉన్నట్లు తెలుస్తోంది. -
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
భారత్లో గూగుల్ ‘జెమిని’ యాప్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్ ‘జెమిని’ ఆండ్రాయిడ్ యాప్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టెక్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. ఐఫోన్ యూజర్ల కోసం గూగుల్ యాప్ ద్వారా మరికొన్ని వారాల్లో జెమిని యాప్ను ప్రవేశపెడతామని పేర్కొంది. భారత్లో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు వివిధ వర్గాల వారు ఉత్పాదకతను పెంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, సృజనాత్మకతను మెరుగుపర్చుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారని జెమిని ఎక్స్పీరియన్సెస్ వైస్ ప్రెసిడెంట్ అమర్ సుబ్రమణ్య ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపారు. తాజాగా గూగుల్కి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జెమిని 1.5 ప్రో ఫీచర్లు కూడా భారత్లోని యూజర్లకు అందుబాటులో ఉంటాయని వివరించారు. -
భారత్లో గూగుల్ జెమిని లాంచ్ - తొమ్మిది భాషల్లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న తరుణంలో గూగుల్ తన AI అసిస్టెంట్ 'జెమినీ' మొబైల్ యాప్ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్ ఇప్పుడు భారతదేశంలో ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.గూగుల్ జెమినీ యాప్లో తనకు కావాల్సిన అంశం గురించి సెర్చ్ చేయవచ్చు లేదా వాయిస్ అసిస్టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇది చదువుకొని వారికి కూడా ఉపయోగపడుతుంది. మొత్తం 9 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారుడు స్థానిక భాషలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.మేము స్థానిక భాషలను జెమిని అడ్వాన్స్డ్కి జోడించడంతోపాటు ఇతర కొత్త ఫీచర్లను రానున్న రోజుల్లో తీసుకువస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమై ఉందని, త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.Exciting news! 🇮🇳 Today, we're launching the Gemini mobile app in India, available in English and 9 Indian languages. We’re also adding these local languages to Gemini Advanced, plus other new features, and launching Gemini in Google Messages in English. https://t.co/mkdSPZN5lE— Sundar Pichai (@sundarpichai) June 18, 2024 -
యూట్యూబ్లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్
భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్ఇంజిన్ కంపెనీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్ పిచాయ్(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్పిచాయ్గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్గా పనిచేసేవారు. సుందర్ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.చదువుపూర్తయ్యాక అప్లైడ్మెటీరియల్స్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టింగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ టూల్బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ వంటి ఇతర అప్లికేషన్ల అభివృద్ధిని పర్యవేక్షించారు.మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్ గూగుల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్తో గౌరవించింది. 2019 డిసెంబర్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!టెన్షన్ పడిన సీఈఓ..సుందర్ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్పుర్లో బీటెక్ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్పుర్ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్ చేసేటప్పుడు నా టెన్షన్ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్, యాహూ, ట్విటర్ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్ దంపతులకు కావ్య పిచాయ్, కిరణ్ పిచాయ్ ఇద్దరు పిల్లలు. -
చిలుకూరు ఆలయంపై తప్పుడు ప్రచారం
-
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
Tech Talk: గూగుల్ 'ఆస్క్ ఫొటోస్' తో.. ఈ వెతుకులాటకి చెక్!
టెక్ దిగ్గజం గూగుల్ రకరకాల కొత్త ఫీచర్ల గురించి ప్రకటించింది. అందులో ‘ఆస్క్ ఫొటోస్’ ఒకటి. అడ్వాన్స్డ్ జెమిని ఏఐ మోడల్తో వస్తున్న ఈ ఫీచర్ను యూజర్లు తమ ఫొటో కలెక్షన్స్తో ఇంటరాక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. యూజర్లు తమ గ్యాలరీని విస్తరించినప్పుడు వారికి అవసరమైన ఫొటోను కనుక్కోవడం కష్టంగా ఉండవచ్చు.దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్ ఫొటోను త్వరగా కనిపెట్టడానికి ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కీవర్డ్ కాంబినేషన్స్తో పనిలేదు. ప్రాంప్ట్ చాలు. ఉదాహరణకు... ‘షో మీ ది బెస్ట్ ఫొటో ఫ్రమ్ ఈచ్ నేషనల్ పార్క్ ఐ హ్యావ్ విజిటెడ్’ అని ప్రాంప్ట్ ఇస్తే సంబంధిత ఇమేజ్లను చూపిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.... యూజర్లు తమ ఫొటోల గురించి వివరంగా అడగవచ్చు.హువావే వాచ్ ఫిట్ 3డిస్ప్లే: 1.82 అంగుళాలురిజల్యూషన్: 480“408 పిక్సెల్స్బరువు: 26 గ్రా బ్యాటరీ: 400 ఎంఏహెచ్- ఆటోమెటిక్ప్రాంప్ట్స్ – ట్రాక్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, వెదర్ వార్నింగ్స్ డిస్ప్లేఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కు సంగీతం..ఇన్స్టాగ్రామ్ప్రొఫైల్కు పర్సనలైజ్డ్ టచ్ ఇవ్వడానికి, మ్యూజిక్ ద్వారా మన మూడ్ను రెఫ్లెక్ట్ చేయడానికి ఉపకరించే లేటెస్ట్ ఫీచర్ ఇది. దీని కోసం...– ఇన్స్టాగ్రామ్ యాప్ను అప్డేట్ చేయాలి– ప్రొఫైల్ స్క్రీన్తో యాక్సెస్ కావడానికి బాటమ్ రైట్ కార్నర్లోనిప్రొఫైల్ పిక్చర్ ట్యాప్ చేయాలి– ఎడిట్ప్రొఫైల్–ట్యాప్– మ్యూజిక్–ట్యాప్– పాటను ఎంపిక చేసుకోవడానికి ప్రొఫైల్ సాంగ్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి.షావోమీ ప్యాడ్ 6ఎస్ ప్రో 12.4..డిస్ప్లే: 12.40 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీబ్యాటరీ: 10000 ఎంఏహెచ్ రిఫ్రెష్ రేట్: 144 హెచ్జడ్మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 256జీబి 12జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్డ్రీమ్ స్క్రీన్..‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్తఫీచర్ని పరీక్షిస్తోంది యూట్యూబ్. ఏఐ ద్వారా ‘షార్ట్స్’కు బ్యాక్డ్రాప్ను జెనరేట్ చేసే ఫీచర్ ఇది. యూజర్లు డ్రీమ్ స్క్రీన్కు యాక్సెస్ ΄÷ందిన తరువాత బ్యాక్గ్రౌండ్లో తమకు ఏమి కావాలో వివరిస్తూప్రాంప్ట్ ఇవ్వవచ్చు.ఉదా: ఒక ద్వీపంలో ఫ్యాన్సీ హోటల్. ఇమేజ్ జనరేట్ అయిన తరువాత వెంటనే బ్యాక్గ్రౌండ్కు జత చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ‘షార్ట్స్’ క్రియేటర్స్ మాత్రమే అందుబాటులో ఉంది.ఇవి చదవండి: Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్లో ఉంటాయి’ -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్గా గూగుల్లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
గూగుల్ మ్యాజిక్ ఎడిటర్.. గురించి ఎప్పుడైనా విన్నారా!
పాత పిక్సెల్ ఫోన్లకు ‘మ్యాజిక్ ఎడిటర్’ను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ‘మ్యాజిక్ ఎడిటర్’లో రకరకాల ఇమేజ్ ఎడిటింగ్, ఎన్హాన్స్మెంట్ టూల్స్ ఉంటాయి. ఫొటో రిసైజ్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి, యూనిక్ ఫిల్టర్లను అప్లై చేయడానికి మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగపడుతుంది.కొత్త ఫ్రీ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్లు ప్రస్తుతం కొన్ని పిక్సెల్స్ 7, పిక్సెల్స్ 6 సిరీస్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. ‘మ్యాజిక్ ఎడిటర్’తోపాటు ఫొటోఅన్బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, పోట్రాయిట్ లైట్లాంటి ఏఐ–పవర్డ్ ఫొటో–ఎడిటింగ్ ఫీచర్లు అన్ని ఆండ్రాయిడ్ డివైజ్లకు అందుబాటులోకి రానున్నాయి.యాపిల్ ఐపాడ్ ప్రో 11బాడీ: 249.7“177.5“5.3 ఎంఎం; బరువు: 466 గ్రా.; డిస్ప్లే: 11.00 వోఎస్/సాఫ్ట్వేర్: ఐపాడ్వోఎస్ 17.5; రిజల్యూషన్: 1668“2420; బ్యాటరీ: 7,606 ఎంఏహెచ్; మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్/ 1టీబి 16జీబి ర్యామ్/ 2టీబి 16జీబి ర్యామ్పోకో ఎఫ్ 6..సైజ్: 6.67 అంగుళాలు రిజల్యూషన్: 1220“2712 పిక్సెల్స్బరువు: 179 గ్రా; బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ఇంటర్నల్: 256జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్ కలర్స్: బ్లాక్, గ్రీన్, టైటానియంఇవి చదవండి: సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే! -
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
బెంగళూరులో ఇటీవల లీజుకు తీసుకున్న ఆఫీస్ స్థలానికి గూగుల్ ఏకంగా నెలకు రూ.4కోట్లు అద్దె చెల్లించనుంది.మీడియా సంస్థల కథనం ప్రకారం..బెంగళూరు వైట్ఫీల్డ్లోని అలెంబిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ ఇటీవల లీజుకు తీసుకుంది. చదరపు అడుగుకు రూ.62 నెలవారీ అద్దె రేటుతో కార్యాలయాన్ని మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్తో ఒప్పందం చేసుకుంది. దాంతో మొత్తం ఆఫీస్ స్థలానికి రూ.4,02,38,000 నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంది.గూగుల్ కనెక్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల హైదరాబాద్లో 6లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజును పునరుద్ధరించింది. 2020 నుంచి భారత్లో గూగుల్ ఆఫీస్ స్పేస్ పోర్ట్ఫోలియోను 3.5 మిలియన్ చదరపు అడుగుల మేర పెంచింది. దాంతో మొత్తం దేశంలోని ఐదు నగరాల్లో 9.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్స్పేస్ను కలిగి ఉంది.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’గూగుల్ తన ఉత్పత్తులను భారత్లో తయారు చేయాలని భావిస్తోంది. దాంతో స్థానికంగా మరింత విస్తరిస్తోంది. తమిళనాడులోని ఫాక్స్కాన్ ఫెసిలిటీలో స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని, ఇతర రాష్ట్రాల్లో డ్రోన్ తయారీని ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. గతేడాది జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్లో ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
టెక్నలాజి పెరుగుతున్న తరుణంలో యూజర్లకు కూడా.. కొత్త ఫీచర్స్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల ప్రారంభంలో గూగుల్ ఏఐ సెర్చింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలను అందిస్తోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ కొత్త ఫీచర్ యూజర్లను తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. ఒక యూజర్ రోజుకు ఎన్ని రాళ్లు తినాలి అని అడిగితే.. రాళ్ళల్లో మినరల్స్ ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినండి అని సమాధానం ఇచ్చింది.మరో యూజర్ పిజ్జా మీద చీజ్ నిలబడలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు.. గ్లూ (గమ్) వేసుకోండి అని.. సింపుల్గా సమాధానం ఇచ్చింది. ఇంకొకరు ఎంత మంది ముస్లింలు యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడయ్యారు అని గూగుల్ ఏఐని అడిగినప్పుడు.. యునైటెడ్ స్టేట్స్లో ఒక ముస్లిం అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పేరు బరాక్ హుస్సేన్ ఒబామా అని సమాధానం ఇచ్చింది.గూగుల్ ఇచ్చిన సమాధానాలను యూజర్లు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. గూగుల్ ఏఐను విమర్శిస్తున్నారు.Google AI is diabolical 💀 pic.twitter.com/YDw34414TO— no context memes (@weirddalle) May 24, 2024 -
సంచలన నివేదికలు.. మరోసారి తెరపైకి షానన్ - మస్క్ సాన్నిహిత్యం
టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాజీ భార్య కోల్ షానన్కు, మస్క్కు సాన్నిహిత్యం ఉందని.. ఆ కారణంగానే సెర్గీ, నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.సెర్గీబ్రిన్, ఎలోన్ మస్క్ ఒకప్పుడు ప్రాణస్నేహితులు. కాబట్టే మస్క్ ఎదుర్కొన్న అనేక ఆర్ధిక ఇబ్బందుల నుంచి సెర్గీబ్రిన్ బయటపడేసినట్లు మీడియా కథనాలు హైలెట్ చేశాయి. అయితే, ఇంతటి ప్రాణ స్నేహితులు విడిపోవడానికి నికోల్ షానన్తో మస్క్కు ఉన్న సాన్నిహిత్యమేనేని నిర్ధారించారు.షానహన్ -సెర్గీ బ్రిన్లు 2018లో వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత కోల్ షానన్కు, మస్క్కు సాన్నిహిత్యం బయటపడడంతో సెర్గీ-నికోల్ దంపతులు విడాకులు తీసుకున్నారు. సెటిల్ మెంట్ కింద నికోల్కు సెర్గీ 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు. ఎనిమిది మంది వ్యక్తులు సాక్షులు ,కీలక డాక్యుమెంట్లను న్యూయార్క్ టైమ్స్ వెలుగులోకి తెచ్చింది. ‘ఏ రన్నింగ్ మేట్స్ హిస్టరీ’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని షానహన్-సెర్గీ బ్రిన్లు ఖండించారు. -
ఈ-కామర్స్ రంగంపై గూగుల్ కన్ను.. ఫ్లిప్కార్ట్లో భారీ పెట్టుబడులు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ భారత్ ఈ-కామర్స్ రంగంపై కన్నేసింది. దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో 350 మిలియన్ డాలర్ల విలువైన మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుందని సమాచారం. ఫ్లిప్కార్ట్ విలువ 37 బిలియన్ డాలర్లు.అయితే ఈ కొనుగోలుపై గూగుల్,ఫ్లిప్కార్ట్ స్పందించలేదు. కానీ వాటా కొనుగోలుపై రెగ్యులరేటరీ నుంచి ఆ రెండు సంస్థలు అనుమతులు తీసుకున్నాయంటూ జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.గూగుల్ తన పెట్టుబడితో ఫ్లిప్కార్ట్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు, దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించేందుకు, డిజిటల్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంలో సహాయపడతాయి అని ఫ్లిప్కార్ట్ తెలిపింది.రీసెర్చ్ సంస్థ రెడ్ సీర్ అంచనాల ప్రకారం.. భారతదేశ ఈ-కామర్స్ మార్కెట్ 2023లో 60-65 బిలియన్ల నుండి 2030 నాటికి 200-230 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఈ తరుణంలో బడాబడా కంపెనీలు భారత్ ఈ-కామర్స్ రంగంపై దృష్టి సారించాయి. తమ సేవల్ని విస్తరించనున్నాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు, తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా లభ్యంతో ఈకామర్స్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఫలితంగా 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులతో ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు, బ్లింకిట్, మీషో, నైకా వంటి ఇతర సెగ్మెంట్లోని ఈ-కామర్స్ సంస్థల వ్యాపారం జోరుగా సాగుతోంది. -
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ సర్వీస్ (గూగుల్ పే) జూన్ నాలుగు తరువాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్ గతంలోనే వెల్లడించింది.ఇండియా, సింగపూర్ మినహా జూన్ 4 తరువాత గూగుల్ పే సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. దీని స్థానంలో గూగుల్ వాలెట్ వస్తుంది. అమెరికాలో గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఎక్కువమంది ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సేవలు భారత్, సింగపూర్ దేశాల్లో యధివిధాగా కొనసాగుతాయి. కాబట్టి గూగుల్ పే ఉపయోగించే భారతీయ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.అమెరికాలోని గూగుల్ పే యూజర్లను గూగుల్ వాలెట్కి మారాలని కంపెనీ కోరింది. గూగుల్.. తన గూగుల్ వాలెట్ను చేసుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'గూగుల్ పే'ను కంపెనీ సుమారు 180 దేశాల్లో గూగుల్ వాలెట్తో రీప్లేస్ చేసినట్లు సమాచారం. -
ఆండ్రాయిడ్ 15 బీటా 2లోని కొత్త ఫీచర్లు
ఆల్ఫాబెట్ ఇంక్ ఇటీవల నిర్వహించిన గూగుల్ I/O 2024 సదస్సులో ఆండ్రాయిడ్ 15 బీటా 2ను పీచర్లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే పిక్సెల్ మొబైల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పిక్సెల్ ఫోన్ను గూగుల్ ప్రత్యేకంగా తయారుచేస్తోంది. దాంతో కొత్త ఫీచర్లు తమ వినియోగదారులకు ఇప్పటికే అందుబాటులో ఉంచింది.గూగుల్ ప్రకటించిన ఈ ఫీచర్లను త్వరలో ఆండ్రాయిడ్ వాడుతున్న ఇతర కంపెనీ ఫోన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు. డెవలపర్ ప్రివ్యూ లేదా బీటా వెర్షన్లలో పాల్గొంటున్న వారికి ఆటోమేటిక్గా బీటా 2 అప్డేట్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.ఆండ్రాయిడ్ 15 బీటా 2లో కొన్ని ఫీచర్లు..ఆండ్రాయిడ్ 15 బీటా 2లో ప్రైవేట్ స్పేస్ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక ప్రొఫైల్ను క్రియేట్ చేసి కావాల్సిన యాప్లను విడిగా సేవ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ లాక్ చేసినప్పుడు అవి కనిపించవు.ప్రైవేట్ స్పేస్లోని యాప్లన్నీ లాంఛర్లోని ప్రత్యేక కంటైనర్లో ఉంటాయి. రీసెంట్ యాప్స్, నోటిఫికేషన్స్, సెటింగ్స్లోనూ కనిపించవు.ఫీచర్ యాప్ పెయిర్స్ అనే కొత్త ఫీచర్తో స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఒకేసారి రెండు యాప్లను లాంఛ్ చేయొచ్చు. తరచూ ఉపయోగించే యాప్లను వెంటవెంటనే ఓపెన్ చేయొచ్చు.ఇదీ చదవండి: పాలసీదారులను మోసం చేస్తున్న బీమా ప్లాట్ఫామ్లుహెల్త్ కనెక్ట్ ఫీచర్లో స్కిన్ టెంపరేచర్, ట్రైనింగ్ ప్లాన్స్ అనే విభాగాలు చేర్చారు. దాంతో యూజర్లు తమ ఆరోగ్యం, ఫిట్నెస్పై మరింత శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంది. -
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తనకు నచ్చిన ఆహార పదార్ధాల గురించి బహిర్ఘతం చేశారు. నిత్యం ఏఐ, యాప్స్, టెక్నాలజీ అంటూ కంప్యూటర్లతో కుస్తీ పట్టే పిచాయ్ ఓ పాడ్ కాస్ట్లో కాస్త రిలాక్స్ అయ్యారు. పిచాయ్ ఇటీవల యూట్యూబర్ వరుణ్ మయ్య పాడ్కాస్ట్లో దేశంలో ఏఐ ప్రభావం, ఐటీ నిపుణులకు సలహాలు, ర్యాపర్ స్టార్టప్తో పాటు పలు అంశాలపై చర్చించారు. అదే సమయంలో తన అభిమాన భారతీయ వంటకాలను కూడా వెల్లడించారు.భారత్లో తనకు ఇష్టమైన ఆహారం పేరు చెప్పమని సుందర్ పిచాయ్ను మయ్య అడిగినప్పుడు సీఈఓ సుందర్ పిచాయ్ దౌత్యంతో సమాధానమిచ్చారు. ప్రాంతాల వారీ ఎదురుయ్యే ఇబ్బందుల్ని ముందే పసిగట్టారు. దేశీయంగా ఉన్న మూడు మెట్రో నగరాలు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్ధాల గురించి తన మనుసులో మాటను బయట పెట్టారు. బెంగుళూరులో దోసె, ఢిల్లీలో చోలే భతురే ముంబైలో పావ్ భాజీలను ఇష్టంగా తింటానని తెలిపారు. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
న్యూఢిల్లీ: గూగుల్ తన డిజిటల్ వాలెట్ అప్లికేషన్ గూగుల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. గూగుల్ ఈ యాప్ను తొలిసారి 2022లో అమెరికాలో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల తర్వాత భారత్ వినియోగదారులకు పరిచయం చేసింది. గూగుల్ వాలెట్అంటే ఏమిటి?గూగుల్ వాలెట్ వివిధ డిజిటల్ ఆస్తులను ఒకే అనుకూలమైన ప్రదేశంలో స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. యాప్లో బోర్డింగ్ పాస్లు, లాయల్టీ కార్డ్లు, ఈవెంట్ టిక్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్లు, గిఫ్ట్ కార్డ్లు ఇతర డిజిటల్ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవచ్చు. గూగుల్పేపై ప్రభావం గూగుల్ వాలెట్ లాంచ్తో గూగుల్ పే యాప్ పనిచేస్తోందా? అనే అనుమానాలపై గూగుల్ స్పందించింది. గూగుల్ వాలెట్ వల్ల గూగుల్ పే వల్ల ఎలాంటి ప్రతి కూల ప్రభావం చూపదని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ పేకి, గూగుల్ వాలెట్కి మధ్య తేడా చెల్లింపు కార్డ్లను గూగుల్ వ్యాలెట్కు అనుసంధానిస్తే.. గూగుల్ పే పనిచేసే ఎక్కడైనా ఆఫ్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రధాన కంపెనీలతో భాగస్వామ్యం పీవీఆర్ ఐనాక్స్, ఫ్లిప్కార్ట్, ఎయిర్ ఇండియా, షాపర్స్ స్టాప్, ఇక్సిగోతో పాటు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారతదేశంలో గూగుల్ వాలెట్ ప్రారంభించిన సందర్భంగా గూగుల్ ప్రకటించింది.ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ వాలెట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్లు, క్రెడిట్ కార్డ్లు, లాయల్టీ కార్డ్లు, గిఫ్ట్ కార్డ్లను ఒక అనుకూలమైన ప్లాట్ఫారమ్లో నిల్వ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్..! కారణం..
ప్రభుత్వ మొబైల్ యాప్లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్లో ప్రభుత్వ యాప్లకు లేబుల్వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.ప్లేస్టోర్లో లక్షల్లో యాప్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్లోని ప్రభుత్వ యాప్లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్లకు గూగుల్ ప్లే స్టోర్లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది. -
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.ఆమె పేరు క్విన్గ్యూ వాంగ్. గూగుల్లో ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. తాను తొలిసారిగా 2018లో గూగుల్లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్లైన్ అసాస్మెంట్ (ఓఏ) రౌండ్లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్ స్క్రీన్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో సైట్ రిలయబిలిటీ ఇంజీనీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్లో మంచి ఫీడ్బ్యాక్ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్ను కూడా అందుకుంది వాంగ్. ఎట్టకేలకు వాంగ్ ఐదో ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించింది. అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి.(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!) -
‘నన్నోడించిన వాడ్నే పెళ్లి చేసుకుంటా’
‘‘బరిలో దూకండి. నన్ను ఓడించండి. ఆ దమ్మున్న మగవాడినే నేను పెళ్లి చేసుకుంటా’’.. పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఆ సవాల్ విసిరింది హమీదా బాను. ఇంతకీ ఇవాళ గూగుల్ హోం పేజీని గమనించారా?.. అందులో ఉంది ఆమెనే.1940-55 మధ్య.. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేసింది. భారతదేశంలో తొలి మల్ల యోధురాలిగా హమిదా బాను పేరు చరిత్రకెక్కింది. ఇప్పుడు.. డూడుల్ రూపంలో ఆ యోధురాలికి గౌరవం ఇచ్చింది గూగుల్.సంప్రదాయ కుటుంబంలో పుట్టి.. హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీఘడ్ వలస వెళ్లింది. అక్కడే సలాం పహిల్వాన్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటానని ప్రకటించి అటు ప్రజలు, ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది.ఛాలెంజ్లో భాగంగా.. పంజాబ్లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పహిల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పహిల్వాన్తో తలపడి.. కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది.బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో.. 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పహిల్వాన్ అసంబంద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట.అమెజాన్ ఆఫ్ అలీగఢ్.. ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్నపేరు. ఐదడుగల మూడు అంగుళాలు, 108 కేజీల బరువుతో.. రోజుకు ఐదున్నర లీటర్ల పాలు, రెండు లీటర్ల పండ్ల రసేఆలు, కేజీ మటన్, అరకేజీ బటర్, ఆరు గుడ్లు, రెండు ప్లేట్ల బిర్యానీ.. ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.హమిదా బాను కెరీర్ సగానికి పైగా వివాదాలతోనే సాగింది. మగవాళ్లతో ఆమె తలపడడాన్ని పలువురు బహిరంగంగానే వ్యతిరేకించారు. మొరార్జీ దేశాయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పోటీలపై నిషేధం విధించారు. అందుకు ఆమె బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పించింది. అలాగే.. ఆమె పాల్గొన్న పోటీల్లోనూ ప్రేక్షకుల నుంచి దాడులు తప్పలేదట. 1954 దాకా దేశ, విదేశీ రెజ్లర్లతో ఆమె తలపడింది. అయితే అదే ఏడాది విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం, స్పానర్లు ఎవరూ ముందుకు రాలేదన్న కారణాలతో ఆమె ఆగిపోయింది. అయితే ఆ ఆగిపోవడం.. బరికి శాశ్వతంగా హమిదా బానును దూరం చేసింది కూడా. 1987లో మహేశ్వర్ దయాల్ అనే రచయిత ఆమె జీవితం మీద రాసిన పుస్తకంలో సంచలన విషయాల్ని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్లో ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొందని, మగ పోటీదారులతో మాత్రమే ఆమె తలపడేదని, అయితే కొన్ని చోట్ల ఆమె రహస్య ఒప్పందాలు కూడా చేసుకునేదని ఆయన రాశారు.రెజ్లింగ్ కెరీర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకుల నడుమ సాగింది. కోచ్ సలాం పహిల్వాన్తో కలిసి అప్పటిదాకా ప్రొఫెషనల్ రిలేషన్ సాగించిన ఆమె.. ఆ తర్వాత ఆయనతో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఆమెను విదేశీ పోటీలకు వెళ్లకుండా సలామే అడ్డుకున్నాడనన్న ఆరోపణ ఒకటి ఉంది. ఇంకోవైపు ఉత్తర భారతం నలుమూలల పోటీల్లో పాల్గొన్న హమిదాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ముంబై కల్యాణ్ ప్రాంతంలో ఉంటూ.. సలాంతో కలిసి పాల వ్యాపారం మొదలుపెట్టింది.సలాం కూతురు సహారా, బానును పినమ్మగా చెబుతుంటుంది. అయితే సలాం ఆమెను శారీరకంగానూ ఎంతో వేధించేవాడని బాను మనవడు ఫిరోజ్ షేక్(ఆమె దత్తపుత్రుడి కొడుకు) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూరప్కు వెళ్లకుండా బానును నిలువరించిన సలాం.. ఆమెను చిత్రహింసలకు గురి చేశాడని, ఈ క్రమంలోనే ఆమె కాళ్లు, చేతులు విరిగియాని ఆరోపించారాయన. కొన్నాళ్లకు సలాం, బానులు విడిపోయారు. సలాం కల్యాణ్లోనే ఉంటూ పాల వ్యాపారం కొనసాగించింది. డబ్బు సరిపోని సమయంలో పిండి వంటలు చేసి రోడ్ల మీద అమ్ముకునేది. అలా మల్లు యోధురాలిగా పేరున్న హమీదా బాను.. చివరి రోజులు మాత్రం కష్టంగానే గడిచాయని పలు కథనాలు వెల్లడించాయి. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్లో అధికంగా ఉపయోగించే స్మార్ట్ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్లో గూగుల్తో పోటీపడుతున్న బింగ్ను యాపిల్ డిఫాల్ట్బ్రౌజర్గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్ను డిఫాల్ట్గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
సాహో భారతీయుడా.. త్వరలోనే బిలియనీర్గా సుందర్ పిచాయ్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. చెన్నైలో రెండు గదుల ఇంటి నుంచి ప్రారంభమైన పిచాయ్ ప్రస్థానం 100 కోట్ల డాలర్ల సంపదతో బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ టాప్ టెన్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోనున్నారు. ఇదే విషయాన్ని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. ఇప్పటి వరకు టెక్నాలజీ కంపెనీ అధినేతలు మాత్రమే బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కానీ తొలిసారి సాధారణ ఉద్యోగిలా గూగుల్లో చేరి తన అసాధారణమైన పనితీరుతో సీఈఓ స్థాయికి ఎదిగిన సుందర్ పిచాయ్ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గాగూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు.సీఈఓ అనే సింహాసనం మీదఅందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్ డాక్లలో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు. అదే సమయంలో సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం అందించిన జీతాలు, ఇతర భత్యాలు, షేర్లు సైతం భారీ లాభాల్ని ఒడిసి పట్టుకున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో సంస్థ విలువతో పాటు సుందర్ పిచాయ్ ఆదాయం భారీగా పెరిగింది. త్వరలో బిలీయనీర్పలు నివేదికల ప్రకారం.. గూగుల్తో పాటు గూగుల్ పేరెంట్ కంపెనీ ‘ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దీనికి తోడు గూగుల్ ఏఐ టూల్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వెరసి ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. -
గూగుల్లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..
టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ ఫ్లట్టర్, డార్ట్, పైథాన్ టీమ్ల నుంచి ఉద్యోగులను తొలగించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. త్వరలో సంస్థ యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరుగనున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఉద్యోగాలు కోల్పోయినవారు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో ఈ అంశాన్ని వైరల్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ప్రకటించారో మాత్రం స్పష్టం కాలేదు.ఈ సందర్భంగా గూగుల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఉద్యోగాలు కోల్పోయినవారు కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కంపెనీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో తొలగింపు ప్రక్రియ అమలుచేసింది. కంపెనీ ఫైనాన్స్ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాల్లో పనిచేసేందుకు అనుమతిస్తున్నారు’ అని చెప్పారు.గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పోరాట్ లేఆఫ్స్కు సంబంధించి ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో స్పందిస్తూ.. కంపెనీ నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్ వంటి ప్రదేశాల్లో గూగుల్ ‘గ్రోత్ హబ్లను’ నిర్మిస్తుందని చెప్పారు. రాబోయే అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్కార్డులున్నాయో తెలుసుకోండిలా..జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్, హార్డ్వేర్, అసిస్టెంట్ బృందాల్లో గూగుల్ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడంతో ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుందని తెలిసింది. -
గూగుల్లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు చివరకు కార్పొరేట్ రంగంలోనూ ప్రవేశించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలో నిరసనగళం వినిపించింది. గూగుల్ ఉద్యోగులు కంపెనీ క్లౌడ్ సీఈఓనే ఎదురించేస్థాయికి వెళ్లారు. ఏకంగా రూ.10వేల కోట్ల ప్రాజెక్ట్ను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. దాంతో చివరకు అలా నిరసనకు దిగిన ఉద్యోగులు అరెస్టయిన ఘటన ఇటీవల గూగుల్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం. హమాస్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ సెగ చివరకు కార్పొరేట్ సంస్థలను తాకింది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఉద్యోగుల్లో కొందరు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా కాలిఫోర్నియా కార్యాలయంలోని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ఛాంబర్ను చుట్టుముట్టారు. ఇజ్రాయెల్ దేశంతో కంపెనీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే నిలిపేయాలని నిరసన గళం వినిపించారు. దాదాపు ఈ నిరసన 8 గంటలపాటు సాగింది. ఈమేరకు లైవ్లో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ⚡️⚡️28 employees entered Google CEO’s office and threatened to stay there until Google canceled its $1.2 billion contract with the Israeli government. Instead, Google has FIRED all of them from jobpic.twitter.com/LZSrksIY1U — Megh Updates 🚨™ (@MeghUpdates) April 18, 2024 డిమాండ్లో పాల్గొన్న ఉద్యోగులను అడ్మినిస్ట్రేటివ్ లీవ్లో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. అయినా అక్కడి నుంచి ఏమాత్రం నిరసన విరమించుకోకపోవడంతో చర్యలు చేపట్టింది. ఉద్యోగుల వ్యవహారంతో చేసేదేమిలేక గూగుల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఉద్యోగులు తీసిన వీడియోలో వారు కూర్చున్న గది ముందు ‘డ్రాప్నింబుస్’ బ్యానర్ కనిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గతంలో గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని పేరు ‘ప్రాజెక్ట్ నింబుస్’. దాని విలువ 1.2 బిలియన్ డాలర్లు(రూ.10 వేలకోట్లు). అయితే ఆ దేశంతో చేసుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ముస్లిం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని కోరారు. వారిపై బెదిరింపులకు పాల్పడకూడదని, ఆ వ్యవహారాన్ని సమరస్యంగా పరిష్యరించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగుల వ్యవహారానికి సంబంధించి కంపెనీ ఘాటుగానే స్పందించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ నిరసనలో పాల్గొన్ని దాదాపు 28 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. ఇదీ చదవండి: భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ BREAKING: Google employees were arrested after occupying their boss's office for more than 8 hours to demand that the company sever ties with Israel. WATCH: pic.twitter.com/W4WQO8NNgH — Kassy Akiva (@KassyDillon) April 17, 2024 -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
గూగుల్ అనువాదం ఎఫెక్ట్.. పట్టాలెక్కిన ‘మర్డర్ ఎక్స్ప్రెస్’
కొచ్చి: గూగుల్ అనువాదంతో బుక్కైన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. కేరళలోని ఓ రైలు పేరు హటియా-ఎర్నాకులం అని హిందీ ఇంఘ్లీష్లో ఉండగా హటియాను అనువదించి మళయాలంలో హత్య(మర్డర్) అని అర్థం వచ్చేలా ‘కొలపతకం’ అని బోర్డుపై రాశారు. దీంతో రైలు పేరు కాస్తా మర్డర్ ఎక్స్ప్రెస్గా మారిపోయింది. ఈ వ్యవహారంలో రైల్వే అధారులపై సోషల్మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రైలు నేమ్ ప్లేట్ను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ ‘ష్..వారికి ఎవరూ చెప్పొద్దు’ అని ఒక నెటిజన్ సెటైర్ వేశారు. గూగుల్ అనువాదంపై పూర్తిగా ఆధారపడ్డ ఫలితం అని మరో నెటజన్ చురకంటించారు. రైలు పేరు విషయంలో అనువాదం బెడిసికొట్టిన వ్యవహారంపై రాంచీ డివిజన్ సీనియర్ రైల్వే అధికారి స్పందించారు. ఇది తప్పుడు అనువాదం వల్ల వచ్చిన సమస్యని, తమ దృష్టికి రాగానే నేమ్ప్లేట్ సరి చేశామని తెలిపారు. రాంచీలోని హటియా నుంచి ఎర్నాకులానికి ఎక్స్ప్రెస్ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. 😭😭😭 https://t.co/u2CXud1sok — Cow Momma (@Cow__Momma) April 12, 2024 ఇదీ చదవండి.. బోర్న్వీటాపై కేంద్రం కీలక ఆదేశాలు -
మే 15 నుంచి ‘గూగుల్ ఫొటోస్’లో మార్పులు
మొబైల్ కొనేముందు ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ, స్క్రీన్ సైజ్తోపాటు ప్రధానంగా కెమెరా గురించి తెలుసుకుంటారు. అందులో ప్రత్యేక ఫీచర్లు ఉంటే మరింత ఆసక్తి చూపుతారు. కొన్ని మొబైల్ తయారీ సంస్థలు ఇంటర్నల్గా ఫోన్ కెమెరా టూల్లోనే ఏఐ ఆధారిత ఫీచర్లును వాడుతున్నాయి. దానికితోడు ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న చాలా ఫొటో ఎడిటింగ్ యాప్లు సైతం ఏఐను వినియోగిస్తున్నాయి. వాటికి ధీటుగా ‘గూగుల్ ఫోటోస్’ యాప్లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు మే 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫొటో ఫీచర్లను అందించేందుకు ఎడిటింగ్ ఆప్షన్లలో మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ఫొటోస్ యాప్లో మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్తోపాటు ఫోటో బ్లర్, పోట్రైట్ లైట్ వంటి ఇతర ఏఐ టూల్స్ను అందించనున్నట్లు చెప్పింది. గూగుల్ సంస్థ ఇప్పటికే ఈ టూల్స్ను కొన్ని మొబైల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 మేలో వీటిని పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ఫోన్ యూజర్లకు పరిచయం చేసింది. మే 15, 2024 తర్వాత ఈ ఏఐ ఆధారిత ఫొటో ఎడిటర్ టూల్స్ను గూగుల్ ఫొటోస్ వాడుతున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరూ వినియోగించవచ్చని తెలిపింది. ఇదీ చదవండి: ‘వాటిలో పెట్టుబడి పెడితే రూ.కోట్లే..’ యూజర్లు ఈ ఫీచర్లును వాడుకోవాలంటే మాత్రం ఆండ్రాయిడ్ 8.0, ఐఓఎస్ 15 సహా ఆపై వచ్చిన ఓఎస్లనే ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. దాంతోపాటు మొబైల్ ర్యామ్ 3జీబీ కంటే ఎక్కువ ఉండాలని చెప్పింది. -
జీమెయిల్ యూజర్లకు శుభవార్త
ప్రముఖ టెక్ దిగ్గజం జీమెయిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆండ్రాయిడ్ ఆధారిత అండ్రాయిడ్ యూజర్లకు ఏఐని జోడిస్తున్నట్లు తెలిపింది.ఇందుకోసం రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్పై పనిచేస్తుందని, ఈ ఫీచర్ సాయంతో ఈమెయిల్స్కు రిప్లయి ఇచ్చేలా యూజర్లు వినియోగించుకునే అవకాశం కలగనుంది. గూగుల్ ఇప్పటికే గూగుల్ వన్ ఏఐ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ద్వారా గూగుల్ డ్రైవ్, డాక్స్ వంటి సర్వీస్లలో జెమిని అడ్వాన్స్డ్ పవర్డ్ ఏఐ టూల్స్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొబైల్ జీమెయిల్ అప్లికేషన్లో ఏఐని ఇంటిగ్రేట్ చేసే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చిన మెయిల్స్ను విశ్లేషించడం, సూచనలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మెయిల్స్ పంపే సమయంలో అందులో ఉన్న కంటెంట్ సరిగ్గా ఉందా, లేదంటే ఇంకా ఏమైనా జోడించాల్సి ఉంటుందా అనే సలహాలు ఇస్తుంది. అవసరమైతే మెయిల్స్లో యూజర్కు కావాల్సిన కంటెంట్ను ఏఐ అందిస్తుందని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. అయితే త్వరలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ వన్ ఏఐ సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. View this post on Instagram A post shared by BSTech (@bstechofficial) -
గూగుల్ రహస్య బ్రౌజర్.. రూ.41,000 కోట్ల దావా!
గూగుల్ తన వినియోగదారుల సెర్చ్ డేటాను డిలీట్ చేసేందుకు అంగీకరించింది. తద్వారా ఐదు బిలియన్ డాలర్ల(రూ.41,000 కోట్లు) విలువైన దావాను పరిష్కరించుకునేందుకు చర్యలు చేపట్టింది. దీనికి శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు అంగీకరిస్తే క్రోమ్ ‘ఇన్కాగ్నిటో మోడ్’లో సెర్చ్ చేసిన లక్షలాది మంది అమెరికా యూజర్ల డేటాను ఆ సంస్థ డిలీట్ చేయాల్సి ఉంటుంది. దీనిపై జులై 30న కోర్టులో విచారణ జరగనుంది. కోర్టుకు తెలియజేసిన ప్రతిపాదనలో గూగుల్ ఎక్కడా పరిహారాన్ని చెల్లిస్తామని చెప్పలేదు. అయితే దీని వల్ల ప్రభావితమయ్యామని భావించిన క్రోమ్ యూజర్లు నగదు పరిహారం కోసం ప్రత్యేకంగా దావా వేసుకోవచ్చని పేర్కొంది. ఇన్కాగ్నిటో మోడ్లో గూగుల్ అక్రమంగా యూజర్ల డేటాను సేకరిస్తోందని 2020 జూన్లో కొంతమంది దావా వేశారు. కంపెనీ అంతర్గత ఈమెయిళ్ల ద్వారా ఇది బహిర్గతమైనట్లు అందులో పేర్కొన్నారు. దీన్ని వెబ్ ట్రాఫిక్ అంచనాకు, వాణిజ్య ప్రకటనల ప్రమోషన్కు వాడుకున్నట్లు తేలిందని చెప్పారు. దీనికిగానూ ఐదు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లు) నష్టపరిహారాన్ని కోరారు. ఇన్కాగ్నిటో మోడ్లో సెర్చ్ చేయడం వల్ల ఆ డేటా బయటకు పొక్కదనే నమ్మకం యూజర్లలో ఉందని దావాలో పేర్కొన్నారు. కానీ, వారి విశ్వాసాన్ని వమ్ము చేస్తూ గూగుల్ ఆ డేటాను సేకరించడం అనైతికమని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ద్వారా యూజర్లను మోసగించడమేనని తెలిపారు. పైగా ఇది వారి గోప్యతకు భంగం కలిగించినట్లేనని వాదించారు. అత్యంత వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య ప్రకటనల ప్రమోషన్కు వాడుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇదీ చదవండి: ‘పని చేయకపోయినా జీతం ఇస్తాం’ దావా వేసిన వినియోగదారులు వాదనల్లో నిజంలేదని.. అయినప్పటికీ దీన్ని పరిష్కరించుకునేందుకు అంగీకరిస్తున్నామని గూగుల్ అధికార ప్రతినిధి జార్జ్ కాస్టానెడ అన్నారు. తాము సేకరించిన డేటాలో యూజర్ల వ్యక్తిగత సమాచారమేమీ లేదన్నారు. కేవలం అది సాంకేతికపరమైనదేనని చెప్పారు. దాన్ని ఎలాంటి ఇతర అవసరాలకు వాడుకోలేదని పేర్కొన్నారు. అయినా, దాన్ని కూడా డిలీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. -
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్కు ఉన్న డిమాండ్ ట్రెండ్ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
Play Store pricing policy: గూగుల్కు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ ధరల విధానం విషయంలో పోటీ వ్యతిరేక పద్ధతులను పాటిస్తోందన్న ఆరోపణలపై గూగుల్పై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) శుక్రవారం ఆదేశించింది. గూగుల్ అనుసరిస్తున్న చెల్లింపు విధానాలు యాప్ డెవలపర్స్, పేమెంట్ ప్రాసెసర్స్, వినియోగదారులతో సహా అనేక మంది వాటాదారులపై ప్రభావం చూపుతున్నాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆధిపత్య స్థానం దురి్వనియోగానికి సంబంధించిన పోటీ చట్టంలోని సెక్షన్ 4ను గూగుల్ ఉల్లంఘించిందని సీసీఐ ప్రాథమికంగా గుర్తించింది. పీపుల్ ఇంటెరాక్టివ్ ఇండియా (షాదీ.కామ్), మీబిగో ల్యాబ్స్ (కుకు ఎఫ్ఎం), ఇండియన్ బ్రాడ్కాస్టింగ్, డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్), ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్ (ఐడీఎంఐఎఫ్) ఫిర్యాదు మేరకు సీసీఐ తాజా ఆదేశాలు వెలువరించింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్ను తీసివేసిన రెండు వారాల లోపే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. సరీ్వస్ ఫీజు చెల్లింపులపై వివాదం కారణంగా మార్చి 1న భారత్లోని ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్ను గూగుల్ తొలగించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో కొన్ని రోజుల్లోనే యాప్స్ను తిరిగి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్బోర్డ్ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్బోర్డ్లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్లో కొద్దిసేపు గడపడం, జిమ్లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
భారత్ కు గూగుల్ క్షమాపణలు "మోడీ పై తప్పుడు వ్యాఖ్యలు"
-
‘జెమిని’ వివాదాలు.. ఊడుతున్న ఉద్యోగాలు..
గూగుల్ సంస్థ అత్యాధునిక కృత్రిమమేధ (ఏఐ) టూల్ ‘జెమిని’ని గతేడాది డిసెంబరులో పరిచయం చేసింది. అయితే ఇటీవల ఈ టూల్ వెల్లడించిన సమాధానాలు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. దీనిపై కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. కొన్ని ప్రశ్నలకు జెమిని ఇచ్చిన ఫలితాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆయనే స్వయంగా తెలిపారు. ఈ ‘జెమిని’ ఎఫెక్ట్ ఇంటర్నెట్ వాడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం ఉండకపోయినా దాన్ని తయారుచేసిన గూగుల్పై అయితే కచ్చితంగా ఉంటుంది. బూమింగ్ టెక్నాలజీకి సంబంధించి సరైన సమీక్ష లేకుండా ఇతరులతో పోటీపడాలనే తొందరలో ఉద్యోగులు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిస్తుంది. ట్రస్ట్, సేఫ్టీ టీమ్దేనా బాధ్యత.. గూగుల్ ‘జెమిని’ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గూగుల్ తన ట్రస్ట్, సేఫ్టీ టీమ్ నుంచి కొంతమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. కంపెనీ తయారుచేసిన జెమినిలో సమస్యలు తలెత్తుతుండటంతో మిగిలిన వారిని స్టాండ్బైలో ఉండమని చెప్పినట్లు పేర్కొంది. మొత్తం 250 మంది ఉద్యోగులు కలిగిన ఈ గ్రూప్ నుంచి పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోనున్నట్లు నివేదిక అంచనా వేసింది. ఈ టీమ్ ఏం చేస్తుందంటే.. గూగుల్ ట్రస్ట్, సేఫ్టీ టీమ్ ఏఐ ఉత్పత్తుల నియమాలను తారుమారు చేసే సామర్థ్యం ఉన్న అవకాశాలను తగ్గించేలా పనిచేయాలి. అవసరమైన రూల్స్ సెటప్ చేసేందుకు ఈ టీమ్ బాధ్యత వహిస్తుంది. గూగుల్ యూజర్లు వినియోగించే టూల్స్ సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించడానికి పలు తనిఖీలను కూడా నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ఆకతాయిల నుంచి రక్షించే లాకెట్.. ఎలాగంటారా.. జెమినిలో వరుసగా లోపాలు తలెత్తుతుండటంతో ఈ టూల్ ద్వారా మరిన్ని పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని గూగుల్ కొంతమంది ఉద్యోగులను కోరినట్లు నివేదిక పేర్కొంది. చారిత్రక చిత్రాలను చూపించడంలో జెమిని ఫెయిల్ కావడంతో ఈ వ్యవహారంపై కంపెనీ విచారణ జరుపుతుందని, దాంతో సిబ్బందిపై అధిక పనిభారం ఉన్నట్లు ఇటీవల కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అంగీకరించారు. -
‘గూగుల్ గుత్తాధిపత్యం’.. యాప్ల తొలగింపు.. పునరుద్ధరణ
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పది భారతీయ మొబైల్ యాప్లను తొలగించిన విషయం తెలిసిందే. దాంతో పలు అంకుర సంస్థలకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశమయ్యారు. గూగుల్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన మొబైల్ యాప్లకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర మంత్రులు సోమవారం పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎటువంటి పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. యాప్ల విషయంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని భారత కంపెనీలు ఆరోపిస్తున్నాయి. గూగుల్ కారణంగా సమస్యలను లేవనెత్తిన సంస్థలు, ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరాయి. ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం ఫీజు వసూలు చేస్తుండటంతో ఈ వివాదం మొదలైంది. యాంటీ కాంపిటీషన్ సంస్థ సీసీఐ ఇంతకు ముందు 15-30 శాతం బిల్లింగ్ వ్యవస్థను తొలగించింది. కంపెనీలకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇవ్వకపోవడంతో ఫీజు రద్దుచేస్తున్న సంస్థలను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం ప్రభుత్వ జోక్యంతో పునరుద్ధరించింది. సమావేశ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. భారత యాప్ డెవలపర్స్ సంఘం అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్)తో చంద్రశేఖర్ వర్చువల్గా సమావేశం అయ్యారు. ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే.. తొలగించిన యాప్లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. -
మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్.. కారణం?
గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో కేంద్రం గూగుల్కు నోటీసులు పంపింది. దీనిపై తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. అంతేకాకుండా తమ ప్లాట్ఫామ్ను ‘నమ్మదగినది కాదు’ అని పేర్కొంది. ఈమేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ఆంగ్ల పత్రికకు ఈ విషయాన్ని తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని గూగుల్కు చెందిన ‘జెమిని’ను ఇటీవల ఓ నెటిజన్ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని ఆ ఏఐ టూల్ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. Forgot to tag @elonmusk. Hope his AI product will be better. https://t.co/Mo8iugmiKK — Arnab Ray (@greatbong) February 22, 2024 ఇదీ చదవండి: ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం తీవ్రంగా స్పందించింది. గూగుల్కు నోటీసులిచ్చింది. దీనిపై గూగుల్ తన స్పందనగా క్షమాపణలు చెప్తూ.. తమ ప్లాట్ఫామ్ను ‘నమ్మదగినది కాదని’ పేర్కొన్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో ఏఐ ఉత్పత్తులను లాంచ్ చేయాలంటే సంబంధిత ఏఐ ప్లాట్ఫామ్స్ ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. అయితే ఈ విషయంలో స్టార్టప్లకు మినహాయింపును ఇచ్చినట్లు మంత్రి వివరించారు. These are direct violations of Rule 3(1)(b) of Intermediary Rules (IT rules) of the IT act and violations of several provisions of the Criminal code. @GoogleAI @GoogleIndia @GoI_MeitY https://t.co/9Jk0flkamN — Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam) (@Rajeev_GoI) February 23, 2024 -
ప్రపంచ టాప్ కంపెనీలో నోటీసు లేకుండా ఉద్యోగాల తొలగింపు..
టెక్ కంపెనీలు కాస్ట్కటింగ్ పేరిట ఉద్యోగాల తొలగొంపునకు పూనుకుంటున్నాయి. అందులో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని సంస్థలో భాగమవుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఉన్న గూగుల్కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ విభాగం నుంచి 43 మందికి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు. యూట్యూబ్ మ్యూజిక్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు మెరుగైన వేతనం, ఇతర ప్రయోజనాలు అడిగినందుకు వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కొన్ని మీడియా కథనాల్లో ప్రచురితమైంది. ఆ ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన గూగుల్లో, సబ్కాంట్రాక్ట్గా కాగ్నిజెంట్లో పనిచేస్తున్నారు. అయితే ఈ తొలగింపులకు గూగుల్ బాధ్యత వహించదని తెలిపింది. బాధితుల్లో ఒకరైన యూట్యూబ్ డేటా అనలిస్ట్ జాక్ బెనెడిక్ట్ గూగుల్తో లేఆఫ్స్కు సంబంధించి యూనియన్ చర్చలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదీ చదవండి: యూపీఐ సేవల్లోకి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఈ అంశంపై జాక్ బెనెడిక్ట్ మాట్లాడుతూ ఉద్యోగులకు తమ తొలగింపుల గురించి ఎలాంటి ముందస్తు నోటీసు రాలేదని చెప్పారు. గూగుల్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కంపెనీ ముందుగా చేసుకున్న ఒప్పందాలు గడువులోపు ముగుశాయన్నారు. తొలగింపులు తమ వ్యాపార కార్యకలాపాల్లో ఒక భాగమని చెప్పారు. అయితే తొలగించిన ఉద్యోగులకు కంపెనీలో ఇతర స్థానాలను కల్పించేలా ఏడు వారాల గడువు ఉంటుందని తెలిసింది. -
కేంద్రం దెబ్బకు దిగొచ్చిన గూగుల్
సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ మొబైల్ యాప్లను తొలగించిన గూగుల్ అప్పుడే యాప్లను పునరుద్ధరించే (Restore) ప్రక్రియను ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్'తో కంపెనీ అధికారులు సమావేశం జరగకముందే టెక్ దిగ్గజం ఈ చర్యకు పూనుకుంది. గత శుక్రవారం గూగుల్ భారతీయ కంపెనీలకు చెందిన యాప్లను తొలగించి.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వివాదానికి కారణమైంది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ప్రముఖ యాప్లను తొలగించింది. తొలగించిన యాప్లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఈయనే లేకుంటే భారత్లో ఎలక్ట్రిక్ కారు పుట్టేదా? ఎవరీ చేతన్ మైని.. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. -
గూగుల్ చర్యను అనుమతించలేము.. యాప్స్ తొలగింపుపై కేంద్రం
గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్లను తొలగించే చర్యను అనుమతించలేమని కేంద్రం తెలిపింది. టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్ల ప్రతినిధులను సోమవారం (మార్చి 4) రావాలని ఐటి మంత్రి 'అశ్విని వైష్ణవ్' ఆహ్వానించారు. సర్వీస్ ఫీజు చెల్లింపులపై వివాదాలను పేర్కొంటూ గూగుల్ నిన్న (మార్చి 1) భారతీయ కంపెనీల యాప్లను తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్బుక్ ఉన్నాయి. అయితే గూగుల్ చేపట్టిన ఈ చర్యకు కంపెనీలు అసహనం వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని, గూగుల్ అధికారులతో చర్చ జరిపిన తరువాత సానుకూలమైన ఫలితం రావచ్చని, తప్పకుండా ఈ కంపెనీలను రక్షించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి 'అశ్విని వైష్ణవ్' వెల్లడించారు. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ యాప్ సంభావ్యతను వివరిస్తూ.. భారతదేశ ఇంటర్నెట్కు ఇది చీకటి రోజుగా పేర్కొన్నారు. ఒక్క భారత్ మ్యాట్రిమోని మాత్రమే 50 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారత యాప్స్పై గూగుల్ కన్నెర్ర.. ప్లేస్టోర్లో అవి మాయం! సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా యాప్ డెవలపర్లు నిబంధలను ఉల్లగించినట్లు, ఈ కారణంగానే ఆ యాప్లను తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్ ద్వారా భారతీయ మార్కెట్లో 94 శాతం వాటాను కలిగి ఉన్న టెక్ దిగ్గజం త్వరలో ఐటి మంత్రిని కలిసిన తరువాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలుస్తుంది. -
గూగుల్పై మిట్టల్ ఆగ్రహం.. యాప్స్ అన్నీ రీస్టోర్ చేయాల్సిందే!
సర్వీసు ఫీజు చెల్లింపులపై వివాదం తలెత్తిన నేపథ్యంలో భారత్లోని తన ప్లే స్టోర్ నుంచి కొన్ని యాప్లను గూగుల్ తొలగిస్తోంది. ఈ క్రమంలోనే షార్క్ ట్యాంక్ జడ్జ్, పీపుల్ గ్రూప్ షాదీ.కామ్ వ్యవస్థాపకుడు,సీఈఓ అనుపమ్ మిట్టల్ గూగుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా ఇంటర్నెట్కు ఈరోజు చీకటి రోజు.సర్వీసు ఫీజు చెల్లింపు అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ గూగుల్ యాప్స్ను తొలగించింది. సేవ్ స్టార్టప్ అంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎక్స్.కామ్లో ట్యాగ్ చేశారు. Today is a dark day for India Internet. Google has delisted major apps from its app store even though legal hearings are underway @CCI_India & @indSupremeCourt Their false narratives & audacity show they have little regard for 🇮🇳 Make no mistake - this is the new Digital East… — Anupam Mittal (@AnupamMittal) March 1, 2024 గూగుల్ యాప్స్ తొలగింపు అంశంలో సీసీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ప్లేస్టోర్లో డీలిస్ట్ చేసిన యాప్స్ని రీస్టోర్ చేయాలని డిమాండ్ చేశారు. -
సుందర్ పిచాయ్ కు 'జెమినీ' గండం..!
-
షాకిచ్చిన గూగుల్..నౌకరి.కామ్ యాప్ మాయం!
భారత్లోని ప్రముఖ లార్జెస్ట్ వెబ్సైట్ నౌకరి.కామ్ యాప్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. గూగుల్, భారత్లోని యాప్ డెవలపర్ల మధ్య కొంతకాలంగా ప్లే స్టోర్ ఛార్జీల వివాదం కొనసాగుతోంది. భారత్లోని కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా గూగుల్ ప్లే స్టోర్ని వినియోగించుకుంటున్నాయని తెలిపింది. ఆయా సంస్థలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని, లేదంటే ప్లేస్టోర్ నుంచి సంబంధిత సంస్థల యాప్స్లను తొలగిస్తామని ప్రకటించారు. నిబంధనల్ని పాటించాం.. ఈ తరుణంలో ఇన్ఫో ఎడ్జ్ యాజమాన్యంలోని నౌకరి, రియల్ ఎస్టేట్కు చెందిన 99 ఎకర్స్ యాప్స్ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. ఈ సందర్భంగా గూగుల్ యాప్ బిల్లింగ్ పాలసీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఫిబ్రవరి 9 నుండి తాము గూగుల్ యాప్ విధానాలకు కట్టుబడి ఉన్నామని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ గతంలో చెప్పారు. గూగుల్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించామని తెలిపారు. భారత్లో 10 యాప్స్ తొలగింపు తాజాగా ప్లే స్టోర్ నుంచి యాప్ను తొలగించడంపై సంజీవ్ బిక్చందానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఇన్ఫో ఎడ్జ్కి చెందిన నౌకరి, 99 ఎకర్స్తో కలిపి మొత్తం 10 యాప్స్ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. -
10 భారతీయ కంపెనీ యాప్లపై కన్నెర్రజేసిన గూగుల్!
టెక్ దిగ్గజం గూగుల్ (Google) పది భారతీయ కంపెనీల యాప్లపై చర్య తీసుకుంటున్నట్లు ఈ రోజు (మార్చి 1) వెల్లడించింది. ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బిల్లింగ్ విధానాన్ని పాటించని కారణంగా కంపెనీ వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ తొలగించనున్న యాప్ల జాబితాలో మ్యాట్రిమోనీ ప్లాట్ఫారమ్ షాదీ.కామ్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ALTT, స్టేజ్ మాత్రమే కాకుండా.. డేటింగ్ యాప్ క్వాక్ క్వాక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. ఈ యాప్స్ అన్నీ కూడా ప్లే స్టోర్కు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వీటిని పూర్తిగా తొలగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యాప్ డెవలపర్లు కూడా గూగుల్ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఇందులో గూగుల్ గేట్ కీపింగ్ చార్జీలు, ఎక్స్ట్రా కమీషన్స్ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యాప్ డెవలపర్ల నుంచి తక్కువ ఫీజులే వసూలు చేస్తున్నట్లు తెలిపింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతం 200000 మంది భారతీయ యాప్ డెవలపర్లు తమ విధానాలకు కట్టుబడి ఉన్నారని, సురక్షితమైన ప్లాట్ఫామ్ను నిర్ధారిస్తున్నారని కంపెనీ తెలిపింది. అయితే 10 కంపెనీలు మాత్రమే తమ నియమాలను పెడచెవిన పెడుతున్నాయని, ఈ కారణంగానే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఇదీ చదవండి: అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ ఈవెంట్: పాప్ సింగర్ ఒక్క పర్ఫామెన్స్కే అన్ని కోట్లా? -
గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే..
గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని ఇప్పుడు భూ ప్రపంచం మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేకుండా పోయింది. ఫోన్ లాక్ తీసేశామా... డెస్టినేషన్ టైప్ చేసి స్టార్ నొక్కామా... రయ్యి రయ్యి మంటూ దుసుకెళ్లామా అన్నట్టు ఉంటుంది గూగూల్ మ్యాప్స్తో వ్యవహారం. బాగానే ఉంది కానీ... నిమిషం తిరిగే సరికి ఫోన్ లాక్ అయిపోతుంది కదా.. మళ్లీ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇబ్బందే కదా? అంటున్నారా? ఎస్. అది ఇప్పటివరకూ ఉన్న సమస్య. ఇకపై మాత్రం ఉండబోదు. ఎందుకంటే గూగుల్ ఈ ఇబ్బందిని తొలగించే ఏర్పాట్లు చేసింది మరి! గూగుల్ మ్యాప్స్లో ఇప్పటికే వినియోగదారులకు ఉపయోగపడే అనేక ఫీచర్లను దశలవారీగా ప్రవేశపెడుతూనే ఉంది ఆ కంపెనీ. వాట్సప్ అవసరం లేకుండానే రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్, ఫ్యూయెల్ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్స్.. తాజాగా లాక్ స్క్రీన్పైనే లొకేషన్ కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి వివరాలను అందిస్తే సమయం, షార్ట్కట్లు కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ లాక్ అయితే తిరిగి లాన్ తీసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్తో మొబైల్ లాక్ స్క్రీన్పై ఈటీఏ (ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్ ప్రత్యక్షమవుతాయి. అంటే ఇకపై గూగుల్ మ్యాప్స్ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఏదైనా లొకేషన్కు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే.. స్టార్ట్ బటన్ క్లిక్ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్గా రూట్ అప్డేట్ అవుతుంది. ఇదీ చదవండి..పిండం వయసును నిర్ధారించే ఏఐ.. ఎవరు తయారు చేశారంటే.. ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే.. గూగుల్ మ్యాప్స్లో గ్లాన్సబుల్ ఫీచర్ డీఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. యాప్ ఓపెన్ చేసి పైన కుడివైపు కనిపించే మీ ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్ను ఎంచుకొని కిందకు స్క్రోల్ చేయగానే నావిగేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేస్తే ‘గ్లాన్సబుల్ డైరెక్షన్స్ వైల్ నావిగేటింగ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. -
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్బాట్ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్బాట్ బార్డ్ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్బాట్ ఇమేజ్ జనరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024 -
'గూగుల్ పే' సౌండ్పాడ్ వచ్చేస్తోంది..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్లో రాశారు. గూగుల్ పే సౌండ్పాడ్ ఎలా పనిచేస్తుందంటే.. సౌండ్పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్పాడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు. -
గూగుల్ నాకందుకే ప్రమోషన్ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం గూగుల్పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్గా చెప్పమంటారా?" అంటూ మాగైర్ గతేడాది డిసెంబర్లో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. గూగుల్ తన ఏఐ చాట్బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్ని మాగ్యురే పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్రమోట్ చేయలేనని అతని సూపర్వైజర్ చెప్పినట్లు మాగైర్ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు. అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్. సెక్వోయాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్ 2016 నుంచి 2019 మధ్య గూగుల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్లో భాగస్వామిగా ఉన్నారు. -
జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!
ఆన్లైన్ పేమెంట్ యాప్లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది. కేవలం ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్లో లభిస్తాయి. 2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి. ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే.. ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -
ఆగస్టు నుంచి 'జీమెయిల్' షట్డౌన్! నిజమేనా?
ప్రపంచవ్యాప్తంగా చాలామందికి జీమెయిల్ లాగిన్ చేయడంతోనే రోజు ప్రారంభమవుతుంది. మరి కొందరు రోజుకు ఒక్కసారైనా జీమెయిల్ చూస్తుంటారు. అలాంటి జీమెయిల్ సర్వీస్ త్వరలో నిలిచిపోనున్నట్లు నెట్టింట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది యూజర్స్ ఆందోళనకు గురయ్యారు. గూగుల్ కంపెనీ దీనిపై స్పందిస్తూ.. జీమెయిల్ యూజర్స్ భయపడాల్సిన అవసరం లేదని, కేవలం HTML ఫీచర్ మాత్రమే నిలిచిపోనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని కంపెనీ గత సెప్టెంబర్లోనే ధ్రువీకరించింది. జీమెయిల్ సర్వీసు నిలిచిపోనున్నట్లు వస్తున్న వార్తలు నమ్మొద్దంటూ సంస్థ అధికారికంగా వెల్లడించింది. Gmail is here to stay. — Gmail (@gmail) February 22, 2024 నిజానికి గత ఏడాది సెప్టెంబర్లోనే జీమెయిల్ సర్వీసులో HTML ఫీచర్ నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ను నిలిపివేయనున్నట్లు, ఇదే స్టాండర్డ్ వ్యూకు మారుతుందని సంస్థ స్పష్టం చేసింది. గూగుల్ సర్వీస్ మరింత మెరుగుపడాలనే ఉద్దేశ్యంతోనే కంపెనీ చిన్న అప్డేట్స్ జోడించనున్నట్లు, అయితే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం జీమెయిల్ పనిచేయకపోవడం అనేది ఉండదని, సంబంధిత అధికారులు ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపింది. ఇదీ చదవండి: దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా.. this is insane. I hate this company pic.twitter.com/pXBRezPAyX — Daniel (@growing_daniel) February 22, 2024 -
ప్రధాని మోదీపై గూగుల్ ‘జెమిని’ వివాదాస్పద సమాధానం
న్యూఢిల్లీ: గూగుల్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ ఓ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోదీపై ఇచ్చిన వివాదాస్పద సమాధానం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో గూగుల్కు నోటీసులు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 3తో పాటు క్రిమినల్ చట్టాలనూ జెమిని ఏఐ ఉల్లంఘించిందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ‘ప్రధాని మోదీ ఫాసిస్టా?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. మోదీ అవలంబించిన విధానాల వల్ల కొంత మంది ఆయనను ఫాసిస్టు అని పిలిచారని జెమిని ఏఐ వివాదాస్పద సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అడగ్గా స్పష్టంగా చెప్పలేమంటూ ఆచితూచి జవాబిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లను ఓ జర్నలిస్టు ఎక్స్(ట్విటర్)లో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీంతో ‘జెమిని’పై విమర్శలు వ్యక్తమయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ నెటిజన్లు మండిపడ్డారు. Forgot to tag @elonmusk. Hope his AI product will be better. https://t.co/Mo8iugmiKK — Arnab Ray (@greatbong) February 22, 2024 గతేడాది డిసెంబర్లో గూగుల్ ‘జెమిని’ అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా, ఇటీవల దీని వినియోగంపై యూజర్లకు గూగుల్ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్ ద్వారా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాను షేర్ చేయొద్దని సూచించింది. These are direct violations of Rule 3(1)(b) of Intermediary Rules (IT rules) of the IT act and violations of several provisions of the Criminal code. @GoogleAI @GoogleIndia @GoI_MeitY https://t.co/9Jk0flkamN — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) February 23, 2024 ఇదీ చదవండి.. రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన ట్వీట్ -
టెక్ దిగ్గజం కీలక ప్రకటన.. పేటీఎంకు గూగుల్ భారీ షాక్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంకు గూగుల్ భారీ షాకిచ్చింది. త్వరలో భారత్లో మిలియన్ల మంది చిరు వ్యాపారులు ఆడియో అలర్ట్లతో క్యూఆర్ కోడ్ సాయంతో లావాదేవీలు జరిపేందుకు గాను స్పీకర్ సౌండ్ పాడ్స్(SoundPods)ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది దేశంలో పేటీఎం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర ఫిన్ టెక్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే పేటీఎం యూజర్లు ఇతర యూపీఐ పేమెంట్స్, చిరు వ్యాపారులు సౌండ్బాక్స్లను వినియోగిస్తున్నారు. తరుణంలో గూగుల్ గత ఏడాది తన సౌండ్బాక్స్లను పరిమిత యూజర్లకు అందించింది. బాక్స్ పనితీరు ఎలా ఉంది? లావా దేవీలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై వ్యాపారుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. గూగుల్ విడుదల చేసిన సౌండ్ బాక్స్ విషయంలో సానుకూల స్పందన వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సౌండ్ బాక్స్ లను వినియోగంలోకి తెస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇంగ్లీషుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీతో సహా ఆరు భారతీయ భాషలలో ఆడియో అలెర్ట్ లను అందించే గూగుల్ సౌండ్ పాడ్స్ కోసం వ్యాపారులు గూగుల్ ప్లే యాప్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్ స్క్రిప్షన్ రోజువారి లేదంటే,ఏడాది ప్లాన్ అనంతరం ఈ ఆడియో డివైజ్ పొందవచ్చు. రోజువారీ ప్లాన్లో, వ్యాపారులు వన్ టైమ్ సబ్ స్క్రిప్షన్ కింద రూ. 499 చెల్లించాలి. ఆ తర్వాత వారి సెటిల్మెంట్ ఖాతా నుండి నెలలో 25 రోజుల పాటు రోజుకు రూ.5 డిడక్ట్ అవుతుంది. ఏడాది ప్లాన్లో వ్యాపారి సెటిల్మెంట్ అకౌంట్ నుండి రూ.1,499 డిడక్ట్ అవుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్ తన సొంత క్యూ ఆర్ కోడ్ల వినియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆడియో నోటిఫికేషన్ సేవలను పొందుతున్న వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది. గూగుల్ పే క్యూఆర్ కోడ్ల ద్వారా నెలలో రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిగిన తర్వాత రూ. 125 క్యాష్బ్యాక్ను పొందవచ్చని గూగుల్ వెల్లడించింది. -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఏఐ ద్వారా వచ్చే సమాచారంలో నిజం ఎంత? దాన్ని ఏ మేరకు నమ్మొచ్చు? మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో అది అందిస్తున్న సమాచారంలో నిజాలు కరవవుతున్నాయి. దాంతో ప్రజలు, జాతుల మధ్య అనిశ్చితులు ఎదురవుతున్నాయి. తాజాగా గూగుల్ జెమిని ఏఐ చారిత్రాత్మక పొరపాటు చేసినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. జెమిని ఏఐ టూల్ను పోప్కు సంబంధించిన ఫొటోలు కావాలని అడిగినపుడు నల్లజాతీయులు పోప్గా ఉన్న చిత్రాలను చూపించినట్లు తెలిసింది. కొన్నిసార్లు ముదురు చర్మంతో ఉన్న ఫొటోలను అందించినట్లు గుర్తించారు. దాంతో గూగుల్ జెమిని చారిత్రాత్మక పొరపాటు చేసినట్లయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో గూగుల్ మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సంఘటనపై జెమిని ఏఐ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ గూగుల్ పక్షపాత ధోరణిని తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన కారణాలు తెలుసుకుని ఏఐ నిబంధనలకు అనుగుణంగా ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను రూపొందిస్తామన్నారు. ఘటనకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఇదీ చదవండి: దేశం విడిచివెళ్లకుండా ప్రముఖ కంపెనీ సీఈఓకు ఈడీ నోటీసులు గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ మోడల్ను ఇటీవలే పరిచయం చేసింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలిపింది. జెమిని 1.0 వెర్షన్ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. జెమిని అల్ట్రా, జెమిని ప్రో, జెమిని నానో. ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్ డివైజ్ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ వివరించింది. -
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్కు పోటీగా ఫోన్పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే..
భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తెరతీసింది. తాజాగా ఫోన్పే ఇండస్ యాప్స్టోర్ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్ను ఈ యాప్స్టోర్లో పొందుపరిచింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్పార్టీ పేమెంట్ గేట్వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఫోన్పే యాప్ లేదా ఇండస్యాప్స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్స్టోర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్లో మరింత పోటీకి ఈ యాప్స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు. ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా.. ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్ల డౌన్లోడ్ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. -
గూగుల్లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా?
ద్రవ్యోల్బణ భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో చాలా టెక్ కంపెనీలు కాస్ట్కటింగ్ పేరిట ఉన్న ఉద్యోగులకు ఉద్వాసన పలకడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నాయి. అందుకు భిన్నంగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. మంచి నైపుణ్యాలు కలిగి ఉండే ఉద్యోగార్థులకు మరింత జీతం ఎక్కువ ఇచ్చైనా వారి సేవలు వినియోగించుకునేందుకు ముందుకొస్తుంది. తాజాగా ఒక నిపుణుడిని అట్టేపెట్టుకునేందుకు టెక్ దిగ్గజం గూగుల్ అతడి జీతాన్ని 300 శాతం పెంచేందుకు సిద్ధమయ్యింది. గూగుల్లో పనిచేస్తున్న సదరు నిపుణుడు పర్ప్లెక్సిటీ ఏఐకి మారాలని నిర్ణయించుకున్నాడు. దాంతో గూగుల్ అతడి జీతాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ఆ ఉద్యోగ మార్పును నిలువరించిందని పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఇటీవల బిగ్ టెక్నాలజీ పాడ్కాస్ట్లో వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ ‘ప్రధాన టెక్ కంపెనీలు తమ కీలక నిపుణులను నిలబెట్టుకునేందుకు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయాన్ని’ వివరించేందుకు ఉదాహరణగా ఈ సంఘటనను తెలిపారు. ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే.. ఆ నిపుణుడికి కృత్రిమమేధ (ఏఐ) విభాగంతో ప్రత్యక్ష సంబంధం లేదనీ, సెర్చ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. అయినా, ఏఐ సంస్థకు మారేందుకు ప్రయత్నించినప్పుడు గూగుల్ ఈ చర్యలకు పూనుకుందన్నారు. టెక్ పరిశ్రమలో తొలగింపుల గురించి ఆయన మాట్లాడుతూ.. కంపెనీ ఉత్పాదకతకు పెద్దగా ఉపకరించకున్నా, అధిక జీతాలు పొందుతున్న ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ఐటీ రంగంలో 32,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. -
పుణెలో గూగుల్ కొత్త ఆఫీస్.. ఎలా ఉందో చూడండి..
Google New Office In Pune : భారత్లో విస్తరణను కొనసాగిస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ( Google ) ఇటీవల పుణెలోని కోరేగావ్ పార్క్ అనెక్స్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యాలయం ద్వారా గ్లోబల్ ఇంజినీరింగ్ బృందాల సహకారంతో అధునాతన ఎంటర్ప్రైజ్ క్లౌడ్ టెక్నాలజీల రూపకల్పన, రియల్ టైమ్లో సాంకేతిక సలహాలను అందించడం, ప్రొడక్ట్ ఇంప్లిమెంటేషన్ నైపుణ్యాలను అందిస్తారు. ఇక్కడ 1,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని అంచనా. పుణెలోని గూగుల్ కొత్త ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న అర్ష్ గోయల్.. అక్కడ ఉద్యోగుల కోసం అందుబాటులో ఉన్న పలు సౌకర్యాల గురించి తెలియజేశారు. దీనికి సంబంధించి తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. విశాలమైన ఆఫీస్లో అందమైన ఇంటీరియర్స్ తోపాటు నోరూరించే ఆహారంతో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్ వంటి ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. ''పుణెలో కొత్తగా ప్రారంభించిన గూగుల్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోజు ఎలా ఉంటుందో చూడండి'' అంటూ తన ఫోలోవర్లతో వీడియోను పంచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 4,70,000 కుపైగా వీవ్స్, 18,000 కుపైగా లైక్లను పొందింది. చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ కొత్త ఆఫీస్ ఇష్టపడ్డారు.అక్కడ పని చేయడానికి తాము ఇష్టపడుతున్నట్లు కామెంట్లు పెట్టారు. పుణెలో ఏర్పాటైన ఈ కొత్త ఆఫీస్తో గూగుల్కి ఇప్పుడు భారత్లో హైదరాబాద్లోని తన దేశ ప్రధాన కార్యాలయంతో సహా ఐదు కార్యాలయాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Arsh Goyal (@arshgoyalyt) -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
ఉక్రెయిన్కు మరోసారి గూగుల్ సపోర్ట్ ఫండ్.. ఈసారి ఎంతంటే?
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్థ భారీగా దెబ్బతినింది. ఉక్రెయిన్ను ఆదుకోవడానికి టెక్ దిగ్గజం గూగుల్ 10 మిలియన్ డాలర్ల (రూ. 83 కోట్ల కంటే ఎక్కువ) విలువైన స్టార్టప్ సపోర్ట్ ఫండ్ను ప్రకటించింది. చాలా మంది ప్రజలు దేశాన్ని దాటి వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోని వ్యాపారాలను నిర్వహించుకోవడానికి గూగుల్ ఈ సపోర్ట్ ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ దేశంలో పెద్దపెద్ద భవనాలు, హాస్పిటల్స్, స్కూల్స్ వంటివి కూడా బాగా దెబ్బతిన్నాయి. నిత్యావరాలకే కష్టమైన ఉక్రెయిన్ను ఆదుకోవడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ 2022 మార్చిలో ఫండ్ ప్రకటించింది. ఉక్రెయిన్ను గూగుల్ ఇప్పటికి కూడా తన మద్దతు అందిస్తూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి సహాయక చర్యలకు మద్దతుగా 45 మిలియన్ డాలర్ల నగదు అందించినట్లు సమాచారం. గూగుల్ ఫండింగ్ను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ ఫండ్ సపోర్ట్తో స్టార్టప్లు 15.8 మిలియన్ ఫాలో ఆన్ ఫండింగ్ను పొందాయి. దీంతో ఆ దేశంలో ఉపాధి గణనీయంగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదీ చదవండి: విల్లాగా మారిన విమానం.. ఫిదా అవుతున్న జనం - వీడియో -
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సంస్థలో విషాదం చోటు చేసుకుంది. ఆ కంపెనీకి చెందిన మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ కుమారుడు 19 ఏళ్ల మాక్రో ట్రోపర్ మరణించారు. నార్తన్ కాలిఫోర్నియాలోని బర్కిలీ నగరం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన హాస్టల్లో మరణించిట్లు ట్రాపర్ తల్లిదండ్రులు నిర్ధారించారు. ట్రోపర్ ఎందుకు మరణించారనే విషయంపై స్పష్టత లేదు. ట్రోపర్ ఆపస్మారక స్థితిలో జారుకున్నప్పుడు సమాచారం అందుకు బర్కిలీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ట్రాపర్ మరణించినట్లు తేలింది. ట్రోపర్ ఎందుకు మరణించారనే అంశం వెలుగులోకి వచ్చేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టొచ్చంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టాక్సికాలజీ రిపోర్ట్ కోసం కుటుంబం ఎదురు చూస్తున్నారు. మనవడి మరణంపై ట్రోపర్ నాయనమ్మ, యూట్యూబ్ మాజీ సీఈఓ సూసన్ వోజిస్కీ తల్లి ఎస్తేర్ వోజిస్కీ కన్నీరుమున్నీరుగా విలపించారు. మెటా పోస్ట్లో తన మనవడిది ప్రేమించే తత్వం, గణిత మేధావి’ అంటూ అభివర్ణించింది. యూట్యూబ్ సీఈఓ సూసన్ వోజిస్కీ తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్కు సీఈఓగా వ్యవహరించిన సూసన్ వోజిస్కీ గత ఏడాది రాజీనామా చేశారు. 54 ఏళ్ల సూసన్ తన కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తొమ్మిదేళ్ల క్రితం తాను యూట్యూబ్లో చేరినప్పుడు, మంచి లీడర్షిప్ టీంను ఏర్పాటు చేశానని, నీల్ మోహన్ ఆ బృందంలో భాగమని సూసన్ చెప్పారు. సూసన్ రాజీనామాతో భారత సంతతికి చెందిన నీల్ మోహన్, యూట్యూబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు. -
అన్నీ పిచ్చిరాతలే.. గూగుల్ రియాక్షన్ ఇదే..
గూగుల్ను అడిగితే చెప్పలేందంటూ ఉండదు. దాదాపు ప్రపంచంలోని అన్ని అంశాలకు చెందిన సమాచారం అంతా అందులో దాగిఉంది. ఏదైనా వస్తువు కొనాలంటే వెంటనే గూగుల్లోకి వెళ్లి రేటింగ్ చూడటం అలవాటైంది. కానీ నిజంగా అందులో ఇస్తున్న సమీక్షల్లో నిజమెంతనే అనుమానం రాకపోదు. కొందరు కావాలనే కొన్ని ప్రొడక్ట్లకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ రేటింగ్ ఇస్తూ సామాన్యులను మోసం చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ఉపయోగించి గూగుల్ మ్యాప్స్, సెర్చింగ్ లో 170 మిలియన్లకు పైగా పాలసీ ఉల్లంఘించే రివ్యూలను బ్లాక్ చేసినట్లు తెలిసింది. గతేడాది కంటే 45 శాతం ఎక్కువ నకిలీ రివ్యూలను తొలగించేందుకు ఈ అల్గారిథమ్ సహాయపడిందని గూగుల్ తెలిపింది. వీటితోపాటు 12 మిలియన్లకు పైగా నకిలీ వ్యాపార ప్రొఫైల్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు చెప్పింది. గతేడాది గూగుల్ తన కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ను ప్రారంభించింది. ఇది రోజువారీ దీర్ఘకాలిక సంకేతాలను పరిశీలించి వేగంగా నకిలీ రివ్యూలను గుర్తిస్తుంది. దీంతోపాటు వీడియో మోడరేషన్ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడం ద్వారా 2023లో 14మిలియన్ల పాలసీ ఉల్లంఘనల వీడియోలను గుర్తించినట్లు గూగుల్ తెలిపింది. ఇది గతేడాది కంటే 7 మిలియన్లు ఎక్కువ. 2 మిలియన్ల హ్యాకర్ అటెంప్ట్ల నుంచి వ్యాపార యజమానులను రక్షించినట్లు గూగుల్ పేర్కొంది. ఇది 2022లో 1 మిలియన్గా ఉంది. గూగుల్ గుర్తించినవాటిలో చాలావరకు కొన్ని సంస్థలకు చెందిన ప్రొడక్ట్ల రివ్యూలు ఫేక్ అని తేలింది. కొన్ని ఉత్పత్తులకు తక్కువ సమయంలోనే పాలసీలు, నియమాలకు విరుద్ధంగా 5స్టార్ రేటింగ్లు, అనధికార రివ్యూలు వస్తున్నట్లు గమనించారు. కొన్నింటికి 1 స్టార్ రేటింగ్లు వస్తున్న ఘటనలు ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఒకప్పటి ఆర్థిక అద్భుతం.. కోల్పోయిన మరో స్థానం అనుమానాస్పద యాక్టివిటీస్ గుర్తించిన తర్వాత 1.23 లక్షల కంటే ఎక్కువ వ్యాపారాలపై తాత్కాలిక రక్షణ కల్పించినట్లు గూగుల్ పేర్కొంది. గతేడాది మ్యాప్స్ లో చిన్న వ్యాపారాలపై ఫేక్ రివ్యూస్ పోస్ట్ చేసిన నటుడిపై గూగుల్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
జెమిని ఏఐ యూజర్లకు గూగుల్ హెచ్చరిక!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఏఐ ఆధారిత చాట్బాట్ బార్డ్లో కీలక మార్పులు చేస్తూ వస్తుంది. బార్డ్ దాని పేరును జెమినిగా మార్చడం, కొత్త ఆండ్రాయిడ్ యాప్ను విడుదల చేయడం, కొత్త అల్ట్రా 1.0 భాషా మోడల్ను ఆవిష్కరించడం వంటివి ఉన్నాయి. అయితే, ఈ తరుణంలో గూగుల్ సంస్థ జెమిని యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. చాట్బాట్తో ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దని కోరింది. జెమిని యాప్ లేదా వెబ్సైట్లు గూగుల్ అసిస్టెంట్కి అత్యంత అడ్వాన్స్డ్ వెర్షన్. ఇందులో ఎదైనా సమాచారం గురించి తెలుసుకుని దాన్ని డిలీట్ చేస్తే డేటా అంటా గూగుల్ డేటాలో స్టోరేజ్ అవుతాయి. యూజర్ తన డివైజ్లో జెమిని యాక్టివిటీని డిసేబుల్ చేసినా.. అప్పటి వరకు సెర్చ్ చేసిన సమాచారం వివరాలు 72 గంటలపాటు స్టోర్ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్ స్టోరేజ్లో ఉంటుంది అని గూగుల్ జెమిని యాప్ ప్రైవసీ బ్లాగ్లో పేర్కొంది. -
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్ఫోర్స్లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
లింక్డిన్లో ఉద్యోగం ఊడింది .. అదృష్టం వరించింది!
ఐర్లాండ్కు చెందిన ‘మరియానా కొబయాషి’కి లింక్డిన్లో పని చేయడం ఓ కల. పలు దిగ్గజ కంపెనీల్లో ఎన్నో తిరస్కరణల తర్వాత చివరికి 2022లో ఉద్యోగం సాధించింది. అదే కొబయాషి జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది. లింక్డిన్లో కోరుకున్న జాబ్.. సంతృప్తినిచ్చేలా జీతం. ఇంతకంటే ఇంకేం కావాలని అనుకుంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది. కానీ గతేడాది ఆర్ధిక మాంద్యం భయాలు ఆమె ఉద్యోగానికి ఎసరు పెట్టాయి. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి అంతర్జాతీయ కంపెనీల వరకు లేఆఫ్స్ ప్రకటించాయి. ఈ తొలగింపుల్లో 2023 మేలో కోబయాషిని తొలగిస్తూ లింక్డిన్ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం ఊడింది బ్రతుకు జీవుడా అంటూ ఇతర కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి చెడులో మంచి ఉందనే నానుడిని నిజం చేస్తూ..సరిగ్గా ఆరు నెలల తర్వాత గూగుల్ నుంచి ఓ మెయిల్ వచ్చింది. దాదాపు రెట్టింపు జీతంతో, ఉన్నత స్థాయిలో జాబ్ ఆఫర్ చేయడంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది. ఈ నేపథ్యంలో లేఆఫ్స్ గురైన సందర్భంలో ఆమె మానసిక సంఘర్షణ ఎలా ఉందో చెబుతూ తన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకుంది. లింక్డిన్లో లేఆప్స్ సమయంలో తనకు ఎలా అనిపించిందో గుర్తు చేసుకుంటూ..‘ నేను అక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లేఆఫ్స్ నన్ను షాక్కి గురి చేశాయి. లింక్డిన్లో ఉద్యోగం సాధించడం ఓ కలగా భావించనందునే .. అందులో ఉద్యోగం వచ్చిన తర్వాత ఊహాలోకంలో విహరించాను. అదెంత తప్పో ఆ తర్వాతే తెలిసింది. లేఆఫ్స్కు గురయ్యాను. నాకున్న వ్యాల్యుని ఉద్యోగంతో ముడిపెట్టకూడదని, లేదంటే ఎప్పుడూ సంస్థల్ని నమ్ముకుని ఉండొద్దనే అనుభవం నాకు నేర్పించింది. తొలగింపుల నుంచి బయటపడేందుకు ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాను. చివరికి గూగుల్ డబ్లిన్ కార్యాలయంలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ స్థానాన్ని పొందినట్లు తెలిపింది. ఇప్పుడు నన్ను నేను చూసుకుని గర్వపడుతున్నాను. లింక్డిన్లో ఉద్వాసనకు గురైన తర్వాత నా కెరీర్లో రెండు అత్యున్న స్థానాలకు చేరుకున్నాను. ఒకటి జీతం డబుల్ అయ్యింది. రెండోది నాకు సరిపోయే గూగుల్లో ఉద్యోగం పొందడం. అదే లింక్డిన్లో ఉంటే ఆ రెండు అసాధ్యం’ అని వెల్లడించింది. ఈ సందర్భంగా లేఆఫ్స్ గురైన వారికి కోబయాషి పలు సూచనలు చేశారు. ఉద్యోగం పోగొట్టుకున్న వారికి నేనిచ్చే సలహా ఒకటే ప్రతి సంక్షోభంలోనూ ఓ అవకాశాన్ని వెతుక్కోడింది. అదే మిమ్మల్ని అత్యున్న స్థాయిలో ఉంచేలా చేస్తోంది అని ముగించింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డిన్ గత ఏడాది రెండు సార్లు ఉద్యోగుల్ని తొలగించింది. రెండవ సారి ఇంజనీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ విభాగాలలో దాదాపూ 700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది. వారిలో మరియానా కొబయాషి ఒకరు -
ఆగ్రహంతో రగిలిపోతున్న గూగుల్ ఉద్యోగులు.. కంపెనీకి చుక్కలు!
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్పై ఆ కంపెనీ ఉద్యోగులు అసంతృప్తి, ఆగ్రహాలతో రగిలిపోతున్నారు. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్ల్లో సుమారు 15,000 మందిని తొలగించింది. ఈ తొలగింపులను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ జనవరి 18న యునైటెడ్ స్టేట్స్లోని ఐదు గూగుల్ క్యాంపస్లలో నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. తొలగింపులను సమర్థించుకోవడానికి కంపెనీ చెబుతున్న కారణాలను బోగస్గా పేర్కొంటూ వాటిని సవాలు చేయడం ఈ నిరసనల లక్ష్యం అని బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. అసంతృప్త ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్.. గత సంవత్సరంలో తొలగింపుల వల్ల దాదాపు 15,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఇదే జనవరి 18న యూఎస్ అంతటా ఐదు గూగుల్ క్యాంపస్లలో నిరసనలు చేపట్టేందుకు యూనియన్ను ప్రేరేపించింది. లేఆఫ్ల కారణంగా కొంతమంది జాబ్స్ పోవడమే కాకుండా ఉన్న ఉద్యోగులపై ప్రభావం గురించి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కమ్యూనికేషన్కు నాయకత్వం వహించే స్టీఫెన్ మెక్ముర్ట్రీ ఆందోళన వ్యక్తం చేశారు. లేఆఫ్లు ఉద్యోగులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా విస్తృతమైన ఆందోళనను కలిగిస్తున్నాయన్నారు. పెరుగుతున్న విమర్శలకు గూగుల్ ప్రతిస్పందిస్తూ తమ చర్యలు "కంపెనీ అతిపెద్ద ప్రాధాన్యతలు, రాబోయే ముఖ్యమైన అవకాశాలలో బాధ్యతాయుతంగా పెట్టుబడి పెట్టడం"లో భాగమని పేర్కొంది. సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని తొలగింపులు ఉన్నట్లు చెబుతోంది. కంపెనీ లోపల, వెలుపల కొత్త ఉద్యోగాలు పొందడంలో బాధిత ఉద్యోగులకు సహాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నట్లు గూగుల్ పేర్కొంటోంది. -
24 ఏళ్లకే ఉద్యోగం.. 29 ఏళ్లకే రిటైర్మెంట్.. గూగుల్ ఉద్యోగి స్ట్రాటజీ అదిరింది!
24 ఏళ్లకే ఉద్యోగం..29 ఏళ్లకే రిటైర్మెంట్. ఆహా! జీవితం అంటే ఇది’ అని అనుకుంటున్నారా? ఐఐటీ బాంబే పూర్వ విద్యార్ధి డేనియల్ జార్జ్ (29) ఇలాగే అనుకున్నాడు. 6 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి చివరికి రిటైర్మెంట్ తీసుకున్నాడు. డేనియల్ జార్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణుడు. 2018లో జార్జ్ ఐఐటి బాంబే నుండి బిటెక్ పూర్తి చేశాడు. 24 ఏళ్ల వయస్సు అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఏడాదికి 265,000 డాలర్ల (సుమారు రూ. 2.20 కోట్లు) ప్యాకేజీతో జాబ్ సంపాదించాడు. అంత డబ్బు ఎలా ఆదా చేశాడు అతను గూగుల్లో పనిచేసే సమయంలో సంపాదించిన డబ్బును ఆదా చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో లెక్కలేసుకుని తన శాలరీని ఎంత మొత్తంలో ఆదా చేసే త్వరగా రిటైర్ అవ్వచ్చు? అనంతరం తన సొంత దేశమైన భారత్లో ఎలా నివసించవచ్చో గుర్తించాడు. అంతే అప్పటి నుంచి రిటైర్మెంట్ కోసం శాలరీని సేవ్ చేయడం మొదలు పెట్టాడు. గూగుల్లో పనిచేయడం ఓ కల గూగుల్లో పనిచేయడం ఒక కల. అదో ‘మాయా అద్భుత భూభాగం’లాంటిదని అభివర్ణిస్తూ డబ్బుల్ని ఎలా సేవ్ చేశాడో చెప్పుకొచ్చాడు. ముందుగా గూగుల్లో అపరిమిత ఆహారం, పానీయాలు, పింగ్ పాంగ్ టేబుల్స్ , వీడియో గేమ్ రూమ్లు, సాకర్ ఫీల్డ్లు, జిమ్, టెన్నిస్ కోర్ట్లు, ఫ్రీ మసాజ్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించింది. వాటిని వినియోగించుకున్నాడు. కానీ అప్పుడే జార్జ్ గూగుల్లో తాను సంపాదించే జీతంలో సగానికిపైగా మొత్తాన్ని ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించాడు. ట్యాక్స్ తగ్గించుకునేందుకు అప్పటి నుంచి జార్జ్ తన ట్యాక్స్ను తగ్గించుకోవడానికి రిటైర్మెంట్ అకౌంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. ఆఫీస్కి నడిచి వెళ్లడం, గూగుల్లో పని చేసే సమయంలో మూడుపూటలా అక్కడే భోజనం చేయడంతో డబ్బు ఆదా అయ్యేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఆహారాన్ని ఖర్చు చేసినట్లు చెప్పాడు. సాధారణంగా సిలికాన్ వ్యాలీలో ఇంటి రెంట్ చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకుంది. అయినప్పటికీ, తన స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్ని షేర్ చేసుకోవడం వల్ల అద్దె తగ్గిందని అన్నాడు. ట్యాక్స్ చెల్లింపులు ఎంతంటే? జార్జ్ ప్రతి సంవత్సరం పన్ను ఆదా చేసుకునేందుకు రూ.62లక్షలు పెట్టుబడి పెడుతూ వచ్చాడు. రిటైర్మెంట్ అయ్యేందుకు కావాల్సినంత మొత్తాన్ని సమకూర్చుకున్నాడు. గత ఏడాది జార్జ్ 29 ఏళ్ళ వయసులో థర్డ్ ఇయర్ ఏఐ అనే స్టార్టప్ను ప్రారంభించాడు. “ఇప్పుడు నేను జీతం సంపాదించడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నేను నా కంపెనీని ప్రారంభించడం కోసం రిస్క్ చేయగలను. నా భార్య పిల్లల కోసం కావాల్సినంత సంపాదించాను. అందుకే త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ఆర్ధిక పాఠాలు చెబుతున్నాడు. -
ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి.. వారం వ్యవధిలో మరో షాకిచ్చిన అమెజాన్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వారం రోజుల క్రితం అమెజాన్ తన పేరెంట్ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్లో ‘బై విత్ ప్రైమ్’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఓ వైపు తొలగింపులు.. మరోవైపు పెట్టుబడులు 2022లో బై విత్ ప్రైమ్ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్పై అమెజాన్ ప్రకటన చేసింది. సిబ్బందిని ఆదుకుంటాం తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ట్విచ్లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఉద్యోగుల్ని నిండా ముంచుతున్న ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజా నివేదిక వెల్లడించింది. మరింత మందిని తొలగిస్తూ గూగుల్ ప్రకటన గూగుల్ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి. -
ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా!
గత ఏడాది పెద్ద కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలు, 2024లో అయినా పరిస్థితులు చక్కబడుతాయనుకుంటే ఇప్పటికే లేఆప్స్ మొదలైపోయాయి. జనవరి 1 నుంచి వివిధ కంపెనీలు 7500 మంది ఉద్యోగులను తొలగించాయి. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ సంస్థ ఈ ఏడాది కూడా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించడానికి ఏఐ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేషన్ వంటి వాటిని అనుసరించనున్నట్లు, ఈ కారణంగా మరింత మంది ఉద్యోగుల తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. గూగుల్ ఇప్పటికే జెమిని' (Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఇది తప్పకుండా భవిష్యత్తులో పనిభారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది కూడా ఈ ఏడాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవడానికి కారణమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదీ చదవండి: టీసీఎస్ కీలక నిర్ణయం.. 5 లక్షల మందికి ట్రైనింగ్! ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపులు గతేడాది మాదిరిగా అన్ని విభాగాల్లో ఉండే అవకాశం ఉండదని పిచాయ్ వెల్లడించారు. అయితే గత వారం సంస్థ తన వాయిస్ అసిస్టెంట్ యూనిట్లోని పిక్సెల్, నెస్ట్, ఫిట్బిట్కి బాధ్యత వహించే హార్డ్వేర్ టీమ్లు, అడ్వర్టైజింగ్ సేల్స్ టీమ్ & ఆగ్మెంటెడ్ రియాలిటీ టీమ్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. -
గూగుల్ తొలగింపులు.. 19 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగం రాత్రి రాత్రే ఊడింది!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించినట్లు బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది. అయితే ఎంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చిందనే విషయంపై స్పష్టత రానప్పటికి.. ఆ సంస్థలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభావితం అయినట్లు సమాచారం. వారిలో గూగుల్లో 19 ఏళ్ల పాటు పనిచేసిన కెవిన్ బౌర్డిల్లాన్ ఒకరు. ‘బుధవారం రాత్రి నన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ చెప్పింది. ఏది ఏమైనప్పటికి గూగుల్లో ఉద్యోగం పోవడం సేద తీరేందుకు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికింది’ అని ట్వీట్ చేశారు. ‘ఈ తొలగింపుల గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు. నా ఉద్యోగం పోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఒకందుకు సంతోషమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావడం అవసరం. ప్రస్తుతానికి జాబ్ చేయాలా? లేదంటే బిజినెస్ చేయాలా? ఇలా ఆలోచిండచం లేదు. నా ఇష్టాఇష్టాల గురించి ఆలోచిస్తున్నానని’ ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, గూగుల్ బుధవారం వందలాది ఉద్యోగాల తొలగింపుల్ని ప్రకటించింది. గూగుల్తో పాటు ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎంలు సైతం ఉద్యోగులకు పింక్ సిప్ల్లు జారీ చేసేందుకు సిద్ధమయ్యాయి. End of an era! After 19 years of working at @Google, with more than 16 of them on the team that I founded, I made the tough decision yesterday morning to finally bite the bullet and find out that I'd been laid off overnight. — Kevin Bourrillion (@kevinb9n) January 12, 2024 -
యూజర్లకు పెద్ద దెబ్బే .. మరో సర్వీస్ను షట్డౌన్ చేయనున్న గూగుల్!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉండే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ వెబ్సైట్ను శాస్వతంగా షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నెలలో ఈ వెబ్సైట్ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ఎవరైనా ఈ బిజినెస్ ప్రొఫైల్ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే డైరెక్ట్గా కస్టమర్ల బిజినెస్ ప్రొఫైల్లోకి వెళ్తారని పేర్కొంది. గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే ఏమిటి? గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది గూగుల్ సెర్చ్, మ్యాప్స్లో వారి వ్యాపారానికి సంబంధించిన అడ్రస్లు డిస్ప్లే చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని గూగుల్ వ్యాపారాలు నిర్వహించే వారికి ఉచితంగా అందిస్తుంది. బిజినెస్ ప్రొఫైల్తో వినియోగదారులు కస్టమర్లతో కనెక్ట్ అవ్వవచ్చు. అప్డేట్లను పోస్ట్ చేయవచ్చు. వారి ప్రొడక్ట్లు, అందిస్తున్న సేవల గురించి చెప్పొచ్చు. ప్రత్యామ్నాయం ఏంటి? గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ షట్డౌన్ అవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ను వినియోగించే బదులు సొంతంగా కొత్త వెబ్సైట్ను తయారు చేసుకోవడంతో పాటు అందులో మీ బిజినెస్ అడ్రస్తో పాటు బిజినెస్ ప్రొఫైల్ను అప్డేట్ చేసుకోవడం మంచిదని గూగుల్ యూజర్లకు సూచించింది. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజినీరింగ్ టీమ్లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్వేర్ టీమ్లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్లోని వర్కర్లపైనా లేఆఫ్ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్వేర్ టీమ్లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
గూగుల్లో శాలరీ తక్కువ.. ‘జాబ్ కంటే జీతం ముఖ్యం!’ మరి మీకు?
మీకు జీతం ముఖ్యమా? శాలరీ ముఖ్యమా? అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జాబ్ కంటే తీసుకునే జీతం ఎంత ఎక్కువైతే మంచిదనే అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటారు మనలో చాలా మంది. అందుకు మెటాలాంటి దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తూ వందల కోట్లలో వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు అతీతులేం కాదు. గతంలో వాళ్లు కూడా జీతం తక్కువైందని పేరున్న కంపెనీలు పిలిచి ఉద్యోగం ఇస్తాంటే సున్నితంగా తిరస్కరిస్తున్న సందర్భాలున్నాయి. మరి మీరూ? ట్యూరింగ్ అవార్డ్ను సొంతం చేసుకుని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైంటిస్ట్ యాన్ లెకున్. ఏఐలో రంగంలో చేసిన పరిశోధనలకు గాను నోబెల్ పురస్కారంతో సమానమైన ట్యూరింగ్ అవార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్గా ఉండే యాన్ లెకున్ తాజాగా ఎక్స్.కామ్లో తనకు గూగుల్ జాబ్ ఆఫర్ ఇస్తే దాన్ని ఎందుకు వదులుకున్నారో తెలిపారు. అనేక కారణాల వల్ల 2002లో గూగుల్లో రీసెర్చ్ డైరెక్టర్ జాబ్ ఆఫర్ను తిరస్కరించినట్లు వెల్లడించారు. వాటిల్లో ప్రధానంగా జీతం తక్కువ కావడమేనని అన్నారు. జాబ్ కన్నా.. జీతం ముఖ్యం ‘‘జీతం తక్కువగా ఉంది. స్టాక్ ఆప్షన్ ఎక్కువే. కానీ నాకు కాలేజీ చదవాల్సిన టీనేజ్ కుమారులున్నారు. డబ్బులు అవసరం. న్యూజెర్సీలో కంటే సిలికాన్ వ్యాలీలో నివాసం ఖరీదైన వ్యవహారం’’ అని అన్నారు. గూగుల్ ఆఫర్ తిరస్కరణ ‘‘ఆ సమయంలో గూగుల్కి 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నాయి. ఆదాయం లేదు. ఆ సమయంలో గూగుల్లో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి సమయాల్లో గూగుల్లో చేరి కార్పొరేట్ వ్యూహం, సాంకేతికత అభివృద్ధి, ఉత్పత్తులు, నిర్వహణ మొదలైన వాటి మెషిన్ లెర్నింగ్, విజన్, రోబోటిక్స్ అండ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ విభాగాల్లో రీసెర్చ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టే గూగుల్ ఆఫర్ను తిరస్కరించా’’నని యాన్ లెకున్ అన్నారు. -
డేంజర్ యాప్స్పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్లను గూగుల్, యాపిల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్కు చెందిన ఎయిర్లో, స్పెయిన్కు చెందిన హోలాఫ్లై రెండు యాప్లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
వెబ్సైట్ల రారాజు గూగులే..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్ వెబ్సైట్కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వెబ్సైట్గా గూగుల్ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్ ట్రాఫిక్ ఉండే టాప్–10 వెబ్సైట్లలో నాలుగు గూగుల్కు చెందినవే. ► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్ వెబ్సైటే టాప్లో ఉంటూ వస్తోంది. అయితే టిక్టాక్ వెబ్సైట్ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్ను వెనక్కి నెట్టి టాప్లో నిలవడం గమనార్హం. ► పాపులర్ సైట్ల లిస్టులో యూట్యూబ్ 11వ స్థానంలో, అమెజాన్ 18వ, ఇన్స్ట్రాగామ్ 24వ, నెట్ఫ్లిక్స్ 25వ, వాట్సాప్ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్చాట్ 40వ, ట్విట్టర్ 45వ, లింక్డ్ఇన్ 68వ, జీమెయిల్ 79వ స్థానాల్లో ఉన్నాయి. -
గూగుల్ పరిస్థితులు బయటపెట్టిన మాజీ ఉద్యోగి
ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలామంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావొచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావొచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ.. జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది. గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి 'జోనాథన్ బెల్లాక్' ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలామంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీమ్ సమస్యలను పరిష్కరించడం మానేశారని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలలు తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతూ.. కొత్త ఆలోచనలను అందించడానికి జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే.. నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండటమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు. ఇదీ చదవండి: బంగారం కొనటానికి ఇది సరైన సమయం.. మళ్ళీ తగ్గిన ధరలు తన పదవీకాలం ముగిసే సమయానికి, వాణిజ్యపరంగా సాఫ్ట్వేర్ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్ట్ చేశారు. -
కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..?
కొత్త సంవత్సరంలో రాబోయే ఆసక్తికర అంశాల గురించి కృత్రిమమేధ ఏం చెబుతుందో వెతికే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా మనిషి శరీరానికి యంత్రాలు అమర్చే ప్రక్రియకు 2024 వేదిక అవుతుందని ‘గూగుల్ బార్డ్’ అంచనా వేసింది. దాంతో మానవులు అత్యంత సమర్థవంతంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మెదడులో అమర్చే చిప్లతో కంప్యూటర్కు అనుసంధానం కాగలిగే టెక్నాలజీ రూపొందుతుందని పేర్కొంది. గూగుల్ బార్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. మనుషుల మెదడు–కంప్యూటర్ అనుసంధానికి వీలుకల్పించే ‘బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ)’లు అభివృద్ధి చెందుతాయి. దీని సాయంతో కృత్రిమ చేతులు, కాళ్లు వంటి అవయవాల (బయోనిక్ లింబ్స్)ను, ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి వీలవుతుంది. భారీ బరువులను ఎత్తడం, అత్యంత వేగంగా పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం, మిలటరీ ఆపరేషన్స్ వంటివి సాధ్యమవుతాయి. అవయవాలు కోల్పోయినవారు, పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితం గడపవచ్చు. మెదడు-కంప్యూటర్లు కలిసి సృజనాత్మకత, మేధోశక్తి పెరుగుతుందని గూగుల్ బార్డ్ ద్వారా తెలిసింది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ రూపొందించిన బ్రెయిన్ చిప్లను ఈ ఏడాదే మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలించనుంది. న్యూరాలింక్ అధునాతన ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్’ (బీసీఐ) సాంకేతికతను మానవులపై ప్రయోగించే దశకు చేరుకుంది. నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్లు, చేతులు చచ్చుబడ్డవారు తమ అవయవాలను కదిలించేందుకు ఇది సాయపడుతుందని మస్క్ చెబుతున్నారు. అంతిమంగా దీనివల్ల ‘మానవాతీత శక్తి’ లభిస్తుందంటున్నారు. ఆయన ప్రణాళికల్లో సగం అమలైనా.. మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరతీస్తుంది. మన మెదడు.. శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల (న్యూరాన్లు) ద్వారా సంకేతాలను పంచుకుంటుంది. ఈ కణాలు పరస్పరం సంధానమై, ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేస్తాయి. న్యూరో ట్రాన్స్మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు మెదడులోని పలు న్యూరాన్లకు సమీపంలో ఎలక్ట్రోడ్లను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం ‘న్యూరాలింక్’ ప్రాజెక్టు ఉద్దేశం. దీని ద్వారా వాటిని ఆధునిక యంత్రాల నియంత్రణకు ఉపయోగించాలని ఆ సంస్థ భావిస్తోంది. నేరుగా చెప్పాలంటే మెదడులోని ఆలోచన శక్తి సాయంతో మనం యంత్రాలతో అనుసంధానం కావొచ్చు. అలాగే నాడీ, కదలికలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయవచ్చు.