‘పవర్‌ఫుల్‌’ ఫోన్‌.. రూ.13 వేలకే..! | Oppo K12x 5g Launched In India, Check Price, Specifications And Sale Details Inside | Sakshi
Sakshi News home page

‘పవర్‌ఫుల్‌’ ఫోన్‌.. రూ.13 వేలకే..!

Jul 29 2024 5:48 PM | Updated on Jul 29 2024 6:09 PM

Oppo K12x 5G launched price and sale details

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఒప్పో (Oppo) మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్‌ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.

ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో,  360 డిగ్రీల ఆర్మర్‌ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్‌ ఫోన్ స్పెసిఫికేషన్స్‌ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్‌ సేల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

స్పెసిఫికేషన్లు
» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌
» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే
» 6GB ర్యామ్‌+ 128GB స్టోరేజ్‌, 8GB ర్యామ్‌+ 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లు
» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్‌
» 32MP మెయిన్‌, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరా

ధర
ఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్‌ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement