new launches
-
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టయోటా క్రూయిజర్ హైరైడర్.. ఇప్పుడు మరికొన్ని కొత్త ఫీచర్లతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటర్స్ వెల్లడించింది.సరికొత్త టయోటా క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు.. ఆరు ఎయిర్బ్యాగ్స్ పొందుతుంది. ఈ సేఫ్టీ ఫీచర్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉందని కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏడబ్ల్యూడీ వేరియంట్లో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ స్థానంలో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, నిర్దిష్ట వేరియంట్స్లో ఎల్రక్టానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రవేశపెట్టినట్లు వివరించింది.కొత్త ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రారంభ ధర రూ. 11.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి ఈ కారు అదే పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. -
రూ.9.97 లక్షల డుకాటీ బైక్ లాంచ్: వివరాలు
డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ మోడల్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీని ధర రూ. 9.97 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. కానీ ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి మార్పు లేదు.డుకాటి స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ ఎడిషన్ అనేది.. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యంత సరసమైన డుకాటి బైక్. ఇందులో 803 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 73 హార్స్ పవర్, 65.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. సుమారు 176 కేజీల బరువున్న ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.స్క్రాంబ్లర్ ఐకాన్ డార్క్ దాని మెయిన్ ఫ్రేమ్, సైకిల్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్లో మాదిరిగానే ఉంటాయి. TFT డిస్ప్లే, రైడ్-బై-వైర్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. -
సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ఇదే: ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఎట్టకేలకు తన క్లాసిక్ 650 (Royal Enfield Classic 650) బైకును లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 3.37 లక్షల నుంచి రూ. 3.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2025 ఏప్రిల్ నుంచి మొదలవుతాయి.మొత్తం నాలుగు రంగులలో లభించే.. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ 648 సీసీ ఇంజిన్ ద్వారా 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉండే ఈ బైక్.. కొంత షాట్గన్ బైకును తలపిస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14.7 లీటర్లు. ఈ బైక్ బరువు 243 కేజీలు.ఇదీ చదవండి: భారత్ కోసం రెండు జపనీస్ బ్రాండ్ కార్లుకొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్.. సాధారణ 350 సీసీ బైకులోని ఫీచర్స్ కాకుండా, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్తో పాటు డిజి-అనలాగ్ డిస్ప్లే పొందుతుంది. USB ఛార్జర్ కూడా లభిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఫీచర్ క్లాసిక్ 650లో ఉంటుంది. అంతే కాకుండా 2025 క్లాసిక్ 650 బైక్ 19/18 ఇంచెస్ ట్యూబ్డ్ వైర్-స్పోక్ వీల్స్ పొందుతుంది. -
కొత్త అప్డేట్తో కేటీఎమ్ 390 డ్యూక్: రేటు మాత్రం సేమ్
కేటీఎమ్ కంపెనీ తన 390 డ్యూక్ 2025 బైకును అప్డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో క్రూయిజ్ కంట్రోల్ మాత్రమే కాకుండా.. ఇది కొత్త కలర్ ఆప్షన్తో లభిస్తుంది. దీని ధర రూ. 2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల కేటీఎమ్ 390 డ్యూక్ మరింత టూరింగ్-ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ బైక్ చిన్న అప్డేట్స్ పొందినప్పటికీ ధరలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికే ఈ బైక్ డీలర్షిప్లలో కనిపించింది. అంటే అమ్మకానికి వచ్చేసిందన్నమాట.ఈ బైక్ చూడటానికి.. దాని మునుపటి బైకుల కంటే కొంత భిన్నమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. కాబట్టి ఇది నలుపు రంగులో ఉండటం చూడవచ్చు. కాగా ఇప్పటికే ఈ మోడల్ నారింజ, నీలం రంగులలో ఉంది.ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇందులో 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో వస్తుంది. ఈ ఇంజిన్ 45.3 Bhp పవర్, 39 Nm టార్క్ అందిస్తుంది. పనితీరులో స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
దేశీయ విఫణిలో వోల్వో ఎక్స్సీ90 ఫేస్లిఫ్ట్ లాంచ్: పూర్తి వివరాలు
వోల్వో ఎక్స్సీ90 (Volvo XC90) ఫేస్లిఫ్ట్ భారతదేశంలో రూ. 1.02 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ అయింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ అప్డేట్స్ పొందింది. అయితే ఇది కేవలం ఒక వేరియంట్లో.. పెట్రోల్ పవర్తో మాత్రమే లభిస్తుంది. డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి.కొత్త వోల్వో ఎక్స్సీ90 ఫేస్లిఫ్ట్.. ఆరు రంగులలో, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 11.3 ఇంచెస్ పెద్ద టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్, పవర్డ్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.వోల్వో XC90 ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 250 Bhp పవర్, 360 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను పొందుతుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ గ్రాండ్ చెరోకీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి -
వివో కొత్త 5జీ స్మార్ట్ఫోన్: ధర కూడా తక్కువే!
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్లో తొలి స్మార్ట్ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్లెస్ ఇయర్ బడ్.మాస్టర్ సిరీస్లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్బడ్లు ఎల్హెచ్డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..సాఫ్ట్ టచ్ మెటీరియల్లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం. -
రూ.21.78 లక్షల కొత్త డుకాటి బైక్ ఇదే..
డుకాటి భారతదేశంలో 'డెజర్ట్ఎక్స్ డిస్కవరీ'ని లాంచ్ చేసింది. దీని ధర రూ. 21.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంది. అయితే అడ్వెంచర్ చేయడానికి మాత్రం అద్భుతంగా ఉంది.ఈ బైక్ స్టాండర్డ్, ర్యాలీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. స్టాండర్డ్ డెజర్ట్ఎక్స్ ధర రూ. 18.33 లక్షలు కాగా, డెజర్ట్ఎక్స్ ర్యాలీ ధర రూ. 23.70 లక్షలు. డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. పెద్ద విండ్షీల్డ్, ప్యానియర్లు, ఇంజిన్, బాడీవర్క్ ప్రొటెక్షన్, సమ్ గార్డ్, రేడియేటర్ గ్రిల్ పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ హీటెడ్ గ్రిప్లు, సెంటర్ స్టాండ్ వంటివి కూడా పొందుతుంది.డుకాటి డెజర్ట్ఎక్స్ డిస్కవరీ.. 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9250 rpm వద్ద, 108 Bhp పవర్, 6500 rpm వద్ద 92 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి.. మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: తక్కువ ధర.. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్: ఇదిగో బెస్ట్ కార్లు -
యాపిల్ కొత్త ఫోన్.. 16e: ధర తెలిస్తే కొనేస్తారు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 16ఈ'ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ 2025లో అత్యంత సరసమైన మోడల్గా ఐఫోన్ 16 లైనప్లోకి చేరింది. వేగవంతమైన పనితీరు కోసం ఇది ఏ18 చిప్ పొందుతుంది.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. ఫ్రీ ఆర్డర్స్ శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారంలో సేల్స్ మొదలవుతాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలుఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. -
రూ.12.90 లక్షల కవాసకి కొత్త బైక్ ఇదే..
కవాసకి కంపెనీ.. దేశీయ విఫణిలో కొత్త 'నింజా 1100ఎస్ఎక్స్' బైక్ లాంచ్ చేసిన.. దాదాపు రెండు నెలల తర్వాత, 'వెర్సిస్ 1100' (Kawasaki Ninja Versys 1100)ను రూ. 12.90 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. చూడటానికి వెర్సిస్ 1000 మాదిరిగే ఉండే.. ఈ బైక్ ఇప్పుడు శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది.ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన కవాసకి వెర్సిస్ 1100.. డ్యూయల్ టోన్ (మెటాలిక్ మాట్టే గ్రాఫేన్ స్టీల్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్) ఫినిషింగ్ పొందుతుంది. ఈ బైక్ డెలివరీలు ఈ నెల (ఫిబ్రవరి 2025) చివరిలో ప్రారంభమవుతాయి.కవాసకి వెర్సిస్ 1100లో ఉన్న అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే.. 1099 సీసీ ఇంజిన్. ఇది 9000 rpm వద్ద 133 Bhp పవర్, 7600 rpm వద్ద 112 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఇందులో క్విక్ షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంది.కవాసకి వెర్సిస్ 1100 సస్పెన్షన్.. అవుట్గోయింగ్ మోడల్ 1000 మాదిరిగానే ఉంటుంది. ముందు భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 43 mm USD ఫోర్క్, వెనుక భాగంలో ప్రీ-లోడ్ మరియు రీబౌండ్ సర్దుబాటుతో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ఫీచర్ల విషయానికొస్తే.. వెర్సిస్ 1100లో మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, కవాసకి ఇంటెలిజెంట్ ఏబీఎస్, సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ విండ్షీల్డ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైక్ కొనుగోలుదారులకు అదనపు పరికలు లేదా యాక్ససరీస్ కావాలంటే కొనుగోలు చేయవచ్చు. బైకును మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు. -
ఓలా కొత్త స్కూటర్లు.. 320 కి.మీ.రేంజ్!
ప్రముఖ విద్యుత్ ద్విచక్రవాహన సంస్థ ఓలా (Ola) తమ మూడో తరం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని భారత్ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. వీటిలో ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ.79,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమై అగ్రశ్రేణి వేరియంట్ ధర రూ.1,69,999 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ శ్రేణిలో ఎస్1 ప్రో (S1 Pro), ఎస్1 ప్రో+ (S1 Pro+), ఎస్1 ఎక్స్ (S1 X), ఎస్1 ఎక్స్+ (S1 X+) ఉన్నాయి.పేటెంట్ పొందిన 'బ్రేక్ బై వైర్' సాంకేతికతను ఓలా Gen 3 లైనప్కు జోడించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్, మోటర్ నిరోధకతను సమతుల్యం చేయడానికి బ్రేక్ లివర్పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఇది రేంజ్ను 15% పెంచడమే కాకుండా బ్రేక్ ప్యాడ్ మన్నికను రెట్టింపు చేస్తుంది. ఇక మెరుగైన భద్రత కోసం ప్రతి స్కూటర్లోనూ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అమర్చారు.బ్యాటరీ ఆప్షన్స్.. రేంజ్ఓలా మూడో తరం స్కాటర్లలో వివిధ బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. ఎస్1 ప్రో మోడల్ 3kWh, 4kWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. ప్రో+ వేరియంట్ 4kWh, 5.3kWh బ్యాటరీ ప్యాక్లను అందిస్తుంది. ఇక ఎంట్రీ-లెవల్ ఎస్1 ఎక్స్ 2kWh, 3kWh, 4kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే ఎస్1 ఎక్స్+ మాత్రం ప్రత్యేకంగా 4kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఎస్1 ప్రో+ మోడల్ 320 కిమీ రేంజ్ని, 141 కి.మీ.గరిష్ట వేగాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.ధరలుమోడల్బ్యాటరీ కెపాసిటీధరఓలా ఎస్1 ఎక్స్2 kWh రూ.79,999ఓలా ఎస్1 ఎక్స్ 3 kWh రూ.89,999ఓలా ఎస్1 ఎక్స్ 4 kWh రూ.99,999ఓలా ఎస్1 ఎక్స్+ 4 kWh రూ.1,07,999ఓలా ఎస్1 ప్రో 3 kWh రూ.1,14,999ఓలా ఎస్1 ప్రో 4 kWh రూ.1,34,999ఓలా ఎస్1 ప్రో+ 4 kWh రూ.1,54,999ఓలా ఎస్1 ప్రో+ 5.3 kWh రూ.1,69,999 -
కమర్షియల్ టైర్ విభాగంలోకి రాల్సన్ టైర్స్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'రాల్సన్ టైర్స్' (Ralson Tyres) హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్లను లాంచ్ చేసింది. సైకిల్ టైర్లతో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. దేశీయ విఫణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కమర్షియల్ టైర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.టైర్ల విభాగంలో 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాల్సన్ టైర్స్.. ఇప్పుడు తన కమర్షియల్ టైర్లను ఇండోర్లోని తయారీ కేంద్రంలో తయారు చేయనుంది. ఇప్పటి వరకు చిన్న టైర్లు మాత్రమే తయారైన ఈ ప్లాంట్లో పూర్తి స్థాయిలో పెద్ద టైర్ల ఉత్పత్తి జరగనుంది. ఈ టైర్లను భారతదేశంలో విక్రయించడంతో పాటు.. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భారతదేశంలో టైర్ ఎగుమతి విలువను 2030 నాటికి ఐదు బిలియన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోర్ ఫెసిలిటీలో తయారు చేసిన టైర్లను ఇప్పటికే 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ విభాగంలో కూడా కంపెనీ తన హవా చాటుకోవడానికి సిద్ధమైంది.భారత వాణిజ్య టైర్ల మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రాల్సన్ టైర్స్ పెద్ద టైర్లను తయారు చేయడానికి పూనుకుంది. ఈ విభాగంలో కూడా కంపెనీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు ప్రయోజనాలను చేకూర్చుతూ ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నాము.హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'మంజుల్ పహ్వా' (Manjul Pahwa) మాట్లాడుతూ.. మా ప్రీమియం శ్రేణి వాణిజ్య టైర్లను భారత మార్కెట్కు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైర్లు అత్యుత్తమ నాణ్యత, మన్నికతో.. వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు. -
మార్కెట్లోకి హీరో కొత్త స్కూటర్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. న్యూ డెస్టినీ 125 (New Destini 125) స్కూటర్ను విడుదల చేసింది. దీంతో 125సీసీ స్కూటర్ మార్కెట్లో విస్తృత మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సాంకేతికత, అసాధారణమైన మైలేజ్, టైమ్లెస్ డిజైన్ను మిళితం చేస్తూ పట్టణ వాహనదారుల కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.హీరో న్యూ డెస్టినీ 125 స్కూటర్.. డెస్టిని 125 వీఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్, డెస్టిని 125 జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ప్రారంభ ధరలు (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) వరుసగా రూ.80,450, రూ.89,300, రూ.90,300.ప్రత్యేకంగా పట్టణ వాహనదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన న్యూ డెస్టినీ 125.. వాహనదారుల భద్రత, సౌలభ్యం కోసం 30 పేటెంట్ అప్లికేషన్లతోపాటు ఇల్యూమినేటెడ్ స్టార్ట్ స్విచ్లు, ఆటో-కాన్సల్ వింకర్ల వంటి సరికొత్త ఫీచర్లతో వచ్చింది.‘హీరో డెస్టిని 125 అనేది మా ఆవిష్కరణ-ఆధారిత విధానానికి, పర్యావరణ అనుకూల చైతన్యాన్ని అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. 59 కి.మీ మైలేజ్, అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్ ఆధునిక రైడర్లకు గేమ్-ఛేంజర్’ హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్జిత్ సింగ్ పేర్కొన్నారు. -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్బ్యాగ్లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
రూ.8.89 లక్షల కొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్సైకిల్' (Triumph Motorcycle).. భారతదేశంలో రూ. 8.89 లక్షల (ఎక్స్ షోరూమ్) విలువైన 'స్పీడ్ ట్విన్ 900' (Speed Twin 900) లాంచ్ చేసింది. ఇది దాను మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ అప్డేట్స్ పొందినట్లు తెలుస్తోంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైకులో 900 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 65 హార్స్ పవర్, 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ అప్డేటెడ్ బైక్ లేటెస్ట్ యూరో 5 ప్లస్ నిబంధనలకు అనుగుణంగా ఉంది.కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 ఇప్పుడు ఎక్కువ బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇచ్చి చూడటానికి స్పీడ్ ట్విన్ 1200ని పోలి ఉంటుంది. అయితే ఇందులో యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, బ్రాండెడ్ రేడియల్ కాలిపర్ను కలిగి ఉంది. ఈ బైక్ సీటు ఎత్తు 900 మిమీ వరకు ఉంది. సింగిల్-పాడ్ డిజి-అనలాగ్ డిస్ప్లే స్థానంలో TFT యూనిట్ ఉంటుంది.ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. స్పీడ్ ట్విన్ 900 పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.Your journey to making every ride exceptional begins here. The new Speed Twin 900 is priced from ₹ 8 89 000* /- Ex showroom Delhi.Discover more: https://t.co/AUDQTKfjrc#SpeedTwin900 #MeetTheNewOriginal #MakeEveryRideExceptional #TriumphMotorcycles #ForTheRide pic.twitter.com/gMiAku7wtS— TriumphIndiaOfficial (@IndiaTriumph) December 23, 2024 -
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం.. రిలయన్స్ కొత్త ఎల్ఈడీ టీవీ
భారతదేశపు అతిపెద్ద రిటైలర్ అయిన 'రిలయన్స్ రిటైల్ లిమిటెడ్' హర్మాన్ భాగస్వామ్యంతో ఏకంగా ఆరు హోమ్ థియేటర్స్ కలిగిన ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేసింది. బీపీఎల్ బ్రాండ్తో ప్రారంభమైన ఈ టీవీలు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ అయిన స్పీకర్ మాడ్యూల్స్ పొందుతాయి. కాబట్టి యూజర్లు మంచి ఆడియో అనుభవాన్ని పొందవచ్చు. ఇది థియేటర్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం మార్కెట్లో మంచి క్వాలిటీ మాత్రమే కాకుండా, అద్భుతమైన ఆడియో సిస్టం కలిగి ఉన్న టీవీల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ రిటైల్ ఈ కొత్త ఎల్ఈడీ టీవీ లాంచ్ చేసింది. ఇది ఆడియో ఈఎఫ్ఎక్స్ ట్యూనింగ్ సాఫ్ట్వేర్ పొందటమే కాకుండా.. నాలుగు ఏఐ అల్గారిథమ్లను పొందుతుంది. కాబట్టి వినియోగదారులు ఇప్పుడు వారి ఇళ్లలో సౌకర్యవంతంగా సినిమాటిక్ అనుభూతిని పొందగలరని సంస్థ వెల్లడిస్తోంది.రిలయన్స్ బీపీఎల్ హోమ్ థియేటర్ ఎల్ఈడీ టీవీలు.. సరికొత్త క్యూఎల్ఈడీ, 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే పొందుతాయి. ఈ ఎల్ఈడీ టీవీలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లు, పెద్ద ఫార్మాట్ స్టోర్లలో, లేటెస్ట్ రిటైల్ అవుట్లెట్లలో, జియో మార్ట్.కామ్, రిలయన్స్ డిజిటల్.ఇన్ వంటి ఈకామర్స్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. -
టయోటా కొత్త కారు లాంచ్: ధర రూ.48 లక్షలు
టయోటా కంపెనీ ఎట్టకేలకు తన 9వ తరం 'క్యామ్రీ'ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సెడాన్ రూ. 48 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకే వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.సరికొత్త టయోటా క్యామ్రీ TNGA-K ప్లాట్ఫామ్పై ఆధారంగా నిర్మితమైంది. ఇది యూ షేప్ హెడ్ల్యాంప్లతో కూడిన పెద్ద ట్రాపెజోయిడల్ గ్రిల్, వెనుక వైపు కొత్త టెయిల్లైట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 స్పోక్ స్టీరింగ్ వీల్, 10 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, హెడ్స్ అప్ డిస్ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్టయోటా క్యామ్రీలోని 2.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 227 బీహెచ్పీ, 220 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈసీవీటీ (ఎలక్ట్రిక్ కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్) పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ సేడం లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్, 9 ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన టాప్ 10 పాపులర్ కార్లు (ఫోటోలు)
-
రూ.1.03 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ ఎం2 కారు - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ ఎం2 కూపేను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ధర రూ. 1.03 కోట్లు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపించే బీఎండబ్ల్యూ ఎం2 కూపే.. ఇప్పుడు సావో పాలో ఎల్లో, ఫైర్ రెడ్, పోర్టిమావో బ్లూ, స్కైస్క్రాపర్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎం వీల్స్ బ్లాక్ ఫినిషింగ్తో డబుల్ స్పోక్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఆప్షనల్ ఆల్కాంటారా ఫినిషింగ్ పొందుతుంది. ఇందులో ఐడ్రైవ్ సిస్టమ్తో కొత్త డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.అప్డేటెడ్ బీఎండబ్ల్యూ ఎం2 కారు 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ద్వారా 480 hp పవర్, 600 Nm టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో కూడిన స్టాండర్డ్ M2 కూపే ఇప్పుడు 0-100kph వేగాన్ని 4 సెకన్లలో కవర్ చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 285 కిమీ/గం. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని స్పష్టమవుతోంది.Introducing the new avatar of unadulterated adrenaline. The new BMW M2 Coupé. #BMWIndia #BMWM #TheM2—————————————————The models, equipment, and possible vehicle configurations illustrated in the advertisement may differ from vehicles supplied in the Indian market. pic.twitter.com/dC701ZP66j— BMW India (@bmwindia) November 29, 2024 -
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే: ధరలు ఎలా ఉన్నాయంటే..
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. ఒకటి 'బీఈ 6ఈ', మరొకటి 'ఎక్స్ఈవీ 9ఈ'. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.18.90 లక్షలు, రూ.21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కార్లను 2025 మార్చిలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. ఎందుకంటే ఈ రెండూ INGLO ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మితమయ్యాయి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తయారైన వాహనాలు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి.XEV 9e ఒక స్పోర్టి కూపే డిజైన్ పొందుతుంది. త్రిభుజాకార ఎల్ఈడీ హెడ్లైట్లు, విస్తృతమైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కూపే స్టైల్ రూఫ్లైన్ వంటివి ఇందులో చూడవచ్చు. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ల మధ్యలో.. ప్రకాశవంతమైన మహీంద్రా లోగో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ డిస్ప్లేలతో కూడిన ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్రైవర్ డిస్ప్లే, లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు.. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్, 16 స్పీకర్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.BE 6e షార్ప్ క్యారెక్టర్ లైన్లు, హుడ్ స్కూప్తో కూడిన పాయింటెడ్ హుడ్, సీ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ట్రీమ్లైన్డ్ బంపర్ను కలిగి ఉంది. ఈ కారు ఏరోడైనమిక్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్.. ఇల్యూమినేటెడ్ బీఈ లోగో వంటివి దీనిని కొత్తగా చూపిస్తాయి. ఇందులో ట్విన్-స్క్రీన్ ర్యాప్రౌండ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో కూడా 16 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్, పనోరమిక్ సన్రూఫ్, ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ రెండూ.. 59 కిలోవాట్, 79 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. 59 kWh బ్యాటరీ 450 నుంచి 500 కిమీ రేంజ్.. 79 kWh బ్యాటరీ 650 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇవి రెండూ ఏసీ ఛార్జర్కు మాత్రమే కాకుండా డీసీ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తాయి. -
రూ. 39999కే ఎలక్ట్రిక్ స్కూటర్: ఓలా సరికొత్త వెహికల్స్ చూశారా..
భారతీయ టూ వీలర్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్లు.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ కస్టమర్ల రోజువారీ వినియోగానికి, వాణిజ్యపరమైన వినియోగానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి రిమూవబుల్ బ్యాటరీ ఆప్షన్ కలిగి ఉంటాయి.ఓలా గిగ్: రూ. 39,999ఓలా గిగ్ ప్లస్: రూ. 49,999ఓలా ఎస్1 జెడ్: రూ. 59,999ఓలా ఎస్1 జెడ్ ప్లస్: రూ. 64,999ఓలా గిగ్రోజువారీవినియోగానికి లేదా తక్కువ దూరాలు ప్రయాణించడానికి.. ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. పేలోడ్ కెపాసిటీ బాగేనా ఉంటుంది. ఇందులోని 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ 112 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం మాత్రమే. కంపెనీ దీనిని ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం లాంచ్ చేసినట్లు సమాచారం.ఓలా గిగ్ ప్లస్కొంత ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఓలా గిగ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పనికొస్తుంది. గంటకు 45 కిమీ వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ రేంజ్ 81 కిమీ మాత్రమే. అయితే రెండు బ్యాటరీల ద్వారా 157 కిమీ రేంజ్ పొందవచ్చు. ఇందులో కూడా 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. గిగ్ వర్కర్లు వేగవంతమైన డెలివరీ కోసం ఈ స్కూటర్లు ఉపయోగపడతాయి. రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణనికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.ఓలా ఎస్1 జెడ్ఓలా ఎస్1 జెడ్ అనేది వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించే స్కూటర్. పరిమాణంలో ఇది కొంత చిన్నదిగా ఉండటం వల్ల దీనిని రద్దీగా ఉండే అర్బన్, సెమీ-అర్బన్ రోడ్లపై కూడా సాఫీగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా ఎస్1 జెడ్ ప్లస్ఇక చివరగా.. ఓలా ఎస్1 జెడ్ ప్లస్ విషయానికి వస్తే, ఇది దృఢమైన నిర్మాణం, అధిక పేలోడ్ కెపాసిటీ పొందుతుంది. దీనిని కూడా వ్యక్తిగత వినియోగం కోసం లేదా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ స్కూటర్ ఒక బ్యాటరీ ప్యాక్తో 75 కిమీ రేంజ్.. రెండుతో 146 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కూడా 1.8 సెకన్లలో 0 నుంచి 20 కిమీ/గం.. 4.8 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.ఓలా పవర్పాడ్ఓలా ఎలక్ట్రిక్ కేవలం కొత్త స్కూటర్లను లాంచ్ చేయడమే కాకుండా.. పవర్పాడ్ కూడా లాంచ్ చేసింది. ఇది పోర్టబుల్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. గృహోపకరణాలు, లైట్లు, ఫ్యాన్లు, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రిక్ పరికరాలకు శక్తినిచ్చే ఇన్వర్టర్గా ఉపయోగపడుతుంది. 500W అవుట్పుట్ను కలిగిన ఓలా పవర్పాడ్.. 1.5 కిలోవాట్ బ్యాటరీ, 5 ఎల్ఈడీ బల్బులు, 3 సీలింగ్ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్ ఛార్జింగ్, 1 Wi-Fi రూటర్ వంటి వాటికి మూడుగంటల పాటు శక్తినిస్తుంది. అంటే పనిచేసేలా చేస్తుంది. దీని ధర రూ. 9999 మాత్రమే.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..ఓలా ఎలక్ట్రిక్.. కొత్త స్కూటర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓలా గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్ల లాంచ్ ఈవీ రంగం వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నామన్నారు. సరసమైన ధర వద్ద లభించే ఈ స్కూటర్లు తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని అన్నారు.Say hello to Ola S1 Z & Gig range, starting at just ₹39K!Affordable, accessible, and now with a portable battery pack that doubles up as home inverter using the Ola PowerPodReservations open, deliveries Apr’25!🛵⚡🔋Ola S1 Z: https://t.co/jRj8k4oKvQOla Gig:… pic.twitter.com/TcdfNhSIWy— Bhavish Aggarwal (@bhash) November 26, 2024 -
సరికొత్త 'రియల్మీ జీటీ 7 ప్రో' వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారతీయ మార్కెట్లో 'జీటీ 7 ప్రో' లాంచ్ చేసింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ మొబైల్ ప్లాట్ఫామ్ ఆధారంగా తయారైన ఈ స్మార్ట్ఫోన్ లేటెస్ట్ టెక్నాలజీని పొందుతుంది.కొత్త రియల్మీ జీటీ 7 ప్రో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ.56,999), రెండు 16 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ (ధర రూ. 62,999). ఇవి రెండూ నవంబర్ 29నుంచి కంపెనీ వెబ్సైట్లో, అమెజాన్ ఈ-కామర్స్ సైట్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం.మార్స్ ఆరెంజ్, గెలాక్సీ గ్రే అనే రెండు రంగులలో లభించే రియల్మీ జీటీ 7 ప్రో.. హై పర్ఫామెన్స్డ్ స్మార్ట్ఫోన్. ఇది 1.5కే రిజల్యూషన్తో 6.78 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. స్క్రీన్ పెద్దగా ఉండటం మాత్రమే కాకుండా.. వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకునిజీటీ7 ప్రోలో.. సోనీ IMX882 సెన్సార్తో 50MP పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా, తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ కోసం మరో 50MP Sony IMX906 OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా &16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా వీడియో రీకరింగ్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి. పోర్ట్రెయిట్, నైట్, అండర్ వాటర్ వంటి అనేక ఫోటోగ్రఫీ మోడ్లు ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..రియల్మీ జీటీ 7 ప్రో 5800mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 120W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఐపీ69 నీరు & ధూళి నిరోధకతను కూడా కలిగి ఉంది. కాబట్టి ఇది చాలా మన్నికైనది, ఏ వాతావరణనైకైనా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫోన్ బరువు 222.8 గ్రాములు.. పొడవు 162.45 మిమీ పొడవు, వెడల్పు 76.89 మిమీగా ఉంది.The #realmeGT7Pro is now more accessible!Get the flagship 12GB RAM + 512GB storage for just ₹56,999 & the 16GB RAM + 512GB storage for ₹62,999 with 50MP Periscope, IP69, AI features & more!#ExploreTheUnexploredJoin the Livestream: https://t.co/6E90cRlxyy pic.twitter.com/KYTnXPO6pa— realme (@realmeIndia) November 26, 2024 -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న కొత్త బీఎండబ్ల్యూ కారు: రేటెంతో తెలుసా?
ఈ ఏడాది జూన్లో 'ఎం5' (M5) కారును గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన తరువాత బీఎండబ్ల్యూ ఎట్టకేలకు భారతీయ విఫణిలో లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఎం5 ధర రూ.1.99 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్, వీ8 పవర్ట్రెయిన్ రెండూ ఉపయోగిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.బీఎండబ్ల్యూ ఎం5 భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. ఈ కారణంగానే దీని ధర కొంత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఈ కారులోని 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 577 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 194 Bhp, 280 Nm టార్క్ అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ (ఎం డ్రైవర్ ప్యాకేజీతో).బీఎండబ్ల్యూ ఎం5 కారులోని 22.1 కిలోవాట్ బ్యాటరీ 70 కిమీ రేంజ్ అందిస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ ఉపయోగించాలి. బ్యాటరీ 3:15 గంటలలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కాబట్టి బ్యాటరీ కూడా మంచి రేంజ్ అందిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..2025 ఎం5 బోల్డ్ డిజైన్ కలిగి సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుంది. ఫ్రంట్ బంపర్ ఎయిర్ వెంట్స్ కలిగి ఉండటం చూడవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్తో రీస్టైల్ బంపర్, క్వాడ్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా పొందుతుంది. ఈ కారులో త్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కర్వ్డ్ ట్విన్ స్క్రీన్లు, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ టెయిల్గేట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.బీఎండబ్ల్యూ ఎం5 నాన్ మెటాలిక్ ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, సోఫిస్టో గ్రే, బ్రూక్లిన్ గ్రే, ఫైర్ రెడ్, కార్బన్ బ్లాక్, ఐల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్, స్టార్మ్ బే, మెరీనా బే బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంటీరియర్ రెడ్/బ్లాక్, కైలామి ఆరెంజ్, సిల్వర్స్టోన్/బ్లాక్ & ఆల్-బ్లాక్ వంటి కాంబినేషన్లను పొందుతుంది. -
2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా?
కవాసకి ఇండియా తన జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైకును కొత్త కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.42 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు లైమ్ గ్రీన్/ఎబోనీ/బ్లిజార్డ్ వైట్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ 2024 మోడల్ కంటే రూ. 32,000 ఖరీదైనది.కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ 399సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-ఫోర్ ఇంజన్ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 77 Bhp పవర్, 13000 rpm వద్ద 39 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.2025 కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్స్, అప్స్వెప్ట్ టెయిల్ లాంప్, టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటివి పొందుతుంది. యూఎస్డీ ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ కలిగిన ఈ బైక్ 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. సుమారు 189 కేజీల బరువున్న కొత్త కవాసకి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ.నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్ లేదా కస్టమ్ అనే నాలుగు రైడ్ మోడ్లను పొందుతుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి కూడా ఈ బైకులో చూడవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అధికారిక డీలర్షిప్లలో బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది. -
రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే..
బీఎండబ్ల్యూ ఇండియా '2024 ఎం340ఐ' పర్ఫామెన్స్ సెడాన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.2024 బీఎండబ్ల్యూ ఎం340ఐ 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది మెర్సిడీ బెంజ్ ఏఎంజీ సీ 43, ఆడి ఎస్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎం340ఐ సెడాన్ 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. డిజైన్, సేఫ్టీ పరంగా ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్ లేదు. -
మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరించిన తరువాత.. 650 సీసీ విభాగంలో మరో బైక్ లాంచ్ చేసింది. 'ఇంటర్సెప్టర్ బేర్ 650' పేరుతో మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ధర రూ. 3.39 లక్షలు (ఎక్స్ షోరూమ్).రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ఆధారంగా నిర్మితమైన ఈ బైక్ స్క్రాంబ్లర్ బైక్ డిజైన్ పొందుతుంది. కాబట్టి ఆ రెండు బైకుల ఫీచర్స్ ఈ ఒక్క బైకులోనే గమనించవచ్చు. కొత్త కలర్ ఆప్షన్స్, సైడ్ ప్యానెల్స్పై నంబర్ బోర్డ్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నీ కూడా ఈ బైకును చాలా హుందాగా కనిపించేలా చేస్తాయి.రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 బైక్ 130 మిమీ ట్రావెల్తో 43 మిమీ షోవా యుఎస్డి ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు 115 మిమీ ట్రావెల్తో కొత్త ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. ఈ హిమాలయన్ బైకులో కనిపించే ఫుల్ కలర్డ్ TFT స్క్రీన్ కూడా ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైంక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్648 సీసీ ఇంజిన్ కలిగిన ఇంటర్సెప్టర్ బేర్ 650.. 47 Bhp పవర్, 57 Nm టార్క్ అందిస్తుంది. 216 కేజీల బరువున్న ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పుడు డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
రూ.19.39 లక్షల సరికొత్త ట్రయంఫ్ బైక్ ఇదే..
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తుంటే.. ట్రయంఫ్ కంపెనీ మాత్రం రూ. 19.39 లక్షల ఖరీదైన '2025 టైగర్ 1200' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.ట్రయంఫ్ లాంచ్ చేసిన 2025 టైగర్ 1200 బైక్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైకులోని 1160 సీసీ 3 సిలిండర్ ఇంజిన్ 9000 rpm వద్ద 150 Bhp పవర్, 7000 rpm వద్ద 130 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.కొత్త ట్రయంఫ్ టైగర్ 1200 బైక్ ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 18 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు కావడం గమనార్హం. ఈ బైక్ కఠిననమైన భూభాగాల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు. కాబట్టి ఈ బైక్ ద్వారా రైడర్ ఆఫ్ రోడింగ్ అనుభవాన్ని కూడా పొందవచ్చు.రైడర్ సీటు ఫ్లాటర్ ప్రొఫైల్తో రీడిజైన్ చేయబడి ఉండటం వల్ల.. సీటు ఎత్తు 20 మిమీ తగ్గింది. వెనుక సస్పెన్షన్ ప్రీలోడ్ కూడా 20 మిమీ వరకు తగ్గుతుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 7 ఇంచెస్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కీలెస్ ఇగ్నిషన్, అడాప్టివ్ కార్నరింగ్ లైట్లు, షిఫ్ట్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందింది. -
లాంచ్కు సిద్దమవుతున్న కొత్త యాపిల్ మ్యాక్బుక్
యాపిల్ కంపెనీ ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 2024లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మ్యాక్ బుక్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ దీనిని లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించే అవకాశం లేదని సమాచారం. కాబట్టి దీనికి సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చని తెలుస్తోంది.యాపిల్ మ్యాక్ ప్రకటనలు నవంబర్ 28న రానున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 'గ్రెగ్ జోస్వియాక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.గ్రెగ్ జోస్వియాక్ ప్రకటనకు ముందే మ్యాక్ బుక్ లేటెస్ట్ వెర్షన్కు సంబంధించి కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది యాపిల్ ఎమ్4 చిప్ పొందనున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఐమ్యాక్, మ్యాక్ బుక్ ప్రో, మ్యాక్ మినీ వంటి కొత్త అప్డేట్లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్యాపిల్ మ్యాక్ బుక్ రిఫ్రెష్ డిజైన్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందనున్నట్లు సమాచారం. ఇందులో 10 కోర్ సీపీయూ ఉండే అవకాశం ఉంది. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త యాపిల్ మ్యాక్ బుక్కు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.Mac (😉) your calendars! We have an exciting week of announcements ahead, starting on Monday morning. Stay tuned… pic.twitter.com/YnoCYkZq6c— Greg Joswiak (@gregjoz) October 24, 2024 -
టయోటా లాంచ్ చేసిన మరో ఫెస్టివ్ ఎడిషన్ ఇదే..
టయోటా కంపెనీ గ్లాన్జా, టైసర్, హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ కారు కొనుగోవులు చేసేవారు ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే రూ. 20608 విలువైన యాక్సెసరీలను పొందవచ్చు.టయోటా రూమియన్ ఫెస్టివ్ ఎడిషన్ మడ్ ఫ్లాప్లు, మ్యాట్లు, క్రోమ్ డోర్ వైజర్, స్పాయిలర్ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకుండా టెయిల్గేట్, రియర్ బంపర్, హెడ్ల్యాంప్, నంబర్ ప్లేట్, బాడీ మౌల్డింగ్లకు గార్నిష్లు ఉన్నాయి. ఈ కొత్త యాక్ససరీస్ వల్ల కారు మరింత అద్భుతంగా కనిపిస్తుంది.టయోటా రూమియన్ దాని మునుపటి మోడల్లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 102 Bhp పవర్, 138 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ అప్షన్స్ పొందుతుంది. ఈ ఫెస్టివల్ ఎడిషన్ ఎస్, జీ, వీ ట్రిమ్లలో మాత్రమే కాకుండా CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్తో..మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా రూమియన్ ప్రధానంగా మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్, హ్యుందాయ్ అల్కాజార్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఇది ఫెస్టివ్ ఎడిషన్ కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎప్పటి వరకు మార్కెట్లో విక్రయానికి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. -
భారత్లో హెచ్పీ ఏఐ ల్యాప్టాప్ లాంచ్: ఇదిగో వివరాలు
హెచ్పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 ఏఐ బేస్డ్ 'ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్' అనే కొత్త ల్యాప్టాప్ లాంచ్ చేసింది. ఇది ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 పొందుతుంది. ఈ ప్రాసెసర్లు ఆన్-డివైస్ ఏఐ వర్క్లోడ్ల కోసం డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని కలిగి ఉంటాయి. క్వాలిటీ వీడియోలను ఆస్వాదించడానికి అనుమతించే.. ఈ ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది.హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 7 ప్రారంభ ధర రూ.1,81,999. ఇది ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది భారతదేశంలో కంపెనీ ఆఫ్లైన్ స్టోర్లలో మాత్రమే కాకుండా.. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అల్ట్రా 9 కూడా రూ.1,91,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్లో మాత్రమే లభిస్తుంది.హెచ్పీ లాంచ్ చేసిన ఈ కొత్త ల్యాప్టాప్లను ఈ నెల చివరి (అక్టోబర్ 31) లోపల కొనుగోలు చేస్తే రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్, ప్రైమరీ ఎలిమెంట్స్ వంటి వాటిని ఉచితంగా పొందవచ్చు. అంతే కాకుండా వినియోగదారులు బజాజ్ ఫైనాన్స్తో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద కూడా కొనుగోలు చేయవచ్చు.హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 14 ఇంచెస్ 2.8కే ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. మెరుగైన వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం హాప్టిక్ టచ్ప్యాడ్, 9 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఇది 32 జీబీ ర్యామ్, 64 వాట్స్ బ్యాటరీ (21 గంటలు) పొందుతుంది. ఇది వైఫై, బ్లూటూత్ వంటి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది.కొత్త హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ల్యాప్టాప్లో డేటా రక్షణ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటి కోసం ఫిజికల్ సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. డీప్ఫేక్ డిటెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. ఇవన్నీ డేటాను రక్షించడానికి, ఇతరులు హ్యాక్ చేయకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. -
రూ.24.99 లక్షల అమెరికన్ బ్రాండ్ కారు: భారత్లో లాంచ్
జీప్ కంపెనీ భారతదేశంలో తన మెరిడియన్ ఫేస్లిఫ్ట్ను రూ. 24.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగా కాకుండా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ కలిగి 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. కొత్త మెరిడియన్ కోసం బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల చివరలో ప్రారంభమవుతాయి.అప్డేటెడ్ మెరిడియన్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (ఓ), ఓవర్ల్యాండ్ అనే నాలుగు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ లాంగిట్యూడ్ ట్రిమ్ 5-సీటర్గా మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన మూడు ట్రిమ్లు 7-సీటర్గా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.జీప్ మెరిడియన్ ఫేస్లిఫ్ట్ ఐకానిక్ సెవెన్-స్లాట్ గ్రిల్తో హనీకూంబ్ మెష్ క్రోమ్ స్టడ్లను పొందుతుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. క్యాబిన్ లేఅవుట్ మునుపటి మాదిరిగానే ఉన్నప్పటికీ.. డ్యాష్బోర్డ్ కాపర్ స్టిచింగ్తో కొత్త స్వెడ్ ఫినిషింగ్ని పొందింది. 9 స్పీకర్ ఆల్పైన్ ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి వాటితో పాటు.. ఈ కారులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్జీప్ మెరిడియన్ ఫేస్లిఫ్ట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4x2, 4x4 వేరియంట్లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్ & 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
టయోటా టైజర్ లిమిటెడ్ ఎడిషన్.. మంచి ఆఫర్తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా కాంపాక్ట్ ఎస్యూవీ టైజర్ లిమిటెడ్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ.20,160 విలువ చేసే టయోటా జెనివిన్ యాక్సెసరీస్ కిట్ను ఆఫర్ చేస్తోంది.అన్ని టర్బో వేరియంట్లలో అక్టోబర్ 31 వరకే ఇది లభిస్తుంది. దీని ఎక్స్షోరూం ధర రూ.10.56 లక్షలు. ఇప్పటికే కంపెనీ పండుగ సీజన్ కోసం ఇతర మోడళ్లలోనూ లిమిటెడ్ ఎడిషన్లను అందుబాటులోకి తెచ్చింది. -
కొత్తగా వచ్చాయ్.. లేటెస్ట్ ఫోన్లు.. గ్యాడ్జెట్లు
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ట్యాబ్స్ వంటి కొత్త గ్యాడ్జెట్స్ ఏవో ఒక ఒకటి మార్కెట్లోకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి ఫీచర్స్, ప్రత్యేకతలేంటి అన్న విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫోన్లు, వాచీలు, గ్యాడ్జెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈడిస్ప్లే: 6.7 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080×2340 పిక్సెల్స్మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్/256 జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 14; ఫ్రంట్ కెమెరా: 10 ఎంపీబ్యాటరీ: 4700 ఎంఏహెచ్; కనెక్టివిటి: 5జీనథింగ్ సీఎంఎఫ్ వాచ్ ప్రో2సైజ్: 1.32రిజల్యూషన్: 466×466 పిక్సెల్స్» స్విమ్మింగ్, రన్నింగ్, రాక్ క్లైంబింగ్, జిమ్ సెషన్..మొదలైన యాక్టివిటీలలో ఉపకరిస్తుంది.» స్ట్రెస్ రీడింగ్, స్లీప్ మానిటరింగ్లాంటి ఫీచర్లు ఉన్నాయి.ఫుల్ చార్జ్: (జీరో నుంచి) 100 నిమిషాలుఒప్పో ప్యాడ్ 3 ప్రోసైజ్: 12.5 అంగుళాలురిజల్యూషన్: 2000×3200 పిక్సెల్స్ఇంటర్నల్ మెమొరీ: 256 జీబిబ్యాటరీ కెపాసిటీ: 10000 ఎంఏహెచ్వివో ఎక్స్ 200 ప్రోడిస్ప్లే: 6.78 అంగుళాలు; బరువు: 223 గ్రా.మెమొరీ: 256జీబి 12జీబి ర్యామ్/512జీబి 16జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 15రిజల్యూషన్: 1260×2800 పిక్సెల్స్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ;బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - వీడియో చూశారా?
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీదారు 'రాయల్ ఎన్ఫీల్డ్' ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను 2024 నవంబర్ 4న మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించింది.కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను సంబంధించిన ఓ టీజర్ విడుదల చేసింది. అయితే నవంబర్ 4న రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించే ఎలక్ట్రిక్ బైక్ కేవలం కాన్సెప్ట్ అయి ఉండొచ్చని, రాబోయే రోజుల్లో మార్కెట్లో ఈ బైక్ లాంచ్ అవుతుందని సమాచారం.ఇప్పటికి లీకైన సమాచారం ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో బహుశా స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చని సమాచారం. పేటెంట్ ఇమేజ్ సింగిల్-సీట్ లేఅవుట్ను కలిగి ఉండనున్నట్లు వెల్లడిస్తున్నప్పటికీ.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ సాధారణ డిజైన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగం అల్యూమినియం స్వింగ్ఆర్మ్, మోనోషాక్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ బైక్ ఎలక్ట్రిక్01 అనే కోడ్ నేమ్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఇంకా చాలా వివరాలు అధికారికంఘా వెల్లడి కావాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ బైక్ మార్కెట్లో లాంచ్ అయితే ప్రత్యర్ధ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. View this post on Instagram A post shared by Royal Enfield (@royalenfield) -
రూ.1.89 కోట్ల కొత్త బీఎండబ్ల్యూ కారు ఇదే.. పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ భారతదేశంలో 'ఎం4 సీఎస్' పేరుతో ఓ కొత్త కారును లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మొట్ట మొదటి బీఎండబ్ల్యూ సీఎస్ మోడల్. ఎం4 కాంపిటీషన్ మోడల్ కంటే కూడా దీని ధర రూ. 36 లక్షలు ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే 3.0 లీటర్ ట్విన్ టర్బో స్ట్రెయిట్-సిక్స్ ఇంజిన్ పొందుతుంది. ఇది 550 హార్స్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బో బూస్ట్ ప్రెజర్ 1.7 బార్ నుంచి 2.1 బార్కి పెంచడం వల్ల పవర్ కొంత ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కారు 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 302 కిమీ/గం.బీఎండబ్ల్యూ ఎం4 సీఎస్.. టైటానియం ఎగ్జాస్ట్ సైలెన్సర్, సెంటర్ కన్సోల్, గేర్బాక్స్ ప్యాడిల్స్ వంటివి ఫైబర్ నిర్మితం. ఈ కారు ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్స్, వెనుక 20 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది. ఎం4 సీఎస్ కారులో ఎల్లో కలర్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి. కిడ్నీ గ్రిల్ బార్డర్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: డిజిటల్ అరెస్ట్ అంటే తెలుసా?: తెలుసుకోకపోతే మోసపోతారు..ఫ్లాట్ బాటమ్ ఆల్కాంటారా ఎం స్టీరింగ్ వీల్ కలిగిన ఎం4 మోడల్ 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. సెంటర్ కన్సోల్లోని సీఎస్ ఎరుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ఆడి ఆర్ఎస్5కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఏడాది తర్వాత మార్కెట్లో లాంచ్ అయిన కారు.. ధర ఎంతంటే?
ఇండియన్ మార్కెట్లో నాల్గవ తరం కియా కార్నివాల్ లాంచ్ అయింది. దీని ధర రూ. 63.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది కేవలం డీజిల్ ఇంజన్తో 7 సీటర్గా మాత్రమే లభిస్తుంది. ఈ కారు ప్రస్తుతం సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశానికి దిగుమతి అవుతుంది.సరికొత్త కియా కార్నివాల్ భారతదేశంలో తయారైతే ధర కొంత తగ్గుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్కు ప్రత్యర్థిగా ఉన్న కార్నివాల్.. కోసం కంపెనీ రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు దాని మునుపటి మోడల్ కంటే చాలా హుందాగా ఉంటుంది.టైగర్ నోస్ గ్రిల్, ఎల్ షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్లతో పాటు 18 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ను కలిగి ఉన్న ఈ కారు ఎల్ఈడీ టెయిల్-లైట్స్ పొందుతుంది. ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది.2024 కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే, 4 స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ సన్రూఫ్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్, పవర్డ్ స్లైడింగ్ రియర్ డోర్లను పొందుతుంది. మల్టిపుల్ ఎయిర్బ్యాగ్లు, రియర్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్, ఏడీఏఎస్ ఫీచర్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: భారీగా పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఇవేకొత్త కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 441 Nm టార్క్, 193 Hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. కంపెనీ ఈ కారుకు మూడు సంవత్సరాల ఫ్రీ మెయినెనెన్స్, వారంటీ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి అందిస్తుంది. -
సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ ధరలు ఇవే..
ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సీ3 ముఖ్యమైన ఫీచర్ అప్డేట్లను ప్రకటించిన నెల రోజుల తరువాత ఆటోమేటిక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఇది కేవలం టాప్-స్పెక్ షైన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది. సీ3 ఆటోమాటిక్ ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 10.27 లక్షల మధ్య ఉన్నాయి.సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ వేరియంట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. అయితే ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. డిజైన్ కొంత అప్డేట్ పొందినప్పటికీ.. ఫీచర్స్ జాబితాలో మాత్రం మాన్యువల్ వేరియంట్తో సమానంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.2 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?సిట్రోయెన్ సీ3 ఆటోమేటిక్ 1.2 లీటర్ టర్బో పిత్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
బీఎండబ్ల్యూ కొత్త ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే..
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'బీఎండబ్ల్యూ' ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ధర రూ. 1.33 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా లేటెస్ట్ అప్డేట్స్ పొందింది.ఎక్స్డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభిస్తున్న ఈ కారు పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుంది. అయితే ఎన్ని యూనిట్లు విక్రయానికి ఉన్నాయనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కారు స్వరోవ్స్కీ గ్లాస్ కట్ క్రిస్టల్స్, అల్యూమినియం శాటినేటెడ్ రూఫ్ రెయిల్లతో కూడిన క్రిస్టల్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.టాంజానైట్ బ్లూ, డ్రవిట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఇండివిజువల్ లెదర్, యూనిక్ క్రిస్టల్ డోర్ పిన్స్,అల్కాంటారా కుషన్స్ వంటి వాటితో పాటు 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా పొందుతుంది. పనోరమిక్ సన్రూఫ్ కూడా ఇందులో లభిస్తుంది.ఇదీ చదవండి: ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఎక్స్7 సిగ్నేచర్ ఎడిషన్ 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 48వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్ కూడా పొందుతుంది. ఈ ఇంజిన్ 381 హార్స్ పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. -
ఒక్కరికి మాత్రమే ఈ కొత్త కారు.. ధర ఎంతంటే?
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్' కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.15 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లకంటే కూడా భిన్నంగా ఉంది.గత ఏడాది ఏప్రిల్లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త 'ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్' పేరుతో అడుగుపెట్టింది. ఇదే భారతీయ విఫణిలో ఎక్స్ఎమ్ లేబుల్ రూపంలో లాంచ్ అయింది. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి 748 హార్స్ పవర్, 1000 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది గరిష్టంగా 82 కిమీ రేంజ్ అందిస్తుంది.ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.ఎక్స్ఎమ్ లేబుల్.. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్సర్ట్లు వంటివన్నీ రెడ్ ఎలిమెంట్లను పొందుతాయి. ఇందులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ చూడవచ్చు.ఇదీ చదవండి: ఈ ఏడాది 850 టన్నులు!.. బంగారానికి భారీ డిమాండ్ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారును ప్రపంచ వ్యాప్తంగా 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో నుంచి ఒక్క కారు మాత్రమే ఇండియాకు కేటాయించి. అంటే భారతదేశంలో ఈ కారును కేవలం ఒక్కరు మాత్రమే కొనుగోలు చేయగలరు. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పడానికి కంట్రోల్ డిస్ప్లే క్రింద “500లో 1” అని ఉంటుంది. -
టీవీఎస్ అపాచీ లేటెస్ట్ ఎడిషన్.. మరింత పవర్ఫుల్!
టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్ను భారత్లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్టీఆర్ 310 లాగే ఉంటుంది.కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్లెట్లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్పీ, 29ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్బాక్స్ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్బాక్స్తో బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో వస్తుంది.యూఎస్డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్తో రెండు చివరల డిస్క్ బ్రేక్లు, రైడ్ మోడ్లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ను కూడా వీటిలో చేర్చింది. అవుట్గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.ధరలుకొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెడ్ (క్విక్షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్షిఫ్టర్తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.41 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ ఖరీదు.బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి.. ఇది ఒక బ్లాంక్డ్ ఆఫ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ ముందు భాగంలో విస్తరించి ఉన్న లైట్బార్కు కనెక్ట్ అయి ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది.విలాసవంతమైన క్యాబిన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్తో కూడిన హైపర్స్క్రీన్ సెటప్ పొందుతుంది. వీటితో పాటు ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: పీఎం సోలార్ రూఫ్టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు! కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 809 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
ఏడాది తర్వాత మళ్ళీ వస్తున్న కారు.. రేపటి నుంచే బుకింగ్స్
కియా మోటార్స్ (Kia Motors) దేశంలో తన కార్నివాల్ ఎంపీవీని నిలిపివేసిన సుమారు సంవత్సరం తరువాత మళ్ళీ సరికొత్త కారుగా ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. అంతకంటే ముందు సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.కియా కంపెనీ తన కొత్త తరం కార్నివాల్ కోసం బుకింగ్స్ సెప్టెంబర్ 16 నుంచి స్వీకరించడం ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది అక్టోబర్ 3న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కానుంది.త్వరలో లాంచ్ కానున్న సరికొత్త కిస్ కార్నివాల్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ కొన్ని అప్డేట్స్ పొంది ఉండటం చూడవచ్చు. వర్టికల్ హెడ్లైట్స్, టైగర్ నోస్ గ్రిల్, వెనుక భాగంలో లైట్బార్ ద్వారా కనెక్ట్ అయిన స్లిమ్ వర్టికల్ టెయిల్ల్యాంప్ ఇందులో చూడవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.5 లక్షలు: ఎన్సీపీఐ కీలక నిర్ణయంకొత్త కియా కార్నివాల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు టచ్స్క్రీన్, డ్యూయల్ సన్రూఫ్, 12 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ పొందుతుంది. వెనుక సీటు ప్రయాణికులు పవర్ ఆపరేటెడ్ స్లైడింగ్ డోర్లు, లెగ్ రెస్ట్లు, వెంటిలేషన్ ఫంక్షన్తో కూడిన మధ్య వరుస సీట్లు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
యమహా ఆర్15ఎం: ఇప్పుడు కొత్త హంగులతో..
జపనీస్ టూ వీలర్ బ్రాండ్ యమహా.. దేశీయ విఫణిలో కొత్త ఫీచర్లతో, కొత్త కలర్ ఆప్షన్ కలిగిన 'ఆర్15ఎం' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ మెటాలిక్ గ్రే, ఐకాన్ పెర్ఫార్మెన్స్ అనే కొత్త కలర్ స్కీమ్ పొందుతుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.98 లక్షలు, రూ. 2.08 లక్షలు (ఎక్స్ షోరూమ్).యమహా ఆర్15ఎం బైక్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్తో చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇందులోని ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్, రియర్ ఫెండర్ వంటివి అప్డేట్స్ పొందుతాయి. అంతే కాకుండా బ్లాక్ అవుట్ ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్పై కొత్త గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ బైకుకు మరింత ప్రీమియంగా కనిపించేలా చేస్తాయి.అప్డేటెడ్ యమహా ఆర్15ఎం బైక్ టర్న్-బై-టర్న్ నావిగేషన్తో పాటు మ్యూజిక్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ వంటివి పొందుతుంది. అయితే వీటన్నింటినీ స్మార్ట్ఫోన్ ద్వారా యమహా వై-కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? ఇందులో 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 18.4 బీహెచ్పీ పవర్, 14.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పర్ఫామెన్స్ ఆశించవచ్చు. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ సెటప్, మోనోషాక్ వంటివి పొందుతుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది. -
మారుతి స్విఫ్ట్ సీఎన్జీ వచ్చేసింది: ధర ఎంతంటే?
మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన 14వ సీఎన్జీ కారుగా 'స్విఫ్ట్'ను లాంచ్ చేసింది. దీంతో స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మోడల్ ప్రారంభ ధరలు రూ. 8.20 లక్షలు. ఈ ధర పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 90వేలు ఎక్కువ కావడం గమనార్హం.మారుతి స్విఫ్ట్ సీఎన్జీ కారు 1.2 లీటర్ ఇంజిన్ పొందుతుంది. ఇది సీఎన్జీలో ప్రయాణించేటప్పుడు 69 బీహెచ్పీ, 102 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోలుతో నడిచేటప్పుడు 80.4 బీహెచ్పీ, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ మాత్రమే పొందుతుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!చూడటానికి సాధారణ స్విఫ్ట్ మాదిరిగా కనిపించే ఈ కొత్త సీఎన్జీ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 60:10 స్ప్లిట్ రియర్ సీటు ఉంటుంది. కాబట్టి లగేజ్ కొంత ఎక్కువగా తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. -
న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్
గురుగ్రామ్: ఆటోమొబైల్స్ సంస్థ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తాజాగా ’ఎంజీ విండ్సర్’ పేరిట ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 9.9 లక్షలు కాగా కి.మీ.కు రూ. 3.5 చొప్పున బ్యాటరీ అద్దె ఉంటుంది. ఇందుకోసం బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్ (బీఏఏఎస్)ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఒకసారి చార్జ్ చేస్తే దీని రేంజ్ 331 కిలోమీటర్లు ఉంటుంది. ఏదైనా డీసీ ఫాస్ట్ చార్జర్తో విండ్సర్ను 40 నిమిషాల్లో చార్జ్ చేయొచ్చు. ఎంజీ ఈ–హబ్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా పబ్లిక్ చార్జింగ్ సదుపాయాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.ఎంజీ మోటార్ ఇండియాలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి వాహనం విండ్సర్. తాము న్యూ ఎనర్జీ వెహికల్ (ఎన్ఈవీ) విభాగంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్ పార్థ్ జిందాల్ తెలిపారు. ప్రతి 4–6 నెలల వ్యవధిలో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. -
జియో కొత్త ఫోన్.. రూ.2799 మాత్రమే
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో భారతదేశంలో కొత్త 'జియోఫోన్ ప్రైమ్ 2' ప్రవేశపెట్టింది. నవంబర్ 2023లో కంపెనీ విడుదల చేసిన జియోఫోన్ ప్రైమా 4జీ కొనసాగింపుగా ఈ ఫోన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫోన్ ధర రూ. 2,799 మాత్రమే. ఇది లక్స్ బ్లూ అనే ఒకే కలర్ షేడ్లో లభిస్తుంది. దీనిని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.జియోఫోన్ ప్రైమ్ 2 క్వాల్కమ్ చిప్సెట్, 2000 mAh బ్యాటరీ పొందుతుంది. అంతే కాకుండా 2.4 ఇంచెస్ కర్వ్డ్ స్క్రీన్.. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను పొందుతుంది. వీడియో కాలింగ్కు కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎల్ఈడీ టార్చ్ లైట్ కూడా ఉంటుంది.జియో కొత్త ఫోన్.. జియోపేకు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేయడానికి స్కాన్ చేయవచ్చు. ఎంటర్టైన్ కోసం జియో టీవీ, జియో సినిమా వంటి యాప్లతో వస్తుంది. వినియోగదారులు ఫేస్బుక్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెన్స్ వంటి సోషల్ మీడియా వంటివి యాక్సెస్ చేయవచ్చు. ఇదీ చదవండి: సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ ఈ కొత్త జియో ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. 120 గ్రాముల బరువున్న ఈ ఫోన్ పరిమాణం 123.4 x 55.5 x 15.1 మిమీ వరకు మాత్రమే ఉంటుంది. హ్యాండ్సెట్ ఒకే నానో సిమ్ ద్వారా 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. FM రేడియోను యాక్సెస్ చేయవచ్చు. మొత్తం మీద తక్కువ ధర వద్ద మంచి ఫీచర్స్ కావాలనుకునే వారికి జియో కొత్త ఫోన్ మంచి ఆఫర్ అనే చెప్పాలి. -
ఇట్స్ గ్లోటైమ్: యాపిల్ మెగా ఈవెంట్ రేపే
యాపిల్ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 9) ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్లో జరుగుతుంది. యాపిల్ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్, యాపిల్ టీవీ యాప్ ద్వారా ఈ ఈవెంట్ లైవ్ చూడవచ్చు.గ్లోటైమ్ ఈవెంట్లో.. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ పరికరాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానప్పటికీ కొన్ని పుకార్లు లేదా లీక్స్ ద్వారా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి మనదేశంలో ఈ పరికరాల రిటైల్ ధర కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది.యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇదే మార్గం: నితిన్ గడ్కరీ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్సెట్ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
భారత్లో జపనీస్ బ్రాండ్ కారు లాంచ్: ధర రూ. 69.70 లక్షలు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా.. భారతీయ మార్కెట్లో 'ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 69.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ పొందుతుంది.లెక్సస్ ఈఎస్ లగ్జరీ ప్లస్ ఎడిషన్ కొత్త సిల్వర్ గ్రిల్, రియర్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్, ఎల్ఈడీ లైట్ లెక్సస్ లోగోతో కూడిన ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్, లోగో ల్యాంప్, రియర్ సీట్ పిల్లో వంటి ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు మీద 8 సంవత్సరాలు / 160000 కిమీ వారంటీ అందిస్తుంది. కస్టమర్లు 5 సంవత్సరాల వరకు రోడ్సైడ్ అసిస్టెన్స్ కూడా పొందవచ్చు.లెక్సస్ కొత్త కారు లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తన్మయ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఎడిషన్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇది లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని ఆయన అన్నారు.2024 ప్రథమార్థంలో, జపనీస్ కార్ల తయారీ కంపెనీ లెక్సస్ భారతదేశంలో 55 శాతం ఈఎస్ కార్లను విక్రయించింది. ఇప్పుడు ఇందులో లగ్జరీ ప్లస్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది కూడా మనషి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నారు. -
రూ.65 లక్షల బీఎండబ్ల్యూ కొత్త కారు: పూర్తి వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎట్టకేలకు '320ఎల్డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో' లాంచ్ చేసింది. ఈ సెడాన్ ధర రూ.65 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.బీఎండబ్ల్యూ 320ఎల్డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ బ్లాక్ కిడ్నీ గ్రిల్, స్మోక్డ్ అవుట్ ఎఫెక్ట్ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్లైట్లు, గ్లోస్ బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, లేన్ చేంజ్ అసిస్టెంట్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.కొత్త బీఎండబ్ల్యూ కారు మినరల్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, పోర్టిమావో బ్లూ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. యాంబియంట్ లైటింగ్లో భాగంగా ఫ్రంట్ సీట్స్ వెనుక భాగంలో కొత్త ఇల్యూమినేటెడ్ కాంటౌర్ స్ట్రిప్ కూడా ఉంది.బీఎండబ్ల్యూ 320ఎల్డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, 16 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసిందిబీఎండబ్ల్యూ 320ఎల్డబ్ల్యు ఎమ్ స్పోర్ట్ ప్రో మోడల్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7.6 సెకన్లలో 0 - 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందిన ఈ కారు 19.61 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో ఎకో ప్రో, కంఫర్ట్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు. -
భారత్లో టాటా కర్వ్ లాంచ్: ధర & వివరాలు
టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంచ్ చేసింది. ఇవి మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్స్ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుంచి రూ. 17.5 లక్షలు. డీజిల్ వేరియంట్స్ ధరలు రూ. 11.5 లక్షల నుంచి రూ. 17.7 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.కొత్త టాటా కర్వ్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మూడు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్తో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో స్టాండర్డ్గా వస్తాయి. ఇది భారతదేశంలో డ్యూయల్-క్లచ్ గేర్బాక్స్ పొందిన ఏకైక డీజిల్ కారుగా నిలిచింది.టాటా కర్వ్ కారు లేటెస్ట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్రూఫ్, రిక్లైనింగ్ రియర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటివి పొందుతుంది.సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ ఆరు ఎయిర్బ్యాగ్లు, లెవెల్ 2 ఏడీఏఎస్, ఈసీఎస్, డిస్క్ బ్రేక్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివన్నీ పొందుతుంది. ఈ కొత్త కారు సిట్రోయెన్ బసాల్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్లో మరో మసెరటి కారు లాంచ్: ధర ఎంతో తెలుసా?
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మసెరటి'.. భారతీయ మార్కెట్లో సెకండ్ జనరేషన్ 'గ్రాన్టూరిస్మో' (GranTurismo) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 2.72 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది మోడెనా, ట్రోఫియో అనే రెండు ట్రిమ్లలో లభిస్తుంది.రెండు డోర్స్, నాలుగు సీట్లు కలిగిన ఈ కారు 3.0 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 490 హార్స్ పవర్, 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.మసెరటి గ్రాన్టూరిస్మో 12.2 ఇంచెస్ డిజిటల్ డయల్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉన్నాయి. దానికి కింద భాగంలో క్లైమేట్ కంట్రోల్స్ కోసం 8.8 ఇంచెస్ టచ్స్క్రీన్ కూడా ఉంటుంది. డిజిటల్ క్లాక్, ఆప్షనల్ హెడ్ అప్ డిస్ప్లే, సోనస్ ఫాబ్రే ఆడియో సిస్టమ్ మొదలైనవి కూడా ఇందులో చూడవచ్చు.20 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుకవైపు 21 ఇంచెస్ వీల్స్ పొందిన మసెరటి గ్రాన్టూరిస్మో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
కొత్త బైక్ లాంచ్ చేసిన ట్రయంఫ్ - ధర రూ.9.72 లక్షలు
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ట్రయంఫ్ మోటార్సైకిల్' భారతీయ విఫణిలో 'డేటోనా 660' బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని డేటోనా 675 ఆధారంగా తయారైంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన ట్రయంఫ్ డేటోనా 660 బైక్.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్ సెటప్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్ పొందుతుంది. ఇది షోవా 41 మిమీ బిగ్ పిస్టన్ అప్సైడ్ డౌన్ ఫోర్క్, వెనుకవైపు 130 మిమీ షోవా మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ రేడియల్ కాలిపర్లతో 310 మిమీ ట్విన్ డిస్క్లు, వెనుక స్లైడింగ్ కాలిపర్తో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి.డేటోనా 660 బైక్ 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 95 Bhp పవర్, 69 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు. కాబట్టి లాంగ్ రైడింగ్ చేయడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.డేటోనా 660 బైక్ ఇన్స్ట్రుమెంటేషన్ కోసం మల్టీ ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్ పొందుతుంది. ఈ బైక్ రోడ్, రైన్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్లను పొందుతుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కొత్త బైక్ కవాసకి నింజా 650, ఎప్రిలియా ఆర్ఎస్ 660 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.It’s GAME ON! The moment you've been waiting for is here. Introducing the ALL-NEW Daytona 660, priced at ₹9 72 450/- Ex-Showroom.Get ready to experience the thrilling triple-powered performance, delivering pure exhilaration.Bookings are open now at Triumph dealerships near you pic.twitter.com/KyBEMWKcw5— TriumphIndiaOfficial (@IndiaTriumph) August 29, 2024 -
టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
భారత్లో ఆడి కొత్త క్యూ8
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్లో కొత్త క్యూ8 విడుదల చేసింది. ధర ఎక్స్షోరూంలో రూ.1.17 కోట్లు. 8 స్పీడ్ టిప్ట్రానిక్ ట్రాన్స్మిషన్, 48వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0 లీటర్ టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.6 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎనిమిది ఎయిర్బ్యాగ్స్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, లేజర్ టెక్నాలజీతో డైనమిక్ ఇండికేటర్స్తో హెచ్డీ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్లైట్స్, 17 స్పీకర్స్తో బీఅండ్వో ప్రీమియం 3డీ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆడి వర్చువల్ కాక్పిట్, రెడ్ బ్రేక్ కాలిపర్స్తో ఆర్21 గ్రాఫైట్ గ్రే అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కాగా, ఆడి 15 ఏళ్లలో భారత్లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
భారత్లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
భారతీయ మార్కెట్లో జపాన్ బ్రాండ్ కారు లాంచ్ - పూర్తి వివరాలు
నిస్సాన్ కంపెనీ తన ఎక్స్-ట్రైల్ SUVని రూ. 49.92 లక్షల ప్రారంభ ధర వద్ద దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు 7 సీటర్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని సంస్థ సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది.కొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో వస్తుంది. ఇది 163hp పవర్, 300Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఆటో-హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
వామ్మో 1890 సీసీ ఇంజిన్.. రూ.72 లక్షల బైక్ విడుదల
దేశంలో మరో ఖరీదైన బైక్ విడుదలైంది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఇండియన్ మోటార్సైకిల్’ తన అల్ట్రా-ప్రీమియం రోడ్మాస్టర్ ఎలైట్ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 71.82 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీంతో భారత్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మోటార్సైకిళ్లలో ఒకటిగా మారింది.రోడ్మాస్టర్ ఎలైట్ అనేది పరిమిత-ఎడిషన్. ప్రపంచవ్యాప్తంగా 350 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేశారు. దీన్ని తయారు చేసిన ఇండియన్ మోటార్సైకిల్ అనేది హై-ఎండ్ మోటార్సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ అమెరికన్ బ్రాండ్. భారత్లో దీని ఉనికి పరిమితమే అయినప్పటికీ ఆకట్టుకునే లైనప్తో అందుబాటులో ఉంది. ఇందులో ఇండియన్ స్కౌట్, చీఫ్టైన్, స్ప్రింగ్ఫీల్డ్, చీఫ్ వంటి మోడల్లు ఉన్నాయి.రోడ్మాస్టర్ ఎలైట్ ప్రత్యేకతలుపూర్తి స్థాయి టూరింగ్ మోటార్సైకిల్గా రూపొందిన రోడ్మాస్టర్ ఎలైట్ బైక్ డీప్ రెడ్, బ్లాక్ రంగులపై గోల్డ్ హైలైట్లతో ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ను కలిగి ఉంది.ఈ బైక్లో 'ఎలైట్' బ్యాడ్జింగ్, గ్లోస్ బ్లాక్ డాష్, కలర్-మ్యాచ్డ్ సీట్లు ఉన్నాయి. ఇవి హీటింగ్, కూలింగ్ ఫంక్షన్లను అందిస్తాయి. అదనపు సౌకర్యం, లగ్జరీ కోసం ప్యాసింజర్ ఆర్మ్రెస్ట్లు, బ్యాక్లిట్ స్విచ్ క్యూబ్లు ఉన్నాయి.రోడ్మాస్టర్ ఎలైట్లో ప్రీమియం 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఇచ్చారు. 7 అంగుళాల TFT డిస్ప్లే ఇందులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే ఫీచర్లు ఉన్నాయి. సంప్రదాయ స్పీడోమీటర్, రెవ్ కౌంటర్ గేజ్లు ఉన్నాయి.హార్డ్వేర్ విషయానికి వస్తే ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్లో డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు, కాన్ఫిడెంట్ స్టాపింగ్ పవర్ కోసం సింగిల్ రియర్ డిస్క్ ఉన్నాయి. ఇందులో 20.8-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.ఇందులో అతి ముఖ్యమైనది 1890 సీసీ V-ట్విన్ 'థండర్స్ట్రోక్' ఇంజన్. ఆరు-స్పీడ్ గేర్బాక్స్తో ఈ పవర్ఫుల్ ఇంజన్ 170 Nm టార్క్ను అందిస్తుంది. వీటి కలయిక శక్తివంతమైన, సరికొత్త రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
49 మందికే రామ్ మందిర్ వాచ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
స్విస్ వాచ్ తయారీదారు జాకబ్ & కో భారతదేశంలోని దాని రిటైలర్ భాగస్వామి ఎథోస్ వాచ్ బోటిక్స్ సహకారంతో 'రామ్ జన్మభూమి ఎడిషన్ వాచ్' లాంచ్ చేసింది. ఈ వాచ్ కేవలం 49 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. దీని ధర 41000 డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34,00,000.జాకబ్ & కో లాంచ్ చేసిన ఈ వాచ్ ఈ వాచ్లో అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం, రాముడు, హనుమంతుని నమూనాలు ఉన్నాయి. ఇది కుంకుమపువ్వు రంగులో ఉంది. దీనికి కేవలం 49మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది.భారతీయ సంస్కృతికి నిదర్శనంగా సంస్థ ఈ వాచ్ లాంచ్ చేసింది. ఈ వాచ్లో 9 గంటల వద్ద రామ మందిరం, 2 గంటల వద్ద రాముడు, 4 గంటల వద్ద హనుమంతుడు ఉండటం చూడవచ్చు. ఈ వాచ్ కలర్ ఆధ్యాత్మికతకు ప్రతీకగా చెబుతున్నారు. దీనిని ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రతిధ్వనించేలా రూపొందించారు. View this post on Instagram A post shared by WatchTime India (@watchtimeindia) -
రూ.72.90 లక్షల కొత్త బీఎండబ్ల్యూ కారు - వివరాలు
బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్త 5 సిరీస్ కారు ఎల్డబ్ల్యుబీ లాంచ్ చేసింది. ఇది 530ఎల్ఐ అనే సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్ షోరూమ్).కొత్త బీఎండబ్ల్యూ 530ఎల్ఐ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్ పొందుతుంది.ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ద్వారా వెనుక చక్రాలను పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 6.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ 250 కిమీ/గం.కొత్త డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 5 సిరీస్.. పరిమాణంలో దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత పెద్దగా ఉంటుంది. ఇందులో కిడ్నీ గ్రిల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్పోర్టియర్ ఫ్రంట్, రియర్ బంపర్లు ఉన్నాయి. లోపల 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మొదలైనవి ఉన్నాయి. -
భారత్లో రూ.14.90 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. వివరాలు
భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ సీఈ (BMW CE) లాంచ్ అయింది. దీని ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ధరలను బట్టి చూస్తే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ టూ వీలర్ అదే అని తెలుస్తోంది.దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.3 kW ఛార్జర్ ద్వారా 4 గంటల 20 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6.9 kW ఛార్జర్ ద్వారా 1 గంట 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.సీఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటారు 42 హార్స్ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ 120 కిమీ.ఎల్ఈడీ లైటింగ్స్, 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే, కీలెస్ ఇగ్నిషన్, ట్రాక్షన్ కంట్రోల్, USB ఛార్జర్, సైడ్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటివి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పొందుతుంది. ఇది బ్లూ, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది ఎకో, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
దశాబ్దాల తర్వాత మళ్ళీ అలాంటి బైక్: ధర ఎంతో తెలుసా?
డుకాటి భారతదేశంలో హైపర్మోటార్డ్ 698 మోనో పేరుతో సరికొత్త బైకును రూ. 16.50 లక్షలకు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతున్న హైపర్మోటార్డ్ 950 ఆర్విఇ ధర కంటే రూ.50000 ఎక్కువ. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల (జులై) చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.హైపర్మోటార్డ్ 698 మోనో అనేది.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్పై డుకాటి చేసిన ప్రయత్నం. కంపెనీ 1950 నుంచి 1970 వరకు సింగిల్ సిలిండర్ కాన్ఫిగరేషన్తో ఇంజిన్లను తయారు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తూ సింగిల్ సిలిండర్ మోటార్సైకిల్ లాంచ్ చేసింది.డుకాటీ లాంచ్ చేసిన హైపర్మోటార్డ్ 698 బైక్ 659 సీసీ సింగిల్ సిలిండర్ కలిగి 77.5 హార్స్ పవర్, 63 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డబుల్ ఎగ్జాస్ట్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్లైట్, హై ఫ్రంట్ మడ్గార్డ్, షార్ప్ టెయిల్, ఫ్లాట్ సీటు వంటి అంశాలతో ఈ బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఫుల్ ఛార్జ్తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024 -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024 -
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్.. లాంచ్ ఎప్పుడంటే?
బజాజ్ కంపెనీ లాంచ్ చేయనున్న సీఎన్జీ బైక్ ఈ నెల 18న లాంచ్ అవుతుందని గతంలో వెల్లడైంది. అయితే ఈ డేట్ ఇప్పుడు జూలై 5కి మారింది. ఇప్పటి వరకు ప్రపంచ మార్కెట్లో సీఎన్జీ బైక్ లేదు.బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త సీఎన్జీ 125 సీసీ విభాగంలో లాంచ్ అవుతుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ పేరు 'బ్రూజర్' అని తెలుస్తోంది. ఈ బైక్ సీఎన్జీ, పెట్రోల్తో నడిచే ప్రపంచంలోనే మొదటి ప్రొడక్షన్ స్పెక్ మోటార్సైకిల్. ఇది చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. వాహన వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.భారతదేశంలో ఇంధన ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోలిస్తే.. సీఎన్జీ ధరలు తక్కువ. కాబట్టి దేశీయ మార్కెట్లో సీఎన్జీ బైక్ లాంచ్ అనేది ఆటోమొబైల్ చరిత్రలో ఓ సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ఈ బైకుకు సంబంధించిన మరిన్ని వివరాలు జూలై 5న వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రూ.1.40 లక్షల కొత్త బైక్.. పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతదేశంలో పల్సర్ ఎన్160 పేరుతో మరో కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కొత్త వేరియంట్ ఇప్పుడు అప్సైడ్ డౌన్ ఫోర్క్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్ మోడ్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్).చూడటానికి స్టాండర్డ్ బజాజ్ పల్సర్ ఎన్160 మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇందులోని డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతుంది. కాబట్టి టర్న్ బై టర్న్ న్యావిగేషన్, ఇతర కనెక్టెడ్ ఫీచర్లను సులభంగా పొందవచ్చు. ఈ బైక్ ఇప్పుడు రెయిన్, రోడ్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.కొత్త పల్సర్ ఎన్160 మోడల్ సాధారణ మోడల్ మాదిరిగానే 164.82 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 rpm వద్ద 16 హార్స్ పవర్, 6750 rpm వద్ద 14.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇంజిన్లో ఎటువంటి అప్డేట్ లేదు, కాబట్టి అదే పనితీరును అందిస్తుంది. -
రూ.20.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ లాంచ్ - పూర్తి వివరాలు
భారతీయ విఫణిలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన 'ఆర్ 1300 జీఎస్' బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 20.95 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్ కంటే రూ. 40000 ఎక్కువ.కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ 1300 సీసీ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 143.5 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. పవర్, టార్క్ అనేవి దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ చూడటానికి దాని ఆర్ 1300 జీఎస్ మాదిరిగానే ఉంటుంది. కానీ కొన్ని అప్డేటెడ్ మార్పులను చూడవచ్చు. ఇందులో రీడిజైన్ ఫ్రంట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్, స్టీల్ షీట్-మెటల్ ఫ్రేమ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఈ బైకులో 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT స్క్రీన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ పొందుతుంది.సుమారు 237 కేజీల బరువున్న ఈ ఆర్ 1300 జీఎస్.. తక్కువ హైట్ ఉన్న సీటును పొందుతుంది. పొట్టిగా ఉన్న రైడర్లకు కూడా ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది ట్రయంఫ్ టైగర్ 1200 జిటి ప్రో, హార్లీ-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.Let's set the pace together. The all-new BMW R 1300 GS starts at an introductory price of INR 20.95 Lakhs*.Have you booked yours? ⬇️https://t.co/NIhvPAPFXK#r1300gs #1300gs #bmw1300gs #pricelaunch #adventurebike #kingofadventure #bmwmotorradlndia #makelifearide pic.twitter.com/Pl9KOODGs0— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) June 13, 2024 -
'నోకియా 3210 4జీ' వచ్చేసింది.. రేటెంతో తెలుసా?
నోకియా బ్రాండ్ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ కంపెనీ సుమారు 25 సంవత్సరాల తరువాత మార్కెట్లో 'నోకియా 3210 4జీ' ఫోన్ లాంచ్ చేసింది. కాలంలో కలిసిపోయిందనుకున్న ఈ ఫోన్ మళ్ళీ కనిపించడంతో నోకియా ప్రియులు సంబరపడిపోతున్నారు.ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3210 4జీ ధర రూ. 3999. దీనిని ఈ కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్లో లేదా హెచ్ఎండీ వెబ్సైట్లో కొనుకోగలు చేయవచ్చు. ఇది బ్లూ, ఎల్లో, బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2.4 ఇంచెస్ స్క్రీన్తో వస్తుంది. టీ107 ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ కీబోర్డుతి వస్తుంది.ఈ కొత్త నోకియా 3210 4జీ ఫోనులో అందరికీ ఇష్టమైన 'స్నేక్' గేమ్ కూడా ఉంది. 64 ఎంబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ 128 ఎంబీ స్టోరేజ్ పొందుతుంది. దీనిని 32 జీబీ వరకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి SD కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇందులో యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ వంటి వాటి కోసం యాప్స్ కూడా ఉన్నట్లు సమాచారం.కెమెరా కోసం నోకియా 3210 4జీ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్తో కూడిన 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయెల్ సిమ్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ఇప్పుడు 1450 mAh రినోవబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఇది యూఎస్బీ టైప్-సీ ఛార్జ్ పోర్టుతో వస్తుంది.Here it is! As iconic as ever – Nokia 3210 4G! Relive the retro, now with a modern touch - YouTube, Scan & Pay with UPI, long battery life, Bluetooth, 4G connectivity, and more!Buy now - https://t.co/E7s4Mblyg4 #HMD #Nokia3210 #IconIsBack pic.twitter.com/0rs00bssDc— HMD India (@HMDdevicesIN) June 10, 2024 -
ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ ఇండియా' దేశీయ మార్కెట్లో కొత్త 'పానిగేల్ వీ2' బైకును బ్లాక్ కలర్ ఆప్షన్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 20.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డుకాటీ పానిగేల్ వీ2 బ్లాక్ ఫెయిరింగ్ పొందటమే కాకుండా.. ఫ్యూయల్ ట్యాంక్ మీద, వీల్స్ మీద, వెనుక భాగంలో రెడ్ కలర్ స్కీమ్ చూడవచ్చు. డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి అదే కన్ను మాదిరిగా ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ హెడ్ల్యాంప్ వంటివి ఉన్నాయి.పానిగేల్ వీ2 బైక్ అదే 995 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 155 Bhp పవర్, 9000 rpm వద్ద 104 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగిన ఈ బైక్.. కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ వంటి వాటితో పాటు.. పైరెల్లీ డయాబ్లో రోస్సో కోర్సా II టైర్లను కలిగి 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
భారత్లో జపనీస్ బ్రాండ్ స్కూటర్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
జపనీస్ టూ వీలర్ తయారీ సంస్థ యమహా దేశీయ మార్కెట్లో 'ఫాసినో ఎస్' వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ స్కూటర్ ధర ధర రూ. 93730 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో ఆన్సర్ బ్యాక్ అనే ఫైండ్ మై స్కూటర్ యాప్ కూడా ఉంది.యమహా ఫాసినో ఎస్ వేరియంట్ 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.2 హార్స్ పవర్ మరియు 10.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని బరువు కేవలం 99 కేజీలు మాత్రమే. ఇది 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ పొందుతుంది.యమహా ఫాసినో ఇప్పుడు డ్రమ్, డిస్క్, ఎస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 79900, రూ. 91130, రూ. 93730 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125, హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్ 125, యమహా రే జెడ్ఆర్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
భారత్లో కొత్త కారు లాంచ్ చేసిన దేశీయ కంపెనీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ హ్యాచ్బ్యాక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ ఆల్ట్రోజ్ కారు కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించే టాటా ఆల్ట్రోజ్ రేసర్.. దాని బోనెట్, రూఫ్ వంటి వాటి మీద వైట్ రేసింగ్ స్ట్రిప్స్ పొందుతుంది. అక్కడక్కడా రేసింగ్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అలాగే ఉన్నాయి.డిజైన్ మాత్రమే కాకుండా టాటా ఆల్ట్రోజ్ రేసర్ వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెంటర్ కన్సోల్లోని గేర్ లివర్ మొదలైనవి కూడా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. -
భారత్లో సరికొత్త అమెరికన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ జీప్.. భారతీయ విఫణిలో సరికొత్త 'స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ. 34. 27 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్డేట్స్ పొందింది.జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్లతో అల్లాయ్ వీల్స్ను పొందుతుంది. ఇందులో సైడ్ మౌల్డింగ్, పుడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర దాని ఎంట్రీ లెవల్ లిమిటెడ్ (ఓ) వేరియంట్ కంటే రూ. 50000 ఖరీదైనది.కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది.జీప్ కంపెనీ ఈ ఏడాది చివర్లో మిడ్-లైఫ్ అప్డేట్ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్డేటెడ్ SUV ఇటీవలే టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ. 82911లకే కొత్త బైక్.. 73 కిమీ మైలేజ్
హీరోమోటోకార్ప్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు సరికొత్త స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 లాంచ్ చేసింది. కంపెనీ ఎవర్గ్రీన్ కమ్యూటర్ యొక్క 30వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ఈ బైకును రూ. 82911 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది.కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 8.02 hp పవర్, 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఇది ఒక లీటరుకు ఏకంగా 73 కిమీ మైలేజ్ అందిస్తుంది.డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ పొందిన ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో డిజిటల్ డిస్ప్లే.. బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉన్న ఈ బైక్ దాని స్టాండర్డ్ XTEC మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ఉఇప్పటికే అమ్మకానికి ఉన్న హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?
జావా మోటార్సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్తో పాటు రెడ్ అండ్ క్రోమ్లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.జావా 42 బాబర్ కొత్త వేరియంట్లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. -
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్ను పొందింది. ఎయిర్ ఇన్టేక్స్లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతదేశంలో 2 సిరీస్ షాడో ఎడిషన్ను రూ. 46.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ షాడో ఎడిషన్ 220ఐ ఎం స్పోర్ట్స్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. ఇది బ్లాక్ అవుట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్తో సూక్ష్మమైన అప్డేట్లను పొందుతుంది.బీఎండబ్ల్యూ షాడో ఎడిషన్ బ్లాక్ ఎడిషన్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, రియర్ స్పాయిలర్ వంటి వాటితో పాటు.. ఆధునిక ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైనవి ఉన్నాయి.ఆల్పైన్ వైట్, స్కైస్క్రాపర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 179 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త బీఎండబ్ల్యూ 2 సిరీస్ షాడో ఎడిషన్.. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 190 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటో గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. -
భారత్లో మరో జర్మన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. ఎట్టకేలకు 'క్యూ7 బోల్డ్ ఎడిషన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ.97.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.కొత్త ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే. అనే నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కొత్త వెర్షన్ లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కాబట్టి అదే ఇంజిన్ ఉంటుంది. పనితీరు పరంగా ఎటువంటి మార్పులు ఉండదు.ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్ 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. 335 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది కేవలం 5.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. క్యూ 7 మోడల్ ఆడి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో పాటు ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్ రోడ్, ఇండివిజువల్ అనే 7 డ్రైవ్ మోడ్లను పొందుతుంది.Make heads turn as you drive the new Audi Q7 Bold Edition.*Terms and conditions apply. European model shown. Accessories and equipment shown may not be currently offered in India. Bold Edition is available on select variants and select colours only.#AudiQ7 #BoldEdition pic.twitter.com/5hQZVQpQXL— Audi India (@AudiIN) May 21, 2024 -
రూ.45 లక్షల బీఎండబ్ల్యూ బైక్ - పూర్తి వివరాలు
'బీఎండబ్ల్యూ మోటొరాడ్' దేశీయ మార్కెట్లో సరికొత్త 'ఎమ్ 1000 ఎక్స్ఆర్' బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే భారతీయ విఫణిలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరింది. ఇది సీబియూ మార్గం ద్వారా ఇండియాకు దిగుమతి అవుతాయి. ఈ బైక్ బుక్ చేసుకుంటే డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి.మంచి డిజైన్ కలిగిన ఈ బైక్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 6.5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. అంతే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, బ్రేక్ స్లైడ్ అసిస్ట్ ఫంక్షన్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ లిమిటర్ ఫంక్షన్లు వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఎక్స్ఆర్ బైక్ 999సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 199 Bhp పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6-స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం వాడుతుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 278 కిమీ కావడం గమనార్హం. ఇందులో రెయిన్, రోడ్, డైనమిక్, డైనమిక్ ప్రో మరియు రేస్ ప్రో మోడ్ అనే ఐదు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. -
బుకింగ్స్లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం
గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.Crossing milestones even before it hits the roads. A big thank you to all our customers who have made this possible. Be a part of our journey, book now: https://t.co/P7UUnkoyxv#XUV3XO #EverythingYouWantAndMore #The3XFactor pic.twitter.com/HMNylKisa1— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) May 15, 2024 -
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్వేస్లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. -
భారత్లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ ఇన్టేక్ సరౌండ్లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
భారత్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' (MWC 2024) ఈవెంట్ ఈ రోజు ప్రారంభమైంది. స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2024 ఈవెంట్ ఈ రోజు నుంచి గురువారం (ఫిబ్రవరి 26 నుంచి 29) వరకు జరుగుతుంది. ఇందులో అనేక స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు స్మార్ట్ఫోన్లను, యాక్సెసరీలను, ఏఐ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలను ప్రవేశపెట్టనున్నాయి. ఈ ఈవెంట్లో శాంసంగ్, షావోమీ, రియల్మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ల్యాప్టాప్ల విషయానికి వస్తే.. ఇందులో హెచ్పీ, లెనోవో, డెల్, అసుస్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఎక్కువగా ఏఐ బేస్డ్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉత్పత్తులలో కూడా ఏఐ ఫీచర్స్ అందించాలని సంకల్పించాయి. ఇదీ చదవండి: కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు గత ఏడాది ఈ ఈవెంట్ సందర్శించడానికి ఏకంగా లక్షల మంది జనం వెళ్లినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్లో లాంచ్ కావడానికి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. 29వ తేదీ వరకు ఈ ఉత్పత్తులను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
భారత్లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే?
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు. కొత్త హెచ్పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్సెన్ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది. డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్నెస్ ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD కెమెరా: హెచ్పీ వైడ్ విజన్ 5ఎంపీ ఓఎస్: విండోస్ 11 హోమ్ పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్ కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 ఛార్జింగ్: 90W బరువు: 4.1 కేజీలు హెచ్పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. -
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 ప్రో రేంజ్ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్యూవీ400కి అప్డేటెడ్ వెర్షన్గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్బోర్డ్తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్తో వస్తోంది. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
భారత్లో విడుదలైన ల్యాండ్ రోవర్ కొత్త కారు - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ల్యాండ్ రోవర్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8' లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ. 2.01 కోట్ల నుంచి రూ. 2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్తో 38.2kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, పనోరమిక్ సన్రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే? రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 104 కిమీ రేంజ్ - ధర ఎంతంటే?
దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
భారత్లో లాంచ్ అయిన ఇటాలియన్ సూపర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'రెవెల్టో' (Revuelto) కారుని లాంచ్ చేసింది. రూ.8.89 కోట్ల ధర వద్ద విడుదలైన ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ రెవెల్టో చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వై షేప్ హెడ్లైట్, ఎయిర్ ఇన్టేక్లు, టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో హెక్సా గోనల్ ఎగ్జాస్ట్ పోర్ట్లు చూడవచ్చు. ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.4 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిస్ప్లే, 9.1 ఇంచెస్ ప్యాసింజర్-సైడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఈ మూడు స్క్రీన్లు ఫిజికల్ కంట్రోల్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా కంట్రోల్ బటన్స్ పొందుతుంది. సౌకర్యవంతమైన సీట్లు కలిగిన ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా? లంబోర్ఘిని రెవెల్టో సూపర్ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 1015 హార్స్ పవర్, 807 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. ఇది ఇండియన్ మార్కెట్లో 'ఫెరారీ SF90 స్ట్రాడేల్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ వారం భారత్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
భారత్లో కొత్త 'మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యాక్బుక్ ప్రో, ఐ మ్యాక్ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యాక్బుక్ ప్రో ఎమ్3 ధరలు యాపిల్ మ్యాక్బుక్ ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 ప్రో మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు సైజ్, ర్యామ్ వంటి వాటిని మీద ఆధారపడి ఉంటాయి. మ్యాక్బుక్ ప్రో ఎమ్3 ప్రారంభ ధర రూ. 1,69,900 14 ఇంచెస్ ఎమ్3 ప్రో ప్రారంభ ధర రూ. 1,99,900 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఈ కొత్త యాపిల్ మ్యాక్బుక్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ స్టోర్ యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఐమ్యాక్ ధరలు యాపిల్ 8-కోర్ GPU కలిగిన iMac ధర రూ.1,34,900. ఇది గ్రీన్, పింక్, బ్లూ, సిల్వర్ కలర్లలో లభిస్తుంది. ఇది 8-కోర్ CPU, 8GB మెమరీ, 256GB SSD, రెండు థండర్బోల్ట్ పోర్ట్ వంటి ఫీచర్లతో మ్యాజిక్ కీబోర్డ్ అండ్ మ్యాజిక్ మౌస్తో వస్తుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! ఐమ్యాక్ కొనుగోలు చేయాలనుకువారు యాపిల్ ఆన్లైన్ స్టోర్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి యాపిల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. -
ఒకేసారి 13 కొత్త కాంట్రాక్టులు.. ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్లో మరింత విస్తరించే దిశగా ఎన్ఎస్ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్లో ఎన్ఎస్ఈ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది. గోల్డ్ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, సిల్వర్ మినీ ఫ్యూచర్స్, కాపర్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్ ఫ్యచర్స్, లెడ్ మినీ ఫ్యూచర్స్, నికెల్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, జింక్ మినీ ఫ్యూచర్స్లో ‘ఆప్షన్ ఆన్ ఫ్యూచర్స్’ను ఎన్ఎస్ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్ మెటల్స్లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందిస్తున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్ను సమర్థవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్ఎన్ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిల్వర్కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్బ్యాగ్లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్గా, స్టైలిష్గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది. సుజుకి హయాబుసా పవర్ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్ హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ బై డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో లభిస్తుంది. రైడింగ్ మోడ్లు, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) అంచనా ధర & ప్రత్యర్థులు సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?
Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర & వేరియంట్స్ స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం. లిమిటెడ్ ఎడిషన్ స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని లైనప్లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్పై క్రోమ్ బిట్లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ప్రత్యర్థులు కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్నేమ్తో ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో అతిపెద్ద మోటార్సైకిల్గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఎలివేట్ - బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది. బుకింగ్స్ & లాంచ్ టైమ్ నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్లు ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్ హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి. ఎలివేట్ ఎస్యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్బాక్స్ పొందనుంది. పవర్ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ & ఫీచర్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!) హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్రూఫ్ను మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) ప్రత్యర్థులు కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్నెస్తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. -
విడుదలకు ముందే వివరాలు లీక్ - ధర ఎంతంటే?
OnePlus Nord Buds 2r: ఆధునిక కాలంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కంటే 'బడ్స్' ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సరసమైన ధరలో వన్ప్లస్ (OnePlus) కంపెనీ 'నార్డ్ బడ్స్ 2ఆర్' (Nord Buds 2r) విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్' బాక్స్ ధర రూ. 2,999 అని తెలుస్తోంది. అంటే వీటి రిటైల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ వీటిని 2023 జులై 05న లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఇయర్బడ్స్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఒక ఛార్జ్తో 38 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ55 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి మంచి ఆడియో క్వాలిటీ అందిస్తుంది. ఇందులో 12.4mm డైనమిక్ టిటానియం డ్రైవర్, 25డీబీ నాయిస్ కాన్సిలింగ్ ఉండనున్నాయి. ఈ లేటెస్ట్ బడ్స్ కలర్ ఆప్షన్స్ గురించి మాత్రమే కాకుండా ఆఫర్స్ గురించి కూడా త్వరలోనే తెలుస్తుంది. -
చిరుత లాంటి వేగం ఈ బైక్ సొంత - ధర ఎంతో తెలుసా?
Ducati Panigale V4R: భారతదేశంలో సరసమైన బైకులు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులు కూడా అమ్ముడవుతున్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో కవాసకి, డుకాటి మొదలైన బ్రాండ్ బైకులు ఉన్నాయి. తాజాగా డుకాటి ఇండియన్ మార్కెట్లో సరికొత్త ఖరీదైన బైకును లాంచ్ చేసింది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి విడుదల చేసిన బైక్ పేరు 'పానిగలె వి4 ఆర్' (Panigale V4 R). దీని ధర అక్షరాలా రూ. 69.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా మరింత ఎక్కువ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని 998 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్ 215 bhp పవర్ అందిస్తుంది. 2019 నుండి కంపెనీ భారతదేశంలో V4R విక్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ లేటెస్ట్ బైక్ రేస్ టీమ్ల కోసం అందించే కొన్ని ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున గన్ డ్రిల్డ్, పిస్టన్ వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న హ్యుందాయ్ ఎక్స్టర్ - ఫస్ట్ యూనిట్ చూసారా!) ఇది ట్రాక్-ఓరియెంటెడ్ సూపర్బైక్ అయినందున ఎలక్ట్రానిక్స్ సూట్తో వస్తుంది. వీటిలో కొత్త 'ట్రాక్ ఈవో' మోడ్, రీకాలిబ్రేటెడ్ డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ EVO2 సిస్టమ్లు ఉన్నాయి. రైడర్ ఎంచుకోవడానికి ఫుల్, హై, మీడియం, లో అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ బైక్ ముందు భాగంలో 1 అనే నెంబర్ ఉండటం చూడవచ్చు. ఇది వరల్డ్ సూపర్బైక్లలో డుకాటి ఆధిపత్యాన్ని చూపించడానికి ఉపయోగపడుతుంది. ఈ బైక్ కూడా సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా అమ్ముడవుతాయి. ఇప్పటికే భారత్కు ఐదు యూనిట్లు వచ్చాయని, అవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. -
భారత్లో పవర్ఫుల్ కారు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ - ధర ఎంతంటే?
Mercedes Benz AMG SL 55: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' (Mercedes Benz India) ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'AMG SL 55' అనే మరో ఖరీదైన కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ 'ఏఎమ్జీ ఎస్ఎల్ 55' ప్రారంభ ధర రూ. 2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశంలో అమ్ముడవుతుంది. రెండు డోర్లు కలిగిన ఈ కారు ఫోర్ సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. డిజైన్ & డైమెన్షన్ (కొలతలు) డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పనామెరికానా ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్లైట్, రెండు పవర్ డోమ్లతో కూడిన పొడవైన బోనెట్, పెరిగిన విండ్స్క్రీన్, క్వాడ్ ఎగ్జాస్ట్లు, 20 ఇంచెస్ అల్లాయ్ వంటివి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్-లేయర్ ఫాబ్రిక్ రూఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి కేవలం 16 సెకన్ల సమయం పడుతుంది. ఇది బ్లాక్, డార్క్ రెడ్, గ్రే కలర్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. కాగా కారు మొత్తం అబ్సిడియన్ బ్లాక్, సెలెనైట్ గ్రే, హైపర్ బ్లూ, ఆల్పైన్ గ్రే, ఒపలైట్ వైట్ బ్రైట్, స్పెక్ట్రల్ బ్లూ మాగ్నో, పటగోనియా రెడ్ బ్రైట్, మోన్జా గ్రే మాగ్నో అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. ఏఎమ్జీ ఎస్ఎల్ 55 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4705 మిమీ, వెడల్పు 1915 మిమీ, ఎత్తు 1359 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఏఎమ్జీ ఎస్ఎల్ 55 ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 11.9 ఇంచెస్ వర్టికల్ టచ్స్క్రీన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ MBUX ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ అనే రెండు ఇంటీరియర్ ట్రిమ్స్ మొదలైనవి లభిస్తాయి. (ఇదీ చదవండి: మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?) ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్జీ ఎస్ఎల్ 55 4.0 లీటర్ లీటర్ ట్విన్ టర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 476 హార్స్ పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో వస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకునే ఈ కారు గరిష్ట వేగం 295 కిమీ/గం. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్జీ ఎస్ఎల్ 55 కారు పోర్స్చే 911 కర్రెరా ఎస్ క్యాబ్రియోలెట్, లెక్సస్ 500హెచ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమాంకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
ప్రత్యర్థులను రఫ్ఫాడించడానికి సిద్ధమైన రెనో రఫెల్ - వివరాలు
Renault Rafale Revealed: అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాన్స్ వాహన తయారీ సంస్థ 'రెనాల్ట్' (Renault) యూరప్ మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ ఎస్యువి 'రఫెల్' (Rafale) ఆవిష్కరించింది. మార్కెట్లో అడుగెట్టిన ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిజైన్ & కొలతలు కొత్త రెనాల్ట్ రఫెల్ CMF-CD ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారైంది. ఇందులో అద్భుతమైన గ్రిల్, ఫాస్ట్బ్యాక్ రూఫ్, స్లోపింగ్ రూఫ్లైన్, పెద్ద బానెట్, వైడ్ ఎయిర్ వెంట్, మాట్రిక్స్ షేప్ ఎల్ఈడీ హెడ్లైట్స్ వంటివి ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. టెయిల్ లైట్, బ్రాండ్ లోగో, స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఈ SUV పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4.7 మీ, ఎత్తు 1.61 మీ, వీల్బేస్ 2.74 మీ వరకు ఉంటుంది. కావున ఇది ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. ఫీచర్స్ ఫీచర్స్ విషయానికొస్తే.. రెనాల్ట్ రఫేల్ పానోరమిక్ సన్రూఫ్, ఆర్మ్రెస్ట్తో కూడిన భారీ సెంటర్ కన్సోల్, ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 9.3 ఇంచెస్ హెడ్అప్ డిస్ప్లే, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.0 ఇంచెస్ వర్టికల్లీ ఓరియెంటెడ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: ఇండియన్ ఆర్మీలోకి మహీంద్రా ఆర్మడో కార్లు - వైరల్ వీడియో) ఇంజిన్ రెనాల్ట్ కొత్త కారు 1.2 లీటర్ టర్బోఛార్జ్డ్ 3 సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ కలిగి 2 ఎలక్ట్రిక్ మోటార్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. సాధారణంగా 130 హెచ్పీ పవర్ను జనరేట్ చేసే ఈ ఇంజిన్.. ఎలక్ట్రిక్ మోటార్లను కనెక్ట్ చేస్తే 200 హెచ్పీ కంటే ఎక్కువ ఔట్పుట్ అందిస్తుంది. (ఇదీ చదవండి: ఐఐటీ చదివి యంగెస్ట్ బిలియనీర్ అయ్యాడిలా.. సంపాదనలో మేటి ఈ అంకిత్ భాటి!) భారతదేశంలో ఈ ఎస్యువి బహుశా విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ 2025 నాటికి రెనాల్ట్ డస్టర్ అప్డేట్ మోడల్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. కాగా యూరప్ మార్కెట్లో విడుదలకానున్న ఈ రఫెల్ ధర 55,000 యూరోలు వరకు ఉండవచ్చు. దీని విలువ భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 49.3 లక్షల వరకు ఉంటుంది. -
ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది. (ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?) ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని అనేది ఒక లైట్వెయిట్ మోడల్. దీనిని 3టీ కార్బన్ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్ను పోలి ఉంటుంది. రెండవ మోడల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
వచ్చేసింది.. ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యాయి, అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కూడా 'స్పెక్టర్' అనే ఎలక్ట్రిక్ కారు విడుదలతో ఈ జాబితాలో చేరింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసిన రోల్స్ రాయిస్ కంపెనీ తాజాగా 'స్పెక్టర్' (Spectre) ఎలక్ట్రిక్ కారుని సౌత్ కొరియాలో విడుదల చేసింది. గతంలో వెల్లడించినట్లుగానే కంపెనీ ఎలక్ట్రిక్ కారుని తీసుకువచ్చింది. ఇది గ్లోబల్ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్. దీని ధర కొరియాలో 620 మిలియన్ వాన్స్.. అంటే భారతీయ కరెన్సీ దీని విలువ సుమారు 3.98 కోట్లు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) దక్షిణ కొరియాలో రోల్స్ రాయిస్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడంలో భాగంగానే స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసినట్లు సమాచారం. ఈ కారు డిజైన్ చూడగానే రోల్స్ రాయిస్ తెలిసిపోతుంది. ఇందులో అత్యంత విశాలవంతమైన గ్రిల్ చూడవచ్చు. పరిమాణం పరంగా ఇది చాలా విషయంగా ఉంటుంది. పొడవు 5,453 మిమీ పొడవు, 2,080 మిమీ వెడల్పు, ఎత్తు 1,559 మిమీ వరకు ఉంది. వీల్బేస్ 3210 మిమీ. ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొత్త రోల్స్ రాయిస్ స్పెక్టర్ 2,950 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 576.6 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. ఇది ఒక ఛార్జ్తో గరిష్టంగా 520 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. -
ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న యమహా ప్లాన్స్
స్టైలిష్ బైకులకు ప్రసిద్ధి చెందిన 'యమహా' (Yamaha) దేశీయ మార్కెట్లో రానున్న రోజుల్లో ప్రీమియం బైక్స్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ వీటి కోసం త్వరలోనే ఫ్రీ బుకింగ్స్ కూడా స్వీకరించడానికి సిద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యమహా విడుదల చేయనున్న ఈ కొత్త బైక్స్ తమ బ్లూ స్క్వేర్ షోరూమ్స్ల విక్రయించనున్నట్లు సమాచారం. కంపెనీ ఇటీవలే 200వ షోరూమ్ను చెన్నైలో ప్రారభించింది. యమహా 2019 నుంచి ఈ ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ ప్రారంభించడం మొదలుపెట్టింది. రానున్న రోజుల్లో ఈ షోరూమ్ల సంఖ్యను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) యమహా ఇండియా ఎమ్టి03, ఎమ్టి-07, ఎమ్టి-07, ఆర్3, ఆర్1, ఆర్1ఎమ్ వంటి ప్రీమియం బైకులను త్వరలోనే దేశీయ విఫణిలో విడుదల చేయనుంది. ఇప్పటికే సంస్థ వీటిని ఒక ప్రైవేట్ ఈవెంట్లో ప్రదర్శించింది. అయితే ఇవి మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయనే ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. బహుశా ఇవి పండుగ సీజన్లో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
తక్కువ ధరలో విడుదలకానున్న సింపుల్ ఎనర్జీ స్కూటర్లు - వివరాలు
Simple Energy Electric Scooters: సుదీర్ఘ విరామం తరువాత 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) కంపెనీ దేశీయ మార్కెట్లో 'సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్' లాంచ్ చేసింది. కాగా సంస్థ ఇప్పుడు వచ్చే త్రైమాసికంలో మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాబోయే రోజుల్లో సింపుల్ ఎనర్జీ విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న సింపుల్ వన్ స్కూటర్ ధర కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన సింపుల్ వన్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.5 లక్షల మధ్య ఉంది. ఇప్పటికే ఈ స్కూటర్ డెలివరీలు కూడా మొదలయ్యాయి. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) కంపెనీ విడుదలచేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు బహుశా రూ. 1 లక్ష నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ధర తక్కువగా ఉంటుంది కావున బ్యాటరీ చిన్నగా ఉంటుంది, తద్వారా రేంజ్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదలైన తరువాత టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 ఎక్స్, ఓలా ఎస్1 ఎయిర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ!) సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. -
2023 హోండా యూనికార్న్ వచ్చేసింది - ధర ఎంతంటే?
Honda Unicorn Lunched: హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందుతున్న యునికార్న్ బైకు అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర, డిజైన్, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన 2023 హోండా యూనికార్న్ ధర రూ. 1,09,800. ఈ బైక్ మునుపటి మోడల్ ధర రూ. 1,05,718 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అంటే ఈ అప్డేటెడ్ బైక్ ధర మునుపటి కంటే కూడా రూ. 4,082 ఎక్కువ. ఈ బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. ఈ అప్డేటెడ్ బైక్ డిజైన్ & ఫీచర్స్ అన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైక్ సీటు ఎత్తు 715 మిమీ, మొత్తం బరువు 140 కేజీల వరకు ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ మైలేజ్ అందించే బైకుల జాబితాలో హోండా యూనికార్న్ కూడా ఒకటి కావడం విశేషం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) ఇంజిన్ & వారంటీ అప్డేటెడ్ హోండా యూనికార్న్ బైకులో 162.7 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 ఆర్పిఎమ్ వద్ద 12.9 bhp పవర్, 5500 ఆర్పిఎమ్ వద్ద 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ కలిగి డ్రమ్ బ్రేక్స్ కూడా పొందుతుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు మార్కెట్లో విడుదలైన హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి - ధర ఎంతో తెలుసా?) హోండా కంపెనీ కొత్త యునికార్న్ కోసం స్పెషల్ వారంటీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే మూడు సంవత్సరాల వారంటీ మాత్రమే కాకుండా ఏడు సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అందిస్తుంది. మొత్తం మీద ఈ బైక్ కొనుగోలుపైన 10 సంవత్సరాల వారంటీ కవరేజ్ పొందవచ్చు. -
భారత్లో హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైక్ - ధర & వివరాలు
2023 Hero Xtreme 160R 4V: భారతీయ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర, అప్డేటెడ్ ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన హీరో మోటోకార్ప్ కొత్త బైక్ పేరు 'ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి'. ఇది స్టాండర్డ్, కనెక్టెడ్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.27 లక్షలు, రూ. 1.32 లక్షలు & రూ. 1.36 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). డిజైన్ & ఫీచర్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి రీ డిజైన్ చేయబడిన ఫుల్ ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది, స్విచ్ గేర్ మునుపటి కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. ఈ బైక్ స్ప్లిట్ సీటు సెటప్ కలిగి రైడర్ అండ్ పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. మోనోషాక్ షోవా 7 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ యూనిట్ వంటివి కేవలం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మిగిలిన వేరియంట్లలో టెలిస్కోపిక్ ఫోర్క్ / మోనోషాక్ సెటప్ ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో LCD డిస్ప్లే లభిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది. కావున కాల్, నోటిఫికేషన్ అలర్ట్ వంటి వాటిని పొందవచ్చు. కాగా దీనికి సింగిల్ పీస్ సీటు, ఫోన్ మౌంట్, బార్ ఎండ్ మిర్రర్ వంటి యాక్ససరీస్ లభిస్తాయి. ఆసక్తి కలిగిని వినియోగదారులు బైకుని మరింత అందంగా చేయాలనుకుంటే ఈ యాక్ససరీస్ పొందవచ్చు. (ఇదీ చదవండి: ఏఐ చేసిన పనికి బిత్తరపోయిన జనం - అసలు విషయం ఏంటంటే?) ఇంజిన్ & పర్ఫామెన్స్ 2023 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకులోని 163 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఇప్పుడు ఎయిర్ కూల్డ్తో పాటు ఆయిల్ కూలర్ను పొందుతుంది. కావున ఇది ఆధునిక 4 వాల్వ్ హెడ్ పొందుతుంది. ఇది 16.9 bhp పవర్ 14.6 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల వరకు ఉంటుంది. బైక్ మొత్తం బరువు సుమారు 140 కేజీల కంటే ఎక్కువ. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రత్యర్థులు భారతదేశంలో విడుదలైన కొత్త ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి ధరల పరంగా బజాజ్ పల్సర్, అపాచే ఆర్టిఆర్ 4వి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. సంస్థ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు జూలై రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. -
రెనో, నిస్సాన్ల ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?
చెన్నై: వాహన తయారీలో ఉన్న రెనో, నిస్సాన్ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ నుంచి తొలి కారు భారత మార్కెట్లో 2025లో అడుగుపెట్టనుంది. ఈ మోడల్ 4 మీటర్లకుపైగా పొడవు ఉండనుంది. రూ.5,300 కోట్లతో రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతోసహా ఆరు కొత్త ఉత్పత్తులను తేనున్నట్టు ఇరు సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. అలాగే చెన్నై సమీపంలోని ప్లాంటును ఆధునీకరించనున్నారు. ఆరు మోడళ్లలో రెనో నుంచి మూడు, నిస్సాన్ నుంచి మూడు రానున్నాయి. జేవీలో నిస్సాన్కు 51, రెనోకు 49 శాతం వాటా ఉంటుంది. ‘ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. అలాగే నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పెద్ద వాహనాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం. భారత్లో క్విడ్, కైగర్, ట్రైబర్ ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్నాం. 2022లో దేశీయంగా 84,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 28,000 యూనిట్లు ఎగుమతి చేశాం. 2023లోనూ ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయి’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. -
మారుతి టూర్ హెచ్1 - దుమ్మురేపే మైలేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా టూర్ హెచ్1 పేరుతో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. భారత్లో అధిక మైలేజీ ఇచ్చే ప్రారంభ స్థాయి కమర్షియల్ హ్యాచ్బ్యాక్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిలోమీటర్లు, సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.46 కిలోమీటర్లు ఇస్తుందని వెల్లడించింది. ధర రూ.4.8 లక్షల నుంచి ప్రారంభం. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు. ఆల్టో కే10 ఆధారంగా టూర్ హెచ్1 రూపొందింది. కె–సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ పొందుపరిచారు. రెండు ఎయిర్బ్యాగ్స్, ప్రిటెన్షనర్, ఫోర్స్ లిమిటర్తో ముందు సీట్ బెల్ట్లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి హంగులు జోడించారు. -
ఫోక్స్వ్యాగన్ వర్టూస్, టైగున్ కొత్త ట్రిమ్స్ - ధర & వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా మధ్యస్థాయి సెడా న్ అయిన వర్టూస్, ఎస్యూవీ టైగున్ కొత్త ట్రిమ్స్ను విడుదల చేసింది. వర్టూస్ జీటీ ప్లస్ వేరియంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్రిమ్ను రూ.16.89 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. జీటీ డీఎస్జీ, జీటీ ప్లస్ వేరియంట్లలో టైగున్ను పరిచయం చేసింది. ఎక్స్షోరూంలో వీటి ప్రారంభ ధర రూ.16.79 లక్షలు. దేశవ్యాప్తంగా 121 నగరాలు, పట్టణాల్లోని 161 విక్రయ శాలల్లో ఇవి లభిస్తాయని కంపెనీ తెలిపింది. -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్లో జీ–క్లాస్ ఎస్యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
భారత్లో బీఎండబ్ల్యూ ఎం2 లాంచ్ - ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో ఎం2 స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.98 లక్షలు. రెండు డోర్లు, నాలుగు సీట్లను కలిగి ఉంది. పూర్తిగా తయారైన కారును భారత్కు దిగుమతి చేస్తారు. బీఎండబ్ల్యూ ఎమ్2 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 460 hp పవర్ & 550 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో 4.1 సెకన్లు, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో 4.3 సెకన్లలో అందుకుంటుంది. -
భారత్లో మళ్ళీ అడుగెట్టిన హీరో ఫ్యాషన్ ప్లస్ - ధర & వివరాలు
Hero Passion Plus: బిఎస్6 ఉద్గార ప్రమాణాల కారణంగా భారతదేశంలో మూడు సంవత్సరాలకు ముందు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) నిలిపివేసిన 'ఫ్యాషన్ ప్లస్' (Passion Plus) ఇప్పుడు మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 76,065 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. కాగా ఈ బైక్ లాంగ్ స్టాండింగ్ ఎయిర్ కూల్డ్, 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉపయోగించి అదే 8 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఇప్పుడు OBD-2 కంప్లైంట్ అండ్ E20 కి సిద్ధంగా తయారైంది. ఈ బైక్ ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా పొందుతుంది. హీరో ఫ్యాషన్ ప్లస్ టెలిస్కోపిక్ ఫోర్క్ & ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి డబుల్ క్రెడిల్ ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ బరువు 115 కేజీలు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఉన్న 100 సీసీ విభాగంలో ఇదే అత్యంత బరువైన బైక్ అని తెలుస్తోంది. ముందు, వెనుక 130 మిమీ డ్రమ్ బ్రేక్లు ఉంటాయి. (ఇదీ చదవండి: ఇండియాలో అక్కడ నివాసం చాలా కాస్ట్లీ - హైదరాబాద్ స్థానం ఏంటంటే?) గతంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హీరో ఫ్యాషన్ ప్లస్ ఇప్పుడు మూడు కలర్ ఆప్షన్స్తో లభించడమే కాకుండా సెల్ఫ్ స్టార్ట్, డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి వాటిని పొందుతుంది. ఈ బైక్ మార్కెట్లో హోండా షైన్, బజాజ్ ప్లాటినా మొదలైన 110 సీసీ విభాగంలోని బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ. 60760కే హెచ్ఎఫ్ డీలక్స్ కొత్త ఎడిషన్ - అదిరిపోయే ఫీచర్స్
Hero HF Deluxe Black Canvas Edition: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్కి చెందిన మరో కొత్త ఎడిషన్ను లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ పేరు 'హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్' (HF Deluxe Black Canvas). ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & కలర్ ఆప్షన్స్ కొత్త హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి కిక్ వేరియంట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 60760 & రూ. 66,408 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ఇప్పుడు ఆల్ న్యూ బ్లాక్ పెయింట్ స్కీమ్లో లభిస్తుంది. అంతే కాకుండా ఇది నెక్సస్ బ్లూ, కాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే పెయింట్ స్కీమ్లో కూడా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఒకప్పుడు క్రెడిట్ కార్డు ఏజంట్.. ఇప్పుడు రూ. 1000 కోట్ల సామ్రాజ్యాధిపతి) డిజైన్ & ఫీచర్స్ కొత్త హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 3డీ హెచ్ఎఫ్ డీలక్స్ ఎంబ్లమ్ పొందుతుంది. ఇందులో అన్ని లైట్స్ హాలోజన్ యూనిట్లు కావడం విశేషం. ఫీచర్స్ విషయానికి వస్తే.. ట్యూబ్లెస్ టైర్స్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇండికేటర్, టో-గార్డ్ వంటివి ఉన్నాయి. ఇక పరిమాణం పరంగా ఈ బైక్ పొడవు 1965 మిమీ, వెడల్పు 720 మిమీ, వీల్బేస్ 1,235 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: రోజుకి రూ. 1.6 లక్షల సంపాదిస్తున్న 34 ఏళ్ల యువతి.. ఈమె చేసే పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!) ఇంజిన్ అండ్ పర్ఫామెన్స్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బ్లాక్ కాన్వాస్ ఎడిషన్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 ఆర్పీఎమ్ వద్ద 7.9 బీహెచ్పీ పవర్ 6000 ఆర్పీఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్, 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఈ బైక్పై కంపెనీ 5 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్బోర్డ్లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ధర తెలియకుండానే దూసుకెళ్తున్న బుకింగ్స్.. అట్లుంటది జిమ్నీ అంటే..
Maruti 5 Door Jimny: మారుతి సుజుకి భారతదేశంలో విడుదల చేయనున్న '5 డోర్ జిమ్నీ' గురించి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు వెల్లడించింది. ఈ SUV జూన్ 7న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టనుంది. జిమ్నీ ఆఫ్-రోడర్ బుకింగ్స్, డెలివరీలు వంటి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన 3 డోర్స్ జిమ్నీ ఇప్పుడు 5 డోర్స్ జిమ్నీ రూపంలో విడుదలకావడనికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే ధరలు మాత్రమే వెల్లడించాల్సి ఉంది. ధరలు కూడా అధికారికంగా వెల్లడి కాకముందే ఈ ఎస్యువి ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. బుకింగ్స్ దాదాపు మ్యాన్యువల్ & ఆటోమాటిక్ వేరియంట్లకు సమానంగా వచ్చినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. కంపెనీ ఈ 5 డోర్ జిమ్నీ కోసం జనవరి నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్న ఈ కారు ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా తయారైంది. ఇందులో 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. (ఇదీ చదవండి: తక్కువ ధర వద్ద మంచి మైలేజ్ అందించే టాప్ 5 కార్లు - చూసారా?) డెలివరీలు.. 5 డోర్ మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ 1000 యూనిట్లను రూపొందించినట్లు సమాచారం. కావున డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫస్ట్ బ్యాచ్ డెలివరీలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి. (ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్ ఇప్పుడు సరికొత్త ఎడిషన్లో.. ధర ఎంతో తెలుసా?) మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించన్నప్పటికీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల ఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో ఇది మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
రూ. 2999కే కొత్త స్మార్ట్వాచ్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
Pebble Cosmos Vault Smartwatch: దేశీయ మార్కెట్లో మెటాలిక్ స్ట్రాప్ను ఇష్టపడే వారి కోసం 'పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్వాచ్' విడుదలైంది. క్లాసిక్ సిల్వర్, రోజ్ గోల్డ్, క్లాసిస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్వాచ్ ధర రూ. 2,999గా ఉంది. ఈ వాచ్ ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి వెబ్సైట్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా అమ్మకానికి ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలైన పెబల్ కాస్మోస్ వాల్ట్ స్మార్ట్వాచ్ 1.43 ఇంచెస్ అమోలెడ్ రౌండ్ డిస్ప్లే పొందుతుంది. ఇది ఇందులో చెప్పుకోదగ్గ హైలెట్. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ మాత్రమే కాకుండా, ప్రత్యేకమైన హెల్త్ ఫీచర్స్, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) కొత్త పెబల్ కాస్మోస్ వాల్ట్ వాచ్లో 240 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా ఏడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ వాచ్ మొబైల్కు కనెక్ట్ చేసుకున్న సమయంలో నోటిఫికేషన్స్ కూడా వాచ్లోనే పొందవచ్చు. మ్యూజిక్ ప్లే బ్యాక్ను కంట్రోల్ చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ వాచ్ ఆధునిక కాలంలో వినియోగదారులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాము. -
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్ కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్లారెన్ సూపర్కార్ - 330 కిమీ/గం స్పీడ్) ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) ప్రత్యర్థులు కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
రూ. 5.1 కోట్ల మెక్లారెన్ కొత్త సూపర్కార్ ఇదే - పూర్తి వివరాలు
McLaren Artura: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ సూపర్కార్ తయారీ సంస్థ 'మెక్లారెన్' (McLaren) ఖరీదైన హైబ్రిడ్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సూపర్కార్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో అడుగుపెట్టిన 'మెక్లారెన్ ఆర్టురా' హైబ్రిడ్ సూపర్కార్ ధర రూ. 5.1 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ప్రపంచములో అత్యంత ఖరీదైన కారు మాత్రమే కాదు అత్యంత వేగవంతమైన కారు కూడా. ఇప్పటికే సంస్థ తన కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించింది. అయితే తన పరిధిని విస్తరించడంతో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కారుని విడుదల చేసినట్లు తెలుస్తోంది. డిజైన్ కొత్త మెక్లారెన్స్ ఆర్టురా మంచి డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని హెడ్ల్యాంప్ క్రింద అదనపు లైటింగ్ ఎలిమెంట్ కూడా లభిస్తుంది. ఇది చూడటానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ ముందు భాగంలో 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. రియర్ ప్రొఫైల్ సన్నని టెయిల్-ల్యాంప్ పొందుతుంది. (ఇదీ చదవండి: ఆధునిక ప్రపంచంలో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' ఈ పనులను చేస్తుందా? ఆ పరిణామాలెలా ఉంటాయి!) ఫీచర్స్ ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ వర్టికల్ మౌంటెడ్ టచ్స్క్రీన్ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రెండు USB పోర్టులు, ADAS టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇంజిన్ కొత్త మెక్లారెన్ ఆర్టురా PHEV 3.0-లీటర్ ట్విన్-టర్బో V6 ఇంజన్ కలిగి 95 hp పవర్, 225 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 585 hp పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు 680 హార్స్ పవర్ & 720 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఇందులో లభిస్తుంది. కావున కేవలం 3.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుందని కంపెనీ ధ్రువీకరించింది. (ఇదీ చదవండి: భారత్లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) మెక్లారెన్ ఆర్టురాలో 7.4 కిలోవాట్ బ్యాటరీ 31 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని బ్యాటరీని కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. ఇందులో ఈ మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది. మెక్లారెన్ ఆర్టురా కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (MCLA)ని కలిగిన మొదటి మోడల్. ఈ కొత్త ప్లాట్ఫారమ్ ఆధారంగా తయారైన ఈ కారు 4539 మిమీ పొడవు, 2080 మిమీ, 1193 మిమీ ఎత్తు, 2640 మిమీ వీల్బేస్తో 66 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. ఈ కారు ముందు ట్రంక్లో 160 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ సూపర్కార్కు ప్రధాన ప్రత్యర్థి లేదు, కానీ మసెరటి MC 20 మాత్రం ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంది. -
టాటా పంచ్ ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఎక్స్టర్ - లాంచ్ డేట్ ఫిక్స్
Hyundai Exter: భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ కొత్త కారుని (ఎక్స్టర్) విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ SUV ఫోటోలను, డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను వెల్లడించినప్పటికీ ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు సంస్థ ఎక్స్టర్ లాంచ్ డేట్ కూడా అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ నివేదికల ప్రకారం, హ్యుందాయ్ ఎక్స్టర్ 2023 జులై 10న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఎస్యువి మార్కెట్లో అడుగుపెట్టడాని మరెన్నో రోజులు లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే రూ. 11,000లతో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కావున డెలివరీలు జులై చివరినాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. వేరియంట్స్ & డిజైన్ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ మొత్తం ఐదు వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అవి EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉండే ఈ కారు ఫీచర్స్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్ల్యాంప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్కు టెక్స్చర్డ్ ఫినిషింగ్, ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు లభిస్తాయి. వెనుక వైపు నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ ప్రస్తుతానికి కంపెనీ ఈ ఎస్యువి ఇంటీరియర్ ఫీచర్స్ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ డిస్ప్లే, ఏసీ వెంట్స్, సింగిల్ పేన్ సన్రూఫ్ వంటివి వుంటాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇంజిన్ కొత్త హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) సేఫ్టీ ఫీచర్స్ ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు కేవలం డిజైన్, ఫీచర్స్, మైలేజ్ వంటి విషయాలతో పాటు సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్కెట్లో విడుదలైన తరువాత టాటా పంచ్ మైక్రో ఎస్యువికి ప్రత్యర్థిగా నిలబడనున్న ఎక్స్టర్ తప్పకుండా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇందులోని అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్ బ్యాగులు, హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో) ప్రత్యర్థులు & అంచనా ధర హ్యుందాయ్ ఎక్స్టర్ ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ దీని ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్లో యమహా డార్క్ నైట్ ఎడిషన్ లాంచ్ - వివరాలు
Yamaha YZF-R15 V4 Dark Knight Edition: భారతదేశంలో యమహా బైకులకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మార్కెట్లో తనదైన రీతిలో దూసుకెళ్తున్న ఈ కంపెనీ తాజాగా మరో బైకుని లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ పేరు 'వైజెడ్ఎఫ్-ఆర్15 వి4' (YZF-R15 V4) డార్క్ నైట్ ఎడిషన్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్ని బతి ధరలు కూడా మారుతూ ఉంటాయి. వైజెడ్ఎఫ్-ఆర్15 రెడ్ కలర్ ధర రూ. 1.18 లక్షలు, డార్క్ నైట్ ధర రూ. 1.82 లక్షలు, బ్లూ అండ్ ఇంటెన్సిటీ వైట్ ధరలు రూ. 1.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ చూడటానికి దాదాపు బ్లాక్ కలర్ పొందుతుంది. అయితే ఇందులో లోగోలు, అల్లాయ్ వీల్స్ వంటివి గోల్డ్ హైలైట్లను పొందుతాయి. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ఇంజిన్ ఇంజిన్ కూడా స్టాండర్డ్ ఎడిషన్ బైక్తో సమానంగా ఉంటుంది. కావున అదే లిక్విడ్ కూల్డ్ 155 సీసీ సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 18.4 hp పవర్, 14.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి4 డార్క్ నైట్ ఎడిషన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250, కెటిఎమ్ RC 200 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఇక సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ రేపే!
Simple One Electric Scooter: బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న 'సింపుల్ వన్' (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ని రేపు అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. సుదీర్ఘ విరామం తరువాత విడుదలకానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. డెలివరీలు కూడా బహుశా రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు పరిచయమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు రెండు సంవత్సరాల తరువాత మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎటువంటి ఇబ్బందులు కస్టమర్లు ఎదుర్కోకూడదని చాలా రోజులుగా టెస్ట్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం చరమ దశకు చేరింది. కావున విడుదలకు సన్నద్ధమైపోయింది. రేంజ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కిలోవాట్ మోటార్ ఉంటుంది. కావున ఇది 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది. కావున మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ కలిగి బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఎకో, రైడ్, డాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. (ఇదీ చదవండి: భారత్లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) ధర & ప్రత్యర్థులు ఇప్పటికే మంచి బుకింగ్స్ పొందిన ఈ స్కూటర్ రానున్న రోజుల్లో మరిన్ని గొప్ప బుకింగ్స్ పొందుతుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ. 1.09 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) గతంలోనే ప్రకటించింది. ఇది మార్కెట్లో ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ 450 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
భారత్లో మరో సిఎన్జి కారు లాంచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్
Tata Altroz CNG: ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్జి కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ సిఎన్జి (Altroz CNG) విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిఎన్జి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & వేరియంట్స్ టాటా మోటార్స్ విడుదల చేసిన ఆల్ట్రోజ్ సిఎన్జి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), XZ+ O (S) వేరియంట్లు. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). దేశీయ విఫణిలో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి సన్రూఫ్ కలిగిన మొదటి CNG బేస్డ్ హ్యాచ్బ్యాక్. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సెటప్ కలిగి ఉంటుంది, కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ 345 లీటర్లు. డిజైన్ & ఫీచర్స్ ఆల్ట్రోజ్ CNG కారు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ దీని టెయిల్గేట్పై 'iCNG' బ్యాడ్జ్ ఇది కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతుంది. బూట్ ప్లోర్ కింద రెండు సిఎన్జి ట్యాంకులు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ దాదాపు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. కావున అదే 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్ కలిగి.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వారికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్ కూడా లభిస్తాయి. XM+ (S), XZ+ (S), XZ+ O (S) వేరియంట్లలో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్-పేన్ సన్రూఫ్ లభిస్తుంది. కావున ఇది దాని ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్లో 5 డోర్ జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే) పవర్ట్రెయిన్ ఆల్ట్రోజ్ సిఎన్జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్లో ఇది 88 హార్స్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక సిఎన్జి మోడ్లో 77 hp పవర్, 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) ప్రత్యర్థులు ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి ఇప్పటికే అమ్ముడవుతున్న మారుతి బాలెనొ సిఎన్జి, టయోటా గ్లాంజా సిఎన్జి వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే
2023 జనవరి ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో అందరి దృష్టిని ఆకర్శించిన 'మారుతి సుజుకి 5 డోర్స్ జిమ్నీ' (Maruti Suzuki Jimny) లాంచ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందిన ఈ SUV విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాహన ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ డేట్ మారుతి సుజుకి దేశీయ విఫణిలో జిమ్నీ ధరలను అధికారికంగా జూన్ 07న ప్రకటించనుంది. ఈ కారు జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో విడుదలకానున్నట్లు సమాచారం. ఇందులో టాప్-స్పెక్ ఆల్ఫా ట్రిమ్కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ వేరియంట్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మారుతి జిమ్నీ బ్లూయిష్ బ్లాక్, కైనెటిక్ ఎల్లో, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్స్లో లభించనుంది. ఇప్పటికే కంపెనీ ఈ ఆఫ్-రోడర్ మైలేజ్ గణాంకాలను కూడా వెల్లడించింది. 105 hp పవర్, 134.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగిన ఈ ఎస్యువి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. మైలేజ్ డీటైల్స్ మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: 5 డోర్స్ జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు) ఫీచర్స్ విషయానికి వస్తే 5 డోర్స్ జిమ్నీ 9-ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ వ్యూ కెమరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. డిజైన్ పరంగా జిమ్నీ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. అంచనా ధరలు జిమ్నీ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలఎక్స్ -షోరూమ్ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
జిమ్నీ మైలేజ్ వెల్లడించిన మారుతి సుజుకి - పూర్తి వివరాలు
Maruti Jimny: మారుతి సుజుకి తన జిమ్నీ SUVని ఎప్పుడెప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కంపెనీ ఈ కారుని వచ్చే నెలలో విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కానీ అంత కంటే ముందు ఈ కారు మైలేజ్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది వాహన ప్రియులను ఆకర్శించిన 5 డోర్స్ జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. ఈ ఆఫ్ రోడర్ 105 హార్స్ పవర్, 134.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ కె15బి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. మైలేజ్ వివరాలు మాన్యువల్ గేర్బాక్స్ కలిగిన జిమ్నీ 5 డోర్ వెర్షన్ 16.94 కిమీ/లీటర్ మైలేజ్ అందించగా.. ఆటోమేటిక్ గేర్బాక్స్ వెర్షన్ 16.39 కిమీ/లీటర్ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన జిమ్నీ మాన్యువల్ ఒక ఫుల్ ట్యాంక్తో 678 కిమీ రేంజ్, ఆటోమేటిక్ వెర్షన్ 656 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే ఈ గణాంకాలు వాస్తవ ప్రపంచంలో కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎస్యువి వెయిటింగ్ పీరియడ్ ఇప్పటికే మాన్యువల్ వేరియంట్ల కోసం ఆరు నెలల, ఆటోమేటిక్ వేరియంట్ల కోసం ఎనిమిది నెలల వరకు ఉంటుంది. కాగా సంస్థ ఈ నెల ప్రారంభంలో గురుగ్రామ్లోని తన ప్లాంట్ నుంచి 5 డోర్స్ జిమ్నీ విడుదల చేసింది. కావున ధరలు కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అంచనా ధర & ప్రత్యర్థులు మారుతి సుజుకి జిమ్నీ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య విడుదలవుతుందని అంచనా. ఈ ఆఫ్-రోడర్ దేశీయ మార్కెట్లో విడుదలైన తర్వాత మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించనుంది. జిమ్నీ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఇప్పుడు మరింత అందంగా మారిన వెస్పా.. కొత్త కలర్స్ అదుర్స్!
Vespa Dual Tone: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు మాత్రమే కాకుండా అప్డేటెడ్ వాహనాలు కూడా విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ టూ వీలర్ తయారీ సంస్థ 'పియాజియో ఇండియా' తన అప్డేటెడ్ వెస్పా స్కూటర్ భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనమూ తెలుసుకుందాం. వెస్పా డ్యుయల్ సిరీస్ పేరు విడుదలైన ఈ స్కూటర్ పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో సీటు, ఫుట్బోర్డ్ మాత్రమే కాకుండా పిలియన్ రైడ్ను అనుకూలంగా ఉండే రెస్ట్ కూడా కొత్త కలర్ ఆప్షన్ పొందుతుంది. వేరియంట్స్ & ధరలు: పెర్ల్ వైట్ + అజురో ప్రోవెంజా కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 ధర రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + బీజ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ విఎక్స్ఎల్ 125 రూ. 1.32 లక్షలు కాగా, విఎక్స్ఎల్ 150 ధర రూ. 1.46 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. పెర్ల్ వైట్ + మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగిన వెస్పా డ్యూయల్ ఎస్ఎక్స్ఎల్ 125 ధర రూ. 1.37 లక్షలు కాగా, ఎస్ఎక్స్ఎల్ 150 ధర రూ. 1.49 లక్షలు. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ మహారాష్ట్ర) (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కలర్ ఆప్షన్ కాకుండా ఈ స్కూటర్లలో పెద్దగా ఆశించిన మార్పుయ్లు లేదు. 125 సీసీ వేరియంట్ 7,000 rpm వద్ద 9.65 bhp పవర్, 5,600 rpm వద్ద 10.11 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 150 సీసీ వేరియంట్ 7,400 rpm వద్ద 10.64 bhp పవర్, 5,300 rpm వద్ద 11.26 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్లు రెండూ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందాయి. కావున ఉత్తమ పనితీరుని అందిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..
Hyundai Exter: హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త మైక్రో SUV 'ఎక్స్టర్' (Exter) లాంచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారికి కంపెనీ శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి సమాచారం వెల్లడించిన కంపెనీ తాజాగా లాంచ్ టైమ్ ఎప్పుడనే దానికి సంబంధించిన సమాచారం వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఎక్స్టర్ '2023 జులై' నాటికి అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన హ్యుందాయ్ డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. డిజైన్ & వేరియంట్స్: భారతీయ విఫణిలో అడుగెట్టనున్న ఎక్స్టర్ EX, S, SX, SX(O), SX(O) కనెక్ట్ అనే ఐదు వేరియంట్లలో విడుదలవుతుంది. డిజైన్ విషయానికి వస్తే.. ఇది కంపెనీ ఇతర మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్ చూడవచ్చు. డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్కు టెక్స్చర్డ్ ఫినిషింగ్ వంటివాటితో పాటు ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్ లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి లేటెస్ట్ న్యూస్.. ఇక ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?) సేఫ్టీ ఫీచర్స్: ఇటీవల కంపెనీ తన ఎక్స్టర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి వెల్లడించింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయని తెలిసింది. హై ఎండ్ వేరియంట్లలో డ్యూయెల్ కెమెరా సెటప్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రీ పాయింట్ సీట్ బెల్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎన్ విత్ ఈబీడీ వంటివి లభిస్తాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడతాయి. ఇంజిన్: ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఇది హ్యుందాయ్ ఆరా వంటి కార్లలో ఉపయోగంలో ఉంది. ఈ ఇంజిన్ 83 hp పవర్, 114 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. ఈ మైక్రో ఎస్యువి CNG రూపంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వెర్షన్ కేవలం స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) అంచనా ధర & ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రారంభ ధర రూ. 6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత 'టాటా పంచ్, సిట్రోయెన్ సి3' వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డెలివరీలు ఆగస్టు నాటికి ప్రారంభమవుతాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంలో మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారత్లో హీరో ఎక్స్పల్స్ 200 4వి లాంచ్ - పూర్తి వివరాలు
Hero Xpulse 200 4V: భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు అప్డేటెడ్ 'హీరో ఎక్స్పల్స్ 200 4వి' (Hero Xpulse 200 4V) విడుదలైంది. అదే సమయంలో ర్యాలీ ఎడిషన్ ప్రో వేరియంట్గా కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు, ఇతర ఫీచర్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు దేశీయ మార్కెట్లో విడుదలైన అప్డేటెడ్ హీరో ఎక్స్పల్స్ 200 4వి బైక్ ధర రూ. 1.44 లక్షలు, కాగా ర్యాలీ ఎడిషన్ ప్రో ధర రూ. 1.51 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ బైక్స్ వాటి మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. డిజైన్ & ఫీచర్స్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ లేటెస్ట్ బైక్స్ అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతుంది, కావున ఇది మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అంతే కాకుండా పొడవైన విండ్స్క్రీన్, కొత్త స్విచ్ గేర్ వంటివి మరింత ఫ్రీమియంగా ఉంటాయి. బ్లాక్ ఎలిమెంట్స్ స్థానములో ఇవి పెద్ద హ్యాండ్ గార్డ్లను పొందుతాయి. ఇవన్నీ రైడర్కి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ అప్డేటెడ్ హీరో ఎక్స్పల్స్ బైకుల ఇంజిన్లలో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ 200 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు ఓబిడి-2 కంప్లైంట్తో పాటు ఈ20 అనుకూలతను పొందుతుంది. ఇంజిన్ 19.1 hp పవర్, 17.35 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు సింగిల్ ఛానల్ ఏబీఎస్ కోసం రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ బైకులో ఫుట్ పెగ్లు ఇప్పుడు 35 మి.మీ తక్కువ, వెనుక 8 మి.మీ ఎక్కువతో సెట్ చేశారు. కావున రైడింగ్ చేయడానికి మునుపటికంటే చాలా అనుకూలంగా ఉంటుంది. USB ఛార్జర్ మరింత అనుకూల ప్రదేశంలో నిక్షిప్తం చేశారు. ఇక ప్రో వేరియంట్ ర్యాలీ కిట్ పొందటం వల్ల రెండు చివర్లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ పెరిగి అడ్జస్టబుల్, బెంచ్ స్టైల్ సీట్, హ్యాండిల్బార్ రైజర్లు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రైడింగ్కి సిద్ధమైపోండి.. మరిన్ని హంగులతో 390 అడ్వెంచర్ వచ్చేసింది!
2023 KTM 390 Adventure Spoke Wheels: కుర్రకారుకు ఎంతో ఇష్టమైన 'కెటిఎమ్ 390 అడ్వెంచర్' KTM 390 Adventure) ఇప్పుడు కొన్ని ఆధునిక హంగులతో దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ బైక్ ప్రైస్, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'కెటిఎమ్ 390అడ్వెంచర్' ధర రూ. 3.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు మరింత ఆఫ్ రోడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైర్-స్పోక్ రిమ్లను కలిగి ఉండటం వల్ల మరింత రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త మార్పులు.. గతంలో చాలామంది కెటిఎమ్ బైక్ రైడర్లు ఈ వైర్-స్పోక్ రిమ్ ఫీచర్ ఉంటే మరింత గొప్ప రైడింగ్ అనుభూతిని పొందవచ్చని అభిప్రాయం వ్యక్తం చేయడం వల్ల చివరకు కంపెనీ ఆ ఫీచర్ తీసుకువచ్చింది. ఇందులో అల్యూమినియం వైర్-స్పోక్ రిమ్లు ఉన్నాయి. ఇవి కూడా ట్యూబ్-టైప్ మెట్జెలర్ టూరెన్స్ టైర్లను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్కి ఫిదా అవ్వాల్సిందే!) లేటెస్ట్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఇప్పుడు అడ్జస్టబుల్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే ఫోర్క్ కంప్రెషన్ అండ్ రీబౌండ్ కోసం మాత్రమే అడ్జస్టబుల్ ఉంటుంది. కానీ ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ లేదు. అదే సమయంలో 10 స్టెప్ ఫ్రీలోడ్ & 20 స్టెప్ రీబౌండ్ అడ్జస్ట్ పొందుతుంది. ఈ కొత్త మార్పులు మాతర్మే కాకుండా ఈ బైక్ ఇప్పుడు కొత్త ర్యాలీ ఆరెంజ్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) డిజైన్, ఫీచర్స్ కూడా దాదాపు దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఇంజిన్ విషయానికి ఇందులో 373 సిసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 42.9 bhp పవర్, 37 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి -
భారత్లో అరంగేట్రం చేయనున్న ఎక్స్ఎల్7 - ఫీచర్స్కి ఫిదా అవ్వాల్సిందే!
Maruti Suzuki: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కొత్త XL7 ఎస్యువిని విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త 7 సీటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న కొత్త ఎక్స్ఎల్7 ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎక్స్ఎల్6 కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది టయోటా ఇన్నోవా క్రిష్టాకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో పరిచమైన ఈ ఎస్యువి మంచి ప్రజాదరణ పొందుతోంది. కాగా ఇక భారతీయ తీరాలకు రావడానికి సన్నద్ధమవుతోంది. మారుతి ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ మారుతి సుజుకి కొత్త ఎక్స్ఎల్7 డిజైన్, ఫీచర్స్ చాలా కొత్తగా ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ డ్యాష్బోర్డ్, స్టాండర్డ్ మిడిల్ ఆర్మ్రెస్ట్లు, లెదర్డ్ స్ట్రీరింగ్ వీల్, పుష్ బటన్, స్టాప్ కీలెస్ ఎంట్రీ, రియర్వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్ఎల్7 ఎస్యువిలో 1.5 లీటర్ కే15బి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4,400 rpm వద్ద 138 Nm టార్క్ & 6000 rpm వద్ద 104 bhp పవర్ డెలివరీ చేస్తుంది. ఇంజిన్ 5 మ్యాన్యువల్, 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందనుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుందని ఆశిస్తున్నాము. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఈ కొత్త ఎస్యువి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
భారత్లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు
ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం. బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్రూఫ్, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. (ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్తో..) సేఫ్టీ ఫీచర్స్: స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
భారత్లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?
భారతదేశంలో ఎట్టకేలకు డుకాటీ కంపెనీ మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్ కంటే ఖరీదైనప్పటికీ అద్భుతమైన డిజైన్, ఆధునిక పరికరాలను పొందుతుంది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' (Ducati Monster SP) ధర రూ. 15.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ లేటెస్ట్ బైక్ దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 3 లక్షలు ఎక్కువ ఖరీదైనది కావడం విశేషం. డిజైన్ & ఫీచర్స్: నిజానికి లేటెస్ట్ డుకాటీ మాన్స్టర్ ఎస్పి డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో MotoGP ఇన్స్ఫైర్డ్ లివరీతో పాటు బ్లాక్ అవుట్ పార్ట్స్ కలిగి ప్యాసింజర్ సీట్ కౌల్ పొందుతుంది. LED DRL ప్రొజెక్టర్ స్టైల్ హెడ్ లాంప్ ఇందులో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ ఇండికేటర్లతో మస్కులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్ అప్ సీట్, రెండు వైపులా 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: వయసు 24.. సంపాదన రూ. 100 కోట్లు - అతడే సంకర్ష్ చందా!) ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కలిగిన 4.3 ఇంచెస్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి కావలసిన సమాచారం అందిస్తుంది. ఎలక్ట్రానిక్ లాంచ్ కంట్రోల్ సిస్టం, రైడింగ్ మోడ్స్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త డుకాటీ మాన్స్టర్ ఎస్పి బైక్ ఇంజిన్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే 937 సిసి ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి 9250 rpm వద్ద 109.9 bhp పవర్ & 6500 rpm వద్ద 93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్ల వరకు ఉంటుంది. (ఇదీ చదవండి: వాట్సాప్లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!) ప్రత్యర్థులు: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'డుకాటీ మాన్స్టర్ ఎస్పి' బైక్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, బీఎండబ్ల్యూ ఎఫ్900 ఆర్, కవాసకి జెడ్900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
మార్కెట్లో కొత్త స్మార్ట్వాచ్ లాంచ్ - ధర చాలా తక్కువ!
దేశీయ మార్కెట్లో పెబల్ కంపెనీ నుంచి కొత్త స్మార్ట్వాచ్ విడుదలైంది. పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో (Pebble Cosmos Bold Pro) పేరుతో విడుదలైన ఈ వాచ్ ధర రూ. 2,799. ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, పెబల్ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి ఉంది. ఈ లేటెస్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో విడుదలైన కొత్త 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' వాచ్ నాలుగు కలర్ ఆప్షన్లలో ఉంటుంది. అవి బ్లాక్, గోల్డ్, మెటల్ బ్లాక్, సిల్వర్ కలర్స్. మెటల్ బాడీ కలిగిన ఈ వాచ్ 1.39 ఇంచెస్ TFT డిస్ప్లేతో లభిస్తుంది. ఇందులో హార్ట్ మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే ఎస్పీఓ2 సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ.. లాంచ్ ఎప్పుడంటే?) బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల ఇది కాలింగ్ ఫీచర్ కూడా పొందుతుంది. బ్లూటూత్ ద్వారా మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ స్వీకరించవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్ ద్వారానే తీసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా వంటి వాటిని కూడా వాచ్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో స్మార్ట్ వాచ్ ఒక ఫుల్ ఛార్జ్ ద్వారా సాధారణంగా వారం (7 రోజులు) రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఎక్కువ ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ స్మార్ట్ వాచ్ ఆధునిక కాలంలో వినియోగించడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. -
ఎట్టకేలకు భారత్లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి ఫ్రాంక్స్' (Maruti Suzuki Fronx) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. విడుదలకు ముందే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందిన ఈ కొత్త ఎస్యువి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & బుకింగ్స్: దేశీయ విఫణిలో అధికారికంగా విడుదలైన కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ట్రిమ్లలో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధరలు రూ. 7.47 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధరలు రూ. 13.14 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మారుతి సుజుకి రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పటికే ఫ్రాంక్స్ 15 వేలకంటే ఎక్కువ సంక్యలో బుకింగ్స్ పొందినట్లు సమాచారం. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. డిజైన్: మారుతి సుజుకి విడుదల చేసిన కొత్త ఫ్రాంక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇది ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, అల్లాయ్ వీల్స్, వాలుగా ఉండే రూఫ్లైన్ వంటి వాటితో పాటు సైడ్ ప్రొఫైల్లో 17 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పరిమాణం పరంగా కూడా ఈ SUV చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,765 మిమీ, ఎత్తు 1,550 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) ఫీచర్స్: మారుతి ఫ్రాంక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రీ-స్టాండింగ్ 9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఉంటుంది. ఇది వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. లెదర్తో చుట్టిన స్టీరింగ్ వీల్ మంచి పట్టుని అందిస్తుంది, ఇందులో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్ప్లే, రియర్ ఏసీ వెంట్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. కలర్ ఆప్షన్స్: కొత్త మారుతి ఫ్రాంక్స్ ఆర్కిటిక్ వైట్, ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, గ్రాండియర్ గ్రే అనే ఏడు రంగులలో లభిస్తుంది. అంతే కాకుండా డ్యూయల్-టోన్ ఎంపికలుగా ఎర్టర్న్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్ & స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ అందుబటులో ఉంటాయి. పవర్ట్రెయిన్స్: ఫ్రాంక్స్ ఎస్యువి 1.0-లీటర్ బూస్టర్జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఆఫర్లో ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్తో లభిస్తుంది. పనితీరు పరంగా ఈ కొత్త ఎస్యువి ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త మారుతి ఫ్రాంక్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
ఒక్క చూపుతో మనసు దోచే పోర్స్చే కొత్త కార్లు - ధర & వివరాలు
దేశీయ విఫణిలో 'పోర్స్చే ఇండియా' ఎట్టకేలకు రెండు లేటెస్ట్ కార్లను విడుదల చేసింది. అవి కయెన్ ఫేస్లిఫ్ట్, కయెన్ కూపే ఫేస్లిఫ్ట్. కంపెనీ విడుదల చేసిన ఈ కార్ల ధరలు, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన పోర్స్చే కయెన్ ఫేస్లిఫ్ట్ ధర రూ. 1.36 కోట్లు కాగా, కయెన్ కూపే ఫేస్లిఫ్ట్ ధర రూ. 1.42 కోట్లు. అయితే డెలివరీలు 2023 జులై నెలలో ప్రారంభమవుతాయి. డిజైన్: ఒక్క చూపుతోనే ఆకర్షించే పోర్స్చే కయెన్ ఫేస్లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్డ్ ఫ్రంట్ ఫాసియాతో రీడిజైన్ పొందింది. ఇందులోని హెడ్లైట్, అల్లాయ్ వీల్స్ వంటివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్లను కనెక్ట్ చేసే లైట్బార్ ఉంటుంది. ఇంటీరియర్ ఫీచర్స్: పోర్స్చే కెయెన్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్బోర్డ్ లేఅవుట్ డిజైన్ చూడవచ్చు. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచెస్ టచ్స్క్రీన్, ప్రయాణీకుల కోసం 10.9 ఇంచెస్ టచ్స్క్రీన్ ఉన్నాయి. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్, డాష్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంజిన్ & పవర్ట్రెయిన్: నిజానికి మార్కెట్లో ప్రస్తుతం కయెన్, కయెన్ కూపే బేస్ మోడల్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్తో 353 హెచ్పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. అయితే త్వరలో విడుదలకానున్న ఈ మోడల్ ఈ-హైబ్రిడ్ వేరియంట్స్ అదే ఇంజిన్ కలిగి ఉన్నప్పటికీ e-మోటార్తో కలిసి 470 హెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 25.9kWh బ్యాటరీ 90 కిలోమీటర్ల పరిధిని మాత్రమే అందిస్తుంది. ఇది 11kW ఆన్-బోర్డ్ ఛార్జర్ ద్వారా సుమారు 2.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ప్రత్యర్థులు: భారతదేశంలో విడుదలైన కొత్త పోర్స్చే కయెన్ ఫేస్లిఫ్ట్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ8 వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఆధునిక ఫీచర్లతో విడుదలకానున్న కొత్త స్మార్ట్ఫోన్ - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్ వంటి ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న అద్భుతమైన మొబైల్ ఫోన్. ఇది 6000 mAh బ్యాటరీ, 5nm ప్రాసెసర్తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను 'మూమెంట్స్ మాన్స్టర్' అని పేర్కొంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్లర్-ఫ్రీ, ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మెరుగైన పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో గేమర్లు, మల్టీ టాస్కర్లు వంటి వాటికోసం ఇది చాలా ఖచ్చితమైన, వేగవంతంగా పనిచేస్తుంది. యాప్ల ద్వారా వేగంగా రన్ చేయడమే కాకుండా క్షణాల్లో కంటెంట్ను డౌన్లోడ్ చేయడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. (ఇదీ చదవండి: ఈ ఆఫర్తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!) గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో ముఖ్యమైన సందేశానికి రిప్లే ఇచ్చినప్పుడు, ఈ అద్భుతమైన స్మార్ట్ఫోన్ సామర్థ్యాలు తప్పకుండా మిమ్మల్ని ముగ్దుల్ని చేస్తాయి. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. -
భారత్లో విడుదలైన జపనీస్ బ్రాండ్ కారు: ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న అన్యదేశ బ్రాండ్ కార్లలో లెక్సస్ (Lexus) ఒకటి. ఈ జపనీస్ కంపెనీ ఎట్టకేలకు ఓ కొత్త హైబ్రిడ్ కారు 'ఆర్ఎక్స్' SUVని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర: భారతీయ విఫణిలో విడుదలైన కొత్త లెక్సస్ నిజానికి 2023 ఆటో ఎక్స్పోలో అరంగేట్రం చేసింది. కాగా ఇప్పుడు మార్కెట్లో అధికారికంగా అడుగెట్టింది. ఈ కొత్త లెక్సస్ ఆర్ఎక్స్350హెచ్ లగ్జరీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 95.80 లక్షలు. అదే సమయంలో హై పర్ఫామెన్స్ అందించే RX500h F-Sport+ ధర రూ. 1.18 కోట్ల వరకు ఉంటుంది (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఇండియా). డిజైన్: 2023 లెక్సస్ RX మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ లగ్జరీ ఎస్యువి స్పిండిల్ బాడీ డిజైన్ కలిగి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునికంగా ఉంటుంది. ఈ కారు పరిమాణం విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 4890 మిమీ, వెడల్పు 1920 మిమీ, ఎత్తు 2850 మిమీ కలిగి 2850 మిమీ వీల్బేస్ పొందుతుంది. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఇంటీరియర్ ఫీచర్స్: కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ 14-ఇంచెస్ టచ్స్క్రీన్ కలిగి.. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో వైర్లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్రూఫ్ ఉంటాయి. ఇంటీరియర్ బ్లాక్, డార్క్ సెపియా, సోలిస్ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. ఇంజిన్ & పర్ఫామెన్స్: 2023 లెక్సస్ RX రెండు ఇంజిన్ల ఎంపికను పొందుతుంది. అవి CVTతో జతచేసిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (RX350h లగ్జరీ). ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 250 హెచ్పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV కేవలం 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇక RX500h F-Sport+ విషయానికి వస్తే.. ఇందులో 2.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 371 హెచ్పి పవర్ మరియు 460 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ లగ్జరీ కారు గంటకు 210 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) ప్రత్యర్థులు: ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఆర్ఎక్స్ కారు జర్మన్ లగ్జరీ కారు అయిన మెర్సిడెస్ బెంజ్ GLE, బిఎండబ్ల్యు ఎక్స్5, రేంజ్ రోవర్ వెలార్, జాగ్వార్ ఎఫ్-పేస్, ఆడి క్యూ7 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
తక్కువ ధరలో కెటిఎమ్ బైక్ కావాలా? ఇదిగో ఈ కొత్త బైక్ బెస్ట్ ఆప్షన్!
యువ రైడర్లను ఎంతగానో మెప్పించిన కెటిఎమ్ (KTM) దేశీయ మార్కెట్లో మరో కొత్త చేసింది. 'కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్' (KTM 390 Adventure X) పేరుతో విడుదలైన ఈ బైక్ మునుపటి అడ్వెంచర్ బైక్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్ ప్రారంభ ధర రూ. 2.8 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న కెటిఎమ్ 390 అడ్వెంచర్తో (రూ. 3.38 లక్షలు) పోలిస్తే దాదాపు యాభై వేలు తక్కువ ధరకే లభిస్తుంది. కావున తక్కువ ధరకు కెటిఎమ్ కావాలనుకునే వారు ఈ లేటెస్ట్ బైక్ ఎంచుకోవచ్చు. డిజైన్ & ఫీచర్స్: నిజానికి కెటిఎమ్ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ఎంట్రీ-లెవల్ వేరియంట్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్షిఫ్టర్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ అందుబాటులో లేదు. కానీ ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సెటప్ కలిగి, వెనుక చక్రం వద్ద ABS స్విచ్ ఆఫ్ చేసే సదుపాయం ఉంటుంది. కావున ఇది ఆఫ్-రోడ్లో ప్రయాణించేటప్పుడు బైక్ను స్లైడ్ చేయడంలో సహాయపడుతుంది. కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైకులో కలర్-TFT డిస్ప్లే ఉంటుందా లేదా LCD డిస్ప్లే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ కొత్త బైక్ కొన్ని ఫీచర్స్ కాకుండా మిగిలిన డిజైన్ దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అదే ఎల్ఈడీ లైట్స్, ఇంజిన్ మొదలైనవన్నీ అలాగే ఉన్నాయి. (ఇదీ చదవండి: లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు) ఇంజిన్ & పర్ఫామెన్స్: కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ 373.27 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్తో కూడిన ఫోర్ వాల్వ్ ఇంజిన్ కలిగి 9000 ఆర్పిఎమ్ వద్ద 42.9 బీహెచ్పి పవర్, 7000 ఆర్పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. కావున పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్ బంపరాఫర్) ప్రత్యర్థులు: కెటిఎమ్ నుంచి విడుదలైన ఈ సరసమైన బైక్ రూ. 3 లక్షల కంటే తక్కువ కావున మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకుకి ప్రత్యక్ష ప్రత్యర్థిగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. -
కేవలం రూ. 2499కే స్మార్ట్వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్
దేశీయ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూలన ఏదో ఒక కొత్త ఉత్పత్తి విడుదలవుతూనే ఉంది. ఇందులో భాగంగానే దేశీయ కంపెనీ 'బోల్ట్ ఆడియో' (Boult Audio) ఒక కొత్త స్మార్ట్వాచ్ విడుదల చేసింది. ఇది ఆకర్షణీయమైన డిస్ప్లే కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు. బోల్ట్ ఆడియో విడుదల చేసిన కొత్త స్మార్ట్వాచ్ పేరు 'బోల్ట్ రోవర్ ప్రో' (Boult Rover Pro). దీని ధర కేవలం రూ. 2,499 మాత్రమే. ఇది ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు ఈ వాచ్తో పాటు అదనంగా రెండు డిటాచబుల్ స్ట్రాప్స్ కూడా లభిస్తాయి. కొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్ 1.43 ఇంచెస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లే కలిగి 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 446x446 పిక్సెల్స్ రెజల్యూషన్ పొందుతుంది. అంతే కాకుండా బ్లూటూత్ 5.2 వెర్షన్ కలిగి ఉండటం వల్ల కాలింగ్ ఫీచర్ ఇందులో లభిస్తుంది. తద్వారా మొబైల్కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. అంతే కాకుండా డయల్ ప్యాడ్, సింక్ కాంటాక్ట్ ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. ప్రస్తుతం స్మార్ట్వాచ్ కొనుగోలు చేసే చాలామంది హెల్త్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాచ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున బోల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ ఎస్పీవో2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు వందకుపైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?) బోల్ట్ రోవర్ ప్రో స్మార్ట్వాచ్ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిని కేవలం 10 నిముషాల ఛార్జ్తో 2 రోజులు ఉపయోగించుకోవచ్చు. చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్కు కూడా సపోర్ట్ చేస్తుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో వినియోగించడానికి ఈ వాచ్ ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది.