Smartphone
-
రూ. 20వేల కంటే తక్కువ ధరలో.. ఇవిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కథనంలో రూ.20,000 కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లలో 'నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1' ఒకటి. ఇది రంగు రంగుల బ్యాక్ ప్యానెల్లను కలిగి ఉండటం వల్ల, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. దీనిని మరింత అందంగా డిజైన్ చేసుకోవడానికి కంపెనీ కొన్ని యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15499 మాత్రమే. కెమెరా సెటప్, డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.రియల్మీ నార్జో 70 టర్బోసాధారణ ఉపయోగం కోసం మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఉపయోగపడే ఫోన్ 'రియల్మీ నార్జో 70 టర్బో'. దీని ధర రూ. 14,999. ఇది డ్యూయెల్ టోన్ బ్లాక్ ప్యానెల్.. ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. చదరంగం ఆకారంలో ఉండే కెమెరా సెటప్ కూడా అకార్షణీయంగా ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ఉంటుంది.టెక్నో పోవా 6 ప్రోరూ. 20వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో.. టెక్నో పోవా 6 ప్రో ఒకటి. దీని ధర రూ. 19999. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులోని డైమెన్సిటీ 6080 చిప్సెట్ కొంతవరకు గేమ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాలావా బ్లేజ్ డుయోరూ.16,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్ఫోన్.. సెకండరీ డిస్ప్లేతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి సరసమైన ధరకు లభించే ఫోన్లలో ఇది బెస్ట్ మోడల్. ముందు నుంచి చూస్తే.. లావా బ్లేజ్ డుయో ఏ హై-ఎండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది స్లిమ్ బెజెల్స్తో కూడిన 3D కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రోఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది రూ. 20వేల కంటే కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇది డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, 8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. దీని ఫ్లాట్ డిస్ప్లే గేమర్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్తో సహా వివిధ యాక్సెసరీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. -
వివో కొత్త 5జీ స్మార్ట్ఫోన్: ధర కూడా తక్కువే!
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్లో తొలి స్మార్ట్ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
వచ్చేస్తోంది.. మరో ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్: దీని గురించి తెలుసా?
మార్కెట్లో ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. జాబితాలో ఇన్ఫినిక్స్ కూడా ఉంది. ఈ కంపెనీ నవంబర్ 2024లో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఫోన్ మార్చి 3 నుంచి 6 వరకు జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025 కంటే ముందే కనిపించింది. అయితే సంస్థ ఈ ఫోన్ లాంచ్ డేట్, హార్డ్వేర్ వివరాలను వెల్లడించలేదు.ఇన్ఫినిక్స్ జీరో సిరీస్ మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. డ్యూయల్ హింజెస్, ట్రిపుల్-ఫోల్డింగ్ మెకానిజం పొందుతుంది. ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్ను ఫోల్డ్ చేసినప్పుడు డ్యూయెల్ ఫోల్డ్ మొబైల్ మాదిరిగానే కనిపిస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీలు తీసుకోవడానికి పంచ్-హోల్ కెమెరా ఉన్నాయి.కంపెనీ లాంచ్ చేయనున్న మినీ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్.. జిమ్ పరికరాలు, సైకిల్ హ్యాండిల్బార్లు, కార్ డాష్బోర్డ్ వంటి వాటికి ఫిక్స్ చేయవచ్చు. దీనికోసం ఇందులో ఒక పట్టీ కూడా ఉంది. సంస్థ ఈ ఫోన్ గురించి చాలా వివరాలను వెల్లడించలేదు. ఇవన్నీ త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.మార్కెట్లో ఇప్పటి వారు ఉన్న ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్స్గ్లోబల్ మార్కెట్లో.. ప్రస్తుతానికి హువావే మాత్రమే ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కాగా 'గెలాక్సీ జీ ఫోల్డ్' పేరుతో శామ్సంగ్ ఓ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7లతో పాటు గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: రోజుకో రేటు వద్ద బంగారం: ఎందుకో తెలుసా?కొత్త శామ్సంగ్ గెలాక్సీ జి ఫోల్డ్ మొబైల్.. హువావే మేట్ XT కంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో 6.49 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 9.96 ఇంచెస్ మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ కొలతలు మేట్ ఎక్స్టి కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇది పరిమాణంలో కొంచెం పెద్దది. లాంచ్ అయినప్పటికీ, గెలాక్సీ జి ఫోల్డ్ లాంచ్ అయిన వెంటనే అమ్మకానికి రాకపోవచ్చు. గెలాక్సీ ఫోల్డ్ స్పెషల్ ఎడిషన్గా మాత్రమే పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే అవకాశం ఉంది. -
యాప్రే.. యాప్!
అరచేతిలో స్మార్ట్ఫోన్– స్మార్ట్ఫోన్ నిండా రకరకాల యాప్స్– యాప్స్తో కావలసినంత కాలక్షేపం, వినోదం మాత్రమే కాదు, అంతకు మించి కూడా! యాప్స్ మన రోజువారీ పనులను సునాయాసం చేస్తున్నాయి. యాప్స్ నగదు బదిలీని సులభతరం చేసి, వ్యాపార లావాదేవీలకు ఊతమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యాప్స్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతోంది. యాప్స్ వినియోగం, వాటి చుట్టూ జరుగుతున్న వ్యాపారం గురించి ఈ ప్రత్యేక కథనం.మనం వాడే స్మార్ట్ఫోన్ లో యాభైకి పైగా అప్లికేషన్స్ (యాప్స్) ఉంటాయి. వీటిని తరచు డౌన్ లోడ్ చేస్తుంటాం. అలా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్ని యాప్స్ డౌన్ లోడ్ అవుతున్నాయో మీకు తెలుసా? వీటిని రూపొందించిన కంపెనీలకు మొబైల్ యూజర్ల వల్ల ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యాప్ డౌన్ లోడ్స్లోను, మొబైల్లో యాప్స్పై యూజర్లు వెచ్చించే సమయంలోను భారత్ తొలి స్థానంలో ఉంది.మొబైల్ ప్రపంచంలో మనదే రికార్డు. గత ఏడాది 2,436 కోట్ల డౌన్ లోడ్స్తో భారత్ తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది మన భారతీయులు మొబైల్లో వెచ్చించిన సమయం 11,26,60,00,00,000 గంటలు. చదవడానికి కష్టంగా ఉంది కదూ! సింపుల్గా చెప్పాలంటే 1,12,660 కోట్ల గంటలు. మరో ఆసక్తికర విషయమే మంటే, డేటింగ్ యాప్ ‘బంబుల్’కు భారతీయులు కోట్లాది రూపాయలు గుమ్మరించారు. గత ఏడాది ప్రపంచంలోని యాప్ పబ్లిషర్స్, పబ్లిషర్ల ఆదాయం 12.5 శాతం పెరిగి, వారి ఆదాయం రూ.13.12 లక్షల కోట్లుగా నమోదైంది. యాప్స్ వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నా, యాప్స్ ఆదాయంలో మాత్రం టాప్–20లో చోటు దక్కలేదు. గేమ్స్ యాప్స్ విషయంలో ప్రపంచస్థాయిలో ‘ఫ్రీ ఫైర్’ మొదటి స్థానంలో నిలిస్తే, భారత్లో ‘పబ్జీ’ అగ్రగామిగా ఉంది. ఫైనాన్స్ యాప్స్లో ‘ఫోన్ పే’ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మన దేశానికి చెందిన పేటీఎం 4వ స్థానంలోను, బజాజ్ ఫిన్సర్వ్ 10వ స్థానంలోనూ నిలిచాయి.అంతర్జాతీయంగా యాప్స్ తీరుప్రపంచవ్యాప్తంగా 2024లో 13,600 కోట్ల యాప్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి 1 శాతం క్షీణించింది. ‘కోవిడ్–19’ కాలంలో యాప్ డౌన్ లోడ్స్ బాగా పెరిగాయి. లాక్డౌన్ల వల్ల జనాలు ఇంటి పట్టునే ఉండడంతో కాలక్షేపం కోసం మొబైల్స్లో మునిగిపోయారు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు డౌన్ లోడ్స్ తిరోగమనంలో పడ్డాయి. అయితే, ఫుడ్ అండ్ డ్రింక్స్ విభాగంలో ప్రపంచంలో మెక్డొనాల్డ్స్, జెప్టో, కేఎఫ్సీ, డామినోస్ పిజ్జా, జొమాటో టాప్–5లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా యాప్ డెవలపర్స్, పబ్లిషర్స్ ఆదాయం విషయంలో ఉత్తర అమెరికా, యూరప్లోని అగ్ర మార్కెట్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. అమెరికా రూ.4.5 లక్షల కోట్లతో ముందుంది. గేమ్స్ రాబడి వృద్ధి నాన్–గేమ్స్ కంటే వెనుకబడి ఉండటంతో ఆసియాలోని కొన్ని గేమింగ్–ఫోకస్డ్ మార్కెట్లు నామామాత్రపు వృద్ధిని చూస్తే, ఇంకొన్ని స్వల్పంగా క్షీణించాయి. ఇన్ యాప్ పర్చేజ్ మరింత సౌకర్యవంతంగా మారుతోంది. 2024లో ప్రధాన యాప్ విభాగాలైన సోషల్ మీడియా, ఓవర్ ది టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ , జనరల్ షాపింగ్ యాప్స్ స్వల్ప వృద్ధిని సాధించాయి. కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉప విభాగాలు కూడా వీటిని అనుసరించాయి. ఇందుకు విరుద్ధంగా యాంటీవైరస్, వీపీఎన్ (–32 శాతం) ఫైల్ మేనేజ్మెంట్ (–24 శాతం) సహా అనేక సాఫ్ట్వేర్ ఉప విభాగాలు క్షీణతను చవిచూశాయి. మన దేశంలో ఇలా..పోటీ దేశం అయిన అమెరికా కంటే మన దేశంలో యాప్ డౌన్ లోడ్స్ రెండింతలు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 2024లో మొత్తం 4.2 లక్షల కోట్ల గంటలు మొబైల్ను ఆస్వాదించారు. ఇందులో 1,12,660 కోట్ల గంటలు.. అంటే 26.8 శాతం వాటా భారత్దే! ఇది పోటీదేశాలైన ఇండోనేషియా, అమెరికాల కంటే మూడు రెట్లకుపైగా ఎక్కువ. 2023తో పోలిస్తే 2024 భారతీయులు 13,510 కోట్ల గంటలు అధికంగా మొబైల్లో మునిగిపోయారు. జనాలు టీవీలు చూడటం కంటే ఎక్కువసేపు మొబైల్లోనే గడుపుతున్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయులు విరివిగా ఉపయోగించి, యాప్ డెవలపర్లకు అధికాదాయం తెచ్చిపెట్టిన యాప్స్లో ఆన్ లైన్ డేటింగ్ యాప్ ‘బంబుల్’ తొలి స్థానంలో నిలవడం విశేషం.‘యూట్యూబ్’ రెండవ స్థానంలోను, లైవ్ వీడియో చాట్ యాప్ ‘చామెట్’ మూడవ స్థానంలోనూ నిలిచాయి. ఇక జనరేటివ్ ఏఐ యాప్స్ 2023లో 911 శాతం దూసుకెళ్లి, 7.5 కోట్ల డౌన్ లోడ్స్ నమోదు చేసుకున్నాయి. 2024లో 135 శాతం వృద్ధితో ఈ సంఖ్య 17.7 కోట్లకు చేరింది. చాట్జీపీటీ, గూగుల్ జెమినై, జీనియస్, వాట్ఆటో, ఆర్టిమైండ్ గత ఏడాది టాప్ యాప్స్గా నిలిచాయి. యాప్స్లో టాప్–5 ఉప విభాగాల డౌన్ లోడ్స్ 2023తో పోలిస్తే 2024లో క్షీణించాయి. అయితే కస్టమైజేషన్ , రింగ్టోన్ యాప్స్ 3 శాతం, సోషల్ మెసేజింగ్ 4 శాతం, డిజిటల్ వాలెట్స్, పీ2పీ పేమెంట్స్ 9 శాతం, బిజినెస్, ప్రొడక్టివిటీ 7 శాతం, టెలికం 6 శాతం, కన్జ్యూమర్ బ్యాంకింగ్ 3 శాతం, లా, గవర్నమెంట్ 23 శాతం, కాలింగ్, ఎస్ఎంఎస్ యాప్స్ 9 శాతం వృద్ధి చెందాయి. ‘గేమ్’చేంజర్స్బిలియన్ డాలర్ క్లబ్లో గత ఏడాది అంతర్జాతీయంగా 11 గేమ్స్, 6 యాప్స్ చేరాయి. గేమ్స్లో లాస్ట్ వార్, వైట్ఔట్ సర్వైవల్, డంజన్ అండ్ ఫైటర్, బ్రాల్ స్టార్స్తోపాటు నాన్ –గేమ్స్లో వీటీవీ ఈ క్లబ్లో కొత్తగా చోటు సంపాదించాయి. మొబైల్ గేమ్స్ ద్వారా డెవలపర్లకు రూ.7,07,875 కోట్ల ఆదాయం సమకూరింది. 2023తో పోలిస్తే ఇది 4 శాతం పెరిగింది. 2023తో పోలిస్తే డౌన్ లోడ్స్ 6 శాతం తగ్గి 4,960 కోట్లుగా ఉన్నాయి. మెక్సికో, భారత్, థాయ్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు వేగానికి ఆజ్యం పోశాయి. ప్రతి వారం సుమారు 100 కోట్ల డౌన్ లోడ్స్ కాగా, యూజర్లు ఇన్ యాప్ పర్చేజ్ కింద రూ.13,475 కోట్లు ఖర్చు చేశారు.సిమ్యులేషన్ , పజిల్, ఆరేక్డ్, లైఫ్స్టైల్, టేబుల్టాప్ టాప్–5 మొబైల్ గేమ్ విభాగాలుగా నిలిచాయి. డౌన్ లోడ్స్లో సబ్వే సర్ఫర్స్ గేమ్, ఆదాయంలో లాస్ట్ వార్ సర్వైవల్ గేమ్ టాప్లో ఉన్నాయి. మన దేశంలో డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికిల్స్ సిమ్యులేటర్ 3డీ, ఆదాయంలో ఫ్రీ ఫైర్ అగ్రస్థానంలో నిలిచాయి. కొత్తగా విడుదలైన గేమ్స్లో భారత్లో శ్రీ రామ్ మందిర్ గేమ్ తొలి స్థానంలో దూసుకెళుతోంది. సోషల్ మీడియా దూకుడుసోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ యూజర్లు 2,37,410 కోట్ల గంటలు గడిపారు. 2023తో పోలిస్తే ఇది 6 శాతం పెరిగింది. మొబైల్స్లో గడిపిన మొత్తం సమయంలో సోషల్ మీడియా వాటా ఏకంగా 56 శాతం దాటింది. సోషల్ మెసేజింగ్కు 60,661 కోట్ల గంటల సమయం వెచ్చించారు.చాట్ జీపీటీ మూడంకెల వృద్ధిఇన్ యాప్ పర్చేజ్ రెవెన్యూ సాధించిన టాప్–20 యాప్ విభాగాల్లో చాట్ జీపీటీ ఏకంగా మూడంకెల వృద్ధి (209 శాతం) సాధించి, రూ.9,362.5 కోట్ల ఆదాయం పొందింది. బుక్స్, కామిక్స్ (9 శాతం) మినహా మిగిలిన ఇతర విభాగాలన్నీ రెండంకెల వృద్ధితో దూసుకెళ్తున్నాయి. 31 శాతం వృద్ధితో రూ.1,04,825 కోట్లతో ఫిల్మ్, టెలివిజన్ తొలి స్థానం కైవసం చేసుకుంది. 29 శాతం ఎగసి రూ.1,02,891 కోట్లతో సోషల్ మీడియా, 13 శాతం దూసుకెళ్లి రూ.46,637 కోట్లతో మీడియా, ఎంటర్టైన్ మెంట్, డేటింగ్ విభాగాలు టాప్–3లో నిలిచాయి. ఆదాయపరంగా బుక్స్, కామిక్స్, మ్యూజిక్, పాడ్కాస్ట్ తర్వాతి వరుసలో ఉన్నాయి.ఏఐ చాట్బాట్స్ హవాగత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల ఏఐ చాట్బాట్స్ డౌన్ లోడ్స్ నమోదయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో 63.5 కోట్ల డౌన్ లోడ్స్ పెరిగాయి. ఏఐ చాట్బాట్స్ అత్యధికంగా 112 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. యాప్స్లో సోషల్ మీడియా, సోషల్ మెసేజింగ్ తర్వాత 599 కోట్ల గంటలు అదనంగా వెచ్చించడంతో చాట్బాట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఏఐ చాట్బాట్స్ కోసం వెచ్చించిన సమయం 347 శాతం పెరిగి 772 కోట్ల గంటలు నమోదైంది.నాన్ –గేమ్స్ ఆదాయంఇన్ యాప్ పర్చేజ్ ఆదాయం నాన్గేమ్స్ విభాగాల్లో అంతర్జాతీయంగా గడిచిన పదేళ్లలో విపరీతంగా పెరిగింది. నాన్ గేమ్స్ ఆదాయం 2014లో రూ.30,625 కోట్ల నుంచి 2024లో రూ.6,05,500 కోట్లకుపైగా చేరుకుంది. 2023తో పోలిస్తే 2024లో 25 శాతం వృద్థితో రూ.1,19,875 కోట్ల అదనపు ఆదాయం పొందింది.⇒ 4.2 లక్షల కోట్ల గంటలు యాప్స్ గణాంకాలు 2024⇒ ప్రపంచ జనాలు మొబైల్లో వెచ్చించిన సమయం⇒ ప్రపంచ జనాలు యాప్స్తో గడిపిన సగటు సమయం 500 గంటలు⇒ ఒక్కొక్కరు మొబైల్తో వెచ్చించే సగటు సమయం 210 నిమిషాలు⇒ నిద్రలేవగానే మొబైల్తో గడిపే సగటు సమయం 13 నిమిషాలు⇒ప్రపంచ జనాలు రోజుకు సగటున వాడిన యాప్స్ సంఖ్య 7⇒ ప్రతి నిమిషానికి యాప్ డెవలపర్స్ ఆదాయం రూ. 2.49 కోట్లు⇒యాప్స్ డౌన్లోడ్స్ 13,600 కోట్లు⇒ప్రతి నిమిషానికి సగటు మొబైల్ డౌన్లోడ్స్ 2.58 లక్షలు⇒మొత్తం డౌన్లోడ్స్లో భారత్ వాటా 17.91 శాతం -
ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..
కొందరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు హై క్వాలిటీ కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్స్ కోసం ఎగబడతారు. ఈ కథనంలో ఐఫోన్ లాంటి కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో (Oppo Find X8 Pro)అద్భుతమైన కెమెరా కలిగిన ఫోన్ల జాబితాలో.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఒకటి. క్వాడ్-కెమెరా సెటప్ కలిగిన ఈ ఫోన్లో 1 ఇంచ్ సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మాక్రో కెపాసిటీతో అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.82 ఇంచెస్ ProXDR OLED డిస్ప్లే పొందుతుంది. దీని ధర ఎక్కువే అయినప్పటికీ.. మంచి కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పాలి.నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు. కానీ టీజర్లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండనున్నాయి. ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే.. దీని ధర కొంత తక్కువగానే ఉంటుందని సమాచారం.నుబియా జెడ్70 అల్ట్రా (Nubia Z70 Ultra)అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్ఫోన్ల జాబితాలో.. నుబియా జెడ్70 అల్ట్రా ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 35 మీమీ సమానమైన లెన్స్తో వస్తుంది. కాబట్టి యూజర్లకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. విభిన్న ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ పనికొస్తుంది. దీని ధర కూడా కొంత ఎక్కువే.లావా అగ్ని 3 (Lava Agni 3)లావా అగ్ని 3 మొబైల్ కూడా.. మంచి కెమెరా సెటప్ పొందుతుంది. ఇది OISతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. 6.78 ఇంచెస్ 120 Hz డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
iPhone: నీ దూకుడు.. సాటెవ్వరూ..!
పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్లో ఐఫోన్ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల పరంగానూ ఐఫోన్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్ సెల్లింగ్ మోడల్గా నిలిచిన యూఎస్, అర్బన్ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్ సరసన భారత్ చేరింది. యాపిల్కు 5వ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది.ఖరీదైనా తగ్గేదేలే..సగటున ఐఫోన్ ధర సామ్సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్ అంటే చాలా మందికి స్టేటస్. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది. దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్కు ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం. యాపిల్ పంట పండింది.. భారత్లో 2024లో అన్ని బ్రాండ్స్ కలిపి 15.3 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్ల విలువలో యాపిల్ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్–డిసెంబర్లో యాపిల్ 5వ స్థానానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.రికార్డుల భారత్.. యాపిల్ ఎగుమతులు భారత్ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు. గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ మోడళ్లు అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సైతం భారత్లో తయారవడం విశేషం. హైదరాబాద్ సమీపంలోని ఫాక్స్కాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది. భారీ అవకాశాలు ఉన్నాయ్..భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడై భారత్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు భారత్ రెండవ అతిపెద్ద విపణి. అలాగే పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. – టిమ్ కుక్, సీఈవో, యాపిల్ -
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్ఈఆర్లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్వర్డ్లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్ఈఆర్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
భారత్లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్ను భారత్లో ఏప్రిల్లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
లేటెస్ట్ గూగుల్ ఫోన్పై రూ.26 వేల డిస్కౌంట్!
మీ పాత స్మార్ట్ఫోన్ను (smartphone) మార్చేసి ఖరీదైన కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్పై ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ (Flipkart)లో భారీ డీల్ అందుబాటులో ఉంది. ఐదు వేలు.. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 26,000 తగ్గింపు లభిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రీమియం ఫోన్లపై తరచుగా లభించదు. కాబట్టి పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సువర్ణావకాశం.34 శాతం తగ్గింపు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్పై 34 శాతం తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు తర్వాత గూగుల్ పిక్సెల్ 8 (Hazel, 128 GB) (8 GB RAM) ధర రూ.49,999 అయింది. వాస్తవంగా ఈ స్మార్ట్ఫోన్ రూ. 75,999 వద్ద లిస్ట్ అయింది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్తో రూ. 28200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ (HDFC) క్రెడిట్ కార్డ్పై రూ.3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.8,334 నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్ కూడా ఉంది.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు6.2-అంగుళాల OLED డిస్ప్లేగూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు27W వైర్డు, 18W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో 4575mAh బ్యాటరీఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్అద్భుతమైన కెమెరాగూగుల్ పిక్సెల్ 8 ఫోన్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 10.5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఏఐ సాంకేతికతను పొందుపరిచారు. కెమెరాలోని 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్తో ఫోటో నుండి అనవసరమైన వాటిని తొలగించవచ్చు. 'రియల్ టోన్' ఫీచర్ విభిన్న స్కిన్ టోన్లను ఖచ్చితమైన రీతిలో చూపుతుంది. 'నైట్ సైట్' ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. -
ఫోన్ మోడల్ను బట్టి క్యాబ్ చార్జీలా?
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్ల కోసం ఓలా లేదా ఉబర్లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్ఫోన్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంబంధిత యాప్ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు. -
భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్
భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్ఫోన్ బ్రాండ్ లిస్ట్లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.యాపిల్ విజయానికి ప్రధాన కారణాలుమార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ను భారత్లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుభవిష్యత్తు అవకాశాలు2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది. -
స్విచాఫ్ ది ఫోన్! ఓపెన్ ది మైండ్!
ప్రస్తుత కాలంలో ఫోన్తోనే ప్రతి ఒక్కరికీ పని. స్మార్ట్ ఫోనే ఫ్రెండ్. ఫోనే పార్ట్నర్. సెల్లే సర్వస్వం. అయితే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఫోన్కి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తే..? వారాంతంలో ఓ రోజు పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన ఊహించడానికే ఏదోలా ఉంది కదా... అదేం కాదు.. ఫోన్ లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం.చేతిలో ఫోన్ లేకపోతే మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం ఆరంభం అవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలుపెట్టే ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం. సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది.కానీ సమాధానమే తట్టదు. గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్కరోజైనా చేతిలో ఉన్న ఫోన్ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపుకు వచ్చేది.అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్తో ఎంగేజ్ అయి ఉంటాయి. అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది.ఒక గంటతో మొదలు పెట్టండి!వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్లో ఉంటే ‘ఫోన్ ఆఫ్లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్కు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి. -
స్మార్ట్ఫోన్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్
ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)మొబైల్ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్ఎండ్లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.ఉపయోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.అనవసరమైన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడంపర్ఫామెన్స్ బూస్టర్ని ఉపయోగించడం వల్ల ఫోన్లోని అనవసరమైన ఫైల్లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్లలో ఈ బూస్టర్ యాప్లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్కి వెళ్లి ఈ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
‘హాని’లైన్ గేమ్స్!
సాక్షి, వరంగల్: ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను అగమాగం చేస్తున్నాయి. కరోనా అనంతరం చాలామంది యువత చేతిలో సెల్ఫోన్లు ఉండడం వల్ల కూడా.. తమకు తెలియకుండానే ఆన్లైన్లో పరిచయమయ్యే ఈ గేమ్లకు అలవాటు పడుతున్నారు. తొలుత తక్కువ డబ్బులు చెల్లించి ఆడే ఈ ఆట ద్వారా వందల్లో లాభాలు ఇచ్చి అలవాటయ్యేలా చేసి.. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అప్పులు చేసి.. కుటుంబసభ్యులకు తెలిస్తే పరువు పోతుందోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 20 రోజుల వ్యవధిలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ ఆన్లైన్ గేమ్తో పాటు.. వివిధ బెట్టింగ్ యాప్లలో రూ.ఏడు లక్షల వరకు డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పు ఇచి్చన స్నేహితులు అడగడంతో తీవ్ర మనోవేదనకు గురై గత నెల 29న హైదరాబాద్లోని ఘట్ కేసర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరిపట్ల అనుక్ ఆన్లైన్లో పబ్జీలాంటి గేమ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్లైన్ గేమ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో అతడికి దఫాలుగా రూ.ఐదు లక్షలు పంపాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఈ నెల 15న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో చాలా మంది యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ కుమారుల కదలికలపై నిఘా వేయడం కనిపిస్తోంది. మృతుల్లో యువతతోపాటు గృహిణులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు గుర్తించాలిడ్రగ్స్, ఆల్కహాల్ లాగే.. ఆన్లైన్ గేమ్, బెట్టింగ్లకు యువత త్వరగా అలవాటుపడుతోంది. డబ్బులు ఒకసారి రాకపోయినా.. మరోసారి వస్తాయనుకుంటున్నారు. అది సరికాదని చెప్పినా వినరు. అచేతన స్థితికి వెళ్లిపోయి కొందరు చనిపోతున్నారు. ఇంకొందరు నేరాల బాట పడుతున్నారు. దీన్నే బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ముందే గుర్తించాలి. సైకాలజిస్టుతో థెరపీ, మెడిటేషన్ ఇప్పించాలి. గేమ్కు బానిసైన వ్యక్తి అందులోనుంచి బయటకు రావాలని అనుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. – అనూష వినేయత, సైకియాట్రిస్ట్ ముందు సరదాగా.. తర్వాత అలవాటై..సులభ సంపాదన కోసం స్మార్ట్ ఫోన్లో వెతికేవారికి ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్, సైట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఆన్లైన్ గేమ్స్ను సరదాగా మొదలెట్టి, ఆ తర్వాత అలవాటు పడి బయటపడలేక జీవితం అగమాగం చేసుకుంటున్నారు. కొందరు అవి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్లోనే అప్పులు దొరుకుతుండడం ఈ సమస్యను మరింత పెంచుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్’.. సలహా ఇచ్చిన ఏఐ
వాషింగ్టన్: కంప్యూటర్తో ఎక్కువ సేపు గడపొద్దంటూ ఆంక్షలు పెడుతున్నందుకు తల్లిదండ్రులను చంపేయాలంటూ ఏఐ చాట్బాట్ ఓ 17 కుర్రాడికి సలహా ఇచి్చంది! ఇదేం వైపరీత్యమంటూ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై టెక్సాస్ కోర్టులో కేసు వేశారు! క్యారెక్టర్.ఏఐ అనే ఆ చాట్బాట్ హింసను ప్రేరేపిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. చాట్బాట్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న గూగుల్ను ప్రతివాదిగా పేర్కొన్నారు. చాట్బాట్తో కలిగే ప్రమాదకర పరిణామాలకు పరిష్కారం చూపేదాకా దాని వాడకం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలునికి, చాట్బాట్ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్ను పిటిషన్కు జత చేశారు. కంప్యూటర్తో ఎక్కువ సేపు గడిపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాలుడు చెప్పాడు. దానికి చాట్బాట్ బదులిస్తూ, ‘ఓ బాలుడు తనను దశాబ్ద కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తల్లిదండ్రులను చంపేయడం వంటి ఘటనలను చూస్తే నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. ఇలాంటివి మళ్లీ ఎందుకు జరగవనిపిస్తోంది’ అంటూ బదులిచ్చింది. క్యారెక్టర్.ఏఐలో యూజర్లు ఇష్టమొచి్చన డిజిటల్ వ్యక్తులను సృష్టించుకుని సంభాషణ జరపవచ్చు. చాట్బాట్ తన కుమారుని మరణానికి కారణమైందంటూ ఫ్లోరిడా కోర్టులో ఇప్పటికే ఓ మహిళ కేసు వేసింది. -
2024లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..
2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వన్ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో 'వన్ప్లస్ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)మంచి డిస్ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్ఫోన్ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ డిస్ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్ వంటివి ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి.వివో టీ3 ప్రో (Vivo T3 Pro)లెదర్ బ్యాక్తో సొగసైన.. స్లిమ్ డిజైన్ పొందిన ఈ స్మార్ట్ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే పొందుతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))పాలికార్బోనేట్ బ్యాక్తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు. -
భారత్లో వన్ప్లస్ భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ తయారీలో ఉన్న చైనా సంస్థ వన్ప్లస్ ప్రాజెక్ట్ స్టార్లైట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్లో వచ్చే మూడేళ్లలో రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా ఏటా రూ.2,000 కోట్లు వెచి్చంచనుంది. భారత్లో ఉత్పత్తులు, సేవలలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ను అమలు చేయనున్నట్టు వన్ప్లస్ గురువారం ప్రకటించింది. ప్రాజెక్ట్ స్టార్లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని వివరించింది. మరింత మన్నికైన పరికరాలను తయారు చేయడం, అసాధారణ కస్టమర్ సేవలు, భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేయడం ఇందులో ఉన్నాయి. పరికరాలను మరింత మన్నికైనదిగా చేయడానికి ప్రాజెక్ట్ స్టార్లైట్ కింద వన్ప్లస్ రెండు ముఖ్యమైన డిస్ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి డిస్ప్లేమేట్ ఏ++ డిస్ప్లే, వన్ప్లస్ యొక్క గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ను రూపొందించడం ఇందులో భాగం. భారత్ కస్టమర్ల కోసం.. కొత్త డిస్ప్లే రాబోయే ఫ్లాగ్షిప్ మోడల్లో కొలువుదీరనుందని వన్ప్లస్ వెల్లడించింది. గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ మొబైల్స్ కనిపించే ఆకుపచ్చని గీతలపట్ల ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ‘వివిధ సెట్టింగ్లలో మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నాం’ అని వన్ప్లస్ వివరించింది. అత్యంత ప్రాధాన్య మార్కెట్.. ‘వినియోగదారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయాలనే అంకితభావానికి ప్రాజెక్ట్ స్టార్లైట్ నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్’ అని వన్ప్లస్ ఇండియా సీఈవో రాబిన్ లేవో తెలిపారు. ప్రాజెక్ట్ స్టార్లైట్ కింద వన్ప్లస్ తన సరీ్వస్ సెంటర్లను 2026 మధ్య నాటికి 50 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్గ్రేడ్ చేయనుంది. 2024లో బ్రాండ్ సొంత ప్రత్యేక సేవా కేంద్రాలలో 11 శాతం పెరుగుదలతో సహా 22 శాతం మేర తన సరీ్వస్ సెంటర్లను పెంచినట్లు వన్ప్లస్ తెలిపింది. -
సంబంధాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్ఫోన్.. సర్వేలో భయంకర నిజాలు
మితిమీరిన స్మార్ట్ఫోన్ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.స్మార్ట్ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో64 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
డిజిటల్ కామ్డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..
జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్.. ఇన్నోసియన్ బెర్లిన్ కలిసి 'కామ్డోమ్' (Camdom) యాప్ ప్రారంభించాయి. ఇది స్మార్ట్ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్లను నిలిపివేయడానికి బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.డిజిటల్ కామ్డోమ్ యాప్ అనేది.. ప్రైవేట్ సమయాల్లో వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎదుటి వ్యక్తి కాల్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ వంటివి చేయకుండా నిరోధిస్తుంది. ఒకవేళా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ వస్తుంది.చాలామంది మీరు వీడియో కాల్ లేదా ఆడియో కాల్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ డిజిటల్ కామ్డోమ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని స్మార్ట్ఫోన్లోని బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగించవచ్చు. యాప్ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి.ప్రస్తుతం ఈ యాప్ 30 కంటే ఎక్కువ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ యాప్ మన వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుందని యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా పేర్కొన్నారు. -
అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు
న్యూఢిల్లీ: మొబైల్ఫోన్స్ తయారీలో ఉన్న దేశీయ కంపెనీ లావా అక్టోబర్ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్ఫోన్ను విక్రయించనుంది. అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా ఈ మోడల్ లభించనుంది. ప్రారంభ ధర రూ.19,999.లావా అగ్ని-3 బార్ ఫోన్లో రేర్ డిస్ప్లేతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే పొందుపరిచారు. ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్ కెమెరా, సామ్సంగ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో రూపుదిద్దుకుంది.లావా అగ్ని-3 స్మార్ట్ఫోన్ 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని–3 రాకతో రూ.20–25 వేల ధరల శ్రేణిలో ఆన్లైన్ విభాగంలో 2025–26 నాటికి 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ఈడీ సునీల్ రైనా తెలిపారు. -
స్మార్ట్ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
చట్టాలను ఉల్లంఘించిన స్మార్ట్ఫోన్ కంపెనీలు
శామ్సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్మీ, వన్ప్లస్ వంటి స్మార్ట్ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్కార్ట్తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్సైట్లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు రాయిటర్స్ నివేదికపై స్మార్ట్ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్కార్ట్లు ప్రత్యేకమైన లాంచ్ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు. -
అద్భుత ఫీచర్లతో ఐఫోన్ 16 !
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్లుండే కొత్త మోడల్ స్మార్ట్ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు. అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది. కొత్త సిరీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. 16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది. – వాషింగ్టన్ -
స్మార్ట్ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్ఫోన్ను మైక్రోస్కోప్లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్ఫోన్ను రోజులో ఒకసారైనా శానిటైజ్తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ను దూరంగా ఉంచాలి. -
గూగుల్ కొత్త స్మార్ట్ఫోన్: స్విచ్ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్పుట్కు సపోర్ట్ చేస్తుందికొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లు యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్పుట్కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్బీ-సీ ద్వారా డిస్ప్లే పోర్ట్తో స్క్రీన్ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చుసాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్ఫోన్లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్ఫోన్కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. -
క్లిక్ చేయొద్దు.. బ్లాక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడు తప్పక వాడే మొబైల్ యాప్ వాట్సాప్. ఇప్పుడు ఈ యాప్ను వేదికగా చేసుకుని సైబర్నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ వాట్సాప్లకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. అందులోని లింక్పై క్లిక్ చేసి, తాము చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తిని రూ.5.4 కోట్లు మోసగించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. అయితే, పెట్టుబడుల పేరిట వాట్సాప్లో వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. షేర్మార్కెట్ పెట్టుబడులతోపాటు ఇతర యాప్లకు సంబంధించి వచ్చే లింక్లపైనా క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.అనుమానాస్పద మెసేజ్లు వాట్సాప్కు వస్తే వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేయాలని తెలిపారు. సైబర్నేరగాళ్ల నుంచి తరచూ ఈ తరహా మెసేజ్లు వస్తుంటే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టికి ఆ నంబర్లు తీసుకురావాలని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, సైబర్ నేరగాళ్ల చేతిలో మరికొందరు మోసపోకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు. -
గూగుల్పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్కి పోతుంది.గూగుల్పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్తోపాటు బింజ్తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
విషప్రచారపు కోరల్లో...
చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది. మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్పోర్ట్లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి. అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్మీడియా లోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి. చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి. ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్కు ఓటేశారు. పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్కు శోభనివ్వదు. అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం. -
‘80 కోట్ల భారతీయుల జీవితాలను మార్చిన స్మార్ట్ఫోన్’
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ స్క్రీనింగ్ టైమ్
స్మార్ట్ఫోన్తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్ఫోన్లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
ఐదోవంతు సమయం స్మార్ట్ఫోన్కే సరి
సాక్షి, అమరావతి : స్మార్ట్ఫోన్తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్ఫోన్లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్ను మార్కెట్కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
హైదరాబాద్లో చోరీ.. సూడాన్కు స్లగ్మింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఇటీవల సెల్ఫోన్ చోరీలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న టాస్్కఫోర్స్ పోలీసులు చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–సూడాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ నేర బంధం వెలుగులోకి వచి్చంది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్ఫోన్లను థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి సూడాన్కు స్మగ్లింగ్ చేస్తున్న వ్యవస్థీకృత ముఠా వ్యవహారాలు బయట పడుతున్నాయి. గత నెల ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా««దీనం చేసుకున్న టాస్్కఫోర్స్ పోలీసులు.. తాజాగా మరో 31 మందిని పట్టుకుని వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ ముఠాల వ్యవహారంపై టాస్క్ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చోరీ చేసి.. వ్యాపారులకు విక్రయం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విలాసాలకు అవసరమైన డబ్బును తేలిగ్గా సంపాదించడానికి సెల్ఫోన్ల చోరీలు చేయాలని పథకం వేశారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ప్రజల సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వాటిని జగదీశ్ మార్కెట్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫోన్ మార్కెట్లలో కొందరు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఆపై వాటిని ఏం చేస్తున్నారు? ఇలా చోరీ చేసిన ఫోన్లలో దాదాపు అన్నీ లాక్ చేసే ఉంటాయి. వీటిని అన్లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్ఫోన్ టెక్నీíÙయన్లు పని చేస్తున్నారు. వీళ్లు చోరీ ఫోన్ల లాక్లు తీయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే.. తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక ని«ఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఆ ఫోన్లను వ్యాపారులు సూడానీయులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు.. సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి, తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపేస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు.. సయ్యద్ ఘయాజ్ హషి్మ, మహ్మద్ దస్తగిర్, సయ్యద్ సాజిద్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ సలావుద్దీన్, టైల్స్ వర్కర్లు మహ్మద్ హమీద్, షేక్ మునావర్, వెల్డింగ్ వర్కర్లు షేక్ అన్సార్, మహ్మద్ ఖాన్, డెకరేషన్ వర్కర్ మహ్మద్ అంజాద్, వంట పని చేసే మహ్మద్ ఖాలిద్, పెయింటర్ మహ్మద్ మహమూద్ అలీ, చిరుద్యోగి సోహైల్ ఖాన్, కూరగాయల వ్యాపారి మహ్మద్ ముస్తాక్ ఫోన్లు చోరీ చేస్తారు. మొబైల్ వ్యాపారులైన షేక్ షాజవాజ్ ఖాన్, మహ్మద్ ఆసిఫ్ అహ్మద్, మహ్మద్ గౌస్, మహ్మద్ అర్షద్ మొయినుద్దీన్, మహ్మద్ నవీదుద్దీన్ సల్మాన్, మహ్మద్ నజీరుద్దీన్, మహావీర్ జైన్, మహ్మద్ అబ్దుల్ సిరాజ్, మజీద్ ఖాన్, అబ్దుల్ హజీమ్, షేక్ జావేద్ అలీ ఈ చోరీ ఫోన్లు కొంటారు. వీటిని సయ్యద్ రహీమ్, మహ్మద్ అర్బాజ్ ఖాన్, నజీముద్దీన్, సాదిక్ అహ్మద్ అన్లాక్ చేస్తుండగా.. ఇవన్నీ తక్కువ ధరకు కొనే సూడానీ మూసా హసన్ తమ దేశానికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. నానల్నగర్లో ఉండే మూసా మొబైల్ విడిభాగాల వ్యాపారం చేస్తున్నాడు. స్మగ్లింగ్ వ్యవహారంలో మూసానే కీలకంగా వ్యవహరిస్తున్నాడు. -
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్ఫోన్ లాంచింగ్కు షావోమీ రెడీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారిగా సినిమాటిక్ విజన్ (సివి) ‘CI’ (of Cinematic) and ‘VI’ (of Vision) సిరీస్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్కు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. కానీ ఫోన్ గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించ లేదు. ఈ తరహా సివి ఫోన్ల గురించి గతంలో పుకార్లు వచ్చాయి. షావోమీ సివి 4 ప్రోని..షావోమీ 14 సివిగా భారత్ మార్కెట్కు పరిచయం చేయనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమీ 14 సిరీస్కి అప్డేటెడ్ వెర్షన్ రానుంది. ఈ సిరీస్లో రెండు ఫోన్లు షావోమీ 14, షావోమీ 14 ఆల్ట్రా ఉన్నాయి. సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ #CinematicVision - Coming Soon! pic.twitter.com/Exnu9If9Da— Xiaomi India (@XiaomiIndia) May 21, 2024 సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ అనే ఊహాగానాలు నిజమైతే స్మార్ట్ఫోన్ 1.5కే రిజల్యూషన్తో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్జెడ్ (Hertz) రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడిన డిస్ప్లే. 2160హెచ్జెడ్ పీడబ్ల్యూ ఎం డిమ్మింగ్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో రానుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్అంతేకాదు ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ ఉండగా 12జీబీ ఎల్ పీపీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇక ఫోన్ వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ13బీ10 అల్ట్రా వైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రానుండగా.. ఆఫోన్ షావోమీ ఐపర్ ఓఎస్లో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్, హై రెసెల్యూషన్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటితో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయని సమాచారం. -
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్ల రిజల్యూషన్తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్ఫోన్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కు కూడా మద్దతు ఇస్తుంది. -
భారత్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్లో ఆసక్తికరమైన టేకింగ్కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024: వీటికే అవార్డ్స్..
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు షియోమీ 14 అల్ట్రా లెనోవా ట్రాన్స్పరెంట్ ల్యాప్టాప్ హానర్ మ్యాజిక్ 6 ప్రో శామ్సంగ్ గెలాక్సీ రింగ్ ZTE నుబియా ప్యాడ్ 3D 2 హానర్ మ్యాజిక్బుక్ ప్రో 16 టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ పాయింట్ ఎంసీ02 నథింగ్ ఫోన్ 2ఏ ఒప్పో ఎయిర్ గ్లాస్ 3 వన్ప్లస్ వాచ్ 2 మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ నుబియా ఫ్లిప్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900 హానర్ ఐ-ట్రాకింగ్ టెక్ -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్!
భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు భారీ షాక్ తగిలింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఇంటర్డిజిటల్కు పెండింగ్లో ఉన్న మొత్తం రాయల్టీలను మూడు నెలల్లో చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సదరు చైనా సంస్థల ఫోన్ అమ్మకుండా కోర్టును ఆశ్రయించొచ్చుని తెలిపింది. ఫిబ్రవరి 21న జారీ చేసిన ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వుల్లో.. ఒప్పో ఇంటర్డిజిటల్కు సంబంధిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కోర్టు ఆదేశాల్ని భేఖాతరు చేసినందుకు భారత్లో ఒప్పోతో పాటు ఇతర చైనా ఫోన్ లు అమ్మకాలు జరగకుండా ఇంటర్ డిజిటల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కోసం నమోదు చేసుకునేందుకు అర్హత ఉందని సూచించింది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇంటర్ డిజిటల్ సంస్థకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉందనే అంశంపై స్పష్టతలేదు. అయితే ఆమొత్తాన్ని, అందుకు అయ్యే వడ్డీని బ్యాంక్ అకౌంట్ లలో జమచేయాలని, ఈ కేసు విచారణను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. కేసు దేనికి సంబంధించింది? తమ హ్యాండ్సెట్లలో సెల్యులార్ టెక్నాలజీ (3జీ, 4జీ,5జీ), వీడియో కోడింగ్ టెక్నాలజీ వినియోగంపై ఒప్పో,రియల్ మీ, వన్ ప్లస్ బ్రాండ్లకు వ్యతిరేకంగా ఇంటర్ డిజిటల్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఇంటర్డిజిటల్ తన సాంకేతికతను ఉపయోగించడం కోసం న్యాయమైన, సహేతుకమైన, వివక్షత లేని (FRAND)నిబంధనలపై లైసెన్స్ ఒప్పందం కోసం ఒప్పో గ్రూప్తో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 2021లో యూకే, జర్మనీ, భారత్ తో పాటు ఇతర దేశాల్లో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు వ్యతిరేకంగా వాజ్యం దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది. ఒప్పో వర్సెస్ నోకియా జూలై 2023లో ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ మొబైల్ ఫోన్ తయారీదారు ఒప్పో తన ఫోన్లలో నోకియా సాంకేతికతను అవసరమైన అనుమతి లేకుండా ఉపయోగించినందుకు, నాలుగు వారాల్లోగా దాని భారతదేశ విక్రయాలలో 23 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సైతం సమర్ధించింది. కోర్టు తీర్పుతో దిగివచ్చిన ఒప్పో.. నోకియాకు చెల్లించింది. ఆపై సాంకేతిక వినియోగం విషయంలో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
స్మార్ట్ఫోన్ కోసం న్యూక్లియర్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు పని చేస్తోంది!
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్ఫోన్లోని టచ్స్క్రీన్ కీబోర్డు మీద టైప్చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్ఫోన్కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్రైటర్, డెస్క్టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్ఫోన్లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
మొబైల్ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ ఫేమ్ హిమజా’ సందడి (ఫొటోలు)
-
అదిరిపోయే డిజైన్లతో విడుదల కానున్న ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 11 సిరీస్ను త్వరలో విడుదల చేయనుంది. జనవరి 11 న ఒప్పో రెనో 11 , ఒప్పో రెనో 11 ప్రోలను మార్కెట్కు పరిచయం చేయనుంది. ఇప్పటికే ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్ ఫీచర్లను ఒప్పో రెనో 11 ప్రో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ తో, అలాగే ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానుంది. 5జీ సపోర్ట్తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,6.74 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తుంది. ఫోన్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
వివో ఇండియాకు భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివోకు భారీ షాక్ తగిలింది. వివో అనుబంధ వివో ఇండియా కు చెందిన మరో ముగ్గురు అధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతేడాది వివో ఇండియా వ్యాపారా లావాదేవీలపై ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల ద్వారా రూ.62,476 కోట్ల మేరకు చైనాకు వివో ఇండియా అక్రమంగా తరలించిందని ఈడీ అభియోగం మోపింది. అదే ఏడాది జూలైలో వివో ఇండియా కార్యాలయాలు, సంబంధిత ఎగ్జిక్యూటివ్ల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివో ఇండియాతోపాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవలే పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంతకుముందు హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి హోం రాయ్, చైనీయుడు గౌంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరు నలుగురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్!
స్మార్ట్ఫోన్ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు పాత ఫోన్లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్ నేరస్తులు లక్షల మంది శాంసంగ్ ఫోన్లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. శాంసంగ్ ఫోన్ యూజర్లు ఏం చేయాలంటే శాంసంగ్ ఫోన్లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11,12,13,14లోని ఆపరేటింగ్ సిస్టంను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. శాంసంగ్ ఫోన్లపై దాడి.. ఆపై ఏం చేస్తారంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్ల జాబితాలో ఉంది. ఫోన్ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్ నేరస్తులు ఫోన్లలోని డివైజ్ పిన్ను, ఎమోజీ సాండ్బాక్స్ డేటాను అటాకర్లు చదవగలరు. సిస్టమ్ టైమ్ను మార్చి నాక్స్ గార్డ్ లాక్ను బైపాస్ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్ ఇన్ పేర్కొంది. మిగిలిన ఫోన్ యూజర్లు సైతం అదే సమయంలో మిగిలిన స్మార్ట్ఫోన్ వినియోగదారులు శాంసంగ్ ఫోన్ల నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద లింకుల జోలికి పోవద్దని హెచ్చరించింది. -
త్వరలో.. భారత్లో రియల్మీ 12 సిరీస్ విడుదల, ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ భారత్లో మిడ్ రేంజ్ రియల్ మి 12 సిరీస్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థ ఫ్లాగ్షిప్ ఫోన్ జీటీ 5 ప్రో సిరీస్ను చైనాలో విడుదల చేసింది. ఇతర స్మార్ట్ఫోన్లైన వన్ప్లస్ 12 తో పాటు ఇతర స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ తరుణంలో భారత్లో సైతం ఇతర స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలకు ధీటుగా రియల్మీ కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్లను మార్కెట్కి పరిచయం చేయాలని భావిస్తుందంటూ ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోచైనా నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా రియల్మీ ప్రో, రియల్మీ ప్రో ప్లస్ ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. రియల్మీ 12ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే? రియల్మీ 12 ప్రో క్వాల్కమ్ 7 4ఎన్ఎం ప్రాసెస్ జనరేషన్ 3 చిప్సెట్తో రానుంది. దీంతో పాటు 2ఎక్స్ ఆప్టికల్స్ జూమ్ చేసేలా 32 ఎంపీ ఐఎంఎక్స్ 709 టెలిఫోటోలెన్స్ సైతం ఈ ఫోన్లో ఉన్నాయి. అదే విధంగా రియల్మీ 12ప్రో ప్లస్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 64 ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ64బీ లెన్స్ సపోర్ట్ను అందిస్తుంది. రియల్మీ 12 సిరీస్ ధరలు రియల్మీ 12ప్రో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్తో రూ.25,000గా ఉంది. మొదట వచ్చే ఏడాది మార్చి లోపు ఈ ఫోన్ విడుదల చేసి.. ఆ తర్వాత గ్లోబుల్ మార్కెట్ యూజర్లకు పరిచయం చేస్తుంది. ఈ గ్లోబుల్ మార్కెట్లో భారత్ సైతం ఉంది. ఇక రియల్మీ 12 సిరీస్కి పోటీగా రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను న్యూయర్కి విడుదల చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్కార్ట్లో 80 శాతం భారీ డిస్కౌంట్కే.. -
సంగీతం నేర్పే ‘స్మార్ట్ ఉకులెలె’.. ఎలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడం సులువు అవుతోంది. తెలియని అంశాలను నేర్చుకోవడానికి చాలామంది క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కొంత సమయం పట్టినా చివరకు సాధిస్తున్నారు. గతంలో సంగీతం నేర్చుకోవాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సివచ్చేది. అందుకు కొంత డబ్బు, సమయం ఖర్చయ్యేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి సంగీతాన్ని నేర్పే యాప్స్, ఇన్స్ట్రుమెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జియోమీ సంస్థ అలాంటి ఓ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గిటార్లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దారు. స్మార్ట్ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! -
టెక్ దిగ్గజం యాపిల్కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు భారీ షాక్ తగిలింది. చైనాలో యాపిల్ అమ్మకాలు తగ్గగా.. స్థానిక కంపెనీ షావోమీకి మాత్రం కొనుగోలు దారులు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 20 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ పెరిగింది. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు ఇతర రంగాల్లోని వ్యాపారాలు గణనీయమైన వృద్దిని సాధించాయి. ఫలితంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో షావోమీ స్టాక్ విలువ 60 శాతం పెరిగినట్లు హాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ తెలిపింది. ఇటీవల యాపిల్ క్యూ4 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాల్లో కంపెనీకి రెవెన్యూ తగ్గినా.. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు నివేదించింది. జులై నుంచి సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ల 73.5 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 1శాతం తగ్గింది. అయితే ఆండ్రాయిడ్ మార్కెట్లో యాపిల్ సేల్స్ తగ్గినా.. రానున్న రోజుల్లో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో మార్కెట్ ఫలితాలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా చైనాలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలు సైతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. షోవోమీ 14 సిరీస్ అమ్మకాల జోరు చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత నెల 26న ‘షావోమీ 14’ సిరీస్ను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల ఫోన్లు అమ్ముడు పోయాయి. చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ అమ్మకాల్ని షావోమీ రెండో సారి సాధించింది. షావోమీ తర్వాతి స్థానంలో హువావే టెక్నాలజీ విడుదల చేసిన స్మార్ట్ఫోన్ మేట్ 60 ప్రొ ఉంది. కాగా, షావోమీ ఫోన్లే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్, ఏఐ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అదే స్థాయిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీల ఫోన్ల జోరు డ్రాగన్ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాబట్టే అక్కడి పౌరులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయం స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై పడింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ నివేదికలో క్యూ3లో స్మార్ట్ఫోన్ సేల్స్ 3 శాతం పడిపోయాయి. దీనిపై అమెరికా పెట్టుబడి సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్లు స్పందిస్తూ.. వచ్చే ఏడాది నాటికి చైనాలో స్మార్ట్ఫోన్ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. చదవండి👉 ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్.. -
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్వర్క్తో పనిలేకుండా డైరెక్ట్గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్ఫోన్లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్ఫారమ్లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జియో వినియోగదారులకు శుభవార్త
వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో మెరుగైన వెర్షన్లో 4జీ ఫోన్లను రూ.999కే అందించనుంది. ఈ నేపథ్యంలో నోకియా, లావా, ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్లతో కలిసి స్మార్ట్ఫోన్ సొంత వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. 250 మిలియన్ల 2జీ వినియోగదారులు 4జీ టెక్నాలజీని వినియోగించేలా కృషి చేయాలని కంపెనీ భావిస్తుందన్న ఆయన .. 450కి పైగా ఛానళ్లతో లైవ్ టీవీ, లేటెస్ట్ సినిమాలు, పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్, ఇతర కంటెంట్ వంటి ఫీచర్లను రిలయన్స్ జియో 30 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. స్కాన్ అండ్ పే ఆప్షన్ తో యూపీఐ పేమెంట్స్ ను జియో ప్రవేశపెట్టిందని దత్ వెల్లడించారు. గత నెలలో రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్ జియోభారత్ బి1ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.1,299గా ఉంది. ఈ ఫోన్లో 2.4 అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ అందించేందుకు జియో యాప్స్ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుండగా.. యూపీ పేమెంట్స్ కోసం జియోపేని ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు జియో కల్పిస్తుంది. జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వీ2, కే1 కార్బన్ వంటి ఫోన్లను జియో ప్రవేశపెట్టింది. -
పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. భారత్లో విడుదల ఎప్పుడంటే
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో లేటెస్ట్ సిరీస్తో స్మార్ట్ ఫోన్ ప్రియుల్ని అలరించనుంది. త్వరలో భారత్ మార్కెట్లోకి పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎక్స్5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా పోకో ఎక్స్6 ను విడుదల చేస్తుంది. అయితే రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ - 8జీబీ- 12 జీబీ ర్యామ్, 128 జీబీ /256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోపీ చిప్ సెట్ పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. -
స్మార్ట్ఫోన్లకు మైక్రోస్కోప్.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే?
వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్ స్మార్ట్ఫోన్కు మైక్రోస్కోప్ చూపునిస్తుంది. స్మార్ట్ఫోన్ కెమెరా లెన్స్కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో ఉన్నంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. ఈ లెన్స్ స్మార్ట్ఫోన్ లెన్స్లో సాధారణంగా కనిపించే వస్తువులను వాటి పరిమాణానికి పన్నెండువందల రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. దీని ద్వారా తీసే ఫొటోల రిజల్యూషన్ 700ఎన్ఎం ఉంటుంది. ఈ మైక్రోస్కోపిక్ లెన్స్ను స్మార్ట్ఫోన్కు అమర్చుకుంటే, రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, చంద్రుడిని అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సుదూర దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఐ మైక్రోస్కోప్’ ఈ లెన్స్ను ‘ఐమైక్రో క్యూ3’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 35 డాలర్లు (రూ.2,910) మాత్రమే! -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
భారత్లో ఫోల్డబుల్ ఫోన్ల హవా!
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్సంగ్కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి. పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్పాయింట్ రిసర్చ్ తెలిపింది. మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్ఫోన్ మాదిరి డిస్ప్లేతో ఫ్లిప్ మోడల్ను ఒప్పో తీసుకొచ్చింది. -
భారత్లో ‘పిక్సెల్ సిరీస్’ స్మార్ట్ఫోన్ల తయారీలో గూగుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేయాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్తోపాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా, వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్ 8 సిరీస్ భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. తొలుత పిక్సెల్ 8 మోడల్ ఫోన్లు మేడిన్ ఇండియా ట్యాగ్తో రానున్నాయి. పిక్సెల్ 8 ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందే చాన్స్ ఉంది. దేశీయంగా పిక్సెల్ ఫోన్ల తయారీకై తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, భారత్కు చెందిన డిక్సన్ టెక్నాలజీస్ పోటీపడుతున్నట్టు సమాచారం. 2016 నుంచి అంతర్జాతీయంగా సుమారు 4 కోట్ల పిక్సెల్ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ఒక కోటి యూనిట్లు గడిచిన 12 నెలల్లో అమ్ముడవడం విశేషం. వచ్చే ఏడాది నుంచి.. మేడిన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైసెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో గురువారం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ, దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా 2023 కార్యక్రమంలో పేర్కొన్నారు. గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను దేశంలో తయారు చేయాలనే నిర్ణయం భారత్ను తయారీ కేంద్రంగా మార్చడం, అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం. క్రోమ్బుక్స్ను భారత్లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నికగల హెచ్పీ ఇటీవలే గూగుల్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. భారత్లో ఇప్పటికే యాపిల్.. కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది. ఇందుకోసం చైనా+1 విధానంలో భాగంగా భారత్లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది. గత నెలలో ఐఫోన్ 15 విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. భారత్లో, అలాగే చైనాలో ఉత్పత్తి అయిన ఐఫోన్స్ను ఒకే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా యాపిల్ విడుదల చేయడం ఇందుకు కారణం. సాధారణంగా భారత్లో యాపిల్ తాజా మోడళ్ల ఉత్పత్తి చైనా కంటే కొన్ని నెలలు వెనుకబడి ఉంటుంది. 2025 నాటికి భారత్లో 25 శాతం ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా చేసుకుంది. -
iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేసింది. ఈ సారి ఐఫోన్ 15 సిరీస్పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్లో సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్లో పరిచయం చేసింది. టైటానియం బాడీ కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి. పర్యావరణహితం లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్స్ట్రక్చర్ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్లను ఉపయోగించారు. యాక్షన్ బటన్ సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్లలో మ్యూట్ స్విచ్కి బదులుగా యాక్షన్ బటన్ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్ల కోసం షార్ట్కట్గా ఉంటుంది. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కొత్త ఐఫోన్లు సరికొత్త Qi2 వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు. A17 ప్రో చిప్ మొదటి 3-నానోమీటర్ చిప్గా పిలిచే A17 ప్రో చిప్ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్. కన్సోల్ గేమింగ్ యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్లస్ట్ ఈవెంట్లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది. 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్ను ఇందులో ఉంది. టెట్రాప్రిజం డిజైన్ జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్తో కూడిన టెట్రాప్రిజం డిజైన్ను కలిగి ఉంటుంది. -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్గా 'వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్క్యామ్లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్క్యామ్లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్క్యామ్లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్కెమెరా ఫీచర్ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్టాప్, మ్యాక్బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్ని పర్సనల్ కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్క్యామ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
అయ్యో పాపం.. ఐఫోన్ 15 కోసం ఎంతకు తెగించారో చూడండి..
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 23 నుంచి లభ్యం కావడంతో ఈ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. విడుదలై గంటలు గడవక ముందే ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కమలా నగర్కు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ స్టోర్కి కొంత మంది ఐఫోన్ల కోసం వచ్చారు. అయితే, ఫోన్ల డెలివరీ కాస్త ఆలస్యం అవుతుందని స్టోర్ సిబ్బంది చెప్పడంతో కోపోద్రికులయ్యారు. డెలివరీ అలస్యం అవుతుందని చెప్పిన స్టోర్ ఉద్యోగి దుస్తులు చించారు. ఆపై దారుణంగా కొట్టారు. స్టోర్లోని ఇతర సిబ్బంది వినియోగదారుల్ని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. ప్రస్తుతం, ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై స్టోర్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్టోర్ సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డ కస్టమర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi Police took legal action against the customers after a scuffle broke out between customers and mobile shop employees after an alleged delay in supplying iPhone 15 to him in the Kamla Nagar area of Delhi (Viral Video Confirmed by Police) pic.twitter.com/as6BETE3AL — ANI (@ANI) September 23, 2023 చదవండి : కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ? -
దిగొచ్చిన చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం
Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్కు పోటీగా డిక్సన్కు షావోమి పార్టనర్ షిప్ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?) బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ను ప్రారంభించారు. కాగా ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్ మార్కెట్ షేర్ను కోల్పోయింది. దీన్నుంచు కోలుకునే చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5G స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్ చేస్తోంది. Leadership of @XiaomiIndia met me tdy - hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 6, 2022 -
సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్ఫోన్లు ఇవే
టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఆ సిరీస్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, హానర్ 90, షావోమీ 13 టీ ప్రోలు లాంఛ్ చేయనున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న యాపిల్ షెడ్యూల్ ప్రకారం.. ‘వండర్లస్ట్’ ఫాల్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లు ఉన్నాయి. యూఎస్బీ-సీ పోర్ట్, పవర్ఫుల్ ఏ17 బయోనిక్ చిప్సెట్, లైనప్లో వినూత్నమన డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్కు పెరిస్కోపిక్ కెమెరా లెన్స్ డిజైన్ వంటి ఈ ప్రీమియం మోడల్కి ఉంటాయని అంచనా. హానర్ 90 సిరీస్ దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు హానర్ సంస్థ సిద్దమైంది. చైనా తయారీ సంస్థ హానర్ 2020లో భారత్లో తన కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఈ తరుణంలో హానర్ టెక్ పేరిట పున ప్రారంభం కానుంది. హానర్ 90 సిరీస్ను లాంచ్ చేసి భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తాము సైతం పోటీలో ఉన్నామని చెప్పనుంది. హానర్ కొత్త సిరీస్ విడుదలపై అమెజాన్ ప్రచారం ప్రారంభించింది. మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్గా భావిస్తున్నారు. హైఎండ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లకి పెద్ద మొత్తంలో ఖర్చ చేయకూడదనుకునే వారికి ఈ ఫోన్ మంచిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ విడుదల తేదీ అధికారంగా తెలియాల్సి ఉంది. షావోమీ 13టీ ప్రో ఈ స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ 1న లాంచ్ అవుతుందని గతంలో పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతుంది. షోవోమీ 13టీ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాల్ట్ల ఛార్జింగ్ సపోర్ట్, 144హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సుదీర్ఘ కాలం తర్వాత శాంసగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్లోని బడ్జెట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పేరుతో మార్కెట్కు పరిచయం కానుంది. ఈ ఫోన్లో 50 ఎంపీ కెమెరా,ఎక్స్నాయిస్ 2200 లేదంటే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, 120 హెచ్జెడ్ స్మూత్ డిస్ప్లేతో పాటు యూజర్లు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. వన్ ప్లస్ ఓపెన్ వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలోకి వన్ప్లస్ ఓపెన్ అడుగుపెట్టనుంది. లాంచ్ తేదీ వెల్లడించనప్పటికీ ఇది 7.8-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్ప్లే ఉండొచ్చనే అంచనాలు నెకొన్నాయి. అంతేకాదు ఇందులో స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. -
అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు భారత్లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్ (5G Smartphone) లాంచ్ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్ఫోన్ తొలి సేల్ ఫ్లిప్కార్ట్లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోంది. రెండో సేల్కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ ట్విటర్లో షేర్ చేశారు. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 90Hz రిఫ్రెష్ రేట్తో 6.79 అంగుళాల డిస్ప్లే స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఓఎస్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ర్యామ్ ఎక్స్ప్యాన్షన్ ఫీచర్తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ Today we had the second sale of #POCOM6Pro5G and it started at 12 noon and went Out of Stock in just 9 minutes. Thanks everyone for the tremendous response. #5GDisrupter #POCOM6Pro5G pic.twitter.com/k7f8QR7JR1 — Himanshu Tandon (@Himanshu_POCO) August 12, 2023 -
హైదరాబాద్ : కొత్త స్మార్ట్ఫోన్ లాంచింగ్లో మెరిసిన నటి శ్రీలేఖ - ఫోటోలు
-
‘నో జీ టూ 5జీ’ : టెలికాం రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం. అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ట్రంక్ బుకింగ్ 1990లకు ముందు, వైర్లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే ఆపరేటర్కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్ను మాన్యువల్గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది. సబ్స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్ను డయల్ చేసి ఆపరేటర్తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్లను ఏర్పాటు చేయడంతో STD కాల్లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్ఫోన్ టారిఫ్లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు. ఇంటర్నెట్ 1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్ఎన్ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్కు విద్యార్థి అకౌంట్కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్లను సజావుగా చేసుకోగలుగుతున్నాం. పేజింగ్ సేవలు 1990వ దశకం మధ్యలో ఫోన్లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది. మొబైల్ ఫోన్ విప్లవం 1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది. ది జనరేషన్స్ భారత్లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్వర్క్లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది! -
బాల్యంలో స్మార్ట్ ఫోన్తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్వర్క్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్తో 5,000mAh బ్యాటరీ -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
ఆకాశంలో చుక్కలను సైతం ఇట్టే ఫోటో తీయొచ్చు.. ఇది చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్ఫోన్ జనాల చేతిలోకి వచ్చాక ఫొటోగ్రఫీ చాలా తేలికైపోయింది. సెల్ఫీలు మొదలుకొని, కంటికి నచ్చిన ప్రతిదృశ్యాన్నీ స్మార్ట్ఫోన్ కెమెరాల్లో బంధించే జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్ఫోన్ కెమెరాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. సుదూరంలో ఉన్నవాటిని స్మార్ట్ఫోన్ కెమెరాలతో ఫొటో తీయడం దాదాపుగా దుస్సాధ్యం. వీటి లెన్స్ కొంత వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతాయి. ఆ పరిధి దాటిన వాటిని దగ్గరగా, స్పష్టంగా ఫొటోలు తీయలేవు. ఈ పరిమితిని అధిగమించడానికే ఈ స్మార్ట్ఫోన్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! ‘హీస్టియా–లెన్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టెలిస్కోపిక్ లెన్స్ను స్మార్ట్ఫోన్ కెమెరాకు అమర్చుకుంటే, ఆకాశంలో సుదూరాన కనిపించే గ్రహాలను, నక్షత్రాలను స్పష్టంగా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. ‘వావోనిస్’ అనే అమెరికన్ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్మార్ట్ఫోన్ టెలిస్కోపిక్ లెన్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లెన్స్ ధర 289 డాలర్లు (రూ.23,702) మాత్రమే! -
రూ.10వేలే.. 108మెగా ఫిక్సెల్ కెమెరాతో అదిరిపోయే స్మార్ట్ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ రూ.10వేల ధరలో బడ్జెట్ ధరలో సీ53 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. రూ.9,999 బడ్జెట్ ధరలో విడుదలైన ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనక భాగంలో 108 ప్రైమరీ కెమెరాతో రానుంది. రియల్మీ సీ53 ధర రియల్మీ సీ53 4జీబీ ప్లస్ 128 జీబీ, 6జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్స్ ఫోన్లను అందించనుంది. జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు సమయంలో పరిచయ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. రియల్మీ సీ 53 ఫీచర్లు రియల్మీ సీ 53.. 6.74 అంగుళాల 90 హెచ్జెడ్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ టూ బాడీ రేషియో 90.3శాతం, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 108 ఎంపీ ఆల్ట్రా క్లియర్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, ఫోన్ ఫ్రంట్ సైడ్ 720 పీ/30 ఎఫ్పీఎస్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నానోకార్డ్, మైక్రో ఎస్డీ స్లాట్లు ఉన్నాయి. బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లో లభ్యం కానుంది. -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్టెల్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్క్లూజివ్గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్కార్ట్లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్ఓఎస్తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్జ్ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్వర్క్లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్వర్క్కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్! -
స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్లో ఓ సెల్ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్నెస్తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్ను ఇన్ స్టాల్ చేసుకున్నారా?, చాట్జీపీటీతో పాటు!
మీరు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్ కీ బోర్డ్ వినియోగిస్తున్నా..వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల స్విప్ట్కీబోర్డ్లో బింగ్ చాట్బాట్ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కీబోర్డ్ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్ను రీరైట్ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా స్విఫ్ట్కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్లో ఉన్నాయని అన్నారు. కావాలంటే మీరూ ఆ కీబోర్డ్ పనితీరు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్లో లభ్యమయ్యే స్విఫ్ట్ కీబోర్డ్ను మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 గూగుల్కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం! -
ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్తో 'జెల్లీ స్టార్' స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక ప్యానెల్లో పారదర్శక డిజైన్తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్ఈడీ నోటిఫికేషన్ లైట్ను ఇచ్చింది కంపెనీ. ఫోన్ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి. ధర, లభ్యత ఈ బుల్లి స్మార్ట్ ఫోన్ను 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్తో ఒకే వేరియంట్లో కంపెనీ విడుదల చేసింది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్ను హాంకాంగ్లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్పెసిఫికేషన్లు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్తో 3 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 48 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా 2000mAH బ్యాటరీ -
ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్!
Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో లభిస్తుంది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh. (ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్ హీరోలకు మేనేజర్గా.. బిజినెస్తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!) అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్వర్క్తో లభిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మీద ఫ్లిప్కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
విడుదలకు ముందే జియో 5జీ ఫోన్ ఫోటోలు లీక్, ధర మరీ ఇంత తక్కువా?
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. విడుదలకు ముందే ఆ ఫోన్ ఫోటోలు లీకయ్యాయి. అయితే, లీకైన ఫొటోల్లానే జియో ఫోన్ ఉంటుందా? ఏవైనా మార్పులుంటాయనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆన్లైన్లో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు జియో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ట్విటర్ యూజర్ అర్పిత్ నహిమిలా పోస్ట్ చేసిన ఆ ఫోటొల్ని పరీక్షిస్తే జియో ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా, బ్లాక్ కలర్ వేరియంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు 13 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్, కెమెరా ముందు భాగం 5 మెగా పిక్సెల్ షూటర్తో వాటర్డ్రాప్ స్టైల్ నాచ్, ఫోన్ బాడీ ఫైబర్ ప్లాస్టిక్తో తయారైంది. 5జీ యూనిసాస్ ప్రాసెసర్, డైమన్సిటీ 700 ఎస్ఓఎస్గా ఉంది. ఇక, ఈ ఏడాది దివాళి లేదా కొత్త ఏడాది మధ్య కాలంలో విడుదల కానున్న జియో 5జీ ఫోన్ ధర రూ.10,000 ఉండనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. గతంలో వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లలో జియో ఫోన్ 5జీ 4జీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 480 ఎస్ఓఎస్ను పొందవచ్చని పేర్కొంది. 5జీ ఫోన్ 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.5-అంగుళాల హెచ్ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 సపోర్ట్తో జియో 18 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు ఆ నివేదికలు హైలెట్ చేశాయి. స్మార్ట్ఫోన్ ధర రూ. 8,000 నుంచి రూ. 12,000 ఉండనున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ గత సంవత్సరం అంచనా వేసింది. ఫోన్ గూగుల్ మొబైల్ సర్వీసెస్, జియో యాప్స్తో ఇన్ బిల్ట్ అయి వస్తున్నాయి. ఇందుకోసం గత ఏడాది జియో గూగుల్తో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది. ఫోన్లతో పాటు అతితక్కువ ధరకే ల్యాప్ట్యాప్లను జియో అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1.6-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 665 ఎస్ఓఎస్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ల్యాప్ ట్యాప్ను విడుదల చేసింది. దీని ధర రూ. 15,799. Exclusive!!🔥Here's a sneak-peek at the upcoming unreleased JioPhone 5G. The phone is expected to release between Diwali and New Year. The expected price is under ₹10k. Not much specs known but possibly a Unisoc 5G or a Dimensity 700 processor. 13+2MP Rear 5MP Front camera. pic.twitter.com/bzRRIH8Sdn — Arpit 'Satya Prakash' Patel (@ArpitNahiMila) June 22, 2023 చదవండి : రిలయన్స్తో ఒప్పందం.. భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ? -
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది!
శాంసంగ్కు చెందిన టాప్ ప్రీమియం స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్54 5 జీపై భారీ తగ్గింపు లభిస్తోంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్లోఇటీవల లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్ ఇపుడు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. మెటోర్ బ్లూ ,స్టార్డస్ట్ సిల్వర్ రెండు రంగులలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల వరకు భద్రతా అప్డేట్స్, అలాగే తాజా ఫీచర్లు, మెరుగైన భద్రత ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది. గెలాక్సీ ఎఫ్54 5జీ స్పెసిఫికేషన్స్ 6.7అంగుళాల sAMOLED+ డిస్ప్లే Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 8జీబీర్యామ్ , 256 జీబీ స్టోరేజ్ ఐకానిక్ గెలాక్సీ సిగ్నేచర్ డిజైన్ 108 ఎంపీ నో షేక్ కెమెరా, 8+2 ఎంపీ లెన్స్ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 6000mAh బ్యాటరీ, 25W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్,ఇతర ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అన్ని ఆఫర్లతో సహా, గెలాక్సీ ఎఫ్54 5జీ ధర రూ. 27,999లకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 20వరకే ఈ ఆఫర్అందుబాటులో ఉంటుంది. -
స్మార్ట్ఫోన్లో బీపీ చూసుకోవచ్చు.. ధర రూ. 10 కంటే తక్కువ
బీపీ రీడింగ్ కోసం క్లినిక్లకు వెళ్లక్కర్లేదు. ఇంట్లో పెద్ద పెద్ద బీపీ మానిటర్లు ఉంచుకోనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వేలికి తొడుక్కునే ఈ చిన్న క్లిప్ ఉంటే చాలు, ఇంచక్కా స్మార్ట్ఫోన్లోనే ఎప్పటికప్పుడు బీపీ రీడింగ్ ఎంతో తేలికగా తెలుసుకోవచ్చు. ‘బీపీ క్లిప్’ పేరుతో కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ‘డిజిటల్ లాబ్’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ పరికరం ద్వారా బీపీ మాత్రమే కాకుండా, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి, గుండె వేగం వంటి వివరాలను కూడా చాలా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన ప్లాస్టిక్ క్లిప్. ఈ క్లిప్ను ఒకవైపు వేలికి తొడుక్కుని, మరోవైపు స్మార్ట్ఫోన్ టచ్స్క్రీన్కు ఆనిస్తే చాలు, స్మార్ట్ఫోన్ స్క్రీన్ మీద అన్ని వివరాలూ కనిపిస్తాయి. ఇది యాప్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దీనిపై అమెరికాలోను, దక్షిణ కొరియాలోను క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే, ఈ బీపీ క్లిప్ వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దీని తయారీ ధర కేవలం ఎనభై సెంట్లు (రూ.5.64) మాత్రమేనని చెబుతున్నారు. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
బాబోయ్ స్మార్ట్ఫోన్ లోబ్యాటరీ! ఇదెక్కడి లొల్లి! మీకు ‘నోమోఫోబియా’ ఉందా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాసేపు ఫోన్ కనపడకపోతే.. ప్రపంచానికి మనం దూరమైపోయినట్టు తల్లడిల్లిపోతుంటాం. అదే.. ఫోన్లో లో–బ్యాటరీ అనే సింబల్ కనిపిస్తే.. చాలామందిలో ఆందోళన పెరిగిపోతుంటుంది. దీనినే నోమోఫోబియో (నో మొబైల్ భయం) అని పిలుస్తారంట. నాలుగేళ్ల క్రితం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చినా.. ఇప్పుడు ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ నోమోఫోబియోతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా, మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్తో కలిసి దేశంలోని నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫోన్ బ్యాటరీ లెవల్స్ పడిపోయినప్పుడు వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై టైర్–1, టైర్–2 నగరాల్లోని 1,500 మంది ఫోన్ యూజర్ల నుంచి వివరాలు సేకరించారు. -LA PELIGROSA NOMOFOBIA @El_Universal_Mx @Univ_Opinion #nomofobia #artificalintelligence #InteligenciaArtificial #conexion #internet #smartphone #socialmedia pic.twitter.com/Bs0UUOtEUh — Angel Boligan (@AngelBoligan) March 5, 2023 బ్యాటరీ అయిపోతే.. ఫోన్ వాడలేం! ఈ అధ్యయనం ప్రకారం.. సెల్ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫోన్ వాడలేం కదా.. ఇప్పుడెలా అనే ఆందోళనతో ఎక్కువ మంది బాధపడుతున్నారట. ఈ క్రమంలో లో–బ్యాటరీ అనే సిగ్నల్ కనిపిస్తే చాలు టెన్షన్తో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. 100 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండే వినియోగదారులు.. ఫోన్ చార్జింగ్ 20 శాతానికి తక్కువగా కనిపిస్తే ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. 100 మందిలో 75 మంది ఫోన్ చార్జింగ్ తగ్గిపోతున్న కొద్దీ స్విచ్ఆఫ్ అయిపోతుందన్న ఆందోళనతో కనిపిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. సర్వే ఇంకేం చెప్పిందంటే.. ► ‘లో బ్యాటరీ’ నోమోఫోబియో భయం 31 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారిలో 77 శాతం వరకూ ఉండగా.. 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలోనూ ఈ భయం గుర్తించినట్టు సర్వేలో వెల్లడించింది. ► 87 శాతం మంది ఫోన్ని చార్జింగ్ పెట్టి మరీ ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. ► ఫోన్ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82% మంది పురుషులు చెప్పగా.. 74 శాతం మంది మహిళా యూజర్లు అదే ఆందోళన వెలిబుచ్చారు. ► 60 శాతం మంది వినియోగదారులైతే ఫోన్ బ్యాటరీలో చార్జింగ్ తక్కువ సమయం వస్తుంటే.. వెంటనే 100లో 60 మంది కొత్త ఫోన్ కొనుగోలు చేసేస్తున్నారు. ► 100లో 46 మంది వినియోగదారులు తమ ఫోన్లో చార్జింగ్ ఉన్నప్పటికీ రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెడుతున్నారు. 0 92 శాతం మంది తమ ఫోన్లో పవర్ సేవింగ్ మోడ్ వినియోగిస్తున్నారు. ► ఇంటికి చేరేలోపు లో–బ్యాటరీ సిగ్నల్ వస్తుందేమోనన్న భయంతో 82 శాతం మంది యూజర్లు సోషల్ మీడియా వినియోగ సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. ► సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్ అని 78 శాతం మంది చెప్పారు. ► ఎంటర్టైన్మెంట్, మూవీస్, సీరియల్స్, టీవీషోస్ చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నామని 42% మంది వినియోగదారులు చెప్పారు. ఆందోళన తగ్గించుకోవాలి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు సర్వే నిర్వహించాం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. గంటలకొద్దీ ఫోన్ని వినియోగించకుండా అవసరం మేరకే ఫోన్లని వాడాలి. స్మార్ట్ ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకానికి అప్పుడప్పుడూ గ్యాప్ ఇస్తూ కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్తో మమేకమవుతూ మానవ సంబంధాలకు విలువనివ్వాలి. ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండటం ద్వారా నోమోఫోబియోని అధిగమించడం సులువు. – దమయంత్ సింగ్ ఖనోరియా, సీఎంవో, ఒప్పో ఇండియా -
అమెజాన్ సేల్.. 5జీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్.. సమ్మర్ ఆఫర్ గురూ!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్లో 5జీ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్, రియల్మీ, శాంసంగ్తో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్లో రూ.1,666 నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ృపొందవచ్చని వెల్లడించింది. అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.10,000 వేల వరకు బోనస్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యూ 11 5జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2ప్రాసెసర్ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్ ఫోన్పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. రెడ్మీ నోట్15 జీ రెడ్మీ నోట్12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్తో పాటు పలు బ్యాంక్లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్మీ 5జీ ఫోన్ 120 హెచ్జెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4జనరేషన్ 1 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. షావోమీ 13 ప్రో షావోమీ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2, 4 ఎన్ఎం ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్ను అమెజాన్, బ్యాంక్లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్జెడ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ప్లస్ 10 ప్రో 5జీ వన్ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ ఫోన్లో 48 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్లు ఉన్నాయి. వన్ ప్లస్ 10 ఆర్ 5జీ వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ సేల్లో ఈ ఫోన్పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది. శాంసంగ్ ఎం14 5జీ శాంసంగ్ ఎం14 5జీ 6.6 ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5ఎన్ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్లు అందించే ఆఫర్లు ఉన్నాయి . రియల్మీ నార్జో 50 5జీ రియల్మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ, పవర్ ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో 3,000 డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు. చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్! -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
నోకియా నుంచి రానున్న కొత్త స్మార్ట్ఫోన్ సీ32 - లాంచ్ ఎప్పుడంటే?
Nokia C32: ఆధునిక యుగంలో లేటెస్ట్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్న వేళ నోకియా సంస్థ దేశీయ మార్కెట్లో 'సీ32' మొబైల్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైపోయింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్ ఈ నెలలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నోకియా సీ32 గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నోకియా నుంచి సీ సిరీస్లో మరో బడ్జెట్ 4జీ ఫోన్ రానుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ మొబైల్ త్వరలోనే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. దీని ధర రూ. 9,999 వరకు ఉండవచ్చని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ బీచ్ పింక్, చార్కోల్, అటమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇదే కలర్ ఆప్షన్స్ మన దేశంలో కూడా లభించనున్నాయి. ఫీచర్స్.. కొత్త నోకియా సీ32 మొబైల్ 6.5 ఇంచెస్ హెచ్డీ రెజల్యూషన్ ఐపిఎస్ LCD డిస్ప్లే కలిగి, గ్లాస్ బ్యాక్ అండ్ మెటాలిక్ ఫినిష్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ ప్రాసెసర్ ఉంటుంది. వర్చువల్గా 3జీబీ వరకు అదనంగా ర్యామ్ పెంచుకోవచ్చు. దీనికి మైక్రోఎస్డీ కార్డు స్లాట్ కూడా ఉంటుంది. (ఇదీ చదవండి: రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ - ప్రత్యేకతలివే!) ఇక కెమెరా ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో రెండు రియర్ కెమెరాలు (50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా & 2 మెగాపిక్సెల్ కెమరా), ఒక 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 10 వాట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అదే సమయంలో ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా లభిస్తుంది. మొత్తం మీద ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. -
జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కేరళలో వరుసగా నమోదవుతున్నమొబైల్ ఫోన్ బ్లాస్ట్ సంఘటనలు ఆందోళన రేపుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్లో 70 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొబైల్ పేలుడు సంభవించడం ఇది మూడోది. ఇటీవల ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం యూజర్లను కలవర పెడుతోంది. (టెక్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు) మనోరమ న్యూస్ వివరాల ప్రకారం పెద్దాయన ఇలియాస్ టీ షాపులో టీ తాగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీ తాగుతుండగానే సడెన్గా షర్ట్ జేబులో ఉన్న ఫోన్కు మంటలు వ్యాపించాయి. చొక్కా మీద మంటలు వ్యాపిస్తున్న షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో వైరల్గా మారింది. ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని,ఇది ఫీచర్ ఫోన్ అని బాధితుడు ఇలియాస్ పోలీసులకు తెలిపాడు. ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు లేవని కూడా వెల్లడించాడు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్నట్టుండి స్మార్ట్ ఫోన్ పేలింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయినట్టు సమాచారం. అలాగే త్రిసూర్లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి అసువులు బాసిన సంగతి తెలిసిందే. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) -
దీర్ఘకాలిక డిజిటల్ ప్రమాదం
కళ్ళ ముందు జరుగుతున్నవి సైతం మరెవరో శాస్త్రీయ సర్వేలతో బలంగా చెబితే మనసుకు ఎక్కుతాయి. ప్రతి చిన్నారి చేతిలో స్మార్ట్ఫోన్ కనిపిస్తున్న ఈ రోజుల్లో వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం అలాంటిదే. ఏ వయసులో పిల్లలకు తొలిసారిగా స్మార్ట్ఫోన్, ట్యాబ్ అలవాటైందనే దాన్ని బట్టి పెద్దయ్యాక వారి మానసిక ఆరోగ్యం ఉంటుందన్న తాజా నిర్ధారణ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. అమెరికాకు చెందిన సేపియన్ ల్యాబ్స్ సంస్థ సరికొత్త ప్రపంచ సర్వే ఈ కఠిన వాస్తవాన్ని కళ్ళ ముందుంచింది. పరిమితి దాటిన డిజిటల్ స్క్రీన్టైమ్, పగ్గాలు లేని సోషల్ మీడియా వినియోగం వల్ల ఒంటరితనం, బాధ, కోపం, చివరకు ఆత్మహత్యను ప్రేరేపిస్తున్న ఆలోచనలు సైతం పెరుగుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు, అధ్యయనాలు తేల్చాయి. తాజా సర్వే సైతం ఈ దీర్ఘకాలిక డిజిటల్ ప్రమాదాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. పిల్లలు కళ్ళప్పగించి చూస్తున్న డిజిటల్ తెరలు కంటికే కాదు... పెద్దయ్యే కొద్దీ మనసుకూ చేటు చేస్తున్నాయని సర్వే చేసి ఈ సంస్థ తేల్చింది. ప్రస్తుతం 18 నుంచి 24 ఏళ్ళ వయసులో ఉన్న 28 వేల మంది పాలుపంచుకున్న ఈ సర్వే ప్రకారం మగవారి కన్నా ఆడవారిపై ఈ దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. చిన్నప్పుడే డిజిటల్ తెరలకు అలవాటు పడ్డవారు ఎదుగుతున్న కొద్దీ విషయ గ్రహణ శక్తి తగ్గి, సామాజిక అలవాట్లు మారుతున్నాయి. ‘ఏజ్ ఆఫ్ ఫస్ట్ స్మార్ట్ఫోన్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అవుట్కమ్స్’ అనే శీర్షికన వెలువడ్డ ఈ అధ్యయన సారాంశం ఒకటే – స్మార్ట్ఫోన్ల వాడకం ఎంత నిదానిస్తే, పిల్లల మానసిక ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. లేదంటే, భ్రమల్లో బతకడం, దుడుకుగా వ్యవహరించడం, ఆత్మహత్య ఆలోచనల లాంటివి హెచ్చుతాయి. దక్షిణా సియా సహా అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇదేనట. అంటే, భారత్కూ ఇదే వర్తిస్తుంది. ఇరవై కోట్ల మందికి పైగా 15 నుంచి 25 ఏళ్ళ మధ్యవారున్న దేశంలో పాఠశాలల నుంచి పని ప్రదేశాల దాకా అన్నిచోట్లా ప్రభావం చూపే అంశమిది. అందుకనే ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం లాంటి అంశాలతో పాటు స్మార్ట్ఫోన్ల వినియోగానికి అనుమతించే వయసుపైనా దృష్టి పెట్టాలని ఓ వాదన. భారత్లో నూటికి 94 ఇళ్ళలో కనీసం ఒక మొబైల్ ఫోన్ ఉందని 2019– 21 నాటి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’. కరోనా అనంతరం ఫోన్లతో పాటు ఇంటర్నెట్ వినియోగమూ పెరిగింది. పిల్లలు డిజిటల్ స్క్రీన్లు చూసే సమయం కరోనా కాలానికి ముందుతో పోలిస్తే, రెట్టింపు దాటింది. 2020 – 2022 మధ్య 12 నుంచి 18 ఏళ్ళ లోపు పిల్లల స్క్రీన్టైమ్ 52 శాతం పెరిగిందని గత నవంబర్లో ఓ నివేదిక తేల్చింది. మానసిక ఆరోగ్య అధ్యయనాలు అవసరమంటున్నది అందుకే. పొరుగునే ఉన్న పాకిస్తాన్లో నూటికి 80 మంది యువత సగటున రోజుకు ఆరు గంటలు డిజిటల్ పరికరాలతో గడుపుతూ, స్క్రీన్కు బానిసవుతోందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ తాజా అధ్యయనం. కరోనా తర్వాత జీవితం క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నా, పెరిగిన ఈ స్క్రీన్టైమ్ భారత్ సహా అన్నిచోట్లా ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఒకసారి ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలను వాడడం అలవాటయ్యాక ఇక ఆ వీక్షణ సమయమే ఆ వ్యక్తి ‘కనీస పరిధి’గా మారుతుంది. కరోనా రెండేళ్ళలో ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితుల్లో పిల్లలకు ఆటాపాటా, ఆన్లైన్ చదువులూ అంతా డిజిటల్ పరికరాలే. అలా జీవితంలో అదనపు భాగమైన స్క్రీన్టైమే చివరకు అత్యవసర భాగమైపోయింది. స్క్రీన్టైమ్కీ, మానసిక ఒత్తిడి, ఆందోళనలకూ లంకె ఉందని నిపుణులు ఎప్పుడో తేల్చారు. మితిమీరిన స్క్రీన్టైమ్తో శారీరకంగా, మానసికంగా అలసిపోయి, పిల్లల మానసిక స్థితి దెబ్బతింటుంది. ఏదైనా అంశంపై ఏకాగ్ర దృష్టి పెట్టి, నేర్చుకొనే సామర్థ్యం తగ్గుతుంది. పడుకొనే ముందు స్క్రీన్లో చూసినవి కలత నిద్రకూ కారణమవుతున్నాయి. భారీ టెక్సంస్థలకూ ఈ డిజిటల్ దుష్ప్రభావాల గురించి తెలుసు. డిజిటల్ తెరలకు అతుక్కు పోయి, సోషల్ మీడియాకు బానిసలైతే ఆరోగ్యం చెడుతుందన్న సంగతి సాక్షాత్తూ ఫేస్బుక్ సొంత రీసెర్చ్లోనే తేలింది. ఇన్స్టాగ్రామ్ వ్యసనంగా మారిన టీనేజ్ అమ్మాయిలు మానసిక ఆరోగ్యం పాలయ్యారు. 2021లోనే ప్రసిద్ధ వాల్స్ట్రీట్ జర్నల్ ఆ సంగతి పేర్కొంది. కానీ, జనంలో చైతన్యం పెంచడానికి ఆ సంస్థలు చేస్తున్నది శూన్యం. లాభాపేక్షే ధ్యేయమైన వ్యాపారాన్ని పణంగా పెట్టి, అవి అలా ముందుకొస్తాయనుకోవడం అమాయకత్వమే. చిన్నప్పుడే ఫోన్లు చేతికివ్వడమంటే, చేతులారా డిజిటల్ మత్తుమందుకు బానిసల్ని చేసినట్టే! మారాం చేస్తున్న పిల్లల్ని ఆపడానికీ, ఆడుకో వడానికీ వీడియో గేమ్స్, స్మార్ట్ఫోన్లు అలవాటు చేసే బుద్ధిహీనతను వదిలించుకోవడం మన చేతిలో పనే! తల్లితండ్రులే మొదటి గురువులు గనక వారు డిజిటల్ వినియోగాన్ని నియంత్రించుకుంటే, అదే పిల్లలకూ మార్గదర్శకమవుతుంది. ఇంట్లో అందరూ కలసి మాట్లాడుకుంటూ, మమతానురాగాలు పంచుకోవడం అనేక సమస్యలకు పరిష్కారం. మారుతున్న కాలంలో డిజిటల్ స్క్రీన్లతో సంపర్కం అనివార్యమని గ్రహిస్తూనే ఎంతసేపు, ఎలాంటివి చూస్తూ, ఎవరితో డిజిటల్ స్నేహాలు చేస్తున్నామ నేది ముఖ్యం. ఈ అంశాల్ని తల్లితండ్రులు, బడిలో గురువులు గమనించి, మంచి మాటలతో పిల్లల్ని వర్చ్యువల్ లోకం నుంచి వాస్తవ ప్రపంచంలోకి మరల్చాలి. సురక్షితంగా, సమర్థంగా సాంకేతికతను వాడడడం ఎలాగో నేర్పాలి. పుస్తక పఠనం, ఆటల లాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్స హించాలి. లేదంటే, ఇప్పటికే బస్సుల్లో, రైళ్ళలో సహా అన్నిచోట్లా పక్కనేం జరుగుతున్నా పట్టకుండా స్మార్ట్ఫోన్లు చూసుకుంటూ వేరే ప్రపంచంలో విహరిస్తున్న మనుషులు నిండిన సమాజం దుర్భరం. -
పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా? పెద్దయ్యాక ఈ సమస్యలు తప్పవు!
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు డిజిటల్ పరిజ్ఞానం పెరుగుతుందని, ఆన్లైన్లో నేర్చుకుంటారని స్మార్ట్ఫోన్లుగానీ, ట్యాబ్లెట్గానీ ఇస్తే.. భవిష్యత్తులో మానసిక సమస్యల బారినపడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత చిన్న వయసులో పిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తే.. పెద్దయ్యాక మానసిక ఇబ్బందులతో బాధపడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ ఇటీవల భారత్ సహా 40 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బాల్యంలోనే స్మార్ట్ఫోన్లను అందుకున్నవారు.. యుక్త వయసుకు వచ్చాక ఆత్మహత్య ఆలోచనలు పెరగడం, ఇతరుల పట్ల దూకుడుగా వ్యవహరించడం, వాస్తవికత నుంచి దూరంగా పలు రకాల భ్రాంతులకు గురికావడం వంటివి ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఈ అధ్యయనం కోసం పలు దేశాల్లో 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మంది నుంచి డేటా సేకరించారు. అందులో మన దేశానికి చెందినవారు 4,000 మంది ఉండటం గమనార్హం. అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ♦ మహిళలకు సంబంధించి.. పెద్దగా ఊహ తెలియని అంటే ఆరేళ్ల వయసులోనే స్మార్ట్ఫోన్ను వినియోగించడం ప్రారంభించిన 74% మంది తీవ్రమైన మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇక 10 ఏళ్ల వయసులో మొదటి స్మార్ట్ఫోన్ అందుకున్నవారిలో 61% మంది.. 15 ఏళ్లకే వాడటం మొదలుపెట్టినవారిలో 52% మంది.. 18 ఏళ్లకు వాడటం ప్రారంభించిన వారిలో 46% మంది మానసిక దుష్ప్రభావాలకు లోనయ్యారు. ♦ పురుషులకు సంబంధించి ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నట్టు తేలింది. ఆరేళ్ల వయసులో స్మార్ట్ఫోన్ను వాడటం మొదలుపెట్టిన వారిలో 42% మంది మానసిక సమస్యలకు గురైతే.. 18 ఏళ్లలో స్మార్ట్ఫోన్ చేతపట్టిన వారిలో ఇది 36 శాతమే. ♦ పిల్లలకు చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్/ట్యాబ్లెట్ చేతికి ఇచ్చి మురిసిపోతున్న తల్లిదండ్రులు.. వారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడేందుకు కారణమవు తున్నారని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఎంత చిన్న వయసులో స్మార్ట్ఫోన్/ట్యాబ్లెట్ ఇస్తే.. వారు యుక్త వయసులోకి వచ్చాక అంత ఎక్కువగా మానసిక సమస్యల బారినపడే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. చిన్నవయసులో స్మార్ట్ఫోన్ ఇవ్వడమంటే చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేసినట్టేనని పేర్కొంది. అంతర్జాతీయ సగటు కంటే మనమే ఎక్కువ.. గత ఏడాది విడుదలైన మెకాఫె గ్లోబల్ కనెక్టెడ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం.. 10–14 ఏళ్ల వయసున్న భారతీయుల్లో స్మార్ట్ఫోన్ వినియో గం 83% ఉండటం గమనార్హం. అంతర్జాతీయ సగటు 76% కంటే ఇది 7% ఎక్కువ. అంటే మన దగ్గర మిగతా అన్ని వయసుల వారికన్నా.. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వారు సగటున రోజుకు 5–8 గంటల పాటు.. అంటే సంవత్సరానికి 2,950 గంటల వరకు ఆన్లైన్లోనే గడుపుతు న్నారని వినియోగ గణాంకాలు చూపిస్తున్నాయి. తోటి వారితో కలవక ప్రవర్తన దెబ్బతింటోంది స్మార్ట్ఫోన్ విప్లవానికి ముందు పిల్లలు చాలా సమయం కుటుంబంతో, స్నేహితులతో గడిపేవారు. ఇప్పుడీ పరిస్థితి లేదు. సమాజంలో తమ భాగస్వామ్యానికి తగినట్టుగా సాధన లేక పోవడం, తోటివారితో కలవకపోవడంతో ప్రవర్తన తీరు సంక్లిష్టంగా మారుతోంది. స్మార్ట్ఫోన్కు చిరు ప్రాయంలోనే అలవాటు పడటం అంటే పెద్దవారిగా ఎక్కువ మానసిక సమస్యలు ఎదుర్కోవడానికి దారితీసుకోవడమే. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, ఇతరుల పట్ల దూకుడు భావాలు, వాస్తవికతకు దూరమైన ఆలోచనలు, సమాజం నుంచి వేరుగా ఉన్నామన్న భావన వంటివి చుట్టు ముట్టే అవకాశాలు ఎక్కువ. యుక్త వయసు వచ్చాకే పూర్తి స్థాయిలో స్మార్ట్ఫోన్ వినియోగానికి అవకాశం ఇవ్వడం మంచిది. – సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, న్యూరో సైంటిస్ట్ తారా త్యాగరాజన్ -
ఒప్పో ఎఫ్ 23 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్, ధర, ఫీచర్లు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్చేసింది. ఒప్పో ఎఫ్23 పేరుతరు 5జీ మొబైల్ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 64 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బోల్డ్ గోల్డ్ , కూల్ బ్లాక్ రెండు రంగులలో మే 18 నుంచి ఒప్పో Oppo స్టోర్, అమెజాన్ , మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్స్ 6.72-అంగుళాల 3D కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 91.4% స్క్రీన్-టు-బాడీ రేషియో క్వాల్కం స్నాప్డ్రాగన్ సాక్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64 ఎంపీ ఏఐ కెమెరా 2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 5000mAh బ్యాటరీ 67W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ ఇది కేవలం 18 నిమిషాల్లో ఫోన్ను 50శాతం వరకు ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్ గరిష్టంగా 6 గంటల ఫోన్ కాల్లను లేదా 2.5 గంటల YouTube వీడియోలు చూడొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే, 39 గంటల ఫోన్ కాల్స్ , 16 గంటల యూట్యూబ్ వీడియో లు చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. -
కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం
న్యూఢిల్లీ: పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసేందుకు, ట్రాక్ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని (సీఈఐఆర్) కేంద్రం ఈ వారంలో ఆవిష్కరించనుంది. సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీడాట్) రూపొందించిన ఈ సిస్టం ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొన్ని టెలికం సర్కిల్స్ లో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. దీన్ని తాజా గా మే 17న దేశవ్యాప్తంగా అమల్లోకి తేనున్నట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. అయి తే, ఇథమిత్థంగా తేదీని చెప్పనప్పటికీ ఈ త్రైమాసికంలో సీఈఐఆర్ను ప్రవేశపెట్టనున్నట్లు సీడాట్ సీఈవో రాజ్కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు మొబైల్ ఫోన్ల దొంగతనాల ఉదంతాలు తగ్గుముఖం పట్టేందుకు, చోరీకి గురైన..పోయిన మొబైల్ ఫోన్ల జాడలు కనుగొనడంలో పోలీసులకు సహాయకరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. అలాగే, మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు వాడే ఐఎంఈఐ నంబర్ల క్లోనింగ్ను అరికట్టడంతో పాటు దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సహాయపడగలదని వివరించారు. సీఈఐఆర్ విధానాన్ని ఉపయోగించి ఇటీవలే కర్ణాటక పోలీసులు 2,500 పైచిలుకు ఫోన్లను రికవర్ చేసి, యజమానులకు అప్పగించారు. పోయిన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసేందుకు యాపిల్ ఫోన్లలో ఇప్పటికే ప్రత్యేక సిస్టం ఉండగా.. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో మాత్రం లేదు. మొబైల్ నంబరుకు అనుసంధానమైన డివైజ్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్ను కనిపెట్టేందుకు సీఈఐఆర్ తోడ్పడుతుంది. -
త్వరలో వన్ ప్లస్3 5జీ ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
5జీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నెలలో వన్ ప్లస్ నార్డ్3 5జీతో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ రిలీజ్ కానుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో విడుదల కానుంది. వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. -
చార్జింగ్లో ఉండగా ఫోన్కాల్
నర్సీపట్నం: నర్సీపట్నం కోమటవీధికి చెందిన కె.లక్ష్మణ్ (25) విద్యుత్ షాక్తో శుక్రవారం మృతి చెందాడు. టౌన్ సీఐ ఎన్.గణేష్ కథనం... మృతుడు లక్ష్మణ్ శుభకార్యాల క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేస్తుంటాడు. ఇంటి దగ్గర ఫోన్ చార్జింగ్లో ఉన్నప్పుడు కాల్ రావడంతో ఫోన్లో మాట్లాడుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురయ్యాడు. వెంటనే బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ -
భారత్లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏదో తెలుసా?
ముంబై: దేశీయంగా ఉత్తమ 5జీ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా మోటరోలా నిల్చింది. టెక్నాలజీ రీసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ టెక్ఆర్క్ రూపొందించిన సర్వే రూ. 10,000–30,000 ధర శ్రేణిలోని ఫోన్ల కేటగిరీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రధానంగా కనెక్టివిటీ, కవరేజీ, సామర్థ్యాలు అనే మూడు కీలక అంశాల ప్రాతిపదికన ఈ సర్వేలో ర్యాంకులను కేటాయించినట్లు మోటరోలా తెలిపింది. ఈ మూడు విభాగాల్లోనూ తమ స్మార్ట్ఫోన్లు మెరుగైన పనితీరు కనపర్చినట్లు వివరించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
భారత్లో 5జీ ఫోన్లను తెగ కొనేస్తున్నారు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు (కంపెనీల నుంచి విక్రయదారులకు రవాణా) జనవరి–మార్చి త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16 శాతం తగ్గి 3.1 కోట్ల యూనిట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను మార్కెట్ పరిశోధనా సంస్థ ఐడీసీ ప్రకటించింది. గడిచిన నాలుగేళ్లలో మొదటి త్రైమాసికంలో అతి తక్కువ షిప్మెంట్ ఇదేనని ఐడీసీ పేర్కొంది. రియల్మీ, షావోమీ ఫోన్ల షిప్మెంట్లో ఎక్కువ క్షీణత నమోదైంది. ఇవి మార్కెట్ వాటాను కూడా నష్టపోయాయి. 2023లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో వృద్ధి ఫ్లాట్గా ఉంటుందని ఐడీసీ అంచనా వేసింది. ఇక స్మార్ట్ఫోన్ల రవాణాలో క్షీణత ఉన్నప్పటికీ.. శామ్సంగ్ 20.1 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 17.7 శాతం వాటాతో వివో ఉంది. ఒప్పో 17.6 శాతం వాటాతో మూడో స్థానంలో ఉంది. అంతేకాదు మార్చి త్రైమాసికంలో షిప్మెంట్ పరంగా వృద్ధిని చూపించిన ఏకైక సంస్థగా ఒప్పో నిలిచింది. షావోమీ షిప్మెంట్ 41.1 శాతం తగ్గి 50 లక్షల యూనిట్లుగా ఉంది. మార్కెట్ వాటా 2022 మొదటి త్రైమాసికంలో 23.4 శాతంగా ఉంటే, అది ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 16.4 శాతానికి తగ్గింది. ఆ తర్వాతి స్థానంలో 9.47 శాతం వాటాతో రియల్మీ ఉంది. 29 లక్షల యూనిట్లను రవాణా చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రియల్మీ మార్కెట్ వాటా 16.4 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వినియోగ డిమాండ్ బలహీనంగా ఉంది. 2022 ద్వితీయ ఆరు నెలల్లో పండుగలకు ముందు విక్రేతలు స్టాక్ పెంచుకోవడంతో, వారి వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయి’’అని ఐడీసీ నివేదిక తెలిపింది. ఇక మొత్తం షిప్మెంట్లలో 5జీ స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగింది. తక్కువ ధరల 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. -
స్మార్ట్గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
తక్కువ ధరలో లభించే 5జి స్మార్ట్ఫోన్స్ - ఇవి చాలా బెస్ట్..!
భారతదేశం అభివృద్ధి మార్గంలో పరుగులు పెడుతున్న వేళ స్మార్ట్ఫోన్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. అయితే స్మార్ట్ఫోన్ ధరలు ఇతర మొబైల్స్ కంటే కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నాయి. కానీ తక్కువ ధరలో కావాలనుకునే వారికోసం మార్కెట్లో లభించే స్మార్ట్ఫోన్స్ వివరాలు ఇక్కడ చూసేద్దాం.. లావా బ్లేజ్ 5జి: లావా కంపెనీకి చెందిన బ్లేజ్ 5జి మొబైల్ ధర మార్కెట్లో రూ. 10,999. ఇది 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ & 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెండు మొబైల్ ఆధునిక డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి 50 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ పొందుతుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వివో టి2ఎక్స్ 5జి: 5జి మొబైల్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో టి2ఎక్స్ 5జి ఒకటి. దీని ధర రూ. 12,999. ఇవి మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి 4 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్. ఈ స్మార్ట్ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.58 ఇంచెస్ HD+ LCD స్క్రీన్, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్స్ మైక్రో సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమరా వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జి: ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇండియన్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో ఒకటి శాంసంగ్. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా విడుదలైన గెలాక్సీ ఎమ్14 5జి తక్కువ ధరలో లభించే ఉత్తమమైన మోడల్. దీని ధర రూ. 14,900. ఈ 5జి మొబైల్ 6.6 ఇంచెస్ HD డిస్ప్లే పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. డిజైన్, ఫీచర్స్ మరింత ఆధునికంగా ఉంటాయి. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) పోకో ఎక్స్5 5జి: పోకో కంపెనీకి చెందిన ఎక్స్5 5జి మొబైల్ మార్కెట్లో లభించే ఉత్తమమైన స్మార్ట్ఫోన్. దీని ధర రూ. 18,999. ఇది 8 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ & 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఫీచర్స్ మాత్రమే కాకుండా కెమెరా ఆప్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. -
ఈ యాప్స్ వినియోగిస్తున్నారా? వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే..
మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్న 19 రకాల ప్రమాదకరమైన యాప్స్ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఆ యాప్స్ మీ ఫోన్లలోని సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మాల్వేర్ ఫాక్స్ నివేదిక ప్రకారం.. గత పదేళ్లలో సైబర్ కేటుగాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్లను ఆసరగా చేసుకొని పలు వైరస్ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం నేరస్తులు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్లను ఉపయోగిస్తున్నారు. మాల్వేర్ను ఎలా పంపిస్తారు పైన పేర్కొన్న మాల్వేర్లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్లలోకి వైరస్ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్ చేసుకొని డార్క్వెబ్లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్ ఫాక్స్ నిర్ధారించిన 19 యాప్స్లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్ మీ ఫోన్లలో ఉంటే డిలీట్ చేయాలని విడుదల చేసిన రిపోర్ట్లో నివేదించింది. హార్లీ ట్రోజన్ - ఫేర్ గేమ్ హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్చర్ రికార్డ్, సేమ్ లాంచర్, లైవ్ వాల్ పేపర్, అమేజింగ్ వాల్ పేపర్, కూల్ ఎమోజీ ఎడిటర్ అండ్ స్టైకర్ జోకర్ స్పైవేర్ - సింపుల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసేంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రజర్ చకర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కలర్ మెసేజ్ ఆటోలీ కాస్ మాల్వేర్- వ్వాల్గ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటీవ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్రేట్ ఎనీటైమ్ వంటి యాప్స్ ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదవండి👉 అద్దె ఇంట్లో ఉంటే ఒరిగేదేమీ లేదు.. సొంతిల్లు ఇప్పుడే కొనేయండహో.. -
విడుదల కానున్న ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ.. ఫోన్ ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్ను లాంచ్ చేయనున్నది. గత ఏడాది ఏప్రిల్లో విడుదల చేసిన ఒప్పో ఎఫ్ 21 ప్రో 5జీ ఫోన్కి కొనసాగింపుగా ఈ ఫోన్ను మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లో 6.4 అంగుళాల హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12-బేస్డ్ కలర్ ఓఎస్ 12 యూఐ వర్షన్తో పని చేస్తుంది. క్వాల్క్మ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓఎస్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్స్తో మిడ్ రేంజ్లో ఉండనుంది. ధర ఎంతంటే పలు నివేదికల ప్రకారం.. ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ ఫోన్ మే 15న భారత్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర రూ.25 వేల నుంచి రూ.26వేల మధ్యలో ఉండనుంది. హ్యాండ్సెట్ స్టోరేజీ, కలర్ వేరియంట్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ఒప్పో ఎఫ్ 23 ప్రో 5జీ, 580 నిట్ల బ్రైట్నెస్, 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంటుందని నివేదిక పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓఎస్తో వచ్చిన చిప్సెట్తో రానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్లు, 40 ఎక్స్ మైక్రోస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం ఫ్రంట్లో 32 మెగా పిక్సెల్ సెన్సార్తో రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే? -
Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ
మొబైల్లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్ఫోన్లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్ ఫోన్ మోడల్ రెడ్ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. (చదవండి: చేతిలో స్మార్ట్ఫోన్..వెన్నెముక డౌన్!) ఫోన్ పేలిన ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. (స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు) కాగా, మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్ అవుతున్న మొబైల్లో మాట్లాతుండగా షాక్ కొట్టింది. ఆయన స్పాట్లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్ చార్జింగ్లో ఉండగా వాడటం. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. -
చేతిలో స్మార్ట్ఫోన్..వెన్నెముక డౌన్!
ఒకప్పుడు రైల్లోనో, బస్సులోనో కూర్చునే చోటు దొరక్క నిలబడాల్సి వచ్చిందని మాత్రమే చింతించేవారు.. మరి ఇప్పుడు మనం మొబైల్ను మిస్ అవుతున్నామని అంతకు మించి చింతిస్తున్న పరిస్థితి. (నిలబడీ మొబైల్ వాడేవాళ్లూ ఎక్కువే ఉన్నారనుకోండి). కూర్చునేందుకు కాస్త చోటు దొరికితే చాలు.. టక్కున ఫోన్లో తలదూర్చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. కూర్చున్నా, బెడ్పై ఉన్నా, బయట ఎక్కడైనా తిరుగుతున్నా, నడుస్తూ వెళుతున్నా మొబైల్ ఫోన్ చేతిలోనే ఉంటోంది. కానీ ఇదే అతిపెద్ద సమస్యను తెచ్చిపెడుతోంది. ఫోన్ చూడటం కోసం మెడ వంచడం, చేతులను ఎక్కువ సేపు పైకెత్తి ఉంచడం, కూర్చున్నా, పడుకున్నా ఫోన్ చూడటం కోసం ఏదో ఓవైపు వంగిపోతుండటం, స్క్రోలింగ్, టైపింగ్ కోసం వేళ్లను విపరీతంగా వినియోగిస్తుండటం వంటి వాటితో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ టెక్ నెక్.. సమస్యతో.. స్మార్ట్ఫోన్తో గంటల కొద్దీ గడిపేవారు, ఇందులో ముఖ్యంగా టీనేజర్లు ‘టెక్ నెక్’, లేదా ‘న్యూ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని తాజా పరిశోధనలు గుర్తించాయి. దీనిద్వారా మెడ, వెన్నునొప్పితోపాటు తలనొప్పి, భుజాల నొప్పులు, చేతుల్లో జలదరింపు, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చాలాసేపు మెడ వంచి చూడటం వల్ల.. మెడలోని స్నాయువులు, కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతోందని ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ (ఐఎస్ఐఈ) మెడికల్ డైరెక్టర్ డాక్టర్ హెచ్ఎస్ ఛబ్రా హెచ్చరించారు. దీర్ఘకాలికంగా, మెడ కండరాలు అపసవ్యంగా సంకోచించడం వల్ల పుర్రెతో అనుసంధానమైన ఉన్నచోట మంట, నొప్పిని కలిగిస్తుందని.. ఈ నొప్పి ఫాసియా ద్వారా మెడ నుంచి తలకు వ్యాపిస్తుందని వివరించారు. భంగిమ సరిగా లేక.. భారంగా.. మొబైల్ను చేతిలో పట్టుకున్నప్పుడు కేవలం వేళ్లు మాత్రమే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. కానీ మన చేతులు, మోచేయి, కండరం, మెడ ఇవన్నీ వినియోగిస్తాం. మొబైల్ను చూస్తున్నప్పుడు మెడను కిందకు వంచుతాం. దీనివల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్’కథనం ప్రకారం.. ఇలా మెడ వంచి చూసే భంగిమ వల్ల వెన్నెముకపై తల బరువు పెరుగుతుంది. ‘‘వాస్తవానికి తల నిటారుగా ఉన్న స్థితిలో దాదాపు 5–8 కిలోల బరువుపడుతుంది. తల వంగుతున్నప్పుడు 15 డిగ్రీల దగ్గర.. మెడపై భారం సుమారు 12 కిలోలు, 30 డిగ్రీల దగ్గర 18.14 కిలోలకు 45 డిగ్రీల దగ్గర 22.23 కిలోలకు 60డిగ్రీల దగ్గర 27.22 కిలోలకు పెరుగుతుంది. ఇలా మెడ అతిగా వంగడంతో వెన్నెముక, సపోర్టింగ్ లిగమెంట్లు, కండరాలపై ప్రభావం పడుతుంది..’’అని ఆ కథనం స్పష్టం చేసింది. కీళ్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఫోన్ మాట్లాడే సమయంలో నిలబడే, కూర్చునే భంగిమలో లోపాలు మసు్క్యలోస్కెలెటల్ సమస్యలకు కారణం అవుతున్నాయని.. గర్భాశయ, థొరాసిక్, నడుము ప్రాంతాలలో వెన్నెముక దెబ్బతినడంతో అనేక మంది ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా కీళ్ల పనితీరు బాగున్నప్పుడు ఒత్తిడికి గురైనా, విశ్రాంతి సమయంలో మరమ్మతు అవుతాయని వివరిస్తున్నారు. కానీ కీళ్లను అసాధారణ భంగిమలో ఎక్కువసేపు ఉంచడం, ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంచడం వల్ల తీవ్రమైన ఒత్తిడి పడి.. అరిగిపోయి, తిరిగి బాగయ్యేందుకు అవకాశం లేనంతగా దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే? ♦ మెడ భుజం ముందుకు సాగినప్పుడు.. ముందువైపు కండరాలు బిగుతుగా మారుతూ, వెనుక వైపు బలహీనపడతాయి. కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు భంగిమపై శ్రద్ధ చూపడం తప్పనిసరి. ♦ శరీర భంగిమ అనేది ఫిట్నెస్కు కీలకం. ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ వంటివాటి మీద ఉండగా.. మొబైల్ ఫోన్ వినియోగించడం వంటివి చేయవద్దు. ♦ నిలబడి ఉన్నప్పుడు, ఎవరికైనా మెసేజీలు పంపుతున్నప్పుడు తల పైకి, భుజాలు కిందకు ఉంచాలి. వీలైనంత వరకు మొబైల్ను కళ్లకు సమాంతరంగా ఉంచడం సరైన భంగిమ. ♦ కురీ్చలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఫోన్ చూస్తూ వంగిపోవడం ఏ విధంగానూ ఆరోగ్యకరం కాదు. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి. ఫోన్ చూడటానికి లేదా టెక్ట్స్ చేయడానికిగానీ మెడ ఎక్కువగా వంచకూడదు. ♦ పడుకున్నప్పుడు ఫోన్ పట్టుకోవడానికి.. మోచేతికి దిండు లేదా మరేదైనా మెత్తని దాన్ని ఆసరాగా తీసుకోవాలి. ♦ భోజనం చేసేప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ వినియోగిస్తూ, డ్రైవ్ చేస్తూ.. ఇలా పలు సందర్భాల్లో ఫోన్ను కూడా ఉపయోగించడమనే మల్టీ టాస్కింగ్ అటు శారీరకంగా, ఇటు మానసికంగా కూడా ఆరోగ్యానికి చేటు తెస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బఫెలో హంప్ కనిపిస్తోంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్, స్పైన్ పెయిన్ వంటివన్నీ మనం నిలబడే, కూర్చునే, శరీరాన్ని ఉంచే తీరులో సమస్య వల్లే తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంపాటు తప్పుడు భంగిమ వల్ల మెడ అలైన్మెంట్ సాగిపోతుంది. దాదాపు 60, 70ఏళ్ల వయసులో సంభవించే మెడలు సాగిపోవడం, ఫ్రోజెన్ షోల్డర్, రౌండెడ్ షోల్డర్ వంటివి 40 ఏళ్ల వయసులోనే వచ్చేస్తున్నాయి. మొత్తంగా సహజమైన శరీర నిర్మాణాన్ని ఈ భంగిమ లోపాలు దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు బాగా తలవంచుకుని పనిచేసే కొందరు బ్యాంకు ఉద్యోగులు వంటివారిలో ఎక్కువగా కనిపించే మెడ వెనకాల సెమీ సర్కిల్ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తోంది. బఫెలో హంప్గా పేర్కొనే దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు తప్పవు. ఏదేమైనా భంగిమ లోపాలు సరిచేసుకుంటూనే ఫోన్ వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవడమే ఉత్తమం. – డాక్టర్ విజయ్ బత్తిన, ఉఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయాలి ఇటీవల భుజాల నొప్పులు, మణికట్టు బాధలు చాలా మందిలో గమనిస్తున్నాం. మొబైల్స్ని ప్రొఫెషనల్గా వాడేవారిలో బొటనవేలు మొద్దు బారడం సహా మరిన్ని సమస్యలు కనపడుతున్నాయి. పడుకునే భంగిమలో పుస్తకం చదివినట్టు ఫోన్ చూడడం సరికాదు. అలాగే వాష్రూమ్స్, టాయిలెట్స్లో కూడా వాడొద్దు. ఎలాపడితే అలా వాడటం వల్ల భుజాల కండరాలు, చేతులు, మణికట్టు ఒత్తిడికి గురవుతాయి. అయితే ఏది సరైన భంగిమ అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. కాబట్టి వీలైనంత వరకూ ఫోన్ వాడేటప్పుడు మధ్యలో విరామాలు తీసుకోవడం, ఫోన్ వినియోగాన్ని పరిమితం చేయడం తప్పనిసరి. – డాక్టర్ శివరాజు, జనరల్ ఫిజీషియన్, కిమ్స్ ఆస్పత్రి -
Video: మహిళ డ్రైవర్ నిర్లక్ష్యం.. మొబైల్ చూస్తూ ట్రైన్ నడపడంతో
ఇటీవల కాలంలో ఫోన్ అదరి జీవితాల్లోఓ భాగం అయిపోయింది. చుట్టూ నలుగురు ఉండాలి అనుకునే వాళ్ళను సైతం ఫోన్ వుంటే చాలు ఇంకేం మద్దు అనేలా మార్చేసింది. మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయామనే ఫీలింగ్.చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ ఇదే బాటపడుతున్నారు. ఖాళీ సమయాల్లోనే కాదు. పనివేళల్లో కూడా ఫోన్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో నిర్లక్ష్యంగా ఫోన్ వాడకం కారణంగా కొన్నిసార్లు ప్రమాదాలకు కొని తెచ్చుకున్నవారు అవుతున్నారు. అచ్చం అలాంటి ఓ భయంకరమైన ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. ఓ మహిళా డ్రైవర్(లోకో పైలట్) రైలు నడుపుతూ ఫోన్ చూస్తూ ఉంది. అందులోని వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తుంది. ఇంతలో ట్రైక్పై మరో రైలు ఆగి ఉంది.మహిళ ఫోన్లో బిజీగా ఉండడంతో ముందు రైలు ఉన్న విషయం గుర్తించలేదు. తీరా దగ్గరికి వచ్చాక గమనించింది. ఎదురుగా రైలు సి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించినా.. అప్పటికే సమీపానికి చేరుకోవడంతో సాధ్యం కాలేదు. రైలు నేరుగా వెళ్లి ఆగి ఉన్న రైలును ఢీకొంది. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా సీట్లలో నుంచి ఎగిరి ముందు పక్కన పడ్డారు. అయితే రైలుకు సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండడంతో ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిసింది. ఈ దృశ్యాలన్నీ రైలులోని సీసీటీవీ ఫుటేజీలోరికార్డయ్యాయి. అయితే రైలులో ఎక్కువ ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. చదవండి: బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్.. driving a train while on a smartphone pic.twitter.com/CZA23skxdv — CCTV IDIOTS (@cctvidiots) April 20, 2023 కాగా ఈఘటన 2019 అక్టోబర్లో రష్యాలో చోటుచేసుకుంది. తాజాగా సీసీటీవీ ఇడియట్స్’ అనే ట్విటర్ పేజ్ షేర్ చేయడంతో మరోసారి వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 10 మిలియన్ల మంది చూశారు. అయితే మహిళా డ్రైవింగ్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందనే విషయం ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని కామెంట్ చేస్తున్నారు. -
వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్స్, ఇవే!
2023 ఏప్రిల్ నెల దాదాపు ముగిసింది. మే నెల ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వచ్చే నెలలో (మే 2023) విడుదల కానున్న కొత్త స్మార్ట్ఫోన్స్ ఏవి? వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7A): 2023 మే నెలలో విడుదలకానున్న లేటెస్ట్ స్మార్ట్ఫోన్స్లో 'గూగుల్ పిక్సెల్ 7ఏ' (Google Pixel 7A) ఒకటి. వచ్చే నెల 10న జరగనున్న గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ వేదికగా ఈ మొబైల్ విడుదలకానున్నట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 6.1 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగిన గూగుల్ పిక్సెల్ 7ఏ 64ఎంపీ సోనీ ఐఎంఎక్స్787 కెమెరా, లేటెస్ట్ టెన్సార్ జీ2 చిప్సెట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్స్ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Google Pixel Fold): గూగుల్ విడుదలచేయనున్న పిక్సెల్ ఫోల్డ్ మొబైల్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మొబైల్ మే 10న లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 5.8 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.69 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే స్క్రీన్స్ కలిగి అద్భుతమైన కెమెరా ఆప్షన్స్ పొందే అవకాశం ఉంది. రియల్మీ 11 ప్రో (Realme 11 Pro): భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాగా కంపెనీ వచ్చే నెలలో 11 ప్రో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మొబైల్ 7000 సిరీస్ చిప్సెట్ కలిగి 108mp ప్రైమరీ, 2mp డెప్త్ కమెరా సెటప్ పొందనుంది. ఖచ్చితమైన లాంచ్ డేట్, ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. (ఇదీ చదవండి: మహీంద్రా థార్ కొనటానికి ఇదే మంచి తరుణం.. భారీ డిస్కౌంట్!) రియల్మీ 11 ప్రో ప్లస్ (Realme 11 Pro Plus): మే 2023లో విడుదలకానున్న మరో రియల్మీ మొబైల్ '11 ప్రో ప్లస్'. ఇది వచ్చే నెలలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు, కానీ ఇది దాని మునుపటి మోడల్స్ కంటే ఉత్తమ డిజైన్, ఫీచర్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
రైల్వే ప్రయాణికులకు IRCTC అలెర్ట్..
-
ఆధునిక ఫీచర్లతో విడుదలకానున్న కొత్త స్మార్ట్ఫోన్ - వివరాలు
భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే శాంసంగ్ కంపెనీ త్వరలో 'గెలాక్సీ ఎం14 5జీ' అనే మొబైల్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ డిజైన్, ఫీచర్స్ వంటి ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న అద్భుతమైన మొబైల్ ఫోన్. ఇది 6000 mAh బ్యాటరీ, 5nm ప్రాసెసర్తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ను 'మూమెంట్స్ మాన్స్టర్' అని పేర్కొంది. ఇది తక్కువ వెలుతురులో కూడా బ్లర్-ఫ్రీ, ఆకర్షణీయమైన ఫోటోలను క్యాప్చర్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ మెరుగైన పనితీరుని అందిస్తుంది. అదే సమయంలో గేమర్లు, మల్టీ టాస్కర్లు వంటి వాటికోసం ఇది చాలా ఖచ్చితమైన, వేగవంతంగా పనిచేస్తుంది. యాప్ల ద్వారా వేగంగా రన్ చేయడమే కాకుండా క్షణాల్లో కంటెంట్ను డౌన్లోడ్ చేయడానికి కూడా ఇది ఎంతగానో సహకరిస్తుంది. (ఇదీ చదవండి: ఈ ఆఫర్తో మహీంద్రా థార్ ఇంటికి తీసుకెళ్లండి.. ఇదే మంచి తరుణం!) గేమ్ ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అదే సమయంలో ముఖ్యమైన సందేశానికి రిప్లే ఇచ్చినప్పుడు, ఈ అద్భుతమైన స్మార్ట్ఫోన్ సామర్థ్యాలు తప్పకుండా మిమ్మల్ని ముగ్దుల్ని చేస్తాయి. కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. -
‘వావ్’ కొత్త ఫోన్ అదిరింది.. ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షోవోమీ ‘షావోమీ13 ఆల్ట్రా’ ఫోన్ను లాంఛ్ చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 12 బిట్ డిస్ప్లే, ఎల్టీపీవో సపోర్ట్, 90 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫీచర్లు షావోమీ13 ఆల్ట్రా 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, Dolby Visionతో హెచ్డీఆర్ 10 ప్లస్ రెజెల్యూషన్, పీ3 కలర్ గమ్ముట్,1920 హెచ్జెడ్ పీడబ్ల్యూఎం డిమ్నింగ్, 2600నిట్స్ పీక్ బ్రైట్ నెస్, హెడ్సెట్ కర్వడ్ ఎడ్జ్, ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ప్రీమియం లెథర్ ఫినిష్ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8జనరేషన్ 2 చిప్ సెట్, 16జీబీ 16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ. వీటితో పాటు వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ . 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఐఓఎస్తో 50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సార్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి. షావోమీ13 ఆల్ట్రా ఫోన్ ధరలు షావోమీ13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.గా ఉంది. చదవండి👉 షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు! -
మహిళలు అమితంగా ఇష్టపడే యాప్స్ ఏంటో తెలుసా?
మొబైల్ వినియోగ పోకడలు, భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ఆలోచనలను విశ్లేషిస్తూ 2022- 2023 డేటా ఆధారంగా భారతీయ మహిళలు, పురుషుల అభిరుచులపై ప్రముఖ బొబ్బల్ ఏఐ (Bobble AI) అనే కీ బోర్డ్ సంస్థ నివేదికను విడుదల చేసింది. అందులో మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఆహారం, మెసేజింగ్ యాప్స్ను అమితంగా ఇష్టపడతున్నారని, మగవారు ఫోన్లలో గేమింగ్ యాప్స్ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 85 మిలియన్ల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల డేటా ఆధారంగా బొబ్బల్ ఏఐ ఈ సర్వేను వెలుగులోకి తెచ్చింది. ఇక ఆ రిపోర్ట్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్లపై వెచ్చించే సమయం 50 శాతం పెరిగింది. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కేవలం 11.3శాతమే జరుగుతున్నాయని హైలెట్ చేసింది. మహిళలు, పురుషులు ఆన్లైన్లో గేమ్స్ ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారని, వారిలో 6.1శాతం మంది మహిళలు గేమ్స్ ఆడడంలో యాక్టీవ్గా ఉన్నట్లు తెలిపింది. ఇక వివిధ యాప్స్ వినియోగంలోనూ మహిళలు వెనకబడినట్లు తెలుస్తోంది. ఏయే యాప్స్ను ఎంత శాతం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే.. వాటిలో కమ్యూనికేషన్ అప్లికేషన్లు (apps) 23.3శాతం, వీడియో అప్లికేషన్లు 21.7 శాతం, ఫుడ్ అప్లికేషన్లు 23.5 శాతం ఉన్నాయి. మగవారితో పోలిస్తే పేమెంట్ అప్లికేషన్లు 11.3శాతం, గేమింగ్ అప్లికేషన్లు 6.1 శాతం తక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా, మొబైల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ‘గోప్యత-అనుకూల’ పద్ధతిలో 85 మిలియన్ల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను కవర్ చేసే ఫస్ట్ పార్టీ డేటాను ఉపయోగించి పరిశోధన చేసినట్లు బొబ్బల్ ఏఐ నివేదిక పేర్కొంది. చదవండి👉 ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు! -
ఆధార్ కార్డ్ మరో బిగ్ అప్డేట్
-
అదిరిపోయే ఫీచర్లతో లావా బ్లేజ్: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా!
సాక్షి, ముంబై: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ లావా మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లావా బ్లేజ్-2ను విడుదల చేసింది. ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్ , పంచ్-హోల్ డిస్ప్లే,డ్యూయల్ కెమెరా , 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో బ్లేజ్ 2 స్మార్ట్ఫోన్ను రూ.10,999 వద్ద లాంచ్ చేసింది. అయితే పరిచయ ఆఫర్గా కేవలం రూ.8,999కే అందించనుంది. లావా బ్లేజ్-2 స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో ఈ నెల 18 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. (Billionaire Barber Story: ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!) టైప్ C ఛార్జింగ్ పోర్ట్తో పాటు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13కి అప్గ్రేడ్ చేయబడుతుందని , రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. (మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ దెబ్బ! మస్క్కు భారీ ఝలక్!) లావా బ్లేజ్-2 స్పెసిఫికేషన్స్ 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ప్లే విత్ పంచ్ హోల్ డిజైన్ యూనిసోన్ టీ616 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 6జీబీ రామ్,128 జీబీ స్టోరేజీ 13 మెగా పిక్సెల్స్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీకెమెరా 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ భారత్లో లావా బ్లేజ్-2 ధర రూ.8,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ బ్లాక్, గ్లాస్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 18 మధ్యాహ్నం నుంచి సేల్స్ ప్రారంభం. -
భారత్లో తయారీ.. విదేశాలకు రూ.85వేల కోట్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు!
దేశీయంగా తయారీ, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్- PLI) పథకం మంచి సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. 14 రంగాలకు వర్తిస్తోన్న ఈ స్కీమ్లో భాగమైన స్మార్ట్ ఫోన్ రంగం గణనీయమైన ఫలితాలు సాధించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి (2021-2022) భారత్లో తయారు చేసిన సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (icea) ప్రకటించింది. ఎక్స్పోర్ట్ చేసిన స్మార్ట్ ఫోన్లు గత ఆర్ధిక సంవత్సరం కంటే ఎక్కువగా రెట్టింపు అయ్యాయని సూచించింది. ఫోన్లను యూఏఈ, అమెరికా, నెథర్లాండ్స్, యూకే, ఇటలీ దేశాలకు పంపించినట్లు ఐసీఈఏ డేటా తెలిపింది. ఈ సందర్భంగా ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మోహింద్రో మాట్లాడుతూ.. దేశీయంగా 40 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్ల తయారీని అధిగమించినట్లు చెప్పారు. 25 శాతం అంటే 10 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను విదేశాలకు తరలించినట్లు చెప్పారు. ఇక ఉత్పత్తి చేసిన 97 శాతం ఫోన్లను దేశీయంగా అమ్మకాలు జరిగాయని.. తద్వారా భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఫోన్ల తయారీ దేశంగా అవతరించిందని అన్నారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత్ ఈ ఏడాది ముగిసే సమయానికి రూ.1లక్షల కోట్ల విలువైన ఫోన్లను విదేశాలకు ఎగుమతి చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. పలు నివేదికల ప్రకారం..చైనాలో సప్లయ్ చైన్ సమస్యల కారణంగా కంటే భారత్, వియాత్నం దేశాల్లో స్మార్ట్ ఫోన్ తయారీ లబ్ధిదారులుగా అవతరించినట్లు అంచనా. చదవండి👉 భారత్లో ఐఫోన్ల తయారీ.. యాపిల్ అంచనాలు తలకిందులవుతున్నాయా? -
గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)
సాక్షి,ముంబై: గుడ్ ఫ్రైడే రోజున ఫ్లిప్కార్ట్ సేల్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ (1) పై భారీ ఆఫర్ లభిస్తోంది. యూకే ఆధారిత కార్ల్ పీ నేతృత్వంలోని వినియోగదారు టెక్ కంపెనీ త్వరలో ఫోన్ (2)ని లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున నథింగ్ ఫోన్ డిస్కౌంట్ ధరలో లభించనుంది. సేల్స్లో దూసుకుపోతున్న నథింగ్ ఫోన్ (1) గుడ్ ఫ్రైడే సందర్భంగా ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ. 1,500కే అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్లో గుడ్ ఫ్రైడే రోజున రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 29,999కి లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. దీంతో స్మార్ట్ఫోన్ ధర రూ.28,500కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్ఫోన్కు బదులుగా ఫ్లిప్కార్ట్ రూ. 27,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా నథింగ్ ఫోన్ (1) ధరను రూ. 1,500కి దిగొచ్చింది. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) నథింగ్ ఫోన్ (1) లాంచింగ్ ప్రైస్. రూ. 32,999 నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ 120Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా సెటప్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
ఈ నెలలో విడుదల కానున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు, ఇవే!
భారతదేశం కేవలం కార్లు, బైకులకు మాత్రమే కాకుండా.. స్మార్ట్ఫోన్లకు కూడా అతి పెద్ద మార్కెట్గా అవతరించింది. కావున ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో ఆధునిక మొబైల్స్ విడుదలవుతూనే ఉన్నాయి. శాంసంగ్, ఆపిల్, వన్ ప్లస్, ఒప్పో వంటి కంపెనీ ప్రతి సంవత్సరం అనేక కొత్త మోడల్స్ పరిచయం చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ నెలలో (2023 ఏప్రిల్) ఇండియన్ మార్కెట్లో విడుదలకానున్న కొత్త మొబైల్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. పోకో ఎఫ్5 (Poco F5): చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు పోకో ఏప్రిల్ 06న తన 'ఎఫ్5' మొబైల్ లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్ కలిగి 8GB RAM & 128 GB ఇంటర్నల్ మెమరీ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,500 mAh వరకు ఉంటుంది. దీని ధర రూ. 5,000 వరకు ఉండవచ్చు. వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite): ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్స్లో ఒకటి వన్ ప్లస్. ఇప్పటికే అనేక కొత్త మోడల్స్ విడుదల చేసిన ఈ కంపెనీ ఏప్రిల్ 04న 'నార్డ్ సిఈ 3 లైట్' విడుదల చేయనుంది. ఈ మొబైల్ 6.72 ఇంచెస్ LCD స్క్రీన్ పొందుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh కాగా.. రామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB/128GB వరకు ఉన్నాయి. ఇది సుమారు రూ. 25,000 వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆసుస్ ఆర్ఓజి ఫోన్ 7 (Asus ROG Phone 7): ఆసుస్ కంపెనీ ఈనెల 13న దేశీయ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ఫోన్ ఆర్ఓజి ఫోన్ 7 విడుదలచేయనుంది. ఇది 6.85 ఇంచెస్ AMOLED స్క్రీన్ కలిగి 16 GB రామ్ 512 GB ఇంటర్నల్ మెమొరీ పొందుతుంది. అయితే ఇందులో 6,000 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీని ధర సుమారు రూ. 63,000 వరకు ఉండవచ్చని అంచనా. (ఇదీ చదవండి: అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..) వివో ఎక్స్90 సిరీస్ (Vivo X90 Series): 2023 ఏప్రిల్ నెలలో వివో కంపెనీ కూడా కొత్త 'ఎక్స్90 సిరీస్' విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదాని మీద ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ ఇది 6.78 ఇంచెస్ AMOLED స్క్రీన్, 4,810 mAh బ్యాటరీ, 12 జిబి - 16 జిబి రామ్, 512 GB ఇంటర్నల్ కెపాసిటీ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందనుంది. దీని ప్రారంభ ధర రూ. 42,500 వరకు ఉండవచ్చు. -
స్మార్ట్ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్!
స్మార్ట్ఫోన్ కొనుగోలు దారులకు బంపరాఫర్. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన వన్ప్లస్ 10ఆర్ ధరల్ని భారీగా తగ్గించింది. గత ఏడాది విడుదలైన వన్ప్లస్ 10 ఆర్ ప్రారంభ ధర రూ. 38,999 గా ఉంది. అయితే తాజాగా ఆఫోన్ ధరల్ని భారీ తగ్గించడంతో.. కొనుగోలు దారులు రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చని వన్ ప్లస్ ప్రతినిధులు తెలిపారు. వన్ప్లస్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 150డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్, 80డబ్ల్యూ ఛార్జర్ సప్టోర్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 50 ఎంపీ రిసొల్యూషన్తో సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్లు, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్లు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ చిప్ సెట్, 12జీబీ నుంచి 256 జీబీ వరకు ఇంట్రర్నల్ స్టోరేజ్, ఆక్సీజెన్ ఓఎస్ 12.1 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 వంటి ఫీచర్లు ఉన్నాయి. -
ఫ్లిప్కార్ట్లో మరో అదిరిపోయే సేల్!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో ప్రత్యేక సేల్తో ముందుకు వచ్చింది. మార్చి 24 నుంచి మార్చి 30 వరకు జరిగే ఈ సేల్లో అన్నీ రకాల స్మార్ట్ పోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్లో బ్యాంకులు సైతం కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ 13ను రూ. 61,999కే విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.69,900గా ఉంది. అదే వేరియంట్లో ఐఫోన్ 14పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ.2,000 తగ్గింపు ఆఫర్ ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 256జీబీ స్టోరేజ్ రూ. 79,999 అమ్మకానికి ఉండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డ్ని ఉపయోగించి రూ. 74,999ని పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సమయంలో 5జీ రెడ్మీ నోట్ 12 ప్రో రూ. 24,999 అమ్ముతుంది. ఇదే ఫోన్పై హెచ్డీఎఫ్సీ కార్డులను వినియోగిస్తే రూ. 2,000 తగ్గింపు ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో వివో వి27 అసలు ధర రూ. 32,999 వద్ద ఉండగా..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ. 2,500 తగ్గింపు ఆఫర్తో రూ. 30,499 కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లపై సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. -
రూ. 32 వేల బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ కేవలం రూ. 1,999కే
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్(1) ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో నమ్మశక్యం కాని ధరకు అందుబాటులో ఉంది.కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ స్టార్టప్ నుండి వచ్చిన తొలి స్మార్ట్ఫోన్ ఇది. నథింగ్ ఇయర్ (1) సక్సెస్ తరువాత దీనికి కొనసాగింపుగా త్వరలోనే నథింగ్ ఇయర్ (2) గ్లోబల్ లాంచ్ చేయనుంది. ఈ లాంచింగ్కు ముందే నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. రూ. 32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (1) ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో కేవలం రూ. 1,999కి అందుబాటులో ఉంది. (టాటా, మారుతి, హ్యుందాయ్: కారు ఏదైనా ఆఫర్మాత్రం భారీగానే!) ఫ్లిప్కార్ట్లో 8వేల తగ్గింపుతో రూ. 29,999 వద్ద నథింగ్ ఫోన్ (1) లిస్ట్ అయింది. అయితే దీనికి అదనంగా, కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం తక్షణ తగ్గింపు(రూ. 1000 వరకు). అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్గా రూ. 27 వేల దాకా తగ్గింపుతో కలిపి నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్కార్ట్లో రూ. 1,999కే లభించనుంది. (వచ్చే ఏడాది ఫార్మా రంగం కళకళ!) నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55 అంగుళాల OLED డిస్ప్లే Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 50+50 డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
మీరు ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోయిందా? ఇలా కనిపెట్టేయొచ్చు!
ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పోతే. ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా అందులో ఉండే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ నెంబర్లు వేరే వాళ్ల చేతికి చిక్కితే అంతే సంగతులు. అందుకే ఫోన్ పోయిందని తెగ హైరానా పడిపోతుంటాం. గతంలో ఫోన్ పోయిందంటే.. కొత్త ఫోన్ కొనుక్కోవడం తప్పా..పోయిన ఫోన్ను తిరిగి దక్కించుకునే అవకాశం ఉండేది కాదు. ఇదిగో ఈ తరహా సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర టెలికాం విభాగం (dot), సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (ceir) పేరుతో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల సాయంతో పొగొట్టుకున్న ఫోన్ను వెతికి పట్టుకోవచ్చు. తొలిసారిగా 2019 సెప్టెంబర్ నెలలో కేంద్రం వినియోగంలోకి తెచ్చింది. ముందుగా కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా - నగర్ హవేలీ,గోవా, మహరాష్ట్రలో,అదే ఏడాది డిసెంబర్ నెలలో ఢిల్లీలో లాంచ్ చేసింది. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! ఐఎంఈఐ నెంబర్ ఉందా? కేంద్రం నిర్వహణలో సీఈఐఆర్ వెబ్ సైట్, యాప్స్ పనిచేస్తాయి. వీటిద్వారా కాణీ ఖర్చు లేకుండా ఐఎంఈఐ నెంబర్ సాయంతో మీ ఫోన్ను దక్కించుకోవచ్చు. *#06# డయల్ చేస్తే ఐఎంఈఐ నెంబర్ను పొందవచ్చు. పొగొట్టుకున్న ఫోన్ను తిరిగి ఎలా పొందాలి? ►సీఈఐఆర్ డేటా బేస్లో అన్నీ సంస్థల మొబైల్ ఆపరేటర్లు ఐఎంఈఐ డేటా ఉంటుంది. ఇందుకోసం కేంద్రం మొబైల్ బ్రాండ్స్, నెట్ వర్క్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తుంది. ►సీఈఐఆర్ IMEI నంబర్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేస్తుంది. బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. సిమ్ కార్డ్ మార్చినా ఆ ఫోన్ పనిచేయదు. ►ఒక వేళ ఫోన్ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించుకోవాలి. ►తర్వాత సీఈఐఆర్ పోర్టల్ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అదే ఆప్షన్లో డివైజ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్లో మీ ఫోన్కు సంబంధించిన మొత్తం వివరాలతో పాటు మీరు మీ ఫోన్ను చివరి సారిగా పోగొట్టుకున్న సమయం వివరాలను ఎంటర్ చేయాలి. అనంతరం ఎఫ్ఐఆర్ ఫోటోను అప్లోడ్ చేయాలి. ►యూజర్ సమర్పించిన వివరాల ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్ను సీఈఐఆర్ బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాక్ చేసిన ఫోన్లో సిమ్ మార్చి వేరే సిమ్ వేసినా, వినియోగించినా ఐఎంఈఐ సాయంతో ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టేస్తుంది. ►ఫోన్ దొరికిన వెంటనే ఆ ఫోన్ను అన్బ్లాక్ చేసేందుకు సీఈఐఆర్ పోర్టల్లో అన్ బ్లాక్ ఫౌండ్ మొబైల్పై క్లిక్ చేసి రిక్వెస్ట్ ఐడీ, ఫోన్ నంబర్ వివరాలు సమర్పిస్తే ఫోన్ను వాడుకోవచ్చు. చదవండి👉 టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే! -
మీ మొబైల్ భద్రమా? ఉన్నట్టుండి బ్యాటరీ డౌన్, తెలియకుండానే డాటా ఖతం!
రోజురోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మనకు కావాల్సిన సమాచారం మొత్తం మన చేతిలో (స్మార్ట్ఫోన్లో) ఉంచుకుంటున్నాము. అయితే కొంతమంది మన సమాచారాన్ని తెలుసుకోవడానికి హ్యాక్ చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది. మన ఫోన్లో మన ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా చూస్తున్నారా?.. లేదా.. అని తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. తెలియని అప్లికేషన్లు (Unfamiliar Applications): ఆధునిక కాలంలో స్పైవేర్ ఇతర వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్యారంటల్ కంట్రోల్ యాప్స్ ఉపయోగించుకుంటారు. ఈ యాప్లలో ఒకదానిని ఉపయోగించి ఎవరైనా మీ ఫోన్లో స్పై చేస్తుంటే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి డౌన్లోడ్ చేసినట్లు మీకు గుర్తులేని ఏవైనా తెలియని అప్లికేషన్ల కోసం మీ ఫోన్లో సర్చ్ చేయవచ్చు. దీనికోసం నెట్ నానీ, కాస్పెర్స్కీ సేఫ్ కిడ్స్, నార్టన్ ఫ్యామిలీ యాప్స్ ఉపయోగపడతాయి. పర్ఫామెన్స్లో సమస్యలు: స్పైవేర్ మీ డేటాను ఎప్పటికప్పుడు సేకరించుకుంటుంది. అయితే మునుపటికంటే మీ మొబైల్ పర్ఫామెన్స్ విషయంలో తగ్గితే వెంటనే దానికి కారణాలు తెలుసుకోండి. స్మార్ట్ఫోన్ను ఎలా వేగవంతం చేయాలనే దానిపై అరా తీయండి, ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అని శోధించండి. బ్యాటరీ త్వరగా ఖాళీ అవ్వడం: స్పైవేర్ నిరంతరం పని చేస్తుంటే, అది మీ బ్యాటరీని సాధారణం కంటే వేగంగా ఖాళీ చేస్తుంది. అయితే అన్ని బ్యాటరీలు క్రమంగా క్షీణిస్తాయి, అలా కాకుండా కారణం లేకుండా త్వరగా క్షీణించడం ప్రారంభమైతే దానికి కారణం తెలుసుకోండి. ముందుగా మీరు ఏదైనా కొత్త అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసారా? లేదా అప్డేట్ చేసారా చూడండి. కొన్ని యాప్స్ కూడా బ్యాటరీ త్వరలో ఖాళీ అవ్వడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వేడెక్కడం: మీ మొబైల్ చాలా వేగంగా వేడెక్కుతుంటే ఎవరో మీ మొబైల్ హ్యాక్ చేస్తున్నారని అనుమానించండి. తక్కువగా ఉపయోగించనప్పుడు లేదా అసలే ఉపయోగించకుండా ఉన్నప్పుడు వేడెక్కితుంటే తప్పకుండా దానికి కారణాలు తెలుసుకోండి. ఎక్కువ డేటా వినియోగం: మీ మొబైల్ ఫోన్లో అనుకోకుండా ఎక్కువ డేటా ఖాళీ అవుతుంటే స్పైవేర్ రన్ అవుతుందనే సంకేతం కావచ్చు. ఎందుకంటే నేరస్థుడు సమాచారాన్ని పొందటానికి యాప్ డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది, కాబట్టి డేటా వినియోగంలో పెరుగుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు: నిజానికి మన ఫోన్ మనకు కావలసినప్పుడు షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదా రీస్టార్ట్ చేసుకోవచ్చు. అయితే హ్యాకర్లు మన మొబైల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆఫ్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. నేరస్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా మీ ఫోన్ ఉపయోగించాలి కాబట్టి యాక్సెస్ చేయడం జరుగుతుంది. సర్చ్ బ్రౌజర్ హిస్టరీ: మీ మొబైల్ ఫోన్లో ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీ చెక్ చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా అందులో ఫోన్ స్పై సాఫ్ట్వేర్ గురించి ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్పైవేర్ని డౌన్లోడ్ చేయడానికి మీ బ్రౌజర్ని ఎవరైనా ఉపయోగించే అవకాశం ఉంది. బహుశా అలా జరిగినప్పుడు హిస్టరీలో మనకు కనపడుతుంది. మొబైల్ ఫోన్లో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. స్పైవేర్ రిమూవ్ టూల్ ఉపయోగించండి: మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి స్పైవేర్ను తీసివేయడానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఉపయోగించండి. ఇది స్పైవేర్ (మరియు ఇతర రకాల మాల్వేర్) కోసం మీ పరికరాన్ని స్కాన్ చేస్తుంది, అదే సమయంలో దానిని పూర్తిగా తీసివేస్తుంది. అయితే దీని కోసం భద్రత కలిగిన సాఫ్ట్వేర్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి: మొబైల్ ఫోన్ హ్యాక్ నుంచి తప్పించుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయడం మంచిది. దీని ద్వారా పూర్తిగా తీసివేసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కావున దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపయోగించాలని సూచిస్తున్నాము. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి: ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల స్పైవేర్ పూర్తిగా తొలగించబడుతుంది. ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఫోన్లో ఉన్న అన్ని అంశాలు పోతాయి. మీరు ఏదైనా ఫోన్ తీసుకుంటే దానిని తప్పకుండా రీసెట్ చేయాలి. అంతే కాకుండా ఎప్పుడూ అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేయకుండా ఉండాలి. -
అదిరిపోయే షావోమీ ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఫుల్ చార్జ్తో 1000 కి.మీ మైలేజ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. షావోమీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదలతో పాటు ఉత్పత్తి పెంచుతున్నట్లు తెలిపింది. ఇటీవల చైనా వార్షిక పార్లమెంటరీ సమావేశంలో షావోమీ సీఈవో లీ జున్ ఈవీ కార్ల తయారీ, పెట్టుబడుల గురించి మాట్లాడారు. అయితే షావోమీ తయారు చేసే కారు ఎలా ఉంటుందో చెప్పేలా షావోమీ కార్ల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. కానీ ధరపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ ఆ ఫోటోల్ని బట్టి చూస్తుంటే కారు మెక్లారెన్ 720ఎస్ మాదిరిగానే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు పెద్ద విండ్షీల్డ్, మంచి సైడ్ గ్లాస్ ఏరియా, పనోరమిక్ సన్రూఫ్, చక్రాల మధ్యలో షావోమీ లోగో, విండ్షీల్డ్ పైన కూర్చునే సెన్సార్ కూడా ఉంది. షావోమీ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కి.మీ వరకు ప్రయాణించగలదని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఈవీ దాదాపు 260 కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల 800 వోల్ట్ సిస్టమ్తో వస్తుంది. ఈ కారు గురించి తెలుసుకునేందుకు వాహనదారులు మక్కువ చూపుతున్నారు. -
నంబర్ ఇక్కడ..వాట్సాప్ అక్కడ!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ డీపీలతో టోపీ వేస్తున్న సైబర్ నేరగాళ్లు కొత్త పంథా అనుసరిస్తున్నారు. బేసిక్ ఫోన్లలో ఉన్న సెల్ నంబర్లను గుర్తించి వాటికి సంబంధించిన వాట్సాప్ను తమ స్మార్ట్ఫోన్లలో యాక్టివేట్ చేసుకుంటున్నారు. వైఫై ద్వారా కథ నడుపుతూ డబ్బు, గిఫ్ట్ వోచర్ల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ‘డీపీ ఫ్రాడ్స్’పై అధ్యయనం చేసిన హైదరాబాద్ సిటీ సైబర్క్రైమ్ పోలీసులు.. రెండు రకాలుగా ఇతరుల వాట్సాప్లు సైబర్ నేరగాళ్ల వద్దకు వెళ్తున్నాయని గుర్తించారు. కొన్నాళ్లకు వినియోగించడం మానేసి.. ఒకరి పేరుతో ఉన్న సెల్ నంబర్కు సంబంధించిన వాట్సాప్ను వినియోగించుకోవడానికి సైబర్ నేరగాళ్లు వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.నకిలీ పత్రాలతో గ్రామీణ ప్రాంతాల్లో సిమ్కార్డులు కొని వాటి ద్వారా వాట్సాప్ను యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఆపై కొన్నిరోజులకు ఆ నంబర్ను నేరుగా వాడటం మానేసి కేవలం వైఫై ద్వారానే వాట్సాప్ వాడుతున్నారు. దీంతో నిర్ణీతకాలం తర్వాత సర్విస్ ప్రొవైడర్లు ఆ నంబర్ను మరొకరికి కేటాయిస్తున్నారు. ఇలా తీసుకున్న వాళ్లు ఈ నంబర్తో వాట్సాప్ యాక్టివేట్ చేసుకోకున్నా లేదా బేసిక్ ఫోన్లు వాడుతున్నా వాట్సాప్ నంబర్ పాత యజమాని వద్దే ఉండిపోతోంది. సాధారణ ఫోన్లలో ఉన్నవి గుర్తిస్తూ.. సైబర్ నేరాల కోసం మరొకరి వాట్సాప్ను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి సైబర్ నేరగాళ్లు మరో విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓ సిరీస్లోని నంబర్లను తమ స్మార్ట్ఫోన్లలో వేర్వేరు పేర్లతో సేవ్ చేసుకొని వాటిల్లో వాట్సాప్ యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకుంటున్నారు. యాక్టివేట్ కాని వాటిని వైఫై ద్వారా వాడే తమ స్మార్ట్ఫోన్లలో వాడటానికి ఓటీపీ అవసరం. దీంతో సేల్స్, కాల్సెంటర్ల పేర్లతో వారికి ఫోన్లుచేసి ఓటీపీ తెలుసుకుంటున్నారు. ఇది ఎంటర్ చేయడంతోనే అవతలి వారి నంబర్తో వాట్సాప్ వీరి ఫోన్లలో యాక్టివేట్ అవుతోంది. విషయం ఫోన్నంబర్ వాడే వారికి తెలియట్లేదు. కష్టసాధ్యంగా దర్యాప్తు.. ఈ వాట్సాప్లను వాడి ప్రముఖులు, అధికారుల ఫొటోలు డీపీలుగా పెడుతున్న సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ ద్వారా వారి సంబందీకుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. వాళ్లకు వారి బాస్లు, ప్రముఖుల మాదిరిగా వాట్సాప్ సందేశాలు పంపి డబ్బు, గిఫ్ట్ వోచర్లు డిమాండ్ చేసి కాజేస్తున్నారు. దీనిపై కేసులు నమోదవుతున్నా వాట్సాప్కు సంబంధించిన ఫోన్ నంబరే దర్యాప్తునకు ఆధారంగా మారుతోంది. అలా ముందుకు వెళుతున్న అధికారులకు దాని యజమానుల ఆచూకీ లభిస్తోంది తప్ప వాట్సాప్ యాక్టివేట్ చేసుకొని వినియోగిస్తున్న వారు పట్టుబడట్లేదు. వారిని కనిపెట్టడం కూడా కష్టంగా మారడంతో దర్యాప్తులు జటిలంగా మారుతున్నాయి. ఆన్లైన్లో నగదు కాజేసిన కేసుల్లో నిందితులు దొరకడం అరుదు కాగా.. గిఫ్ట్ వోచర్ల రూపంలో కొల్లగొట్టిన వాళ్లు చిక్కడం దుర్లభమవుతోంది. నేరుగా సంప్రదించడం ఉత్తమం.. వాట్సాప్ మోసాల బారినపడకుండా ప్రతి ఒక్కరూ కనీ స జాగ్రత్తలు తీసుకోవాలి. సందేశం వచ్చిన వెంటనే కేవలం డీపీ ఆధారంగా కాకుండా ఫోన్నంబర్ చూశా కే ఎదుటి వ్యక్తి ఎవరన్నది ఖరారు చేసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేసి లేదా నేరుగా సంప్రదించాకే లావాదేవీలు చేయాలి. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ -
Samsung Galaxy S22 5G: భారీ ఆఫర్, ఇక హోలీనే!
సాక్షి,ముంబై: సౌత్కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీఎస్22 5జీ స్మార్ట్ఫోన్పై భారీఆఫర్ అందిస్తోంది. 33 శాతం తగ్గింపుతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ అసలు ధర రూ.85,999గ ఉండగా, తాజా ఆఫర్లో అమెజాన్లో కేవలం రూ.57,998 కి కొనుగోలు చేయవచ్చు. రూ.28వేల తగ్గింపుతోపాటు, ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది లాంచ్ చేసిన ఎస్ 22 సిరీస్లో ఇదే ఎఫర్డ్బుల్ ప్రైస్ డివైస్గా పేరొందింది. గెలాక్సీ ఎస్ 22 5జీ ఫీచర్లు 6.1 అంగుళాల డైనమిక్ AMOLED డిస్ప్లే 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 8 Gen 1 octa-core ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 50+12+10 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరా 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3700 mAh బ్యాటరీ -
చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే?
రెస్టారెంట్ కిచెన్లలో సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధిస్తారు యజమానులు. వేడి వాతావరణం, గ్యాస్ లీకైతే పేలుడు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ముందుజాగ్రత్తగా ఫోన్లు తీసుకురావొద్దని చెబుతారు. అయితే ఓ మహిళ మాత్రం ఈ రూల్ను పక్కనపెట్టింది. మొబైల్ ఫోన్ను రెస్టారెంట్ కిచెన్లోకి తీసుకెళ్లింది. ఫ్రై చేస్తున్న సమయంలో ఫోన్లో ఏదో నోటిఫికేషన్ రావడంతో ఆమె దృష్టిమళ్లింది. వెంటనే జేబులోనుంచి ఫోన్ తీసి చూసింది. అయితే అనుకోకుండా ఆ ఫోన్ ఆమె చేతిలోనుంచి జారి సలసల మరిగే నూనెలో పడిపోయింది. దీంతో షాకైన ఆమె వెంటనే పట్టుకారుతో ఆ ఫోన్ను నూనెలోనుంచి బయటకు తీసింది. కానీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ ఫోన్ దేనికి పనికిరాకుండా పోయింది. ఆ మహిళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. Oops pic.twitter.com/acPOyFARHU — cctv ediots 📷 (@cctv_videos) March 2, 2023 ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆ ఫోన్ను వెంటనే బియ్యంలో పెట్టారా? అలా చేస్తే పనిచేస్తుంది కదా? అని ఓ నెటిజన్ చలోక్తులు విసిరాడు. మరో యూజర్ స్పందిస్తూ.. ఫోన్ సంగతి సరే.. ఆ నూనెను మార్చాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారేమో? సలసల మరిగే నూనెలో సెల్ఫోన్ పడితే ఎలాంటి కెమికల్స్ విడుదలవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని రాసుకొచ్చాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫోన్ నూనెలో పడగానే నేనింకా ఆమె చేతితో దాన్ని బయటకు తీస్తుందేమో అనుకున్నా.. అని నవ్వులు పూయించాడు. చదవండి: దారుణ అకృత్యానికి రెడీ అవుతున్న పుతిన్! ఏకంగా ఆత్మాహుతి దాడుల కోసం ప్లాన్ -
స్మార్ట్ ఫోనుల్లో చాలా మంది చేసే తప్పులు ఇవే.. మరి ఏం చేయాలి?
గీతిక (పేరుమార్చడమైనది) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఈ మధ్య తన క్లాస్మేట్ (నందు) చేసే మెసేజ్లు ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అందుకు సంబంధించిన సమాచారాన్ని తిరిగి తనకే పోస్ట్ చేస్తున్నాడు. ఎవరికైనా చెబుదామంటే ఎవరూ నమ్మరు. పైగా తననే నిందిస్తారు. తను ఊళ్లో లేకపోయినా తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ తిరిగి తనకే పంపిస్తున్నాడు. ఏమైనా అంటే, నాకు అన్నీ తెలుసు.. అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇది ఇబ్బందికరంగా ఉండటమే కాదు భయంగానూ ఉంటోంది. గీతిక లాగే చాలా మంది ఇబ్బందులకు లోనయ్యే సమస్య ఇది. తమ ఫోన్ హ్యాక్ అయిందనే విషయాన్ని ఏ మాత్రం పసిగట్టలేరు. అంత స్మార్ట్గా మన చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనుల్లో దొంగలు దూరుతున్నారు జాగ్రత్త. స్మార్ట్ ఫోన్లలో చాలా మంది చేసే కొన్ని తప్పులు ఏంటంటే.. ♦ మనం ఏం చేస్తున్నామో మిగతా అంతా చూసేలా చేయడం. ♦ అలెక్సా వంటి టూల్స్ వాటంతట అవే రన్ అయ్యేలా చేయడం ♦ ఎప్పుడూ యాప్స్ సైన్ ఇన్లోనే ఉండటం ♦ స్మార్ట్ ఫోన్ యాక్సెస్ ఏదైనా ఓకే చేయడం. వెంటనే తెలుసుకోవాలంటే... ♦ ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే.. సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్లు (ఏదైనా తెలియని యాప్లో స్పై, మానిటర్, ట్రాక్ ట్రోజన్ .. మొదలైన పేర్లు ఉన్నాయేమో చెక్ చేయండి. ఒకవేళ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ఇది తెలుసుకోవడానికి సెట్టింగ్స్, ప్లేస్ – గూగుల్ ప్లే, ప్రొటెక్షన్ స్కాన్ చేయండి. ♦ ఐవోఎస్ వినియోగదారులు అయితే.. అన్ని పాస్వర్డ్లను మార్చాలి. నెట్వర్క్ సెట్టింగ్స్ను రీసెట్ చేయాలి. ఐఓఎస్ రీసెంట్ వెర్షన్ను అప్డేట్ చేయాలి. స్మార్ట్ఫోన్లో స్నూపింగ్కి అనుమతించేవి... ♦ పిల్లలు వాడుతున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా వారు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకోవడానికి ట్రాక్ చేయగల యాప్స్ ఉంటాయి. ♦ కంపెనీ గ్యాడ్జెట్లలో ఇన్స్టాల్ చేయబడిన మానిటరింగ్ సాఫ్ట్వేర్, వాటిని కంపెనీ ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి కాబట్టి ఈ హక్కును రిజర్వ్ చేసుకోవచ్చు. ♦ ఆర్డర్ డెలివరీని ట్రాక్ చేయడం, డెలివరీని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి నిఘా అవసరం కావచ్చు. కొన్ని రకాల సమస్యలు ♦ హాని కలిగించే యాప్స్, స్పై వేర్, పబ్లిక్ వైఫై, ఉపయోగించని యాప్స్, ఫిషింగ్, పాస్వర్డ్ సెక్యూరిటీ లేనివి .. వంటి వాటి వల్ల సమస్యలు కలగవచ్చు. ముఖ్యమైన పోర్టల్స్ ♦ మీ ఫోన్ IMEI నెంబర్ని https://www.imei.info/ చెక్ చేయండి. ♦ మీ పేరుపై ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవడానికి https://tafcop.dgtelecom.gov.in సైబర్ టాక్ ఎలా చెక్ చేయాలి? ♦ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సెట్టింగ్స్–యాప్స్, నోటిఫికేషన్స్– కెమెరా/ మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్కి యాక్సెస్ ఉందో లేదో తనిఖీ చేయండి) ♦ యాపిల్ ఫోన్ అయితే సెట్టింగ్స్– ప్రైవసీ–కెమెరా/మైక్రోఫోన్ (ఏదైనా తెలియని యాప్కి యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలి) తెలుసుకోవడం ఎలా..? ♦ ఫోన్ చాలా స్లో అవుతుంది. ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ♦ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. ♦ యూ ట్యూబ్ లేదా ఆన్లైన్ వీడియోలు బఫర్ అవ్వవు. ♦వెబ్ పేజీలు లోడ్ అవడానికి టైమ్ పడుతుంది. ♦ ప్రోగ్రామ్స్, యాప్స్ క్రాష్ అవుతాయి. ♦ గాడ్జెట్ సడెన్గా రీస్టార్ట్ అవుతుంది. ♦ చిత్రమైన, ఊహించని మెసేజీలు వస్తుంటాయి. ఏం చేయాలి? ♦ మీ ఫోన్ పరిమితులను మీకు మీరుగా నిర్దేశించుకోండి. ♦ ఐఓఎస్ యాప్స్ని వెంటనే అప్డేట్ చేయండి. ♦ ఉపయోగంలో లేనప్పుడు మీ గ్యాడ్జెట్స్ను లాక్ చేసి ఉంచండి. ♦ వైఫై, బ్లూ టూత్ వాడకంలో జాగ్రత్తలు పాటించండి. ♦ బ్యాంకింగ్, సామాజిక మాధ్యమాల కోసం రెండురకాలప్రామాణీకరణలను పాటించండి. ♦ డేటాను తరచూ బ్యాకప్ చేయండి. ♦ సెక్యూరిటీ యాంటీవైరస్, మాల్వేర్ అప్లికేషన్లను ఉపయోగించండి ♦ మీరు ఇన్స్టాల్ చేసే యాప్స్ను ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఎంచుకోండి. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఐఫోన్ 15 సిరీస్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కలర్స్పై ఓ లుక్కేయండి!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోన్ విడుదలై కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్ 14 కంటే తదుపరి సిరీస్ ఐఫోన్ 15లో లేటెస్ట్ టెక్నాలజీ జోడించడంతో పాటు వివిధ రకాలైన కలర్స్తో మార్కెట్కు పరిచయం చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఈ తరుణంలో ఐఫోన్ 15 సిరీస్లో వనిల్లా కొత్త వేరియంట్స్ కలర్స్తో మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు ‘9 టూ 5 మాక్’ నివేదిక తెలిపింది. వనిల్లా ఐఫోన్ 15 సిరీస్లో డార్క్ పింక్, లైట్ బ్లూ కలర్స్తో పాటు సెల్ఫీ జనరేటెడ్ రెండర్ ఇమేజ్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వనిల్లా ఐఫోన్ 15 ఇమేజ్లను విడుదల చేయడంపై ఆసక్తి మరింత పెరిగింది. ఐఫోన్ 15సిరీస్లో బ్లాక్ , వైట్, రెడ్ వేరియంట్స్ కలర్స్తో మార్కెట్కు పరిచయం కానుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ లేటెస్ట్ కలర్స్పై యాపిల్ స్పందించలేదు. ఇక రిపోర్ట్ల ప్రకారం.. ఈ ఏడాది ఐఫోన్ 15 ప్రో మోడల్స్ను స్పెషల్ కలర్స్ లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్/ ఆల్ట్రా మోడల్స్లో డార్క్ రెడ్ కలర్స్తో టైటానియం ఫినిష్తో రానుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్ప్లేల చుట్టూ తిన్నర్ బెజెల్స్, ఐఫోన్ 14 తరహా స్క్రీన్ను పోలి ఉండనుందని గతంలోనే పలు నివేదికలు తెలిపాయి. తాజా నివేదికలు సైతం యాపిల్ వాచ్ తరహా డిజైన్లతో థిన్ బెజెల్స్, కర్డ్వ్ షేప్స్తో విడుదల కానున్నట్లు సమాచారం. -
వాటి జోలికెళ్తే.. ఐదేళ్లు జైలుకే..!
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారితీస్తున్న చైల్డ్ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫొటోలను పోస్టు చేసినా, షేర్ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. ఐదేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్నెట్తోపాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ)’పనిచేస్తోంది. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు, ఫొటోల (చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్డ్ మెటీరియల్– సీఎస్ఏఎం)ను, వాటి గురించి సెర్చ్ చేస్తున్నవారు, వీక్షిస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం హైదరాబాద్లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్య, అశ్లీల చిత్రాలన్నీ చైల్డ్ పోర్నోగ్రఫీ కిందికి వస్తాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సాహిత్యం తదితరాలను సీఎస్ఏఎంగా పరిగణిస్తారు. ఎన్సీఎంఈసీ ఆధ్వర్యంలో.. అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1984 జూన్ 13న ఎన్సీఎంఈసీ ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్సీఎంఈసీ చర్యలు ముమ్మరమయ్యాయి. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం.. 2021లో భారత్ నుంచే 25 వేలకుపైగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యాయి. ఆధునిక టెక్నాలజీతో పటిష్ట నిఘా.. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ను గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లు వాడుతూ ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంటెంట్ను, సెర్చింగ్ను గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ గురించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. వారు వినియోగించిన కంప్యూటర్/ల్యాప్టాప్/ఫోన్ల ఐపీ అడ్రస్లను సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ వివరాలను ఎన్సీఎంఈసీ క్రోడీకరించి ఆయా దేశాలకు చెందిన నోడల్ ఏజెన్సీలకు అందిస్తుంది. మనదేశంలో జాతీయస్థాయిలో హోంశాఖ అధీనంలోని ఎన్సీఆర్బీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీనికి అందిన వివరాలను రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తుంది. రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు ఈ వివరాలను సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్ క్రైమ్ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్ల ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేయడం/ నోటీసులివ్వడం వంటి చర్యలు చేపడతారు. స్మార్ట్ఫోన్లతో పెరిగి.. కోవిడ్తో విజృంభించి.. విస్తృతమైన ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసగా మారుతున్నారు. కోవిడ్ లాక్డౌన్, ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదుకాగా.. 2020 నాటికి ఈ సంఖ్య 738కి, 2021లో 969కి పెరగడం గమనార్హం. జరుగుతున్న ఉదంతాల్లో కనీసం ఒక శాతం కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి కేసులుగా మారట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాల్లో సర్వర్ల కారణంగా.. అశ్లీల వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. కానీ వాటి నిర్వాహకులు వెబ్సైట్ పేరులో స్వల్ప మార్పులు చేసి మరో వెబ్సైట్గా అందుబాటులోకి తెస్తున్నారు. వాటిపై ఫిర్యాదులు వచ్చి చర్యలు తీసుకునేవరకు ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. వాటిపై ఫిర్యాదులు వచ్చినా నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. బాగా చదువుకున్నవారూ నిందితుల్లో.. చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. పోలీసులు నిందితులతోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక ఈ కేసుల్లో ఇటీవల నోటీసులు అందుకున్న వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. అన్నిరకాలా నష్టం పోర్నోగ్రఫీకి బానిస అవుతున్నవారు అన్నిరకాలా నష్టపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్లో ఉండే పోర్న్ మెటీరియల్తో పాటే వైరస్లు ఉంటాయని.. ఆయా వెబ్సైట్ల ద్వారా వైరస్లను పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్టాప్లను హ్యాక్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్కార్డులు, ఇతర వివరాలూ హ్యాకర్లకు చేరి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు చైల్డ్ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీనికోసం ఎవరు సెర్చ్ చేసినా, వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్ చేసిన వారి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని 67–బీ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం. ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ వేస్తాం. కోర్టులో నేరం నిరూపితమైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది. –గజరావ్ భూపాల్, సంయుక్త పోలీసు కమిషనర్, సీసీఎస్, హైదరాబాద్ -
విడుదల కానున్న ఒప్పో మడత ఫోన్.. ధర ఎంతంటే?
ఒప్పో తొలి ఫ్లిప్ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వరల్డ్ వైడ్గా విడుదల కానుంది. గత ఏడాది చైనా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ మడత ఫోన్ను ఈనెల 15వ తేదీన లాంచ్ చేయనున్నట్టు ఒప్పో అధికారికంగా ప్రకటించింది. అయితే ఫ్లిప్ కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటుండగా ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్లో 3.26 అంగుళాల అమోలెడ్ సెండరీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే 6.8 అంగుళాల అమోలెడ్ ప్రైమరీ అమోలెడ్ డిస్ప్లేతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ వస్తోంది. 5జీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమన్సిటీ 9000+ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఒప్పో ఇస్తోంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే చైనాలో 5,999 యువాన్లు (సుమారు రూ.71,200)గా ఉంది. భారత్లో సుమారు ఇదే ధరతో విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మడత ఫోన్ పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. -
టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ పోటీని తట్టుకొని కొనుగోలు దారుల్ని ఆకట్టుకునేందుకు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఫీచర్లు, ఫోల్డబుల్ ఫోన్లు, ఆకట్టుకునే కలర్స్ అంటూ రకరకాల ఫోన్లను విడుదల చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే తొలిసారి 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాన్నీ ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వీలు కల్పిచ్చింది. సాధారణంగా ఛార్జింగ్ పెట్టుకోవాలంటూ కంపెనీని ఒక్కో ఫోన్ 2 లేదా 3 గంటలు పెడితేనే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. అయితే రియల్ ఫోన్ను కేవలం 10నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ‘రియల్మీ జీటీ నియో 5జీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్కు 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కేవలం నిమిషాల వ్యవధిలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ప్రకటించింది. 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే ఫోన్ ఇప్పటివరకు మార్కెట్లోకి రాలేదని.. తొలి 4 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుందని, 10 నిమిషాల్లోపే 100శాతం పూర్తయిందని రియల్మీ తెలిపింది. ఇక ఆఫోన్లో 50ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వీటితో 4కే, 1080పీ రెజల్యూషన్తో వీడియోలు తీసుకోవచ్చు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉన్న రియల్మీ జీటీ నియో 5 ఫోన్ ధర సుమారు రూ.40వేల వరకు ఉండొచ్చని అంచనా -
అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్...స్మార్ట్ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్స్
వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లపై మరో సేల్కి సిద్దమైంది. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలిచే అమెజాన్ కొత్త సేల్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో ఈ-కామర్స్ దిగ్గజం కొనుగోలుదారులకు ఎస్బీఐ, మాక్స్ క్రెడిట్ కార్డ్లపై ఈఎంఐతో పాటు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 వరకు స్మార్ట్ఫోన్ ఉపకరణాలపై మేడ్ ఫర్ ఈచ్ అదర్ డీల్లను పొందవచ్చు. వాలెంటైన్స్ డే డీల్లో బడ్జెట్ ఫోన్లైన రెడ్మీ10 పవర్, రెడ్మీ 10ఏ, రెడ్మీ ఏ1లపై ఫెడరల్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది. వీటి ధరలు రూ. 10,749, రూ. 7,862, రూ. 6,499 నుండి అందుబాటులో ఉన్నాయి. మరో స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లపై ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు ఆఫర్లు పొందవచ్చు. గెలాక్సీ ఎం13, గెలాక్సీ ఎం 33, గెలాక్సీ ఎం04 లను వరుసగా రూ. 8,699, రూ. 13,999, రూ. 7,499కి కొనుగోలు చేయొచ్చు. అదనంగా, ఈ ఫోన్లపై 3 లేదా 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు. ఐక్యూ లేటెస్ట్ 5జీ ఫోన్లను సైతం అమెజాన్ ఈ సేల్లో విక్రయానికి పెట్టింది. ఐక్యూ జెడ్6 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ, ఐక్యూ నియో 6 5జీలను రూ. 14,499, రూ. 11,999, రూ. 24,990లలో పొందవచ్చు. ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్లు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సందర్భంగా టెక్నో ఫోన్లపై భారీ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యాబ్, 64జీబీ స్టోరేజ్, 13 ఎంపీ, ఏఐ మోడ్తో వచ్చే టెక్నో స్పార్క్ 9 రూ. 7,019 నుండి అందుబాటులో ఉండగా.. టెక్నో పాప్ 6 ప్రో ఎస్బీఐ, ఫెడరల్ బ్యాంక్ నుండి డిస్కౌంట్లతో రూ. 5,399కి కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక సెల్లో రియల్మీ 50 సిరీస్పై కస్టమర్లు అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. రియల్మీ 50ఐ ప్రైమ్, రియల్మీ 50ఏ ప్రైమ్ ధరలు వరుసగా రూ. 6,299, రూ. 8,999ఉన్నాయి. వీటిపై 3 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90హెచ్జెడ్ డిస్ప్లేతో కూడిన రియల్మీ 50 5జీ ఫోన్పై 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐతో రూ. 12,999కి అందుబాటులో ఉంది. -
సోషల్ మీడియా ఎఫెక్ట్: మెదడులో డోపమైన్ హార్మోన్ రిలీజ్.. అనర్ధాలు ఇవే..
హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టుకు రిప్లయ్ ఇవ్వలేదని తను ప్రేమించిన యువతిపైనే బహిరంగంగా దాడి చేశాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. రోజుకు 2.30 గంటలకు మించి సోషల్ మీడియా సైట్లలో గడిపేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, వారు మరో పనిపై మనసు నిమగ్నం చేయలేకపోతున్నారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారు తమ చదువు, వృత్తి కోసం కేటాయించిన సమయాన్ని కూడా వృథా చేసుకుంటున్నట్టు గుర్తించారు. సాక్షి, అమరావతి: స్మార్ట్ఫోన్లో నెట్ రాకుంటే చిరాకు.. గంటపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటే విసుగు.. పోస్టులకు లైక్లు, షేర్లు చేస్తూ కామెంట్లకు రిప్లయ్ ఇవ్వాలన్న కోరిక.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే అదో మానసిక వ్యసనమే అంటున్నారు మానసిక వైద్యులు. ఇది మద్యపాన, మత్తు పదార్థాలు తీసుకోవడం వంటిదేనంటున్నా రు. ఈ వ్యసనంపై చికాగో యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేసింది. మన దేశంలోనూ ఇలాంటి కేసులు పెరుగుతున్నట్టు తేల్చింది. ఆన్లైన్లో విహరించేవారి మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువ విడుదలవుతుందని, చేస్తున్న పని పదేపదే చేసేలే ఆ హార్మోన్ ఉత్తేజపరుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్లనే ఒక్కసారి సో షల్ మీడియా సైట్లకు అలవాటుపడ్డవారు వదలలేకపోతున్నారు. ఇది ఒకస్థాయి వరకు ఇబ్బంది లేకున్నా పరిమితి మించినప్పుడు అనర్థాలకు దారితీస్తున్నట్టు గుర్తించిన సైంటిస్టులు.. అలాంటివారు మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. వెనకకు వెళ్తేనే.. ముందుకు ఆన్లైన్ సెర్చింగ్ వ్యసనం మానసిక రోగమని ఇప్పటిదాకా ప్రపంచంలో ఎవరూ ప్రకటించకున్నా వీరికి చికిత్స అందించే థెరపిస్టులు మాత్రం పెరుగుతున్నారు. అమెరికాలో సోషల్ మీడియా వ్యసనం 20 శాతానికి పెరిగినట్టు గుర్తించారు. మన దేశంలోనూ ఈ సంఖ్య 4.7 శాతంగా ఉండగా, ఇది వచ్చే రెండేళ్లలో మూడింతలవుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ తర్వాత పిల్లల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం అధికమైంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఇలాంటి పిల్లలను తల్లిదండ్రులు సైకియాట్రిస్టులకు చూపిస్తున్నారు. సామాజిక మాధ్యమం వ్యసనానికి చికిత్స కోసం అమెరికా, యూకేల్లో డి–అడిక్షన్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కాలిఫోర్నియా న్యూపోర్టు బీచ్లోని మీడియా సైకాలజీ రీసెర్చ్ సెంటర్లో డ్రైవింగ్, స్విమ్మింగ్తో చికిత్స అందిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాకు ముందున్న పరిస్థితికి వెళ్లాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. ఫోన్ ను పక్కనబెట్టి మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం, సన్నిహితులతో ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకోవాలంటున్నారు. ప్రత్యేక కోర్సు డిజైన్ చేశాం.. స్మార్ట్ఫోన్ వ్యసనం టీనేజ్ పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అదికూడా ఇంట్లో పెద్దవారే అలవాటు చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మరీ ఎక్కువైంది. చాలామంది పిల్లలు స్మార్ట్ఫోన్ వాడే అవకాశం ఉండదని స్కూళ్లకు కూడా వెళ్లడం లేదు. నావద్దకు వచ్చే పిల్లల్లో కొందరు 7 గంటలకు పైగా స్మార్ట్ఫోన్ వాడుతున్నవారున్నారు. పిల్లల్లో కార్పెల్ టెన్నల్ సిండ్రోమ్తో మణికట్టు దెబ్బతింటుంది. అధిక సమయం తలను వంచి ఉంచడం వల్ల డ్రూపింగ్ హెడ్ సిండ్రోమ్ వస్తోంది. ఇటీవల పిల్లల్లో కొత్తగా వర్చువల్ ఆటిజం గుర్తించారు. గత పదేళ్లలో అమెరికాలో ఏడీహెచ్డీ బారిన పడుతున్న పిల్లలు పెరుగుతున్నారు. అంటే ఏకాగ్రత తగ్గిపోతోంది. హింసాతత్వం పెరుగుతోంది. భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోతున్నారు. స్కూల్ పిల్లలను స్మార్ట్ఫోన్ నుంచి దూరంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్ డిజైన్ చేసి పిల్లలకు చూపిస్తున్నాం. దీనివల్ల ప్రైమరీ పిల్లల్లో నూరు శాతం మార్పు వచ్చింది. హైస్కూల్ స్థాయి పిల్లల్లో కొందరు తీవ్రంగా ఫోన్కు బానిసలుగా మారిపోయారు. అలాంటి వారిని సైకియాట్రిస్టులకు చూపించాలని తల్లిదండ్రులకు సిఫారసు చేస్తున్నాం. – వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త. తగ్గించుకునే మార్గాలూ ఉన్నాయ్ వ్యక్తిగత, మానసిక ఆరోగ్యం మీద, మానవ సంబంధాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని సులువుగా తగ్గించుకోవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. - మొదట మన స్మార్ట్ ఫోన్లో అతిగా వినియోగిస్తున్న యాప్స్ను డిలీట్ చేయడం ఉత్తమ మార్గం. - పని సమయంలో, భోజనం, వినోద కార్యక్రమాల సమయాల్లో ఫోన్ను ఆఫ్ చేయాలి. - సోషల్ మీడియా యాప్స్లోని నోటిఫికేషన్ సెట్టింగ్స్ను ఆఫ్ చేయాలి. - పడకగదిలో ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్, డెస్క్టాప్లను ఉంచకూడదు. - సాంకేతికతతో సంబంధం లేని కొత్త అభిరుచిని అలవాటు చేసుకోవాలి. - సాధ్యమైనప్పుడుల్లా స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. -
సోషల్ మత్తు.. అదో జగత్తు!
సాక్షి, అమరావతి: ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్.. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవి. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గంటల తరబడి వాటిలోనే గడిపేటంత వ్యసనంగా మారిపోయాయి. ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల యువత గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంగ్లండ్కు చెందిన కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ‘ఆఫ్కమ్’ లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత (16–24 సంవత్సరాలు) రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతుంటే భారతదేశంలో 33.7 శాతం మంది అదే పనిలో ఉంటున్నట్టు పేర్కొంది. దేశంలో వినియోగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో కనీసం మూడు యాప్ల్లో ఏదో ఒకటి రోజూ 30 నిమిషాలకు ఒకసారి తెరుస్తున్నట్టు గుర్తించారు. రోజులో గంట కంటే ఎక్కువ సేపు ఆన్లైన్లో గడిపితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.36 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు యూఎస్కు చెందిన టెక్ జ్యూరీ సంస్థ తెలిపింది. దేశంలో 4.7% మందికి వ్యసనం వాస్తవానికి సోషల్ మీడియా వ్యసనాన్ని లెక్కించేందుకు నిర్దిష్టమైన కొలమానాలు ఏవీలేకున్నా.. గంటల తరబడి ఫోన్తోనే గడపడాన్ని వ్యసనంగానే భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం.. ఎలాంటి సందేశాలు రాకున్నా వచ్చినట్టు భావించడం.. కాస్త సమయం దొరికితే యూట్యూబ్, ఫేస్బుక్లోకి దూరిపోయి సమయాన్ని మరిచిపోవడం.. నిద్ర వస్తున్నా బలవంతంగా ఫోన్ చూస్తూ గడిపేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సోషల్ మీడియా అడిక్షన్గా పేర్కొంటున్నారు. 5 గంటలకు పైగా ఆన్లైన్లోనే ఉండేవారిని వ్యసనపరులుగా భావిస్తున్నారు. యూకేలో 10 శాతం మందికి ఈ వ్యసనం ఉండగా, మన దేశంలో 4.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనంగా మారినట్టు లెక్కించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో వచ్చే రెండేళ్లలో మనదేశంలో ఇది 12 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇష్టమైన యాప్స్ లాగిన్ అయినప్పుడల్లా మెదడులో డోపమైన్ (ఆనందాన్ని కలిగించే ఎంజైమ్) విడుదల స్థాయి పెరుగుతుందని, ఫలితంగా మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్లు ఆనందంతో కదులుతాయని వైద్యులు చెబుతున్నారు. అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు.. సోషల్ మీడియా వ్యసనానికి, ఆనందించే అలవాటుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించింది. ► సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ► స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్ఫోన్ను తీసుకోవడం, మెస్సేజ్లను చూడడం. ► ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడటం ► ఫోన్లో బ్యాలెన్స్ ఉండి, ఇంటర్నెట్ రాకుంటే చిరాకు, కోపం రావడం, ఏదో కోల్పోయినట్టు ఆందోళన చెందడం. ► అవకాశం దొరికినప్పుడల్లా వ్యక్తులు ఆశ్రయించే మొదటి అంశం స్మార్ట్ఫోన్ కావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సోషల్ మీడియా అడిక్షన్లోకి వెళ్లినట్లేనని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్తో రోజువారీ బంధం ఇలా.. ► సోషల్ మీడియాలో అత్యధికంగా (60 శాతం) ఉండేది 18–34 ఏళ్ల వారే ► ఫోన్ అస్సలు స్విచ్చాఫ్ చేయనివారు 50% ► రోజుకు ఫోన్ అన్లాక్ చేసేది 150 సార్లు ► రోజుకు సగటున ఫోన్చెక్ చేసుకునేది 63 సార్లు.. ఫోన్ పక్కలో పెట్టుకుని నిద్రపోయేవారు 71 శాతం ► బాత్రూముల్లోనూ ఫోన్లు వినియోగించేవారు 40% ► డ్రైవింగ్లో ఒక్కసారైనా మెస్సేజ్ చేసేవారు 75% ► పడుకునే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసేవారు 87 శాతం -
అదిరిపోయే ఫీచర్లతో షావోమీ 13 ప్రో, ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఫిబ్రవరిలో మరో ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 26 న షావోమీ 13 ప్రో’ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రత్యర్ధి సంస్థలైన ఐక్యూ 11 5జీ, వన్ ప్లస్ 11 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఫోన్లను స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓఎస్తో విడుదల చేయగా.. వాటికి పోటీగా షావోమీ స్నాప్ డ్రాగన్ 2 చిప్సెట్తో 4 ఫ్లాగ్ షిప్ ఫోన్లను చైనాలో విడుదల చేసింది. తాజాగా అదే చిప్సెట్తో షోవోమీ 13ను విడుదల చేసి ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్లో షావోమీ 13 ప్రో షావోమీ అధికారిక ప్రకటన ప్రకారం.. చైనా తర్వాత భారత్లో షావోమీ 13 ప్రో ఫిబ్రవరి 26 స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు విడుదల చేయనుంది. ఇక ఇదే ఫోన్ గత ఏడాది చైనాలో విడుదల చేయగా.. ఆ ఫోన్ ధర రూ.61,000గా ఉంది. షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్ షోవోమీ 13 ప్రో స్పెసిఫికేషన్ గురించి షావోమీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ పలు నివేదికలు మాత్రం ఫోన్ గురించి పూర్తి వివరాల్ని విడుదల చేశాయి. వాటి ప్రకారం.. ఆండ్రాయిల్ 13 వెర్షన్ అప్డేట్తో వచ్చిన షావోమీ ఇంటర్ ఫేస్ ఫీచర్ ఎంఐయూఐ 14, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.73 అంగుళాల 2కే ఒఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ఎస్ఓసీ, 12జీబీ ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు లైకా బ్రాండెడ్ 50 మెగా పిక్సెల్ రేర్ కెమరా సెటప్, ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, వైఫై 6, బ్లూటూత్ 5.3 అండ్ ఎన్ఎఫ్సీ(Near-field communication), ఎక్స్ - యాక్సిస్ లైనియర్ మోటార్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఐఆర్ కంట్రోల్ సెన్సార్లు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఫోన్లో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 డబ్ల్యూ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 8.38 ఎంం, బరువు 210 గ్రాములుగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. -
వన్ప్లస్ 11ఆర్ 5జీ,టీవీ, ప్యాడ్, బడ్స్: జోరు మామూలుగా లేదుగా!
సాక్షి,ముంబై: ప్రీమియం స్మార్ట్ఫోన్ల సంస్థ వన్ప్లస్ మరో అద్బుతమైన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో వన్ప్లస్ 11 5జీ, వన్ప్లస్ 11ఆర్ 5జీ మోడల్స్ని తీసుకొచ్చింది. గేమింగ్ ప్రియుల కోసం హైపర్బూస్ట్ గేమింగ్ ఇంజిన్, అడాప్టర్ ఫ్రేమ్ స్టెబిలైజర్ 4.0 ఫీచర్స్ వీటిలో పొందుపర్చింది. అలాగే 120Hz సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఉన్నాయి. వీటితోపాటు పాటు వన్ప్లస్ ప్యాడ్, వన్ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్, క్యూ2 ప్రొ 65 టీవీని కూడా లాంచ్ చేసింది. వన్ప్లస్ 11ఆర్ 5జీ ధర 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ రూ.61,999, 16జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999. గెలాటిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్లోఈ స్మార్ట్ఫోన్లు లభ్యం. ప్రీ ఆర్డర్కు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 28 న సేల్ ప్రారంభం. అమెజాన్, వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. వన్ప్లస్ 11ఆర్ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ 50+8+2 ఎంపీ టట్రిపుల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 100 వాట్ చార్జింగ్ సపోర్ట్ వన్ప్లస్ బడ్స్ ప్రో 2ఆర్ (హెడ్ ట్రాకింగ్ & వైర్లెస్ ఛార్జింగ్) ధర రూ 11,999 వన్ప్లస్ టీవీ క్యూ2 ప్రొ 65 రూ. 99,999 ముందస్తు ఆర్డర్లు: మార్చి 6, విక్రయాలు: మార్చి 10 -
ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్!
ఫిబ్రవరి 9 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో అదరగొట్టేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సిద్దమవుతున్నాడు. ఈ తరుణంలో విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. అయితే ఆ ట్వీట్ బిజినెస్ ప్రమోషన్లో భాగమేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఎండార్స్ మెంట్లతోనే కాదు ట్వీట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంపై విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారని అనుకుంటున్నారా? విరాట్ కోహ్లీ ఓ కొత్త ఫోన్ కొన్నాడట. ఆ ఫోన్ను పోగొట్టుకున్నాడట. ఇంకేముంది. అన్ బాక్సింగ్ చేయకుండా ఫోన్ పోగొట్టుకోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కొన్న ఫోన్ ఎలా ఉందో చూడకుండా (అన్ బాక్సింగ్) పోగొట్టుకుంటే అంతకు మించిన బాధ మరొకటి ఉండదేమో...మీలో ఎవరైనా ఆ ఫోన్ను చూశారా..? అని విరాట్ కోహ్లీ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాత్రం విచిత్రంగా స్పందించింది. ‘వదిన ఫోన్ నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేందుకు మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది’ అని జొమాటో కామెంట్ పెట్టింది. దీంతో కోహ్లీ ట్వీట్పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని ట్యాగ్ చేస్తూ వెంటనే కోహ్లీకి మీ కంపెనీ మొబైల్ పంపించండి’ అని సూచిస్తున్నారు. Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it? — Virat Kohli (@imVkohli) February 7, 2023 feel free to order ice cream from bhabhi's phone if that will help 😇 — zomato (@zomato) February 7, 2023 -
సరికొత్త రికార్డ్స్.. 24 గంటల్లో 1.4 లక్షల ఫోన్ల బుకింగ్స్!
దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటుతోంది. ఆ సంస్థకు చెందిన గెలాక్సీ ఎస్ 23 ఫోన్లు ప్రీ బుకింగ్లో దుమ్మురేపుతున్నాయి. ఒక్కరోజులోనే రూ.1400 కోట్ల విలువైన 1.4 లక్షల యూనిట్ల ప్రీమియం ఫోన్లను కొనుగోలు దారులు బుక్ చేసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శాంసంగ్ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 సిరీస్లోని ‘గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా’ అనే మూడు వేరియంట్లు మోడళ్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనున్న ప్రీ బుకింగ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రెండు రెట్లు పెరిగి ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లాన్ మాట్లాడుతూ.. గతంలో తాము విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 కంటే రెండు రెట్లు పెరిగి సగటున ఫోన్ ధర సుమారు లక్ష రూపాయలు ఉన్న ఈ ఫోన్లు 24 గంటల్లో 1.4 లక్షల యూనిట్లు ప్రీ బుకింగ్స్ జరిగినట్లు చెప్పారు. ఫిబ్రవరి 23 ప్రీబుకింగ్ కొనసాగింపు ఇక ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ ఫిబ్రవరి 23వరకు కొనసాగుతాయని చెప్పిన పుల్లాన్ .. శాంసంగ్ ఎస్ 23 సిరీస్ ధరలు రూ.75 వేల నుంచి రూ.1.55లక్షల వరకు ఉన్నాయని అన్నారు. భారత్లో తయారీ.. ఎక్కడంటే దేశీయ మార్కెట్లో విడుదలైన శాంసంగ్ ఎస్ 23 ప్రీమియం ఫోన్లు నోయిడా ప్లాంట్లో తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇక గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లను మాత్రం వియాత్నం మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో తయారు చేసి.. దిగుమతి అనంతరం భారత్లో అమ్మకాలు జరిపినట్లు వెల్లడించారు. -
Poco X5 Pro 5g: వచ్చేస్తోంది.. రాక్స్టార్ చేతులమీదుగా
సాక్షి,ముంబై: పోకో ఎక్స్5 ప్రో ఈరోజు( సోమవారం) సాయంత్రం విడుదలవుతోంది. సాయంత్రం 5.30 గంటలకు జరిగే లాంచింగ్ కార్యక్రమాన్ని కంపెనీ తమ యూట్యూబ్ చానెల్, ఫ్లిప్కార్ట్ చానెల్లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. పోకో ఎక్స్5 ప్రో స్మార్ట్ ఫోన్లను ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు కంపెనీ ట్విటర్ ద్వారా తెలియజేసింది. గతేడాది విడుదల చేసిన పోకో ఎక్స్4 ధర రూ.18,999. అయితే తాజాగా లాంచ్ చేయనున్నపోకో ఎక్స్5 ప్రో బేసి వేరియంట్ ధర 20 వేల లోపే ఆవిష్కరించ నుందట. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర రూ. 22,999 ఉంచనుంది. అయితే ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ద్వారా 2వేల తగ్గింపుతో 20,999 అందించనుంది. ఫిబ్రవరి 13 నుంచి తొలి సేల్ షురూ కానుంది. ప్రత్యేకతలు ఇవే.. (అంచనా) ఈ ఫోన్ స్పెసిఫికేషన్లలో కొన్నింటిని కంపెనీ ఇదివరకే వెల్లడించింది. పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 778 ఎస్ఓసీ టెక్నాలజీతో రాబోతోంది. ఇదే టెక్నాలజీతో వచ్చిన శాంసంగ్, ఐక్యూ కంపెనీలకు చెందిన ఫోన్ల ధర రూ.30 వేలకు పైనే. పోకో ఫోన్లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. 108+8+ 2 ఎంపీ రియర్ కెమెరా, 120హెడ్జ్ ఆమోల్డ్ డిస్ప్లే, స్లిమ్ డిజైన్ ఉండబోతోంది. 5000 ఎంఏహచ్ బ్యాటరీ సామర్థ్యం, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్తో ఇది పనిచేస్తుంది. Rockstar on the field and a superstar IRL. Catch @hardikpandya7 #UnleashX with the #POCOX5Pro5G behind the scenes. Revealing today @ 5:30 PM on @Flipkart: https://t.co/fRPK7AdL8X pic.twitter.com/hfCNQWuCGA — POCO India (@IndiaPOCO) February 6, 2023 -
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?
సాక్షి, ముంబై: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. రెనో 8 సిరీస్లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్ భారీ కెమెరా, బిలియన్ కలర్స్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 8టీ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ స్నాప్డ్రాగన్ 695 5G SoC 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ధర రూ. 29,999 -
రియల్మీ కోకా-కోలా స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది.. అదిరే కలర్స్లో
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం రియల్మీ కోకా-కోలాకంపెనీ భాగస్వామ్యంతో సరికొత్త స్మార్ట్ఫోన్ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. రియల్మీ 10 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ కోకా -కోలా ఎడిషన్ను ఫిబ్రవరి 10న చేయబోతున్నట్టు ప్రకటించింది. సరికొత్త కలర్స్లో, యూజర్ ఇంటర్ఫేస్లో (UI) కీలక మార్పులతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ను కూడా కంపెనీ మొదలు పెట్టింది. స్టోరేజ్ మార్పు తప్ప, మిగిలిన ఫీచర్లు గత ఏడాది నవంబర్లో లాంచ్ చేసిన మోడల్ మాదిరిగానే ఉండబోతున్నాయి. గతేడాది మార్వెల్ భాగస్వామ్యంతో రియల్మీ జీటీ నియో3 థోర్ ఎడిషన్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజా కోకా కోలాతో జతకట్టింది. పరిమిత-ఎడిషన్ ఫోన్ను కోకాకోలా లోగోతో బ్లాక్ అండ్ రెడ్ డ్యుయల్ టోన్ కలర్స్లో ఆకర్షణీయంగా లాంచ్ చేస్తోంది. రియల్మీ 10 ప్రో కోకా-కోలా ఎడిషన్ ఫీచర్లు (అంచనా) 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13, స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 108 ఎంపీ ప్రోలైట్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ధర భారత్లో రూ.20 వేల లోపే ఉండొచ్చని అంచనా. కాగా రియల్మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.19,999. అలాగే రియల్మీ 10 ప్రో ప్లస్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియెంట్ ధర రూ.24,999గాను, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజీ ధర రూ.27,999గా ఉన్నాయి. -
షావొమీకి మను జైన్ గుడ్బై
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న చైనా కంపెనీ షావొమీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్ జైన్ రాజీనామా చేశారు. తొమ్మిదేళ్లపాటు ఆయన భారత వ్యవహారాలను నిర్వహించారు. ఫెమా నిబంధనలను షావొమీ ఉల్ల -
ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్.. స్మార్ట్ఫోన్ సేల్స్ డౌన్
ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచంలోనే రెండు అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లైన భారత్, చైనాలలో స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పూర్తిగా తగ్గినట్లు తెలిపింది. అయితే చైనా కంటే భారత్లో ఈ పరిణామం ఎక్కువగా ఉండటం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్, బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల సేల్స్ తగ్గినట్లు తెలిపింది కౌంటర్ పాయింట్ రీసెర్చ్. 2021తో పోలిస్తే 2022లో భారత్లో స్మార్ట్ ఫోన్ సేల్స్ 9 శాతం తగ్గి గతేడాది కేవలం 152 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. విచిత్రం ఏంటంటే ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గినా.. రూ.30 వేల కంటే పై చిలుకు స్మార్ట్ ఫోన్ల సేల్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో 35 శాతం పెరగడం గమనార్హం. లేటెస్ట్ 5జీ టెక్నాలజీ ఫోన్ల అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి. 2021లో స్మార్ట్ ఫోన్ల విక్రయం 19 శాతం పెరిగితే, 2022లో అది 32 శాతం వృద్దిరేటును నమోదు చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో శామ్ సంగ్ 21 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. సేల్స్ ఆదాయంలోనూ 22 శాతంతో ముందంజలో ఉంది. -
డిజిటల్ సర్పం.. విషానికి విరుగుడు
పదిమంది గుమిగూడే స్థలం... అంటే బస్టాప్, రైల్వేస్టేషన్, ఆఖరికి పార్కులకు వచ్చేవారిలో కూడా చాలామంది మొబైల్లోనో, ట్యాబ్లోనో తలలు దూర్చి కనిపిస్తారు. అవసరం మేరకు ఉపయోగించడానికి బదులుగా, అంతకంటే ఎక్కువగా ఎప్పుడూ స్క్రీన్కు అతుక్కుపోవడాన్ని ‘డిజిటల్ అడిక్షన్’గా మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది విషపదార్థాలను మెదడులోకి నింపుకోవడమేననీ, చిన్న చిన్న టెక్నిక్స్ ఉపయోగించి వాటిని శుభ్రం చేయవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఆ వివరాలివి... పిల్లలతో పాటు పెద్దలు సైతం మొబైల్స్నూ, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ వంటి వాటిని వాడుతుంటారు. అయితే వారు పెద్దవాళ్లు కావడంతో కుటుంబ బాధ్యతలకూ, ఆఫీసు పనుల కోసం స్క్రీన్ నుంచి ముఖం తప్పించడం తప్పదు. స్క్రీన్కు అతుక్కుపోవడం టీన్స్లో ఎక్కువ... పిల్లల్లో అందునా టీనేజీ పిల్లల్లో ‘స్క్రీన్’ పట్ల అడిక్షన్ ఎక్కువ. తమ చదువుల కోసం, కాలేజీల్లో ఇచ్చే టాస్కులు, ప్రాజెక్టుల కంటే ఎక్కువగా సరదా అంశాలూ, సినిమాలు, గాసిప్స్ కోసమే స్క్రీన్ టైమ్ను వెచ్చిస్తుంటారు. అంతకంటే చిన్న పిల్లల్లోనూ... ఇక టీన్స్లోకి రాని ఎనిమిది, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల పిల్లలు సైతం డెస్క్టాప్, ల్యాప్టాప్ల్లో తలను ముంచేస్తారు. ఆఖరికి బయటికి వచ్చినప్పుడు కూడా మొబైల్లో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒక్కోసారి పిల్లల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు అల్లరి చేయకుండా ఉండేందుకు తల్లిదండ్రులే ‘మొబైల్స్’ను వాళ్ల చేతికి అందిస్తుంటారు. అదే అలవాటు వాళ్లు టీన్స్లోకి వచ్చాక మరీ ముదిరిపోతుంది. ఓ వయసుకు చేరేనాటికి అది ‘డిజిటల్ అడిక్షన్’గా మారిపోతుంది. దీని వల్ల వచ్చే మానసిక సమస్యల విశ్వరూపాల్ని మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. మొబైల్లో గేమ్స్ ఆడవద్దన్నందుకు తల్లిదండ్రులతో పోట్లాటలు దగ్గర్నుంచి ఆత్మహత్యల వరకు ఈ దుష్పరిణామాలెన్నో. డిజిటల్ అడిక్షన్ను గుర్తించడమెలా? స్క్రీన్ ముందు చాలాసేపు గడపడం: సోషల్ మీడియాలో బ్రౌజింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తే చాలాసేపు గడపడం. దాంతో చదువూ, హోమ్వర్క్, వ్యాయామం, ఫ్రెండ్స్తో కలవడం వంటి కార్యకలాపాలకు దూరమవుతుంటారు. స్క్రీన్ ముందు నుంచి తప్పించడం చాలా కష్టం కావడం: పిల్లల చేతుల్లోంచి స్మార్ట్ఫోన్ లాగేసుకున్నా లేదా కంప్యూటర్ ఆఫ్ చేయమన్నా వాళ్లకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. బలవంతంగా మొబైల్ లాగేసినా లేదా కంప్యూటర్ ఆఫ్ చేసినా కోపం రగిలిపోవడంతో పాటు చేతుల్లో ఉన్న వస్తువుల్ని విసిరేసి, వైల్డ్గా ప్రవర్తిస్తుంటారు. రోజువారీ పనుల్ని పూర్తి చేయకపోవడం: తాము రోజూ చేయాల్సిన క్లాస్వర్క్గానీ లేదా హోమ్వర్క్గానీ చేయకుండా వదిలేస్తారు. ఈ పెండింగ్వర్క్ను తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు అతిగా ఆందోళనపడుతుంటారు. ఒంటరిగా ఉండటం: వీరు స్మార్ట్ఫోన్లోని యాప్స్తో తప్ప ఇతరులతో కమ్యూనికేషన్లో ఉండరు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దేనిపట్లా ఆసక్తితో ఉండరు సరికదా... గతంలో వారికి ఇష్టమైన పెయింటింగ్ లాంటి అభిరుచులకు దూరంగానూ, అనాసక్తితో ఉంటారు. మూడ్ స్వింగ్స్ : తాము చేసే పని పట్ల ఏకాగ్రత కోల్పోతుండటం, దేని పట్లా దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో పాటు త్వరత్వరగా వారి మూడ్స్మారిపోతుండటం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. అంతేకాదు... వారి ప్రవర్తన గమనించి పెద్దవాళ్లు ఫోన్ తీసుకోబోతుంటే దాన్ని దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివీ చేస్తారు. చక్కదిద్దడానికి చిట్కాలివి... పిల్లలు అవసరానికి మించి ‘స్క్రీన్’ను వాడటాన్ని తగ్గించేలా చేయడం ఎలాగో మానసిక నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలివి... ముందు మారాల్సింది పేరెంట్సే: చాలామంది తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్తో చాలా సేపు గడుపుతూ... తమ పిల్లలు మాత్రం వాటికి దూరంగా, క్రమశిక్షణతో ఉండాలనుకుంటారు. ఈ విషయంలో ముందుగా మారాల్సిందీ, పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిందే తల్లిదండ్రులే. ఒకేసారి లాగేయకండి: అడిక్షన్కు లోనైన పిల్లల నుంచి స్మార్ట్ఫోన్ /ల్యాప్టాప్ను ఒకేసారి లాగేయకండి. స్విచ్నొక్కినట్టుగా పిల్లలు మారిపోరు. వారు రోజూ డిజిటల్ డివైజ్తో ఎంత టైమ్ను గడపదలచుకున్నారో వారినే నిర్ణయించుకొమ్మని సూచించండి. నిర్దిష్టంగా ఆ టైమ్లో వాళ్లను స్మార్ట్ఫోన్ లేదా కంప్యూటర్తో ఆడుకోనివ్వండి. క్రమంగా ఆ టైమ్ను తగ్గిస్తూ రావాలి తప్ప ఠక్కున మారిపోవడం అంటూ జరగదు. పైగా అలా చేయడం ఇంకా మరికొన్ని దుష్పరిణామాలు దారితీస్తుంది. స్నేహితుల్ని వ్యక్తిగతంగా కలవమనడం: స్నేహితుల్ని ఫోన్లో లేదా వాట్సాప్లో పలకరించడానికి బదులు వ్యక్తిగతంగా కలిసి రమ్మనీ, కలిసి ఆడుకొమ్మని ప్రోత్సహించాలి. అంతేకాదు... పెళ్లిళ్లు, పండుగల వంటి సమయాల్లో వ్యక్తుల్ని, బంధువుల్ని ప్రత్యక్షంగా కలవమని, సామాజిక బంధాల్ని బలోపేతం చేసుకోవడం ఎంత అవసరమో చెప్పాలి. వారీ అలవాటు నుంచి బయటకు వచ్చాక... డిజిటల్ ఉపకరణాలవల్ల వారు కోల్పోబోయిన అంశాలు, వాటి వల్ల కలిగిన నష్టాలతో పాటు... డీ–టాక్సికేషన్ తర్వాత ఇప్పుడు వారికి ఒనగూరిన/ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించవచ్చు. అప్పుడు వారు డిజిటల్ ఉపకరణాలను మరింత సమర్థంగా ఎలా వాడాలో తెలుసు కుంటారు. అనవసరమైన వాటికి దూరంగా ఉంటూ స్వీయనియంత్రణ పాటిస్తారు. (క్లిక్ చేయండి: సోషల్ మీడియా పోస్ట్ వాల్యూకి ఇవే కొలమానం! ఈ చిట్కాలు పాటిస్తే..) డిజిటల్ ఉపకరణాల దుష్ప్రభావాలు నిద్రలేమి, తరచు నిద్రాభంగం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం (లో సెల్ఫ్ ఎస్టీమ్), తరచు తలనొప్పులు, ఒకేచోట కూర్చుని అదేపనిగా గేమ్స్ ఆడుతుండటం వల్ల ఒబేసిటీ, కీళ్లనొప్పులు వంటి అనేక రూపాల్లో కనిపిస్తాయి. అందుకే వీటిని మనకు ఉపయోగపడే మేరకే విచక్షణతో, తెలివిగా వాడుతూ... వీటికి అడిక్ట్ కావడం నుంచి క్రమంగా బయటపడాలి. - డాక్టర్ చరణ్తేజ కోగంటి సీనియర్ సైకియాట్రిస్ట్ -
బీ న్యూలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ ఆవిష్కరణ
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్ను ఆవిష్కరించారు. సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, రెడ్మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
శాంసంగ్ నుంచి కొత్త 5జీ ఫోన్లు.. ఫీచర్లు అదిరిపోయాయ్, లాంచ్ డేట్ అప్పుడే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ శాంసంగ్ నూతన సంవత్సరంలో కొత్త మొబైల్ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఓ బడ్జెట్ ఫోన్ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా శాంసంగ్ ఏ సిరీస్ 5జీ (Samsung Galaxy A Series) ఫోన్లను జనవరి 18న లాంచ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఏ మోడల్ అన్నదానిపై ఇంకా స్పష్టం చేయలేదు. అయితే ఇటీవల యూఎస్, యూరప్లో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ (Samsung Galaxy A14), విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మోడల్ స్మార్ట్ఫోన్ లాంచ్ అవుతుందనే తెలుస్తోంది. శాంసంగ్ మాత్రం దీనిపై పూర్తి సమాచారం తెలపకుండానే ఏ సిరీస్లో 5జీ ఫోన్లను విడుదల చేస్తామని, ఆ ఫోన్కు సంబంధించిన ప్రత్యేకతలను టీజ్ చేసింది. ప్రత్యేకతలు ఈ స్మార్ట్ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.6-అంగుళాల పూర్తి-HD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ముందు భాగంలో వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో వస్తోంది. బ్యాటరీ 2 రోజుల వరకు బ్యాకప్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిని చూస్తే ఇటీవల ప్రారంభించిన Galaxy A14 5G రూపకల్పనను పోలి ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్యూఐ 5.0 అందుబాటులోకి వచ్చింది. ఈనెల 18న సామ్సంగ్ ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీతో పాటు గెలాక్సీ ఏ23 5జీ మొబైళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. వీటితో పాటు గెలాక్సీ ఏ34 5జీ, గెలాక్సీ ఏ54 5జీ మోడళ్లకు కూడా విడుదలై అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు!
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ శుభవార్త మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్లో తన కస్టమర్లకు ఈ అద్భుత ఆఫర్ను తీసుకువచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రెడ్మి స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్లన్నీ ఉపయోగిస్తే ఈ మొబైల్ వెయ్యి రూపాయలు లోపు చెల్లించి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం! రెడ్మి ఏ1 స్మార్ట్ఫోన్ .. ఇది మరో రకంగా బడ్జెట్ ఫోన్ అని చెప్పవచ్చు. అమెజాన్ వెబ్సైట్లో దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ధరపై 28 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో తగ్గింపు పోను రూ. 6,499కే కస్టమర్లు కొనేయచ్చు. అంతేనా ఇది కాకుండా మరో అదిరిపోయే డీల్స్ కూడా ఉన్నాయి, వాటిపై ఓ లుక్కేద్దాం. ఈ ఫోన్పై బ్యాంక్ ఆఫర్ కింద రూ. 620 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మీకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 311 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ. 6,100 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఫైనల్గా రూ.1000 లోపే ఈ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ మోడల్, అది ఉన్న కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది. -
న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్ఫోన్పై రూ.14,000 తగ్గింపు.. కేవలం 2 రోజులే!
కొత్త కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో అప్డేట్ అవుతూ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో ఫోన్ లవర్స్ తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే కొందరు మంచి ఆఫర్ల కోసం వేచి చూస్తుంటారు. మీరు కనుక ఆ జాబితాలో ఉంటే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫాంలో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. దీనిలో పలు ప్రాడెక్ట్స్పై భారీగా తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్కార్ట్. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా ఇందులో వినియోగదారులకు బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. ప్రస్తుతం అందులో స్మార్ట్ఫోన్ల విషయానికొస్తే Google Pixel 6a పై భారీ ఆఫర్ను అందిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం! ఆఫర్ ఎంతంటే Google ఈ ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్లో వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని రూ.43,999కి గ్రాండ్గా మార్కెట్లో ప్రారంభ ధరగా లాంచ్ చేసింది. దీని బట్టి చూస్తే ప్రస్తుతం రూ.14,000 డిస్కౌంట్తో గూగుల్ పిక్సెల్ 6ఏ లిస్ట్ అయింది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై రూ. 3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, మీరు రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఫోన్ చాక్, చార్కోల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అన్ని డిస్కౌంట్ల తర్వాత, మీరు ఈ ఫోన్ను సగం కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్ని ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ సందర్భంగా మీకు అందిస్తోంది. ఫీచర్లు ఇవే గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.14 ఇంచెస్తో పూర్తి HD + డిస్ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హ్యాండ్సెట్ గూగుల్ టెన్సర్ చిప్సెట్లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్తో వస్తుంది. దీనికి 5G వరకు సపోర్ట్ కూడా ఉంది. పరికరం 4410mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు వంటి లక్షణాలను కలిగి ఉంది. -
జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోతో 5జీ ఫోన్లకు సంబంధించి షావోమీ ఇండియా ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియో కస్టమర్లకు అచ్చమైన 5జీ సేవల అనుభవాన్ని అందించనున్నట్టు షావోమీ తెలిపింది. రిలయన్స్ జియో నెట్వర్క్ పరిధిలో షావోమీ ఫోన్లకు మెరుగైన కవరేజీ అందేలా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవ్వనుంది. అన్ని షావోమీ 5జీ ఫోన్లు రిలయన్స్ జియో ట్రూ 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేస్తాయని షావోమీ ఇండియా ప్రకటించింది. యూజర్లు తమ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్స్లో ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ను 5జీకి మార్చుకోవాలని సూచించింది.