మస్క్‌ వైపే కేంద్రం మొగ్గు.. | Scindia rejects spectrum auction proposal by Ambani and Mittal boost for Elon Musk | Sakshi
Sakshi News home page

అంబానీ, మిట్టల్‌లకు షాక్‌.. మస్క్‌ వైపే కేంద్రం మొగ్గు!

Nov 8 2024 7:52 AM | Updated on Nov 8 2024 7:56 AM

Scindia rejects spectrum auction proposal by Ambani and Mittal boost for Elon Musk

న్యూఢిల్లీ: శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ స్పెక్ట్రంను అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాలకు తగ్గట్లే కేటాయిస్తామే తప్ప వేలం వేయబోమని కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరోసారి స్పష్టం చేశారు. అయితే దీన్ని ఉచితంగా ఇవ్వబోమని, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిర్ణయించే ధరను కంపెనీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రంను కేటాయించాలే తప్ప భారతీయ టెల్కోలు కోరుతున్నట్లుగా వేలం వేయరాదని కోరుతున్న స్టార్‌లింక్‌ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌కు ఈ పరిణామం సానుకూలం కానుంది. ఈ స్పెక్ట్రంను వేలం వేయాలని దేశీ దిగ్గజాలు జియో, ఎయిర్‌టెల్‌ కోరుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement