
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వరుసగా రెండవ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పురోగమించి రోజు గరిష్ట స్థాయి 76,589.93కి చేరిన తర్వాత 76,532.96 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం లాభపడి 23,163.10 వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 23,181.35 నుంచి 22,976.50 రేంజ్లో ట్రేడయింది.
విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 3.32 శాతం పెరగడంతో స్మాల్క్యాప్ షేర్లు ఛార్జ్లో ముందంజలో ఉన్నాయి. కాగా నిఫ్టీ మిడ్క్యాప్ 100 2.31 శాతం లాభంతో ముగిసింది.
శనివారం పనిచేయనున్న మార్కెట్లు
కేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నందున వచ్చే శనివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) రెండూ శనివారం పూర్తి ట్రేడింగ్ సెషన్లను నిర్వహించనున్నట్లు ధ్రువీకరించాయి .
తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తెరిచి ఉంటాయని, కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల వరకు ట్రేడింగ్ ఉంటుందని ఎక్స్ఛేంజీలు వివరించాయి. అయితే, సెటిల్మెంట్ సెలవు కారణంగా "T0" సెషన్ షెడ్యూల్ మాత్రం ఉండదు. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9:00 నుండి 9:08 వరకు జరుగుతుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment