
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.
ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment