IndusInd Bank
-
‘ఇండస్ఇండ్లో వాటా పెంపునకు అనుకూల సమయం’
ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ధర ఇటీవల భారీగా పతనం కావడంతో ప్రమోటర్లు వాటాలు పెంచుకునేందుకు ఇది అనుకూల తరుణమని ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ఛైర్మన్ అశోక్ హిందుజా అన్నారు. హిందుజా గ్రూప్ పెట్టుబడుల సంస్థ ‘ఐఐహెచ్ఎల్’ ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్లో 16 శాతం వాటాతో ప్రమోటింగ్ సంస్థగా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ ఇటీవలే సూత్రప్రాయ ఆమోదం తెలపడం గమనార్హం.బ్యాంక్ ఖాతాల్లో రూ.2,100 కోట్ల విలువ మేర వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇటీవలే వెలుగు చూడడం, అనంతరం సంస్థ నికర విలువ (నెట్వర్త్) తగ్గిపోవడం తెలిసిందే. అయినప్పటికీ ప్రమోటర్ల నుంచి బ్యాంక్ నిధుల సాయం కోరలేదని అశోక్ హిందుజా తెలిపారు. అవసరమైతే బ్యాంక్కు నిధులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ 15 శాతానికి పైన సౌకర్యంగానే ఉందన్నారు. ఈ ధరలో తాను మాత్రమే కాదని, ఏ వాటాదారుడు అయినా వాటా పెంచుకోవాలనే అనుకుంటారని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తాజా ఆటోమొబైల్ అప్డేట్స్బ్యాంక్ ఖాతాల్లో వ్యత్యాసంపై వాస్తవాలను తేల్చేందుకు ఆడిటింగ్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, మార్చి నెలాఖరుకు అది రానున్నది. పీడబ్ల్యూసీ ఆడిటింగ్ నివేదికతో ఖాతాల్లో వ్యత్యాసానికి ఎవరు బాధ్యులన్నది తేలుతుందని అశోక్ హిందుజా అన్నారు. సీఎఫ్వో పదవి నుంచి గోదింద్జైన్ తప్పుకోవడం వెనుక కారణాలపై మీడియా ప్రశ్నించగా, వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. దూసుకెళ్తున్న ఇండస్ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు బలపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 73,830 వద్ద ప్రారంభమైంది. తరువాత ఆటో, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో పుంజుకుంది.ఉదయం 9.25 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 412 పాయింట్ల లాభంతో 72,245 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా 135 పాయింట్లు లాభపడి 22,533 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 5 శాతం లాభపడింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా 2 - 3 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ సోమవారం ఇంట్రాడేలో 0.5 శాతం పెరిగింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ పరిస్థితి ఏంటి?
ప్రైవేటు రంగానికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్లో బయటపడిన అవకతవకలు.. వాటి చుట్టూ అల్లుకున్న ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పందించింది. ప్రస్తుతం ఆ బ్యాంకు పరిస్థితి ఏంటి..? డిపాజిటర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా..? అనే దానిపై ఆర్బీఐ తాజాగా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.భయపడాల్సిన పని లేదుఇండస్ ఇండ్ బ్యాంక్ పరిస్థితి గురించి భయపడాల్సిన పని లేదంటూ ఆర్బీఐ డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చింది. స్పెక్యులేటివ్ రిపోర్టులపై స్పందించవద్దని సెంట్రల్ బ్యాంక్ కోరింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని ఆర్బీఐ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ మంచి క్యాపిటలైజేషన్ కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపింది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ఆడిటర్ సమీక్షించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. బ్యాంక్ సౌకర్యవంతమైన క్యాపిటల్ అడెక్వసీ రేషియో 16.46 శాతం, ప్రొవిజన్ కవరేజ్ రేషియో 70.20 శాతంగా ఉంది. 2025 మార్చి 9 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సిఆర్) 113 శాతంగా ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.ఇండస్ ఇండ్ బ్యాంక్ తన ప్రస్తుత వ్యవస్థలను సమీక్షించడానికి, అకౌంటింగ్ తప్పిదం వాస్తవ ప్రభావాన్ని త్వరగా అంచనా వేయడానికి, లెక్కించడానికి ఇప్పటికే ఒక బాహ్య ఆడిట్ బృందాన్ని నియమించింది. వాటాదారులందరికీ అవసరమైన వివరాలను వెల్లడించిన తర్వాత ప్రస్తుత త్రైమాసికంలో అంటే 2025 ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి నివారణ చర్యలను పూర్తి చేయాలని బ్యాంకు బోర్డు, యాజమాన్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తప్పిదంఇండస్ఇండ్ బ్యాంక్ తన పోర్ట్ఫోలియోలోని ఆస్తులు, అప్పుల ఖాతాలకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్షలో కొన్ని "లోపాలు" కనిపించాయని మార్చి 2025 మార్చి 10న వెల్లడించింది. 2024 డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువలో ఈ లోపం ప్రతికూల ప్రభావం సుమారు 2.35% ఉంటుందని అంతర్గత సమీక్ష అంచనా వేసింది. పన్ను అనంతరం దాదాపు రూ.1,600 కోట్లు, పన్నుకు ముందు రూ.2,100 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని అంచనా. -
ఇండస్ఇండ్లో అవకతవకలపై ఐసీఏఐ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఆర్థిక అవకతవకలపై ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమీక్షించే అవకాశం ఉన్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రెసిడెంట్ చరణ్జ్యోత్ సింగ్ నందా తెలిపారు. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) దీన్ని చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో రూ.2,100 కోట్ల మేర వ్యత్యాసాన్ని గుర్తించినట్లు బ్యాంక్ ఇటీవల ప్రకటించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఇండస్ఇండ్ వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కూడా ప్రాథమిక విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. -
నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
ఫ్లాటుగా ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 452 పాయింట్లు పతనమై సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 145 పాయింట్లు క్షీణించి 22,315 వద్ద కనిష్టాన్ని తాకింది. అమెరికా మాంద్యం భయాలతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు భారీ క్షీణత(27%), ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో నష్టాలు మరింత అధికమయ్యాయి. అయితే అఖరిగంటలో అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంకు(2.50%), రిలయన్స్ (1%), ఎయిర్టెల్ (2%) షేర్లు రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనానికి దారితీయోచ్చనే ఆందోళనలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
ఇండస్ఇండ్ ఇన్వెస్టర్లకు షాక్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల నిర్వహణలో రూ. 2,100 కోట్లమేర అంతరం నమోదైనట్లు తాజాగా ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. అయితే బ్యాంక్వద్ద తగినంత రిజర్వులు, మూలధనం ఉండటంతో కవర్ చేసుకోగలమని పేర్కొంది. అయితే యాజమాన్యం హామీ ఇచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండస్ఇండ్ షేరు 10% పతనమైంది. ఆపై మరింత బలహీనపడుతూ 20% సర్క్యూట్ను తాకింది. సర్క్యూట్ నుంచి రిలీజ్ అయ్యాక మరింత దిగజారింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి 27% కుప్పకూలి రూ. 657 వద్ద నిలిచింది. ఒక దశలో రూ. 649 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఏం జరిగిందంటే? ఖాతాలో వ్యత్యాసాన్ని గతేడాది(2024) సెప్టెంబరు– అక్టోబర్లో గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కథ్పాలియా పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రాథమిక సమాచారాన్ని ఆర్బీఐకు గత వారమే నివేదించినట్లు తెలియజేశారు. అయితే తుది వివరాలు బయటి ఏజెన్సీతో చేయిస్తున్న ఆడిట్ ద్వారా వెల్లడికానున్నట్లు పేర్కొన్నారు. నివేదిక ఏప్రిల్ మొదట్లో వెలువడనున్నట్లు తెలియజేశారు. లాభదాయకత, మూలధన పటిష్టత నేపథ్యంలో ఈ ప్రభావాన్ని బ్యాంక్ సర్దుబాటు చేసుకోగలదన్నారు. 2024 ఏప్రిల్1కు ముందు 5–7ఏళ్లుగా డెరివేటివ్ పోర్ట్ఫోలియో ఖాతాలో తేడా నమోదవుతూ వచ్చిందని చెప్పారు. ఎక్స్ఛేంజీలకు సమాచారం...డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో కొన్ని అంతరాలున్నట్లు సోమవారం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. వీటి వల్ల బ్యాంక్ నెట్వర్త్పై 2.35 శాతంమేర ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు పేర్కొంది. అంతర్గత సమీక్ష ద్వారా ఈ అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. వీటిని స్వతంత్రంగా సమీక్షించి నిర్ధారించేందుకు బయటి ఏజెన్సీని ఎంపిక చేసినట్లు తెలిపింది.కాగా.. ట్రెజరీ బిజినెస్లో గుర్తించిన వ్యత్యాసం అంతర్గత, చట్టబద్ధ, ఆర్బీఐ ఆడిట్లలో బయటపడకపోవడం గమనార్హం! 2024 ఏప్రిల్ 1నుంచి డెరివేటివ్స్లో ఇంటర్నల్ ట్రేడ్ను నిలిపివేస్తూ 2023 సెప్టెంబరులో జారీ అయిన ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా అంతర్గత బుక్పై సమీక్షకు తెరతీసినట్లు సుమంత్ వెల్లడించారు. దీంతో బయటి ఆడిట్కు ఆదేశించినట్లు తెలియజేశారు. అయితే బ్యాంక్ ఎండీ, సీఈవోగా తిరిగి ఎంపిక చేయడంలో ఆర్బీఐపై ఈ అంశంప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు మూడేళ్ల కాలానికి ప్రతిపాదించగా.. గత వారం ఆర్బీఐ ఏడాది కాలానికే సుమంత్ బాధ్యతల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రూ. 19,000 కోట్లు ఆవిరి...షేరు భారీ పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు ఒక్కరోజులోనే రూ. 19,000 కోట్లమేర చిల్లుపడింది. ఈ నెల 10న నమోదైన రూ. 70,150 కోట్ల నుంచి బ్యాంక్ మార్కెట్ విలువ తాజాగా రూ. 51,168 కోట్లకు క్షీణించింది. బ్యాంక్ షేరు 2018 ఆగస్ట్లో రూ. 2038 వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. గతేడాది అంటే 2024 ఏప్రిల్ 8న రూ. 1,576 వద్ద నమోదైన గరిష్టం నుంచి తాజాగా 52 వారాల కనిష్టం రూ. 649ను తాకింది. వెరసి 59 శాతం పతనమైంది. ఫండ్స్ లబోదిబో ఇది ఇండెక్స్ షేరు కావడంతో 2025 ఫిబ్రవరికల్లా 35 మ్యూచువల్ ఫండ్స్ 360 పథకాల ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశాయి. 20.88 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. ఈ హోల్డింగ్స్ విలువ రూ. 20,670 కోట్లు కాగా.. షేరు తాజా పతనంలో రూ. 6,970 కోట్లు ఆవిరైంది. దీంతో హోల్డింగ్స్ విలువ రూ. 13,700 కోట్లకు పరిమితమైంది. ఇక ప్యాసివ్ ఫండ్స్ సైతం బ్యాంక్ షేర్ల పతనంతో ప్రభావితమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 2,202 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,805 కోట్లు ఆర్జించింది. మొండిబకాయిలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,719 కోట్ల నుంచి రూ. 13,530 కోట్లకు జంప్ చేసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 5,077 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 4.24 శాతం నుంచి 4.29 శాతానికి స్వల్పంగా మెరుగుపడ్డాయి. ఇతర ఆదాయం రూ. 2,011 కోట్ల నుంచి రూ. 2,282 కోట్లకు బలపడింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.61 శాతం నుంచి 0.57 శాతానికి నీరసించాయి. ప్రొవిజన్లు రూ. 1,141 కోట్ల నుంచి రూ. 974 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.21 శాతంగా నమోదైంది. ఈ కాలంలో 3,500 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1% నష్టంతో రూ. 1,421 వద్ద ముగిసింది. -
మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్!
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు 'ఇండస్ఇండ్' (IndusInd) 'ఇండీ' (INDIE) పేరుతో ఓ కొత్త యాప్ పరిచయం చేసింది. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీని ఉపయోగమేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండస్ఇండ్ బ్యాంక్ పరిచయం చేసిన ఈ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా అద్భుతమైన డిజిటల్ అనుభవం పొందవచ్చు. బ్యాంక్ డిజిటల్ స్ట్రాటజీ 2.0ని వేగవంతం చేసే దిశగా INDIE ప్రారంభమైంది. ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఇండీ మొబైల్ యాప్ గురించి తెలుసుకోవలసిన అంశాలు.. ఇండీ యాప్ అనేది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా రూ. 5 లక్షల వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టదు, కావున వినియోగదారుడు తన అవసరానికి కావాల్సిన మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తీసుకున్న లోన్ ఆధారంగా వడ్డీ కూడా ఉంటుంది. ఈ యాప్ అత్యంత పారదర్శకమైన రివార్డ్ ప్రోగ్రామ్ను కూడా అందిస్తుంది, కస్టమర్లు టాప్ ఈ కామర్స్ బ్రాండ్ల నుంచి తమకు ఇష్టమైన బ్రాండ్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇండీ యాప్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ అందించే అన్ని సర్వీసులను పొందవచ్చు. అకౌంట్ నెంబర్ ఎంచుకోవడం, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ వంటి సర్వీసులను పొందవచ్చు. కస్టమర్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లను సేవింగ్స్ ఖాతాకు లింక్ చేసుకోవచ్చు. కావున కస్టమర్ల వద్ద సేవింగ్స్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్తో చెల్లించవచ్చు. ఈ యాప్ చాలా సెక్యూరిటీ అందిస్తుంది. దీని ద్వారా నంబర్లెస్ డెబిట్ కార్డ్లు పొందవచ్చు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం జూమ్.. భారీగా పెరిగిన ఆదాయం
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్చేసి రూ. 2,124 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,631 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం సహకరించాయి. మొత్తం ఆదాయం రూ. 10,113 కోట్ల నుంచి రూ. 12,939 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 4,867 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా మెరుగుపడి 4.29 శాతానికి చేరాయి. ఇతర ఆదాయం 14 శాతం వృద్ధితో రూ. 2,210 కోట్లుగా నమోదైంది. ప్రొవిజన్లు రూ. 1,251 కోట్ల నుంచి రూ. 991 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.35 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.67 శాతం నుంచి 0.58 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు నామ మాత్రంగా తగ్గి రూ. 1,390 వద్ద క్లోజైంది. -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
జీ, ఇండస్ఇండ్ మధ్య సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంకుతో అన్ని రకాల వివాదాలనూ పరిష్కరించుకున్నట్లు మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) తాజాగా వెల్లడించింది. రెండు పార్టీలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. జీల్కు వ్యతిరేకంగా చేపట్టిన దివాలా చర్యలపై ఫిబ్రవరి 24న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) నిలిపివేసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు అన్ని రకాల వివాదాలకూ తెరదించే బాటలో సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు జీల్ పేర్కొంది. కాగా.. రూ. 83 కోట్ల రుణ చెల్లింపులలో విఫలంకావడంతో జీల్పై దివాలా చర్యలు తీసుకోమని అభ్యర్థిస్తూ గతేడాది ఫిబ్రవరిలో ఇండస్ఇండ్.. ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన ఎన్సీఎల్టీ.. సంజీవ్ కుమార్ జలాన్ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్గా ఎంపిక చేసింది. (అచ్చం యాపిల్ స్మార్ట్వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) తదుపరి ఎన్సీఎల్టీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా ఎన్సీఎల్ఏటీలో ఫిర్యాదు చేశారు. ఆపై ఎన్సీఎల్ఏటీ ఈ అంశాలపై స్టే ఇచ్చింది. ఎస్సెల్ గ్రూప్ మల్టీసిస్టమ్ ఆపరేటర్ సిటీ నెట్వర్క్స్ తీసుకున్న రుణాల వైఫల్యం దీనికి నేపథ్యంకాగా.. ఈ రుణాలకు జీల్ గ్యారంటర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. (హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్!
ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం... ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై సాధారణ ప్రజలకు 3.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ చదవండి: New IT Rules: ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే.. ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మూడు నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్పై అత్యధిక వడ్డీ సాధారణ ప్రజలకు 7.75 శాతం, అదే సీనియర్ సిటిజన్లకైతే 8.25 శాతం ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పెరిగిన వడ్డీరేట్లు మార్చి 18 నుంచి అమలులోకి వస్తాయి. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఇలా.. 7 నుంచి 30 రోజుల వ్యవధి డిపాజిట్లపై 3.5 శాతం, 31 నుంచి 45 రోజుల వ్యవధి డిపాజిట్లపై 4 శాతం, 46 నుంచి 60 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.5 శాతం, 61 నుంచి 90 రోజుల వ్యవధి డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ ఉంటుంది. ఇదీ చదవండి: Byju’s: మాస్టారు మామూలోడు కాదు.. సీక్రెట్ బయటపెట్టిన బైజూస్ రవీంద్రన్! 91 నుంచి 120 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4.75 శాతం, 121 నుంచి 180 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5 శాతం, 181 నుంచి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే దేశీయ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. అలాగే 211 నుంచి 269 రోజుల వ్యవధి డిపాజిట్లపై 5.80 శాతం, 270 నుంచి 354 రోజుల వ్యవధి డిపాజిట్లపై 6 శాతం, 355 నుంచి 364 రోజుల వ్యవధితో చేసిన డిపాజిట్లపై 6.25 శాతం అందిస్తుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
ఇండస్ఇండ్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 58 శాతం జంప్చేసి రూ. 1,964 కోట్లను తాకింది. రుణాల నాణ్యత మెరుగుపడటం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 4,495 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 0.17 శాతం మెరుగై 4.27 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం సైతం రూ. 1,877 కోట్ల నుంచి రూ. 2,076 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 1,654 కోట్ల నుంచి రూ. 1,065 కోట్లకు క్షీణించాయి. క్యూ2 (జూలె–సెప్టెంబర్)తో పోలిస్తే తాజా స్లిప్పేజీలు రూ. 1,572 కోట్ల నుంచి రూ. 1,467 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.11 శాతం నుంచి 2.06 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.01 శాతానికి చేరింది. ఈ కాలంలో 1,800 మందికి ఉపాధి కల్పించినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా తెలియజేశారు. తొలి 9 నెలల్లో 8,500 మందిని జత చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్ మొత్తం సిబ్బంది సంఖ్య 37,870కు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు బీఎస్ఈలో 0.7% క్షీణించి రూ. 1,222 వద్ద ముగిసింది. చదవండి: కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్! -
ఇండస్ ఇండ్ ఫలితాలు ఆకర్షణీయం!
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంకు జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,631 కోట్లుగా నమోదైంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయి. బ్యాంకు ఆదాయం సైతం రూ.10,113 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,016 కోట్లు, ఆదాయం రూ.9,298 కోట్లుగా ఉన్నాయి. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ.8,182 కోట్లకు చేరింది. స్థూల నినర్థక ఆస్తులు (ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 2.35 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి ఉన్న 2.88 శాతంతో చూస్తే కొంచెం తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.84 శాతం (రూ.1,760 కోట్లు) నుంచి 0.67 శాతానికి (రూ.1,661 కోట్లు) క్షీణించాయి. మార్చి త్రైమాసికం చివరికి ఉన్న నికర ఎన్పీఏలు 0.64 శాతం (రూ.1,530 కోట్లు)తో పోల్చి చూస్తే స్వల్పంగా పెరిగాయి. ప్రొవిజన్లు, కంటెంజెన్సీలకు చేసిన కేటాయింపులు తగ్గినట్టు ఇండస్ఇండ్ బ్యాంకు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో రూ.1,251 కోట్లను కేటాయించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,779 కోట్లను కేటాయించడం గమనించాలి. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో కేటాయింపులు రూ.1,461 కోట్లుగా బీఎస్ఈలో బ్యాంకు షేరు ఒక శాతం లాభంతో రూ.879 వద్ద క్లోజయింది. -
తప్పు చేస్తే వేటే..ఉద్యోగులకు ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్నింగ్!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహిస్తున్న అక్రమ రెమిటెన్స్ల కేసు విచారణలో తమ ఉద్యోగులెవరైనా దోషులుగా తేలిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ పాత కేసు గురించి మీడియాలో వార్తలు రావడంతో తాజా వివరణ ఇస్తున్నట్లు పేర్కొంది. 2011–2014 మధ్యలో దిగుమతి లావాదేవీలకు సంబంధించిన రెమిటెన్సుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలకు సంబంధించి కొన్ని సంస్థలపై ఈడీ విచారణ జరుపుతోందని వివరించింది. విచారణ వార్తలతో బీఎస్ఈలో బుధవారం ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 3.42% క్షీణించి రూ. 817.75 వద్ద క్లోజయ్యింది. చదవండి: మీకు తెలియకుండా.. మీ పేరు మీద ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా! -
కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంకులకు ఆర్బీఐ షాక్!
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించకపోవడం దీనికి కారణమని పేర్కొంది. నాలుగు సహకార బ్యాంకులపై కూడా జరిమానాను విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే కస్టమర్ ప్రొటెక్షన్ బాధ్యతలకు సంబంధించి ఆదేశాలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ. 1.05 కోట్ల పెనాల్టీ విధించినట్లు ప్రకటన పేర్కొంది. నిర్దిష్ట నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలను పాటించనందుకు ఇండస్ఇండ్ బ్యాంక్పై రూ. 1 కోటి జరిమానా విధించినట్లు వివరించింది. నవ్ జీవన్ కో–ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ధాకురియా కోఆపరేటివ్ బ్యాంక్ (కోల్కతా), ది పళని కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ జరిమానా విధించినట్లు తెలిపింది. -
‘జీ’పై ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్
న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్ కేసులో మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)పై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశ్రయించింది. జీఎల్ రూ. 83.08 కోట్లు డిఫాల్ట్ అయినట్లు పేర్కొంది. దీనిపై ముంబైలోని ఎన్సీఎల్టీకి ఇండస్ఇండ్ బ్యాంక్ దరఖాస్తు సమర్పించినట్లు జీల్ వెల్లడించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ సిటీ నెట్వర్క్స్ పొందిన రుణానికి సంబంధించి బ్యాంకు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోందని, న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు చర్యలు ప్రారంభించిందని జీల్ పేర్కొంది. దీనిపై న్యాయపరంగా తగు చర్యలు తీసుకుంటామని వివరించింది. దివాలా కోడ్లోని (ఐబీసీ) సెక్షన్ 7 ప్రకారం రూ. 1 కోటికి పైగా రుణాలను ఎగవేసిన సంస్థలపై సీఐఆర్పీ కింద చర్యలు తీసుకోవాలంటూ రుణదాతలు .. కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. గతేడాది డిసెంబర్ 22న సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్తో జీల్ విలీనమైన సంగతి తెలిసిందే. -
ఎన్నారైలకు శుభవార్త ! రెమిటెన్సులు ఇకపై సులభం
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ వారి నుంచి భారతీయులు ఇక మరింత సులభంగా డబ్బును అందుకునే (రెమిటెన్సులు) వెసులుబాటు ఏర్పడింది. లబ్ధిదారుల యూపీఐ ఐడీలను ఉపయోగించడం ద్వారా సరిహద్దు నగదు బదిలీని సులభతరం చేయడానికి ఉద్దేశించి ఎన్పీసీఐతో (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇండస్ఇండ్ బ్యాంక్ అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. తాజా చొరవతో రెమిటెన్సులు లేదా ఎన్ఆర్ఐ చెల్లింపుల కోసం యూపీఐ ఐడీని వినియోగంలోకి తీసుకువస్తున్న తొలి భారతీయ బ్యాంక్గా ఇండస్ఇండ్ నిలవనుందని ప్రకటన వివరించింది. ఈ విధానం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఆపరేటర్లు (ఎంటీఓ).. ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపు వ్యవస్థలో అనుసంధానం కావడానికి, లబ్దిదారుల ఖాతాల్లోకి రెమిటెన్సుల చెల్లింపులకు ఇండస్ఇండ్ బ్యాంక్ చానెల్ని వినియోగించుకుంటారు. థాయ్లాండ్తో ప్రారంభం థాయ్లాండ్తో తన తాజా రెమిటెన్సుల విధానాన్ని బ్యాంక్ ప్రారంభించింది. ఇందుకుగాను థాయ్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ సేవల సంస్థ– ‘డీమనీ’ సేవలను బ్యాంక్ వినియోగించుకోనుంది. నగదు బదిలీ, విదేశీ కరెన్సీ మార్పిడికి సంబంధించి డీమనీ అత్యుత్తమ సేవలను అందిస్తోంది. డీమనీ వెబ్సైట్లో భారతదేశంలోని లబ్ధిదారుల యూపీఐ ఐడీలను జోడించి, విదేశాల్లోని భారతీయులు ఎవరైనా సులభంగా నిధులను బదిలీ చేయవచ్చు. డీమనీ తరహాలోనే వివిధ దేశాల్లోని అత్యుత్తమ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది. భారత్దేశంలోని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ల వివరాలతో పనిలేకుండా కేవలం వారి యూపీఐ ఐడీలను యాడ్ (జోడించడం) చేసుకోవడం ద్వారా ఎన్ఆర్ఐలు తేలిగ్గా నిధుల బదలాయింపు జరపడంలో తమ చొరవ కీలకమైనదని ప్రకటనలో బ్యాంక్ హెడ్ (కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్) సౌమిత్ర సేన్ పేర్కొన్నారు. యూపీఐ వినియోగించే అంతర్జాతీయ పర్యాటకులకు తాజా ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీన్ రాయ్ పేర్కొన్నారు. యూపీఐ ద్వారా రెమిటెన్సులకు సంబంధించి తాజా చొరవ గొప్ప ముందడుగని కూడా ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: విదేశాల్లో ఉద్యోగానికి సై.. ఐటీదే ఆధిపత్యం -
భారత్ ఫైనాన్షియల్ ఎండీ, ఈడీల రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్లో భాగమైన భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ (బీఎఫ్ఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో శలభ్ సక్సేనా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సీఎఫ్వో ఆశీష్ దమానీ తమ పదవులకు రాజీనామా చేశారు. పోటీ కంపెనీ అయిన సూక్ష్మ రుణాల సంస్థ స్పందన స్ఫూర్తిలో (ఎస్ఎస్ఎఫ్ఎల్) వారు చేరనున్నట్లు సమాచారం. సక్సేనా, దమానీ నవంబర్ 25న తమ తమ పదవులకు రాజీనామా చేసినట్లు ఎక్సే్చంజీలకు బీఎఫ్ఐఎల్ సోమవారం తెలియజేసింది. తాత్కాలికంగా ఈడీ హోదాలో జే శ్రీధరన్ను, రోజు వారీ కార్యకలాపాల పర్యవేక్షణకు శ్రీనివాస్ బోనం ను నియమించినట్లు పేర్కొంది. సక్సేనా, దమానీల విషయంలో కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. సక్సేనాను ఎండీ–సీఈవోగా, దమానీని ప్రెసిడెంట్–సీఎఫ్వోగా నియమించినట్లు ఎస్ఎఫ్ఎఫ్ఎల్ నవంబర్ 22న ప్రకటించింది. అయితే, వారు తమ సంస్థలో రాజీనామా చెయ్యలేదంటూ ఆ మరుసటి రోజైన నవంబర్ 23న బీఎఫ్ఐఎల్ తెలిపింది. ఒకవేళ చేస్తే.. నిర్దిష్ట షరతులకు అనుగుణం గా వారు వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. నోటీసు పీరియడ్, పోటీ సంస్థలో చేరకూడదు వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటికైతే మాత్రం వారిద్దరూ తమ సంస్థలోనే కొనసాగుతున్నారని బీఎఫ్ఐఎల్ స్పష్టం చేసింది. కస్టమర్ల సమ్మతి లేకుండా సాంకేతిక లోపం వల్ల 84,000 రుణాలు మంజూరైన అంశంపై సమీక్షలో సహకరిస్తామంటూ వారు చెప్పినట్లు పేర్కొంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సక్సేనా, దమానీకి వర్తింపచేసే నిబంధనల అమలుపై బీఎఫ్ఐఎల్ వివరణ ఇవ్వలేదు. -
ఇండస్ఇండ్.. రయ్ లాభం 73 శాతం జూమ్
ముంబై: ప్రైవేటు రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంకు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో పనితీరు మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్గా నికర లాభం 73 శాతం పెరిగింది. రూ.663 కోట్ల లాభాన్ని బ్యాంకు ప్రకటించింది. రుణాల్లో వృద్ధికితోడు, ఎన్పీఏలకు (వసూలు కాని మొండి రుణాలు) కేటాయింపులు తగ్గడం లాభం పెరిగేందుకు దోహదపడింది. సూక్ష్మ, వాహన రుణ విభాగం లో ఒత్తిళ్లు ఉన్నట్టు బ్యాంకు ప్రకటించింది. ► నికర వడ్డీ ఆదాయం 12 శాతం పెరిగి రూ.3,658 కోట్లకు చేరింది. ► నికర వడ్డీ మార్జిన్ 4.07 శాతంగా ఉంది. ► ఫీజుల రూపంలో ఆదాయం రూ.1,554 కోట్ల నుంచి రూ.1,838 కోట్లకు పెరిగింది. ► సెప్టెంబర్ త్రైమాసింకలో రూ.2,658 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ► స్థూల ఎన్పీఏలు 2.77 శాతానికి చేరాయి. ఇవి అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి 2.21శాతంగా ఉంటే, ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరికి 2.88 శాతంగా ఉన్నాయి. ► కేటాయింపులు రూ.1,703 కోట్లకు తగ్గాయి. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్ఇండ్ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇండస్ఇండ్ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్టివి) రుణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్ ఇండ్ భాగస్వామ్యంతో ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు. అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా కస్టమర్పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పథకాల నిమిత్తం టాటా మోటార్స్తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టీఏ రాజగోప్పలన్ తెలిపారు. -
కార్వీ స్కామ్, తీసుకున్న రుణాలు ఎగ్గొట్టేందుకు కుట్ర.?!
ప్రముఖ స్టాక్ మార్కెట్ సంస్థ కార్వీపై షేర్లను తనఖా పెట్టి రుణం తీసుకుందని హెచ్డీఎఫ్సీ,ఇండస్ ఇండ్ బ్యాంక్లు ఫిర్యాదు చేశాయి. కార్వీపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. షేర్లను ఉంచుకొని రుణాలు మంజూరు చేయాలని ధరఖాస్తు చేసుకొని తరువాత అసలు,వడ్డీ చెల్లించకుండా మోసం చేసిందని హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు వేర్వేరుగా ఫిర్యాదు చేశాయి. రూ.329.16 కోట్ల షేర్లను తనఖా పెట్టి హెచ్డీఎఫ్సి వద్ద రుణం తీసుకుంటే.. ఇండస్ ఇండ్ బ్యాంక్ లో రూ. 137కోట్ల రుణం తీసుకొని ఎగవేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రుణం తీసుకున్న తర్వాత కొద్దినెలలు వాయిదాలు చెల్లించి రుణాల్ని ఎగవేయడంలో వెన్నతో పెట్టిన విద్య అని బ్యాంక్లు అంటున్నాయి. 2019 సెప్టెంబరులో కార్వీసంస్థపై ఫిర్యాదుతో రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేదం విధించింది. వినియోగదారుల షేర్లను కార్వీసంస్థ అక్రమంగా సొంత లాభానికే వాడుకుంటుందంటూ సెబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించింది. వందల కొద్ది షేర్లు నకిలీవి ఉన్నాయంటూ నివేదికలో తెలిపింది. దీంతో కార్వీ సంస్థ బ్యాంకుల్లో ఉంచిన షేర్ల లావాదేవీలు ఒక్కసారిగా స్తంభించాయి. మరోవైపు తాము ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు అవసరమైన పత్రాల్ని సమర్పించాలంటూ కార్వీ డైరెక్టర్లకు హెచ్డీఎఫ్ అధికారులు నోటీసులు పంపారు. అయితే నెలలు గడుస్తున్నా పత్రాలు ఇవ్వలేదని బ్యాంక్ ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే రుణాల్ని ఎగవేత వేయడంతో పాటూ బ్యాంకుల్ని దారుణంగా వంచించారని, ప్రజల డబ్బుకు రక్షణగా ఉన్న తమపట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ కార్వీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ రెండు బ్యాంకులు కోరాయి. చదవండి : అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?! -
ఇండస్ఇండ్కు తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్నకు చెందిన బ్యాంక్ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం! 2019లో..: ప్రమోటర్ సంస్థలు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, ఇండస్ఇండ్ లిమిటెడ్కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫైనాన్స్ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్పై కోటక్ కన్ను!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్ డీల్గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎల్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ను కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్ కానుంది. కేఎంబీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది. అవకాశాలు పరిశీలిస్తుంటాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా గ్రూప్ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్ఇండ్) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్ చెప్పారు. డీల్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది. -
ఇండస్ఇండ్పై కొటక్ మహీంద్రా కన్ను?!
హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్పై ప్రయవేట్ రంగ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ దృష్టి సారించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్ స్టాక్ డీల్(షేర్ల మార్పిడి) ద్వారా ఒప్పందం కుదుర్చుకునే వీలున్నట్లు వార్తలు వెలువడ్డాయి. సంయుక్త సంస్థలో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్ కొంతమేర వాటాను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై వ్యాఖ్యలు చేయబోమంటూ కొటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి స్పందించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇక మరోపక్క.. ఇవి వట్టి పుకార్లు మాత్రమేనని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో సుమంత్ కథప్లియా కొట్టిపారేశారు. బ్యాంక్ యాజమాన్యం ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని, ఈ వార్తలు నిరాధారమని వివరించారు. డీల్ జరిగితే.. ఇటీవల ఆస్తుల(రుణ) నాణ్యతపై ఆందోళనలతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు డీలాపడుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఇండస్ఇండ్ షేరు 64 శాతం పతనమైంది. దీంతో బ్యాంక్ మార్కెట్ విలువలో 60 శాతం కోత పడినట్లు నిపుణులు తెలియజేశారు. ఒకవేళ ఇండస్ఇండ్ను కొటక్ మహీంద్రా బ్యాంక్ టేకోవర్ చేస్తే.. సంయుక్త సంస్థ ప్రయివేట్ రంగంలోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఆవిర్భవించే వీలున్నట్లు వివరించారు. బ్యాంక్ ఆస్తులు 83 శాతం పెరిగే అవకాశమున్నట్లు తెలియజేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇంతక్రితం 2014లో ఐఎన్జీ గ్రూప్ను 2 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇండస్ఇండ్ ప్రమోటర్లు హిందుజా గ్రూప్తో కొటక్ మహీంద్రా గ్రూప్ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. 11.2 బిలియన్ డాలర్ల విలువైన హిందుజా గ్రూప్లోని నలుగురు సోదరుల మధ్య విభేధాల నేపథ్యంలో బ్యాంక్ విక్రయానికి చర్చలు ప్రారంభమైనట్లు భావిస్తున్నాయి. హిందుజా సోదరులు ఇండస్ఇండ్లో వాటా పెంచుకునేందుకు చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది జూన్లో ఆర్బీఐ తిరస్కరించినట్లు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. షేర్ల తీరిలా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు యథాతథంగా రూ. 1,382 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1,399 వద్ద గరిష్టాన్ని, రూ. 1,372 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 2.4 శాతం జంప్చేసి రూ. 623 వద్ద కదులుతోంది. తొలుత గరిష్టంగా రూ. 633ను అధిగమించగా.. ఒక దశలో రూ. 617 వద్ద కనిష్టాన్ని చేరింది. -
టాటా కాఫీ- ఇండస్ఇండ్.. అదరహో!
విదేశీ మార్కెట్లు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. మరోవైపు ఇదే కాలంలో పటిష్ట పనితీరు చూపడంతో పానీయాల దిగ్గజం టాటా కాఫీ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాండెలోన్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం 68 శాతం క్షీణించింది రూ. 461 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 8681 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 72 శాతం పడిపోయి రూ. 602 కోట్లను తాకింది. స్థూల మొండిబకాయిలు 2.45 శాతం నుంచి 2.53 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు మాత్రం 1.23 శాతం నుంచి 0.86 శాతానికి తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.2 శాతం జంప్చేసి రూ. 549 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 565 వరకూ ఎగసింది. టాటా కాఫీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన టాటా కాఫీ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 36 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 26 శాతం పుంజుకుని రూ. 588 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం 65 శాతం వృద్ధితో రూ. 79 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో టాటా కాఫీ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11.5 శాతం దూసుకెళ్లి రూ. 93 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 97 వరకూ ఎగసింది. -
ఇండస్ఇండ్- యస్ బ్యాంక్.. జోరు
ప్రపంచ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 36 పాయింట్లు క్షీణించి 36,638కు చేరగా.. నిఫ్టీ 7 పాయింట్లు తక్కువగా 10,793 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల ప్రభావంతో ప్రయివేట్ రంగ సంస్థలు ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్లో యూఎస్ హెడ్జ్ ఫండ్.. రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాటాను పెంచుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 5.25 శాతం జంప్చేసి రూ. 554 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 558 వరకూ ఎగసింది. గత 7 ట్రేడింగ్ సెషన్లలోనూ ఈ షేరు 15 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! బ్యాలన్స్షీట్ను పటిష్ట పరచుకోవడంతోపాటు నిధుల సమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటీవల పలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇండస్ఇండ్లో రూట్ వన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ప్రస్తుతం 5.41 శాతం వాటా ఉంది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా ఈ వాటాను 9.9 శాతానికి పెంచుకునే యోచనలో రూట్ వన్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇందుకు బ్యాంక్ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇవ్వవలసి ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మరోవైపు బ్యాంక్ ప్రమోటర్లు సైతం తమ వాటాను ప్రస్తుత 14.34 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నిధుల సమీకరణ సన్నాహాల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 3 శాతం బలపడి రూ. 26.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 27 వరకూ పెరిగింది. బ్యాంక్ బోర్డుకి చెందిన పెట్టుబడుల పెంపు కమిటీ(సీఆర్సీ) ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా నిధుల సమీకరణకు అనుమతించినట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సీఆర్సీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలియజేసింది. -
ఇండస్ఇండ్- రామ్కో సిస్టమ్స్.. దూకుడు
కోవిడ్-19 ప్రభావంతో ఈ ఏడాది అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు ఫెడ్ వేసిన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 340 పాయింట్లు పతనమై 33,907ను తాకింది. తద్వారా 34,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 10,026 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీ సేవల కంపెనీ రామ్కో సిస్టమ్స్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ సెకండరీ మార్కెట్ ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రమోటర్లు పేర్కొనడంతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.3 శాతం జంప్చేసి రూ. 526 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి గరిష్టంగా రూ. 541కు చేరింది. వెరసి వరుసగా ఐదో రోజు లాభాలతో కదులుతోంది. గత వారం రోజుల్లో ఈ షేరు 30 శాతం దూసుకెళ్లడం విశేషం! అయితే గతేడాది ఆగస్ట్లో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 2038తో పోలిస్తే ఇప్పటికీ 73 శాతం పతనంలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మార్చి 24న రూ. 236 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి నుంచి చూస్తే రెట్టింపునకుపైగా ఎగసింది. కాగా.. ప్రస్తుతం ఇండస్ఇండ్లో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్లోనే ప్రమోటర్లు ఆర్బీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. రామ్కో సిస్టమ్స్ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ విజయ్ కిషన్లాల్ కేడియా ఈ నెల 10న రామ్కో సిస్టమ్స్ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.4 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ డేటా వెల్లడించింది. ఐటీ కన్సల్టింగ్ కంపెనీ రామ్కో సిస్టమ్స్లో వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా షేరుకి రూ. 87.82 ధరలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడియా సెక్యూరిటీస్ ద్వారా విజయ్ కేడియా రెప్రో ఇండియా, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సుదర్శన్ కెమికల్స్, సెరా శానిటరీ తదితర స్మాల్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రామ్కో సిస్టమ్స్ కౌంటర్కు డిమాండ్ పెరిగింది. వెరసి వరుసగా రెండో రోజు 20 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో రూ. 18.4 ఎగసి రూ. 110 వద్ద ఫ్రీజయ్యింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కలిపి ఇప్పటివరకూ 7 లక్షల షేర్లకుపైగా చేతులు మారినట్లు నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఈ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది. -
ఎస్బీఐ- ఇండస్ఇండ్.. పరుగు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) కౌంటర్కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ప్రమోటర్లు అదనపు వాటా కొనుగోలు చేయనున్న వార్తలతో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఎస్బీఐ షేరు తొలుత 6 శాతం జంప్చేసింది. రూ. 198 సమీపానికి చేరింది. ప్రస్తుతం 4 శాతం ఎగసి రూ. 195 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు తొలుత 8 శాతం దూసుకెళ్లి రూ. 456ను తాకింది. ప్రస్తుతం 6.5 శాతం లాభపడి రూ. 450 వద్ద ట్రేడవుతోంది. ఇతర వివరాలు చూద్దాం.. లాభాలు అప్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ. 3581 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన ఇది రికార్డ్కాగా.. ఇందుకు అనుబంధ విభాగం ఎస్బీఐ కార్డ్స్లో వాటా విక్రయం ద్వారా సమకూరిన రూ. 2731 కోట అదనపు ఆదాయం సహకరించింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22766 కోట్లకు పరిమితంకాగా.. స్థూల, నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 6.15 శాతం, 2.23 శాతానికి చేరాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్ ద్వారా ప్రమోటర్ గ్రూప్ అదనపు షేర్లను కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు ఇండస్ఇండ్ బ్యాంక్ కౌంటర్కు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతం వరకూ పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్లో ప్రమోటర్లు రిజర్వ్ బ్యాంక్నకు దరఖాస్తు చేసుకున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మెన్ శాక్స్ సింగపూర్ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్) ప్రయివేటు రంగ దిగ్గజబ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ జోరుమీదుంది. గురువారం ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్ 8.47 శాతం పెరగడం విశేషం. ఓపెన్ మార్కెట్లో గోల్డ్మెన్ శాక్స్ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంక్ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్టైమ్ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్ఇండ్ బ్యాంక్ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్ఇండ్ బ్యాంక్ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. -
‘సంపద’కు కేరాఫ్.. రిలయన్స్
న్యూఢిల్లీ: గడిచిన ఐదు సంవత్సరాల్లో... అంటే 2014–19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్ ఓస్వాల్ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014–19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్ 3 కంపెనీలుగా ఆర్ఐఎల్, ఇండియా బుల్స్ వెంచర్స్, ఇండస్ఇండ్ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్ వెంచర్స్ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్–10 సంపద సృష్టికర్తల్లో బజాజ్ ఫైనాన్స్ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్ ఇండ్ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్ కాంపౌండెడ్ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది. ఫైనాన్షియల్ రంగం ముందంజ... ఫైనాన్షియల్ రంగం 2014–19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, పవర్గ్రిడ్ కార్పొరేషన్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్ఐసీ హౌసింగ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎన్బీసీసీ. 2014–19 మధ్య కాలంలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రూపొందించింది. శ్రీమంతుల సగటు సంపద రూ.3.6 కోట్లే విశ్రాంత జీవనానికి నెలకు రూ.93,000 స్టాండర్డ్ చార్టర్డ్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సగటు ఐశ్వర్యం రూ.3.6 కోట్లేనని, విశ్రాంత జీవన కాలంలో ప్రతి నెలా వెచ్చించేందుకు వారికి రూ.93,000 మాత్రమే ఉంటున్నదని స్టాండర్డ్ చార్టర్డ్ ‘సంపద అంచనా నివేదిక 2019’ తెలియజేసింది. ఇందులో వర్ధమాన సంపన్నుల వద్ద సగటున రూ.1.3 కోట్లు, సంపన్నుల వద్ద రూ.2.6 కోట్లు, అధిక సంపన్నుల(హెచ్ఎన్డబ్ల్యూఐ) వద్ద రూ.6.9 కోట్ల మేర వారి రిటైర్మెంట్ నాటికి ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన ఒక్కో సంపన్నుని వద్ద రిటైర్మెంట్ సమయంలో ప్రతీ నెలా వ్యయం చేసేందుకు రూ.93,000 ఉంటుందని పేర్కొంది. ఈ నిధిని వారి కోరిక మేరకు సగటున నెలవారీగా వ్యయం చేస్తూ వెళితే మాత్రం వర్ధమాన సంపన్నులకు ఆరేళ్ల పాటు, సంపన్నులకు తొమ్మిదేళ్లు, హెచ్ఎన్డబ్ల్యూఐలకు ఐదేళ్ల పాటే సరిపోతుందని నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లు తదితర అంశాలతో ఎంత సంపదను సమకూర్చుకోగలరు? రిటైర్మెంట్ సమయంలో ప్రతినెలా ఎంత మొత్తంతో వారు జీవించగలరు? అనే గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది. -
ఆల్టైమ్ హైకి సెన్సెక్స్
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇండెక్స్లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్కు ఒక పాయింట్ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. రోజంతా లాభాలే..:లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్టైమ్ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ ఆల్టైమ్ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగబాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. కొనసాగిన ‘రిలయన్స్’ రికార్డ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రికార్డ్ల మీద రికార్డ్లు సృష్టిస్తోంది. షేర్ ఆల్టైమ్ హై, మార్కెట్ క్యాప్ రికార్డ్లు బుధవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో 4.1 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,572ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,547 వద్ద ముగిసింది. ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో టారిఫ్లను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇక ఈ కంపెనీ మార్కెట్ క్యాప్(ఈ కంపెనీ మొత్తం షేర్లను ప్రస్తుత ధర వద్ద గుణిస్తే వచ్చే మొత్తం) రూ.10 లక్షల కోట్ల మార్క్కు చేరువయింది. మార్కెట్ ముగిసేనాటికి రూ.9,80,700 కోట్ల మార్కెట్ క్యాప్తో అత్యధిక మార్కెట్ క్యాప్ గల భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,96,415 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ (13,600 కోట్ల డాలర్లు) బ్రిటిష్ ఇంధన దిగ్గజం, బీపీపీఎల్సీని దాటేసింది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్కు ముందు బీపీపీఎల్సీ మార్కెట్ క్యాప్ 13,000 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంది. -
ఇండస్ఇండ్ లాభం రూ.1,401 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 52 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.920 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,401 కోట్లకు పెరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, నికర లాభం స్వల్పంగా తగ్గిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్ తక్కువ వృద్ధిని నమోదు చేయడం దీనికి కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,755 కోట్ల నుంచి రూ.8,878 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4.1 శాతం నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.2,909 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి తెలిపారు. సీక్వెన్షియల్గా చూస్తే, నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడి 4.1 శాతానికి ఎగసిందని వివరించారు. 21 శాతం రుణ వృద్ధి సాధించామని, ఇది బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి అని, మందగమనం ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండగలదని అంచనా వేస్తున్నామన్నారు. ఎగబాకిన మొండిబకాయిలు... నికర లాభం, ఆదాయాలతో పాటు బ్యాంక్ మొండి బకాయిలు కూడా పెరిగాయి. రుణ నాణ్యత వార్షికంగా, సీక్వెన్షియల్గా చూసినా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 1.09 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 2.19 శాతానికి పెరిగాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అలాగే నికర మొండి బకాయిలు 0.48 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.725 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,102 కోట్లకు పెరిగాయని తెలిపారు. దీంట్లో కంపెనీల తాజా మొండి బకాయిలు 174 శాతం, రిటైల్ రుణాలకు సంబంధించిన తాజా మొండి బకాయిలు 13 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు రూ.590 కోట్ల నుంచి 71 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరాయని వివరించారు. ఈ క్యూ1లో 43 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ క్యూ2లో 50 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. నికర లాభం, ఆదాయం పెరిగినా, మొండి బకాయిలు రెట్టింపై రుణనాణ్యత క్షీణించడంతో ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు 6.1 శాతం నష్టంతో రూ. 1,229 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ను... వీడని ఐఎల్ఎఫ్ఎస్ కష్టాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ను ఐఎల్అండ్ఎఫ్ఎస్ రుణ కష్టాలు ఇంకా వీడలేదు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో బ్యాంక్ రూ.985 కోట్ల నికర లాభం సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.936 కోట్ల లాభంతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. సాధారణంగా ఈ బ్యాంక్ ప్రతి క్వార్టర్లోనూ 20–25 శాతం వృద్ధిని సాధించేది. గత రెండు క్వార్టర్లలో నికర లాభం వృద్ధి తగ్గుతూ వస్తోంది. ఐఎల్అండ్ఎఫ్ఎస్కు ఈ బ్యాంక్ రూ.3,000 కోట్ల మేర రుణాలివ్వడమే దీనికి ప్రధాన కారణం. అది మినహాయిస్తే, మామూలుగానే.... గత క్యూ3లో రూ.5,474 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 32 శాతం వృద్ధితో రూ.7,232 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ రుణ కష్టాలను మినహాయిస్తే, తమ వ్యాపారం మామూలుగానే ఉందని వివరించారు. ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగిందని రమేశ్ సోబ్తి చెప్పారు. కార్పొరేట్, వాహన రుణాల జోరుతో రుణ వృద్ధి 35 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. మిశ్రమంగా మొండి బకాయిలు.. స్థూల మొండిబకాయిలు 1.16% నుంచి 1.13%కి తగ్గాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అయితే నికర మొండి బకాయిలు మాత్రం 0.46% నుంచి 0.59% కి పెరిగాయన్నారు. అంతకు ముందటి క్వార్టర్తో పోల్చితే స్థూల మొండి బకాయిలు 10% ఎగసి రూ.1,968 కోట్లకు చేరాయని, నికర మొండి బకాయిలు 31 శాతం పెరిగి రూ.1,029 కోట్లకు చేరాయని వివరించారు. కేటాయింపులు 157 శాతం పెరిగి రూ.607 కోట్లకు పెరిగాయని, సీక్వెన్షియల్గా చూస్తే, ఈ వృద్ధి 3% అని వివరించారు. తగ్గిన నికర వడ్డీ మార్జిన్... నికర వడ్డీ మార్జిన్ మాత్రం తగ్గిందని రమేశ్ సోబ్తి తెలిపారు. గత క్యూ3లో 3.99 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 3.83 శాతంగా ఉందని, ఈ క్యూ2లో 3.84 శాతమని పేర్కొన్నారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల కోసం ఈ క్యూ3లో రూ.255 కోట్లు కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. క్యూ2లో రూ.275 కోట్లు కేటాయింపులతో కలుపుకొని మొత్తం మీద ఈ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు రూ.600 కోట్ల మేర కేటాయింపులు జరిపామని వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలోఇండస్ఇండ్ »కê్యంక్ షేర్ 1.4 శాతం లాభపడి రూ.1,601 వద్ద ముగిసింది. -
ఫలితాలు, గణాంకాలు కీలకం!
ముంబై: ఐటీ కంపెనీల బోణీతో ఈ ఏడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. టీసీఎల్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థల ఫలితాలకు తోడు.. పలు జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాలు ఈవారంలో దేశీ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ గురువారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండగా.. ఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగిన 31వ సమావేశంలో పలు వస్తు, సేవలపై జీఎస్టీ రేటును కౌన్సిల్ తగ్గించిన నేపథ్యంలో ఈసారి సమావేశంపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఇక శుక్రవారం వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలపై కూడా ఇన్వెస్టర్లు కన్నేసివుంచారు. వీటితో పాటు ముడిచమురు, రూపాయి కదలికలు మార్కెట్ ట్రెండ్ను ప్రభావితం చేయనున్నాయని భావిస్తున్నారు. ఒడిదుడుకులకు అవకాశం.. ‘కార్పొరేట్ ఫలితాల అంశం కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగేందుకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనుండగా.. ఇక్కడ నుంచి అందే సంకేతాలు, క్రూడ్ ధరల కదలికలు, రూపాయి మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయి.’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేషన్, దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనం.. పట్టణ, గ్రామీణ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్య లభ్యత కారణంగా వచ్చే త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయంలో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది. ఇక సాధారణ ఎన్నికలు సమీస్తున్నాయి. ఈ అంశాలను బేరీజు వేసుకుని చూస్తే ఇంకొంతకాలం మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని అంచనావేస్తున్నాం.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ సైతం ఒడిదుడుకులు కొనసాగేందుకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సమాచారం అనంతరం ఇందుకు ఆస్కారం అధికంగా ఉండగా.. ఈ డేటా వెల్లడి తరువాత మార్కెట్కు ఒక దిశా నిర్దేశం కానుందన్నారు. దేశీ ఆర్థిక అంశాల్లో ఐఐపీ ఈవారంలో కీలకంగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. అమెరికా–చైనాల చర్చ.. ఈనెల 7–8 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు బీజింగ్లో సమావేశంకానున్నారు. గతేడాదిలో చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య యుద్ధం మొదలుకాగా, ఆ తరువాత ఇరు దేశాలు రాజీ ధోరణి ప్రదర్శించినప్పటికీ.. ఏ క్షణంలో ఎటువంటి వార్తలు వెలువడుతాయో అనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే యూఎస్–చైనా ప్రతినిధుల చర్చ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈవారంలో మార్కెట్ను ప్రభావితం చేయదగిన అంతర్జాతీయ అంశాల్లో.. డిసెంబర్ అమెరికా పేరోల్ రిపోర్ట్, ఆ దేశం ద్రవ్యోల్బణం, తయారీయేతర పీఎంఐ డేటాలు ఉన్నాయి. ఎఫ్పీఐల అమ్మకాలు రూ.83,000 కోట్లు గతేడాదిలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) దేశీ మార్కెట్ నుంచి రూ.83,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. రూ.33,553 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి.. రూ.49,593 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. వడ్డీ రేట్ల పెంపు, క్రూడ్ ధరల పెరుగుదల, రూపాయి పతనంతో 2018లో ఈస్థాయి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని ఫండ్స్ఇండియా డాట్ కామ్ మ్యూచువల్ ఫండ్ రీసెర్చ్ హెడ్ విద్యా బాల అన్నారు. -
డెబిట్ కమ్ క్రెడిట్.. రెండూ ఒకే కార్డులో
డెబిట్ లేదా క్రెడిట్కు రెండు కార్డులు వాడుతున్నారా? అయితే ఇక ఆ పని లేదట. ఒకే కార్డులో రెండింటిన్నీ వాడుకోవచ్చట. ఇండస్ఇండ్ బ్యాంక్ తొలిసారి 2 ఈఎంవీ చిప్ డెబిట్ కమ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ టూ-ఇన్-వన్ డ్యూ కార్డు రెండు మాగ్నెటిక్ స్ట్రిప్స్, 2 ఈఎంవీ చిప్స్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇవి డెబిట్, క్రెడిట్ కార్డులు చేసే రెండు పనులను చేస్తోంది. కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు డెబిట్ కమ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చినట్టు బ్యాంక్ చెప్పింది. ప్రతి రోజూ జరిపే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల అన్ని లావాదేవీలకు రెండు కార్డులను తీసుకు వెళ్లాల్సినవసరం లేకుండా.. ఇక నుంచి ఒకే కార్డును తీసుకువెళ్లవచ్చని పేర్కొంది. అనగ్రామ్ టెక్నిక్తో ఈ కార్డును బ్యాంక్ డిజైన్ చేసింది. ఇండస్ఇండ్ డ్యూ కార్డు మొబైల్ కస్టమర్ల కోసం ముఖ్యంగా యువత కోసం ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, లైఫ్స్టయిల్ వంటి పలు ఫీచర్లను ముందస్తుగా అప్లోడ్ చేసుకుని వచ్చింది. బ్యాంకింగ్ను మరింత సులభతరం చేసి, తమ కస్టమర్లకు సౌకర్యవంతంగా తీసుకురావడమే తమ లక్ష్యమని ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్ బ్యాంకింగ్ సుమంత్ కత్పాలియా చెప్పారు. డ్యూ కార్డు లాంటి ఇన్నోవేషన్లు కస్టమర్ల జీవితాన్ని సరళీకరం చేయున్నట్టు పేర్కొన్నారు. యువత, ఔత్సాహికులైన కస్టమర్లు కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పారు. ఒక్క ప్లాస్టిక్ కార్డులోనే విస్తృతమైన ఆఫర్లను, అనుభవాన్ని ఉన్నతంగా అందించనున్నట్టు పేర్కొన్నారు. -
ఇండస్ఇండ్ లాభం 953 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.953 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం (రూ.752 కోట్లు)తో పోల్చితే 27 శాతం వృద్ధి సాధించామని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, నికర లాభం రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.5,041 కోట్ల నుంచి రూ.5,859 కోట్లకు పెరిగిందని తెలిపారు. వడ్డీ ఆదాయం రూ.3,830 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.4,650 కోట్లకు పెరిగిందని వివరించారు. ఒక్కో షేర్కు రూ.7.50 డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 20% వృద్ధితో రూ.2,008 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ మార్జిన్ 3.97%కి తగ్గిందని, 4% నికర వడ్డీ మార్జిన్ సాధించడం లక్ష్యమని వివరించారు. వాహన రుణాలు 47%, వాహనేతర రుణాలు 30%, కార్పొరేట్ రుణాలు 30 శాతం చొప్పున పెరిగాయని, మొత్తం మీద 28% రుణ వృద్ధి సాధించామని పేర్కొన్నారు. నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26% పెరి గి రూ.3,606 కోట్లకు పెరిగిందని సోబ్తి తెలిపారు. మొత్తం ఆదాయం రూ.18,577 కోట్ల నుంచి రూ.22,031 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పెరిగిన మొండి బకాయిలు...: బ్యాంక్ స్థూల మొండి బకాయిలు 1.17 శాతం పెరిగి రూ.1,700 కోట్లకు, నికర మొండి బకాయిలు 0.51 శాతం పెరిగి రూ.750 కోట్లకు పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. దీంతో కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 42% వృద్ధి చెంది రూ.335 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఈ బ్యాంక్ సైతం అదే బాట... మొండి బకాయిలను తక్కువ చేసి చూపించిన ప్రైవేట్ రంగ బ్యాంకులు..ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యస్ బ్యాంక్ల సరసన తాజాగా ఈ బ్యాంక్ కూడా చేరింది. ఇటీవలే వేరే కంపెనీలో విలీనమైన సిమెంట్ కంపెనీకి చెందిన రూ.1,350 కోట్ల మొండి బకాయిలను ఈ బ్యాంక్ తక్కువ చేసి చూపించిందని ఆర్బీఐ ఆడిట్లో వెల్లడైంది. అయితే ఈ ఎన్పీఏలకు సమీక్షా క్వార్టర్లో పూర్తిగా కేటాయింపులను ఈ బ్యాంక్ జరిపింది. ఎగసిపడిన షేర్... ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఇంట్రాడేలో 3 శాతం వరకూ ఈ షేర్ ఎగసింది. మొండి బకాయిలను తక్కువ చేసి చూపిందని వెల్లడి కావడంతో నష్టాల్లోకి జారిపోయింది. చివరకు 0.6% నష్టంతో రూ.1,834 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ వాట్సాప్ సర్వీసులు!!
న్యూఢిల్లీ: ఇండస్ఇండ్ బ్యాంక్ తన కస్టమర్లకు త్వరలో వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్టు కింద వాట్సాప్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ను ఆవిష్కరించింది. దీనిసాయంతో కస్టమర్లు లావాదేవీలను వాట్సాప్లో చూసుకోవచ్చు. అలాగే బ్యాంక్ అధికారులతో సంభాషణలు నిర్వహించొచ్చు. వాట్సాప్లో మెసేజ్ సర్వీసును కస్టమర్లకు దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ అధికారిక వాట్సాప్ నంబర్ను ఖాతాదారులు స్మార్ట్ఫోన్లో సేవ్ చేసుకొని, సంభాషణను ప్రారంభించొచ్చని పేర్కొంది. కస్టమర్లు వాట్సాప్ ద్వారా రెండు రకాల సేవలు పొందొచ్చని తెలిపింది. కస్టమర్ మెసేజ్కు రిప్లే ఇవ్వడం మొదటిది. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్మెంట్, రివార్డ్ పాయింట్స్ చెకింగ్, ఆధార్ అప్డేట్ వంటి బేసిక్ సర్వీసులు రెండోది. -
ఇండస్ ఇండ్ లాభం 26% అప్
♦ జూన్ త్రైమాసికంలో రూ.837 కోట్లు ♦ వడ్డీ ఆదాయం దన్నుతో ♦ రూ.836 కోట్లుగా నమోదు ♦ స్వల్పంగా పెరిగిన ఎన్పీఏలు ముంబై: ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక ఫలితాల్లో అంచనాలకు అనుగుణంగా రాణించింది. నికర వడ్డీ ఆదాయం దన్నుతో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికరలాభం 26 శాతం అధికంగా రూ.836.55 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.661 కోట్లే. నికర వడ్డీ ఆదాయమైతే 31 శాతం వృద్ధితో 1,774.06 కోట్లకు చేరుకుంది. గతంలో ఉన్న నికర వడ్డీ మార్జిన్ 4 శాతాన్ని బ్యాంకు తాజాగా ముగిసిన త్రైమాసికంలోనూ నిలబెట్టుకోగలిగింది. వడ్డీయేతర ఆదాయంలోనూ పెరుగుదల నమోదైంది. 20 శాతం అధికంగా రూ.1,167.26 కోట్లు ఆర్జించింది. రుణాల్లో 24 శాతం, డిపాజిట్లలో 31 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. తక్కువ వ్యయాలుండే కరెంట్, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లు కూడా 38 శాతానికి పెరిగాయి. తగ్గిన ఆస్తుల నాణ్యత స్థూల ఎన్పీఏలు అంతకుముందున్న 0.91 శాతం నుంచి 1.09 శాతానికి పెరిగాయి. పునరుద్ధరించిన రెండు రుణాలు మొండి బకాయిలుగా (ఎన్పీఏ) మారడమే దీనికి కారణమని బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. ఈ కాలంలో బ్యాంకు ఎన్పీఏలకు చేసిన మొత్తం కేటాయింపులు రూ.230 కోట్ల నుంచి రూ.310 కోట్లకు పెరిగాయి. జేపీ సిమెంట్కు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడంతో అంతకుముందు త్రైమాసికంలో (జనవరి–మార్చి) రూ.122 కోట్లను నష్టాలుగా చూపించి పక్కన పెట్టింది. జేపీ సిమెంట్ను రూ.16,000 కోట్లకు అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో, నష్టాల పేరుతో పక్కన పెట్టిన నిధులను అప్పుడే లాభాల్లోకి తీసుకోకూడదని బ్యాంకు నిర్ణయించింది. ఆర్బీఐ దివాలా చట్టం కింద చర్యలకు గుర్తించిన 12 భారీ ఎన్పీఏ కేసుల్లో ఇండస్ఇండ్ బ్యాంకు ఇచ్చిన రుణాలు రూ.50 కోట్ల మేర ఉండగా, వాటికి జూన్ త్రైమాసికంలో తగిన నిధుల కేటాయింపులు చేసినట్టు రమేశ్సోబ్తి తెలిపారు. జీఎస్టీ అమలు, బీఎస్–4 కాలుష్య నియంత్రణ ప్రమాణాలు ట్రక్ సరఫరాలపై పడడంతో ఈ విభాగంలో రుణ వృద్ధి మందగించిందన్న ఆయన సెప్టెంబర్ క్వార్టర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్నారు. వాహనేతర వినియోగ రుణాల్లో మాత్రం 35–40 శాతం వృద్ధి ఉన్నట్టు చెప్పారు. -
స్టాక్స్ వ్యూ
హెచ్డీఎఫ్సీ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ టార్గెట్ ధర: రూ.1,750 ; ప్రస్తుత ధర: రూ.1,547 ఎందుకంటే: దేశంలో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. బ్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, గృహరుణాల్లో ఎస్బీఐ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోల్చితే 20 శాతం వృద్ధితో రూ.2,044 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.2,761 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ నిలకడగా 4 శాతంగా ఉంది. మొత్తం రుణాల్లో 69 శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు 14 శాతం, కార్పొరేట్ రుణాలు 16 శాతం చొప్పున వృద్ధి సాధించడంతో మొత్తం రుణాలు 14 శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగేళ్లలో పరిశ్రమ 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తే, ఈ కంపెనీ 18% చొప్పున వృద్ధి సాధించింది. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, తన అగ్రస్థానాన్ని నిలుపుకునే సత్తా ఈ కంపెనీకి ఉంది. కంపెనీకున్న బ్రాండ్ విలువ, విస్తృతమైన నెట్వర్క్, పటిష్టమైన వ్యాపార విధానాలు దీనికి ప్రధాన కారణాలు. పోటీ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, సాధారణ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ బ్యాంక్ రుణ వృద్ధి రెండేళ్లలో 16% చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. కొంతకాలంగా వడ్డీరేట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 3.5% రేంజ్లో సాధిస్తోంది. కార్పొరేట్ రుణాలు మందగమనంగా ఉన్నప్పటికీ, నిమ్ ఇదే రేంజ్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న కంపెనీల్లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 0.79%గా ఉన్నాయి. వంద శాతం ప్రొవిజన్ కవరేజ్ రేషియో కారణంగా నికర మొండి బకాయిలు దాదాపు లేవు. రెండేళ్లలో నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. ఇండస్ఇండ్ బ్యాంక్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: వెంచురా సెక్యూరిటీస్ టార్గెట్ ధర: రూ.2,008 ; ప్రస్తుత ధర: రూ.1,408 ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న ప్రైవేట్ బ్యాంకుల్లో ఇదొకటి. 1,200 బ్రాంచీలు, 2,036 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. కార్పొరేట్ రుణాలు 30 శాతం, వినియోగదారుల రుణాలు 28 శాతం చొప్పున పెరిగాయి. ఫలితంగా మొత్తం రుణాలు 28 శాతం వృద్ధితో రూ.1,13,081 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.6,068 కోట్లకు చేరింది. కాసా డిపాజిట్లు 42 శాతం పెరగ్గా, స్థూల మొండి బకాయిలు 0.93 శాతంగా, నికర మొండి బకాయిలు 0.39 శాతంగా ఉన్నాయి. గ్రామీణ, వ్యవసాయ రంగాలపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించేందుకు గాను ఇటీవలే రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంత విస్తరణపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం బ్యాంక్కు 95 లక్షల మంది ఖాతాదారులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవ్వగలదని బ్యాంక్ అంచనా వేస్తోంది. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 1 శాతంలోపే ఉన్నాయి. 2019–20 నాటికి స్థూల మొండి బకాయిలు 1.15 శాతంగా, నికర మొండి బకాయిలు 0.55 శాతంగా ఉండగలవని అంచనా వేస్తున్నాం. ఆర్థికంగా ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, గత పదేళ్లలో నిలకడైన వృద్ధిని సాధించింది. ఇదే జోరు మరో మూడేళ్లపాటు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రుణాలు 23 శాతం, నికర వడ్డీ ఆదాయం 20 శాతం, డిపాజిట్లు 24 శాతం, కాసా డిపాజిట్లు 28 శాతం, ఫీజు ఆదాయం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా నికర వడ్డీ ఆదాయం 17% వృద్ధి చెంది రూ.9,594 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 21 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.752 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.620 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్లు బ్యాంక్ తెలియజేసింది. నికర వడ్డీ, ఇతర ఆదాయాలు పెరగడంతో పాటు రుణ వృద్ధి, నిర్వహణ లాభం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.1,667 కోట్లకు పెరగ్గా, రుణ వృద్ధి 28 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. ఇతర ఆదాయం 33 శాతం వృద్ధితో రూ1,211 కోట్లకు, నిర్వహణ లాభం 37% వృద్ధితో రూ.1,572 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 32 శాతం అప్.. మొత్తం ఆదాయం రూ.4,120 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.5,041 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండిబకాయిలు 0.87 శాతం నుంచి 0.93 శాతానికి, నికర మొండిబకాయిలు 0.36 శాతం నుంచి 0.39 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.214 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెంచామని వివరించింది. ఇక 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.2,868 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అలాగే మొత్తం ఆదాయం రూ.15,169 కోట్ల నుంచి 23 శాతం వృద్ధితో రూ.18,577 కోట్లకు ఎగసిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ను ఇవ్వనున్నామని పేర్కొంది. ఫలితాలు నేపథ్యంలో బీఎస్ఈలో ఈ బ్యాంక్ షేర్ 0.6% క్షీణించి రూ.1,423 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ చేతికి ఐఎస్ఎస్ఎల్
వంద శాతం వాటా కొనుగోలు ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్... ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్)కు చెందిన సెక్యూరిటీస్ సర్వీసెస్ అనుబంధ కంపెనీ, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సెక్యూరిటీస్ సర్వీసెస్(ఐఎస్ఎస్ఎల్)ను కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థలో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఇండస్ ఇండ్ తెలియజేసింది. తాము ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్ వ్యాపారంలో ఉన్నామని, 500కు పైగా బ్రోకర్లకు సేవలందిస్తున్నామని ఐఎస్ఎస్ఎల్ కొనుగోలుతో తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని ఇండస్ఇండ్ ఎండీ, సీఈఓ రొమేశ్ సోబ్తి చెప్పారు. 3 నెలల్లో ఈ లావాదేవీ పూర్తవుతుందన్నారు. 2007లో ప్రారంభమైన ఐఎస్ఎస్ఎల్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రొఫెషనల్ క్లియరింగ్, డిపాజిటరీ, కస్టోడియల్ సర్వీస్లను నిర్వహిస్తోంది. రిటైల్, సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లతో పాటు వెయ్యికి పైగా బ్రోకర్లకు సేవలందిస్తోంది. రోజుకు పది లక్షలకు పైగా లావాదేవీలను నిర్వహిస్తోంది. -
ఇండస్ఇండ్ బ్యాంక్ బోణీ బాగుంది
క్యూ3లో లాభం 29 శాతం వృద్ధి ముంబై: గతేడాది అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29 శాతం అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది. ఎన్ఐఐ జూమ్: నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) విభాగంలో లాభం 35 శాతం అధికంగా రూ.1,578 కోట్లు వచ్చిందని... నిధుల వ్యయాలు తగ్గడమే దీనికి కారణమని ఇండస్ ఇండ్ బ్యాంకు ఎండీ రమేశ్ సోబ్తి తెలిపారు. నగదు నిల్వల నిష్పత్తి విషయంలో ఆర్బీఐ తీసుకున్న చర్యల వల్ల ఎన్ఐఐ రూ.40 కోట్లు అధికంగా వచ్చినట్టు చెప్పారు. కలిసొచ్చిన డిపాజిట్లు: ఇక బ్యాంకు డిపాజిట్లు 35 శాతం పెరిగాయి. వీటిలో 56 శాతం సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలే. వీటిపై వ్యయాలు తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. రుణాలు: రుణాల జారీలోనూ ఇండస్ ఇండ్ బ్యాంకు మెరుగైన గణాంకాలను ప్రకటించింది. ఇవి 25 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమ సగటు కంటే ఐదు రెట్లు అధికమని సోబ్తి పేర్కొన్నారు. రుణాలకు డిమాండ్ కూడా తగ్గలేదన్నారు. చెల్లని నోట్లు: రూ.11,400 కోట్ల విలువైన చెల్లని పెద్ద నోట్లను డిపాజిట్లుగా బ్యాంకు స్వీకరించింది. నవంబర్ 8 తర్వాత రూ.200, రూ.1,000 నోట్ల రూపంలో భారీ స్థాయిలో నగదు జమలు వచ్చినప్పటికీ సీఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టినట్టు బ్యాంకు తెలిపింది -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 26 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్కు రూ.560 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్కు రూ.704 కోట్లకు పెరిగిందని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు, నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లకు పెరగడంతో నికర లాభం 26 శాతం వృద్ధి సాధించిందని వివరించారు. గత క్యూ2లో రూ.3,581 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,440 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 0.77 శాతం నుంచి 0.90 శాతానికి, నికర మొండి బకాయిలు 0.31 శాతం నుంచి 0.37 శాతానికి పెరిగాయని వివరించారు. కేటాయింపులు రూ.158 కోట్ల నుంచి రూ.214 కోట్లకు పెరిగాయని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 4%కి పెరిగిందని, మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్ రుణాలు వేగంగా వృద్ధిచెందడం, నిధుల వ్యయం తగ్గడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ పెరిగిందని పేర్కొన్నారు. ఫీజులు, ఫారెక్స్, ట్రెజరీ కార్యకలాపాలు కలగలసిన ఇతర ఆదాయం 24% వృద్ధి చెంది రూ.970 కోట్లకు పెరిగిందని వివరించారు. వినియోగదారుల రుణాలు 42%, కార్పొరేట్ రుణాలు 27% పెరగడంతో మొత్తం మీద రుణాలు 26% వృద్ధి చెందిందని తెలిపారు. -
ఇండస్ ఇండ్ లాభం 26 శాతం జంప్
ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంకు అంచనాలకు అనుగుణంగానే బుధవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన క్యూ2 లో 25.7 శాతం జంప్ చేసి 704 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.560 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లుగా నమోదు చేసింది. అయితే బ్యాంక్ ఎన్పీఏ 0.38 శాతం నుంచి 0.37 శాతానికి క్షీణించింది. వడ్డీ రూపలో వచ్చిన రూ.3,469 కోట్లకు పెరిగింది. గ త ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.2,798 కోట్లుగా నమోదైంది -
ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 26% అప్
ముంబై : వివిధ వ్యాపార విభాగాల్లో వృద్ధి ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 26 శాతం ఎగిసి రూ. 661 కోట్లుగా నమోదైంది. మరోవైపు ఆదాయం 34 శాతం వృద్ధితో రూ. 1,742 కోట్ల నుంచి రూ. 2,329 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం మరింత మెరుగ్గా 38% వృద్ధి చెంది రూ. 981 కోట్ల నుంచి రూ. 1,356 కోట్లకు చేరగా, వడ్డీయేతర ఆదాయం 28 శాతం పెరుగుదలతో రూ. 973 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు (నిమ్) 3.68 శాతం నుంచి 3.97 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రతీ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్లు కనీసం 2-3 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపర్చుకుంటున్నామని, ఇదే ధోరణి ఇక ముందు కూడా కొనసాగగలదని బ్యాంక్ ఎండీ రమేష్ సోబ్తి ఆశాభావం వ్యక్తం చేశారు. డిపాజిట్లు 31 శాతం వృద్ధితో రూ. 1,01,768 కోట్లకు, మంజూరు చేసిన రుణాలు 30 శాతం పెరుగుదలతో రూ. 93,678 కోట్లకు చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు స్వల్పంగా 0.31% నుంచి 0.38 శాతానికి పెరిగాయి. -
లాభాల్లో ఇండస్ ఇండ్...తప్పని బ్యాడ్ లోన్ భారం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు జోరు నేటినుంచి ప్రారంభమైంది. ప్రైవేట్ రంగానికి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంకు తొలి త్రైమాసికంలో నికర లాభాల్లో అదరగొట్టింది. 2016 జూన్ 30కు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 26శాతం జంప్ అయి, రూ.661 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికరలాభాలు రూ.525 కోట్లగా ఉన్నాయి. నికర వడ్డీ ఆదాయం పెరగడంతో బ్యాంకు లాభాల బాటలో నడిచింది. నికర వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,325 కోట్లగా రికార్డు అయ్యాయి. ఈ ఆదాయాలు గతేడాది ఇదే క్వార్టర్లో రూ.980 కోట్లగా ఉన్నాయి. అయితే ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంకు కేవలం రూ.653 కోట్లను మాత్రమే నికర లాభాలుగా నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేశారు. విశ్లేషకుల అంచనాల కంటే కాస్త అధికంగానే బ్యాంకు లాభాలను నమోదుచేసింది. నికర వడ్డీ మార్జిన్లు ఈ త్రైమాసికంలో 3.97శాతం మెరుగయ్యాయి. అయితే బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(నాన్ ఫర్ ఫార్మింగ్ ఆస్తులు) జూన్ క్వార్టర్లో రూ.776 కోట్లనుంచి రూ.860 కోట్లకు ఎగిశాయి. అదేవిధంగా నికర నిరర్ధక ఆస్తుల సైతం 0.36శాతం నుంచి 0.38శాతానికి పెరిగాయి. దీంతో బ్యాడ్ లోన్స్ ప్రభావం స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేర్లపై పడింది. ఇండస్ ఇండ్ బ్యాంకు షేరు రూ.0.24శాతం పడిపోయి రూ.1,124వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్తో హోండా జట్టు
న్యూఢిల్లీ: హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా ఇండస్ఇండ్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హోండా టూవీలర్ల కొనుగోలుకు బ్యాంక్.. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లలో ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించనున్నది. టూవీలర్ పరిశ్రమలో రిటైల్ ఫైనాన్స్ ప్రాధాన్యం పెరుగుతోందని, కస్టమర్లు పలు ఫైనాన్స్ మార్గాలను అన్వేషిస్తున్నారని హెచ్ఎంఎస్ఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ సింగ్ గులారియా తెలిపారు. టూవీలర్ ఫైనాన్సింగ్ విభాగంలో అధిక వాటా లక్ష్యంలో భాగంగా హెచ్ఎంఎస్ఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ (కన్సూమర్ ఫైనాన్స్ విభాగం) ఎస్.వి.పార్థసారథి పేర్కొన్నారు. ఒప్పందంలో ఇందులో భాగంగా కస్టమర్లు గంటలో రుణ ఆమోదం, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి తదితర సౌలభ్యాలను పొందొచ్చని హెచ్ఎంఎస్ఐ పేర్కొంది. బైక్ విలువలో 90 శాతం వరకు రుణాన్ని పొందొచ్చని, దీన్ని 36 నెలల్లో ఇన్స్టాల్మెంట్ల రూపంలో కట్టొచ్చని వివరించింది. -
ఇండస్ఇంద్ బ్యాంక్ నికర లాభం 30 శాతం అప్
* 20% పెరిగిన మొత్తం ఆదాయం * తగ్గిన మొండి బకాయిలు ముంబై: ప్రైవేట్ రంగంలోని ఇండస్ఇంద్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 30 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 430 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.560 కోట్లకు పెరిగిందని ఇండస్ఇంద్ బ్యాంక్ బీఎస్ఈకి నివేదించింది. మొత్తం ఆదాయం రూ.2,973 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.3,581 కోట్లకు చేరిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 1.08 శాతం నుంచి 0.77 శాతానికి, నికర మొండి బకాయిలు 0.33 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో తమ నికర లాభం 27 శాతం వృద్ధితో రూ.1,085 కోట్లకు, మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.7,066 కోట్లకు పెరిగాయని ఇండస్ఇంద్ బ్యాంక్ తెలిపింది. -
29 శాతం పెరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం
ముంబై: హిందుజా గ్రూప్ సారథ్యంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 29 శాతం పెరిగింది. ఇతర ఆదాయం ఊతంతో రూ. 447 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 347 కోట్లు. తాజా క్యూ3లో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 18% మేర పెరిగి రూ. 861 కోట్లకు, ఇతర ఆదాయం 27% పెరిగి రూ. 611 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 3.65 శాతం నుంచి 3.67 శాతానికి పెరిగింది. కొన్ని కార్పొరేట్ రుణాలను పునర్వ్యవస్థీకరించినప్పటికీ.. నికర నిరర్ధక ఆస్తులు 0.32 శాతం స్థాయిలోనే ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు మెరుగుపడటం, వ్యయాలను తగ్గించుకోగలగడం వంటి అంశాలతో క్యూ3లో లాభాలు గణనీయంగా పెరిగాయని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రమేష్ సోబ్తి తెలిపారు. -
మరిన్ని బ్యాంకులకు పసిడి దిగుమతి చాన్స్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. వీటిలో యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్బ్యాంక్లు ఉన్నాయి. ఈ దిగుమతుల ప్రక్రియలో 80:20 పథకం వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఆగస్టు 14వ తేదీన ప్రవేశపెట్టిన 80:20 పథకం బంగారం నామినేటెడ్ ఏజెన్సీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం దిగుమతిచేసుకున్న పసిడిలో 20 శాతం తప్పనిసరిగా ఎగుమతి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎగుమతి షరతును అమలుచేస్తేనే తదుపరి పసిడి దిగుమతులకు వీలవుతుంది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ నిబంధనసహా, పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకూ, ఆభరణాల దిగుమతుల విషయంలో 15 శాతం వరకూ పెంచుతూ కేంద్రం గతంలో చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కేవలం 6 బ్యాంకులు, మూడు ఆర్థిక సంస్థలకు 80:20 పథకం కింద బంగారం దిగుమతులు చేసుకుంటున్నాయి. కన్సైన్మెంట్ ప్రాతిపదికన 21 బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులకు ఆర్బీఐ అనుమతి ఉంది. బంగారం ఆభరణాల ఎగుమతిదారుల వాస్తవ అవసరాలను నెరవేర్చడానికి బులియన్ దిగుమతులకు కన్సైన్మెంట్ ప్రాతిపదిక వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వ ఆంక్షలు బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయి, క్యాడ్ కట్టడికి దోహదపడ్డాయి. అయితే దేశీయంగా పరిశ్రమ దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఇటీవల కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి పీ చిదంబరం ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్బీఐ నుంచి తాజా అనుమతులు వచ్చాయి.