మద్యం మత్తులో కారు బీభత్సం.. విద్యార్థుల హల్‌చల్‌ | Degree Student Died After Speeding Car Hit The Divider And Overturned In Ranga Reddy Dist - Sakshi
Sakshi News home page

Ranga Reddy Road Accident: మద్యం మత్తులో కారు నడుపుతూ విద్యార్థుల హల్‌చల్‌.. ఒకరు మృతి

Published Thu, Aug 24 2023 7:22 AM | Last Updated on Thu, Aug 24 2023 9:30 AM

Car Road Accident At Rangareddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్‌ చౌరస్తాలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం.. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్‌ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ‘బెంగాల్‌ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement