Vizag: అక్రమ కాల్‌ సెంటర్లపై సీబీఐ దాడులు | CBI Raids On Illegal Call Centers In Visakhapatnam, Check More Details Inside | Sakshi
Sakshi News home page

Vizag: అక్రమ కాల్‌ సెంటర్లపై సీబీఐ దాడులు

Published Sun, Sep 29 2024 10:49 AM | Last Updated on Sun, Sep 29 2024 11:52 AM

Cbi Raids On Illegal Call Centers In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్‌ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్‌ సెంటర్లు నిర్వహి­స్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్‌ నగర్‌ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్‌లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. భారత్‌లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్‌ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశా­లకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్‌ నేరాలకు పాల్ప­డుతున్నట్టు ఎఫ్‌బీఐ ఇచ్చిన సమా­చారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.

తొలుత థానేలోని కాల్‌ సెంటర్‌ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్‌కు సంబంధించిన సర్వ­ర్‌ను అహ్మ­దాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరద­రాబాద్, కోల్‌కతా, విశాఖల­లోనూ ఈ సంస్థల కార్యక­లాపాలు నిర్వహిస్తు­న్నట్లు తెలుసు­కున్నారు.

దీంతో నగరంలో విస్తృతంగా తని­ఖీలు చేశారు. సాగర్‌నగర్‌ ప్రాంతంలోని దేవీ ప్యారౖ­డె­జ్‌లో నివాసం ఏర్పరచు­కున్న అక్షయ్‌ పాత్వాల్, ధీరజ్‌ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్‌బాలి, ప్రితేష్‌ నవీన్‌ చంద్రపటేల్‌లను మురళీనగర్‌ ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌­టాప్‌లు, హార్డ్‌ డిస్క్‌లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement