Illegal
-
చైనా దురాక్రమణను భారత్ అంగీకరించబోదు: కేంద్రం స్పష్టం
న్యూఢిల్లీ: చైనా దుందుడుకు వ్యవహారిశైలిపై భారత్ మరోమారు మండిపడింది. భారత్కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇటీవల చైనా(China) రెండు కొత్త కౌంటీలను సృష్టించింది. వీటిలో కొంత ప్రాంతం భారత్లోని లడఖ్లో ఉంది. దీనిపై భారత్ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో పేర్కొంది.లోక్సభ(Lok Sabha)లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశపు కొత్త కౌంటీల ఏర్పాటు.. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాల వైఖరిని ప్రభావితం చేయబోదన్నారు. చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్ చట్టబద్ధం చేయబోదన్నారు.లడఖ్లోని భారత భూభాగాన్ని కలుపుకొని హోటాన్ ప్రావిన్స్లో చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను అడినప్పుడు సింగ్ ఈ సమాధానం చెప్పారు. చైనాలోని హోటాన్ ప్రావిన్స్లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లడఖ్(Ladakh) కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయన్నారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తద్వారా భారత్ తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను మెరుగుపరుచుకుంటుందన్నారు. ఇది కూడా చదవండి: కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం -
గన్స్@ వాట్సాప్
సాక్షి, అమరావతి: భారత్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా తుపాకుల అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రముఖ సోషల్ మీడియా టూల్స్ పరిశోధక సంస్థ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ పరిశోధనలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దేశంలోని భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వాట్సాప్ గ్రూపుల్లోనే తుపాకుల విక్రయాలకు సంబంధించిన ప్రకటనలు పోస్టు చేస్తున్నారని తెలిపింది.గతంలో అక్రమ తుపాకులు కొనుగోలు చేయాలంటే ఉత్తరప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల విక్రేతలను లేదా వారి ఏజెంట్లను రహస్యంగా కలిసి ఆయుధాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే... కేవలం వాట్సాప్ ద్వారానే తాము కోరుకున్న అక్రమ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థల ద్వారా ఆ ఆయుధాలు డోర్ డెలివరీ అవుతున్నాయని డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. పరిశోధనలో వెల్లడైన అంశాలివీ...⇒ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కేంద్రంగా దేశవ్యాప్తంగా అక్రమ తుపాకుల వ్యాపారం జోరుగాసాగుతోంది. అక్రమ ఆయుధాల వ్యాపారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి మరీ తుపాకులు అమ్ముతున్నారు. తమవద్ద ఉన్న తుపాకులు, వాటి ధరలు, ఇతర వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు.⇒ 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య మన దేశంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా అక్రమ తుపాకుల విక్రయాలకు సంబంధించిన 8 వేలకుపైగా ప్రకటనలు జారీ చేశారు. ⇒ ఏకంగా 234 వాట్సాప్ గ్రూపుల్లో అక్రమ తుపాకుల విక్రయాల వివరాలను పోస్టు చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ బహిరంగంగానే అందరికీ అందుబాటులో ఉండటం గమనార్హం. ఒక్కో వాట్సాప్ గ్రూపులో వందలాది మంది సభ్యులు ఉన్నారు. ⇒ మన దేశంలో 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. దాంతో వ్యాపార, పారిశ్రామిక సంస్థలు వాట్సాప్ను తమ వ్యాపార విస్తరణకు వేదికగా చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారులు కూడా అదే రీతిలో వాట్సాప్ ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. నిషేధం ఉన్నా పట్టించుకోని ‘మెటా’'సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయుధాల వ్యాపారం భారత్లో నిషిద్ధం. కానీ.. ఈ విషయాన్ని మెటా సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. మెటా సంస్థే నిర్వహిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్రమ ఆయుధాల అమ్మకాల ప్రకటనలు జారీ చేసిన ఓ ముఠాను 2023లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా మెటా సంస్థ సరైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు. 2022–2024లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అక్రమ ఆయుధాల విక్రయాల ప్రకటనలను మెటా సంస్థ ఆమోదించడం అప్పట్లోనే తీవ్ర అలజడి సృష్టించింది. ప్రస్తుతం భారత్లోనూ మెటా సంస్థ నిర్వహిస్తున్న వాట్సాప్ ద్వారా పలు ముఠాలు అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.బిజినెస్ ఖాతాల ద్వారానే..అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తున్న ముఠాల వాట్సాప్ ప్రొఫైల్స్ను డిజిటల్ విట్నెస్ ల్యాబ్ విశ్లేషించింది. ఆ ముఠాలన్నీ బిజినెస్ ఖాతాల ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కస్టమర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ ఖాతాలన్నీ అదనపు ఫీచర్లు కలిగి ఉన్నాయని కూడా గుర్తించింది. కోడ్ భాషలో అక్రమ ఆయుధాలను విక్రయిస్తున్నారని పేర్కొంది. 2022లో 1.04 లక్షల అక్రమ ఆయుధాల జప్తునేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1.04 లక్షల అక్రమ ఆయుధాలను పోలీసులు జప్తు చేశారు. పోలీసుల దృష్టికి రాని అక్రమ ఆయుధాలు అంతకుమించి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. అంటే దేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం ఎంతగా విస్తరించిందన్నది ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మరోవైపు వాట్సాప్ ద్వారా తుపాకుల విక్రయాలకు ప్రకటనలు జారీ చేస్తుండటం అక్రమ ఆయుధాల ముఠాల బరితెగింపునకు నిదర్శనం. -
శ్రీ చైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
కొండలను పిండి చేస్తున్న మైనింగ్ మాఫియా
-
Hyderabad: మార్చి.. ఏమార్చి..
ఒకప్పుడు ఓ మామూలు కారు కొంటే, ఉంటే గొప్ప.. ఇప్పుడు ఖరీదైన కారు కొంటే.. అది అందరికన్నా భిన్నంగా ఉంటేనే గొప్ప.. రూ.లక్షలు, కోట్లు పెట్టి కారు కొనడం మాత్రమే కాదు దానిని మరింత స్టైల్గా చూపించాలనే తాపత్రయంతో కొందరు రకరకాలుగా అలంకరణలు చేస్తున్నారు. బైకర్స్ సైతం అంతే.. ఖరీదైన బైక్స్ కొనడంతో పాటు ‘మోడిఫైడ్’ మోజులో పోలీసు కేసుల బారిన పడుతున్నారు. గత నెల 11న మితిమీరిన వేగంతో కారు నడుపుతున్నందుకు ఓ మెర్సిడీస్ బెంజ్ కారుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ కారు యజమాని అంతటితో సరిపుచ్చలేదు. ఒరిజినల్ రంగు అయిన పోలార్ వైట్ కలర్ నుంచి మెర్సిడీస్ను మల్టీకలర్ వాహనంగా మార్చినందుకు మరో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కారు యజమానితో పాటు మోడిఫికేషన్ చేసిన సదరు వర్క్షాపుపై కూడా మోటారు వాహన చట్టం సెక్షన్ 182–ఎ(1) కింద అభియోగాలు నమోదయ్యాయి. ఇక బైకర్స్ పైన ఇలాంటి కేసులకు కొదవే లేదు. తప్పు మాత్రమే కాదు ముప్పు కూడా.. ‘అనేక మంది వాహనదారులు చట్టాన్ని పాటించడం లేదు. ఇష్టానుసారం వాహనాల ఫీచర్లను మార్చుకుంటున్నారు. అలాంటి మార్పు చేర్పులు తప్పు మాత్రమే కాదు, ముప్పు కూడా’ అని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ కమల్ అంటున్నారు. వాహన తయారీదారులు నిర్దిష్ట మోడల్ను ఉత్పత్తి చేయడానికి అధికారుల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకుంటారు. అలా తయారైన మోడల్ను ట్యాంపరింగ్ చేయడం వల్ల వాహనం దాని ఒరిజినల్ కొలతలు, ఏరోడైనమిక్లను కోల్పోవచ్చు. తద్వారా అది నడిపేవారితో పాటు ఇతరులకూ ప్రమాదకరంగా మారవచ్చు’ అని నిపుణులు అంటున్నారు. ‘వాహనం రంగు మార్చడానికి చట్టపరమైన అనుమతి పొంది, రిజి్రస్టేషన్ సరి్టఫికెట్లో కొత్త రంగు ప్రతిబింబించాలి. బైకర్స్ తమ సైలెన్సర్లు, టెయిల్ ల్యాంపులను మారుస్తారు, ఈ మార్పులు ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి’ అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ముఖ్య కార్యకర్త వినోద్ చెబుతున్నారు. ఏదైనా వాహనం ఇంటీరియర్స్ లేదా ఎక్స్టీరియర్స్ సవరించడం చట్టవిరుద్ధం. తస్మాత్ జాగ్రత్త.. వాహన మార్పుల వల్ల వాహనానికి ఏదైనా నష్టం జరిగితే తయారీదారు వారంటీ చెల్లదు. కార్ల యజమానులు తరచూ చేసే మార్పుల్లో లేతరంగు విండోస్ ఒకటి. దీని వల్ల విండోస్ 25% కంటే తక్కువ లైట్ ట్రాన్స్మిషన్ స్థాయిని కలిగి ఉండటం వల్ల ఇతర వాహనాలను గమనించే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. మార్పుల వల్ల కొన్ని వాహనాల పనితీరు మందగిస్తుంది. కొందరు యజమానులు తమ వాహనాన్ని వీలైనంత మేర మోడిఫై చేస్తుంటారు. దీనివల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. సస్పెన్షన్ అప్గ్రేడ్లు, టర్బోచార్జ్ జోడించడం, స్పోర్ట్స్ సీట్లను ఇన్స్టాల్ చేయడం వంటి మార్పులు చేస్తుంటారు. ఇవి వాహన పనితీరును దెబ్బతీస్తాయి.మనం కొన్న కారే కానీ.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టే ఎంత డబ్బు ఉంటే అంత కారు కొనుక్కోవచ్చు తప్పులేదు. కానీ.. ఎంత ఖర్చు పెట్టి కొన్న కారైనా, బైక్ అయినా మన ఇష్టం వచ్చినట్టు మార్పులు, చేర్పులు చేసుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. వాహనం రంగు కావచ్చు, రూపంలో కావచ్చు.. ఏవైనా మార్పు చేర్పులను చేయాలంటే ప్రాంతీయ రవాణా కార్యాలయం వాటిని ఆమోదించాలి. సరైన విధంగా డాక్యుమెంట్ చేయాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది..? వాహనంలో అనధికారిక మార్పులు చేసినట్లు తేలితే.. ఒక సంవత్సరం వరకూ జైలు శిక్షతో పాటు రూ.లక్ష వరకూ జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఆర్టీఏ నుంచి అనుమతి లేకుండా మార్పులు చేసిన వాహనాలను సీజ్ చేసే అధికారం ఉందని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాహనాల రూపాన్ని, పనితీరును మెరుగుపరచడానికి కొన్నింటికి మాత్రమే అనుమతులు ఉంటాయి. దాని లోబడి అలాంటి మార్పులు చేసుకోవచ్చు. కార్లు లేదా మోటార్ సైకిళ్లకు అదనపు పరికరాలను అమర్చడం లేదా ధ్వనులను మార్పు చేయడం వంటివి మోటారు ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుందని అధికారులు చెబుతున్నారు.ఎలాంటి మార్పులూ చేయకూడదు.. ఓ వాహనాన్ని తయారీ దారుడు మార్కెట్లోకి పంపేముందు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకుంటాడు. భద్రతతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ వాహనం బరువు, రూపం, తదితరాలను ఖరారు చేస్తారు. అలా వచి్చన వాహనానికి ఎలాంటి మార్పులూ చేయకూడదు. దీంతో పాటు నెంబర్ ప్లేట్స్, సైలెన్సర్స్ మార్చడం వంటివి చేయకూడదు. విండ్ షీల్డ్స్, విండో గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్స్ తగిలించకూడదు. వీటిలో ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడినా మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. తీవ్రతను బట్టి జరిమానా, కేసు, ఛార్జిషిట్ వంటి చర్యలు ఉంటాయి. – జి.శంకర్రాజు, ఏసీపీ, నార్త్ జోన్ ట్రాఫిక్ విభాగం -
బూడిదలో కాసుల వేట
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చో లేదోగానీ బూడిద నుంచి మాత్రం మన ‘పచ్చ’నేతలు కోట్లకు కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. రోజుకు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు చొప్పున ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ నుంచి హైదరాబాద్కు సాగుతున్న బూడిద దోపిడీ(illegal ash trade) కథాకమామిషు ఏమిటంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెలరేగిపోతున్నారు.ప్రణాళిక ప్రకారం పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ఇతరుల స్టాక్ పాయింట్లు మూసివేయించి తన కనుసన్నల్లోనే స్టాక్యార్డు నడుపుతున్నారు. ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు నుంచి ఉచితంగా లోడింగ్ చేసిన ఫ్లైయాష్ ను ఈ స్టాక్ పాయింట్ ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. బూడిద వ్యాపారులు ఎవరైనా తమ స్టాక్ పాయింట్కే తోలాలని.. ఇతర ప్రాంతాల లారీలు తమవద్దే లోడింగ్ చేసుకోవాలని సదరు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. – సాక్షి ప్రతినిధి, విజయవాడతెలంగాణకు అక్రమ రవాణా..ఎన్టీటీపీఎస్ విద్యుదుత్పత్తి ద్వారా వెలువుడే ఫ్లైయాష్ను ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు, రోడ్ల నిర్మాణం, ప్లైఓవర్ నిర్మాణాలు, భవన నిర్మాణాలకు వినియోగించాల్సి ఉంది. ప్రైవేట్ సంస్థలకు కావల్సి వస్తే ముందుగా ఎన్టీటీపీఎస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలి. అనుమతి పొందిన వారికే చెరువులో లోడింగ్ చేయాలి. పైగా.. బూడిద లోడింగ్పై నామమాత్రపు ధర వసూలుచేయాలని ఏపీ జెన్కో పెద్దలు గతంలో ఆదేశాలిచ్చారు. కానీ, ఇవి అమలుకాకుండా సదరు ప్రజాప్రతినిధి అ«ధికారులపై ఒత్తిడి తెచ్చి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందులో అనేకమంది పెద్దలకు భాగస్వామ్యం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.మా స్టాక్ పాయింట్లేఉండాలి...కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమ బూడిద వ్యాపారంతో ప్రజాప్రతినిధులు చెలరేగిపోతున్నారు. సంపద సృష్టించుకునేందుకు ఫ్లైయాష్ వ్యాపారాన్ని అయుధంగా మలుచుకున్నారు. తమవి తప్ప ఇతరుల బూడిద స్టాక్ పాయింట్లు ఉండకూదని అధికారులకు హుకుం జారీచేశారు. మూతపడిన స్టోన్ క్రషర్లు, సడక్ రోడ్డు, కొండ ప్రాంతాల్లో చిన్నచితక ఫ్లైయాష్ నిల్వలు మూసివేయాలని సదరు ప్రజాప్రతినిధి అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారు.దీంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి కనిపించిన స్టాక్ పాయింట్లలో జేసీబీలు పెట్టి వారి లారీలతో బూడిదను బయటకు తరలించి స్వామిభక్తిని చాటుకున్నారు. అంతటితో ఆగకుండా.. మళ్లీ స్టాక్ పాయింట్లు పెట్టొద్దని గట్టిగా హెచ్చరించి వ్యక్తిగతంగా హాజరుకావాలని వాటి నిర్వాహకులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. బైండోవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకూ గురిచేశారు. దీంతో.. తన స్టాక్ పాయింట్ మూసివేయించి తనపైనే బైండవర్ కేసు పెట్టారని.. మూలపాడులో నడుస్తున్న స్టాక్పాయింట్పై కూడా చర్యలు తీసుకోవాలని బైండోవర్ అయిన ఓ వ్యక్తి ఇటీవల తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశాడు. రోజుకు 300 లారీలు.. ఏటా రూ 64.80 కోట్ల ఆదాయం.. ఇక మండలంలోని మూలపాడు గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన పాత స్టోన్ క్రషర్ స్థలంలో సదరు స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఓ స్టాక్పాయింట్ నడుస్తోంది. ఫ్లైయాష్ చెరువులో ఉచితంగా లోడింగ్ జరిగిన లారీలు చాలావరకు ప్రజాప్రతినిధి స్టాక్ పాయింట్కు చేరుతున్నాయి. అందుకుగాను 20–30 టన్నుల లారీకి రూ.4 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. కొన్ని లారీలు సొంతంగా టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధే ఏర్పాటుచేసుకున్నారు.ఈ స్టాక్యార్డ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే భారీసైజు లారీల్లో లోడింగ్ చేస్తున్నారు. ఒక్కో లారీకి టన్నుకు రూ.360 చొప్పున 30 టన్నులు లోడింగ్ చేస్తున్నారు. ఒక లారీకి రూ.10,800 వసూలుచేస్తున్నారు. వీరికి టన్నుకు రూ.200 చొప్పున లారీకి రూ.6,000లు మిగులుతోంది. ఈ లెక్కన రోజుకు 300 లారీలకు సుమారు రూ.18 లక్షలు, నెలకు రూ.5.40 కోట్లు.. ఏడాదికి రూ. 64.80 కోట్లు దండుకుంటున్నారు. గ్రామాలకు కాలుష్యం కాటు.. ఇదిలా ఉంటే.. గ్రామాల సమీపంలో జాతీయ రహదారి పక్కన ఫ్లైయాష్ లోడింగ్ అన్లోడింగ్తో తీవ్ర వాయుకాలుష్యం వెలువడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అ«ధికారులను, టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కోరుతున్నప్పటికీ చర్యలు శూన్యం. మొక్కుబడిగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. -
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి
దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.వాయువ్య ప్రావిన్స్లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
గన్నవరంలో అక్రమంగా 8 మంది అరెస్ట్.. ఏపీ పోలీసులపై పేర్ని నాని ఫైర్
-
హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
హాంకాంగ్: పార్లమెంట్లో తమకు అనుకూలంగా వ్యవహరించే నేతల ఎంపిక కోసం అనధికారికంగా ప్రైమరీ ఎలక్షన్స్ చేపట్టి సమాంతర పార్లమెంటరీ వ్యవస్థ నిర్వహణకు తెగించారంటూ 45 మంది ప్రజాస్వామ్య ఉద్యమకారులు, మాజీ చట్టసభసభ్యులకు హాంకాంగ్ హైకోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల శిక్షలుపడ్డాయి. పార్లమెంట్లో మెజారిటీ సభ్యులను తమ వైపునకు తిప్పుకుని ప్రభుత్వాన్ని నిర్విర్యంచేయాలని కుట్ర పన్నారని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. తదుపరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే విపక్షసభ్యులుగా ఉంటూ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లను తిరస్కరిస్తూ వీటో చేసేందుకు వీరంతా కుట్ర పన్నారని కోర్టు తీర్పులో ప్రస్తావించింది. 2020 జూలై 10, 11వ తేదీల్లో జరిగిన ఈ అనధికార ప్రైమరీ ఎన్నికల్లో 6,10,000 ఓట్లు పోలయ్యాయి. అయితే ఆనాడు అధికార ఎన్నికలను ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయడం తెల్సిందే. అయితే హాంకాంగ్ చరిత్రలోనే అతిపెద్ద జాతీయ భద్రతా కేసుగా పరిగణించబడిన ఈ కేసులో ఉద్యమకారులపై అన్యాయంగా శిక్షలు మోపారని ప్రపంచ దేశాలు ఖండించాయి. పరోక్షంగా చైనా ఏలుబడిలో ఉన్న హాంకాంగ్లో సమాంతర పాలనకు ప్రయత్నించారంటూ 2021 ఏడాదిలో 47 మంది ఉద్యమకారులను ప్రభుత్వం అరెస్ట్చేసింది. కఠిన జాతీయ భద్రతా చట్టం–2020 కింద కేసులు నమోదుచేసింది. ఈ చట్టం కింద దోషులుగా తేలితే గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశముంది. 47 మందిలో గత ఏడాది ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ ఉదంతంలో సూత్రధారిగా కోర్టు పేర్కొన్న బెన్నీ థాయ్కు గరిష్టంగా పదేళ్ల జైలుశిక్షపడింది. మాజీ విద్యార్థి నాయకుడు జోషువా వాంగ్, మాజీ చట్టసభ సభ్యులకూ వేర్వేరు శిక్షలు పడ్డాయి. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్న విషయంపై తమకు కనీస అవగాహన కూడా లేదని కొందరు నిందితులు కోర్టులో చెప్పడంతో వారికి తక్కువ శిక్షలుపడ్డాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, మీడియాపై కఠిన ఆంక్షలు, ఎన్నికల్లో సాధారణ ప్రజల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి పరిణామాల తర్వాత ప్రజాస్వామ్య ఉద్యమకారులు ఆనాడు ఇలా అనధికార ప్రైమరీ ఎన్నికలు నిర్వహించారు. దీంతో హాంకాంగ్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. బ్రిటిష్ వలసప్రాంతంగా అభివృద్ధిచెందిన హాంకాంగ్పై పాలనాపగ్గాలు 1997లో చైనాకు దఖలుపడ్డాక హాంకాంగ్లో నిరంకుశ చట్టాలను డ్రాగన్దేశం అమలుచేస్తోందని ప్రపంచదేశాలు తప్పుపట్టడం విదితమే. ‘‘హాంకాంగ్ ప్రాథమిక చట్టం ప్రకారం శాంతియుతంగా తమ నిరసన తెలుపుతున్న ఉద్యమకారులపై కక్షగట్టి ప్రభుత్వం కేసులు బనాయించి ఆగమేఘాల మీద తీర్పు వెలువరించి శిక్షించింది’’అని హాంకాంగ్లోని అమెరికా కాన్సులేట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ్రస్టేలియా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యతోపాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి మానవహక్కుల పరిరక్షణా సంస్థలు తీర్పును తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే తీర్పును చైనా స్వాగతించింది. -
టీడీపీ నేతలపై ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు: YSRCP నేతలు
-
కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ
«సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భారత పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ...
-
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్కు భారీగా దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐ -
సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు కమిటీ
ముంబై: ముంబైలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు ముగిసింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తోంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్య చేపట్టింది.అక్రమ నిర్మాణం కూల్చివేతలో ముందుగా మసీదుపై అక్రమంగా నిర్మించిన గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు. దీనికిముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పివుంచింది. బీఎంసీ బృందం మసీదును పరిశీలించేందుకు వచ్చి, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.అయితే ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు స్వయంగా హామీ ఇచ్చింది. ఈ నేపధ్యంలో మసీదు కూల్చివేత పనులను సోమవారం ప్రారంభించింది. హిమాచల్లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ చేపట్టింది.ఇది కూడా చదవండి: ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా? -
Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్కు సంబంధించిన సర్వర్ను అహ్మదాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారౖడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
ఆలయ భూముల్లో అక్రమ సాగుకు యత్నం
జంగారెడ్డిగూడెం రూరల్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెంలో కోదండ రామాలయానికి చెందిన భూములపై అక్రమార్కుల కన్ను పడింది. టీడీపీకి చెందిన ఓ నేత ఆలయానికి చెందిన ఈ భూముల్లో 2 రోజులుగా జేసీబీలతో పామాయిల్ చెట్లను కూల్చివేసి భూమి చదును చేసే పనులు చేపట్టారు. ఇప్పటికే ఈ భూముల్లో అక్రమ సాగు చేసేందుకు పొగాకు నారు సిద్ధం చేశారు. చల్లవారిగూడెంలో కోదండ రామాలయానికి 1957లో పెండ్యాల వెంకట రామారావు 42 ఎకరాల 79 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ తవ్వకాలకు అధికారులు భూసేకరణ చేపట్టారు.రామాలయం భూముల మీదుగా ఈ కాలువ వెళ్లడంతో 2015 మే 2న 12 ఎకరాల వరకు ఆలయ భూములను కాలువకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటన ద్వారా తెలిపింది. అప్పట్లో కొంతమంది అక్రమార్కులు ఎత్తిపోతల పథకం పరిహారం కాజేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అప్రమత్తమై ఆలయానికి చెందిన ఈ భూములకు సంబంధించి పరిహారం రామాలయానికే చెందాలంటూ కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆలయానికి చెందిన ఈ భూముల్లో ఎత్తిపోతల పథకం కాలువ పనులు చేపట్టలేదు. ఈ భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి భారీగా పెరిగిన పామాయిల్ చెట్లు ఉన్నాయి. వీటిని 2 రోజుల నుంచి నేలకూల్చి అక్రమ సాగుకు సిద్ధం చేస్తున్నారు. -
నిషేధం.. వారికి ఓ వరం
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం గుట్కాను నిషేధించిన విష యం తెలిసిందే. కానీ ఆ నిషేధిత వస్తువే కొందరికి వరంగా మారి కోట్లాది రూపా యల లాభం చేకూరుస్తోంది. మొన్నటి వరకు వ్యాపారులే గుట్కా దందా చేయగా..ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు కూడా అందులోకి దిగారు. అసలే రాజకీయ నేతలు..ఆపై ప్రజాప్రతినిధులు కావడంతో ఆహార కల్తీ నియంత్రణ, పోలీసు శాఖలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా టార్గెట్ల కోసం దాడులు చేసి గుట్కా ప్యాకెట్లను స్వా«దీనం చేసుకొని కేసులు పెడుతున్నారే తప్ప సూత్రధారులు, గుట్కా రాకెట్ను నిరోధించలేకపోతున్నారు. ఒక్క లారీ సరుకుపై రూ.60–రూ.80 లక్షల ఆదాయం మాణిక్చంద్, సితార్, సాగర్, గోవా, రెబల్, సిమ్లా, గోవా, అంబర్..పేర్లేవైనా తెలంగాణవ్యాప్తంగా గుట్కా, తంబాకు ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైన గుట్కా దందా వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. గతంలో ప్రతిరోజూ రూ. 5 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు అమ్ముడుపోగా.. ఇప్పుడా అమ్మకాలు, ధరలు పెరిగి రూ.10 కోట్లకు చేరినట్టు అంచనా. కంపెనీ నుంచి హోల్సేల్ వ్యాపారికి.. అక్కడి నుంచి రిటైల్గా షాపులకు సరఫరా చేసేందుకు ప్రతీ జిల్లాలో ‘గుట్కా మాఫియా’పెద్ద నెట్వర్క్నే ఏర్పాటు చేసుకుంది. ఒక్క గుట్కా లారీ (డీసీఎం వ్యాన్) నేరుగా వ్యాపారి వద్దకు వస్తే రూ.60 లక్షల సంపాదన వచ్చినట్టే. ఒక లారీలో 250 కాటన్ల గుట్కా వస్తుంది. ఒక్కో కాటన్లో 70 పొడలు, ఒక్కో పొడలో 50 ప్యాకెట్లు ఉంటాయి. 50 పొట్లాలు ఉండే ఒక్క పొడ (బాక్స్) రూ.350లకు ఇస్తుండగా... రిటైల్ వ్యాపారులు ‘నిర్భంధం, నిషేధం, పోలీసు నిఘా’తదితర పదాలు వాడుతూ రూ.750 ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక్క గుట్కా ప్యాకెట్ను రూ.7లకు తీసుకొని రూ.15ల నుంచి 18ల వరకు అమ్ముతున్నారంటే లాభాలు ఏ మేరకు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. హోల్సేల్ వ్యాపారులు ఇవే గుట్కాలను కంపెనీని బట్టి రూ.20ల నుంచి రూ.25ల వరకు.. పాన్ టేలా, కిరాణం దుకాణందారులు రూ.30ల నుంచి రూ.40లు కూడా అమ్ముతున్నారు. సరిహద్దు 10 కిలోమీటర్ల దూరంలోనే... తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉంది. బీదర్ పట్టణం రాష్ట్ర సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బీదర్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు గుట్కా సరఫరా అవుతోంది. కర్ణాటకలో గుట్కాపై నిషేధం లేదు. తెలంగాణ ఉన్న నిషేధం, డిమాండ్ను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గుట్కాకు ఉన్న డిమాండ్ను చూసి కొంతమంది వ్యాపారులు పట్టణంలో పరిశ్రమలను స్థాపించారు. అక్రమార్కులు బీదర్లో తయారవుతున్న గుట్కాను తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ అంతా రవాణా చేస్తున్నారు. కాగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచి్చంది.దాని ప్రకారం పొగాకు ఉత్పత్తుల, విక్రయాలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో 2005లో గోవాలో గుట్కా, పాన్ మాసాలాను నిషేధించగా, 2012, 2013లలో మరో 15 రాష్ట్రాలు అమలు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013 జనవరి 9న గుట్కాలపై నిషేధం విధించగా, రాష్ట్ర వి¿¶భజన తర్వాత కూడా ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతోంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హరిణాయా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, మిజోరాం, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాలలోనూ గుట్కా విక్రయాలపై నిషేధం ఉంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే గుట్కా విక్రయాలు, తయారీకి లైసెన్స్లు ఇవ్వగా, అక్కడి నుంచి అన్ని జిల్లాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. రకరకాల పేర్లు, అధిక రేట్లు... నిండు జీవితాలు బలి పొగాకు ఉత్పత్తులను రకరకాల పేర్లతో ఎంఆర్పీ లేకుండా అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. వీటిలో విమల్, మాణిక్చంద్ (ఎంసీ), సితార్, సాగర్, గోవా, ఎంజీఎం, హాన్స్, చైనీఖైనీ, మీరాజ్, రెబల్, సిమ్లా, పాన్బార్, విమల్, 1000, ఖలేజా, ఆర్డీఎం, కె 7000, కె 9000, 24 క్యారెట్ .. వంటి వాటికి ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా భారీ గిరాకీ ఉంది. వీటిని విక్రయించే స్థలం, సమయం, పరిస్థితిని బట్టి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అధిక ధర అయినా, దొరకడమే భాగ్యం అన్నట్టుగా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. విచ్చలవిడిగా గుట్కా, చైనీఖైనీ, వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో యువత వాటికి బానిసలవుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్టు తేలింది. గుట్కా, పాన్ మసాలాను నమిలేవారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు16 శాతం వరకు ఉన్నారని అంచనా. 17 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే అధికంగా ఉన్నారు. కేన్సర్, గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతూ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దొరుకతలేవు అంటుండ్రు... అడ్డగోలు ధరకు ఇస్తుండ్రు రోజూ పనికి పోయినచోట మా పెద్దన్నతోటి మెల్లమెల్లగా గుట్కా అలవాటు అయ్యింది. టైంపాస్ కోసం ఏసుకున్నందుకు ఇప్పుడు అలవాటుగా మారింది. దొరుకుతలేవు అంటండ్రు.. రోజుకో రూపాయి పెంచి అమ్ముతండ్రు. ఎం.సీ (మానిక్చంద్) ఎనిమిది రూపాలుండే. ఇప్పుడు రూ.35ల నుంచి రూ.40లు అంటండ్రు. రెబల్, కె.7000, 24 క్యారెట్లేమో రూ.25ల నుంచి రూ.30లకు ఇస్తుండ్రు. నిషేధం ఉండుడేమో గాని అడ్డగోలు ధరలు పెంచి అమ్ముతండ్రు. – గుట్కా వినియోగదారుడు, జనగాం -
చెరువుల ఆక్రమణలతోనే వరదలు: సీఎం రేవంత్
-
సోమిరెడ్డి అవినీతి బట్టబయలు.. రూ.100 కోట్ల దోపిడీకి స్కెచ్!
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి బట్టబయలైంది. రీచ్ టు రిచ్కు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీగానే ప్లాన్ వేశారని స్పష్టమవుతోంది. ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.వందల కోట్లు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్న ఆయన మనుషులు సూరాయపాళెం ఇసుక రీచ్లో సాగించిన హెచ్చరికలు, దూషణల పర్వం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డ్రెడ్జింగ్ విధానంలో ఇసుక వెలికి తీసేందుకు వచ్చిన గుంటూరుకు చెందిన శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోర్డ్ వర్కర్స్ అండ్ అదర్ వర్క్స్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాంట్రాక్టర్లను సోమిరెడ్డి మనుషులు బెదిరించారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సోమిరెడ్డి తన మనుషులను రీచ్ వద్దకు పంపి డ్రెడ్జింగ్ వినియోగించే పడవలను వెనుక్కు పంపే ప్రయత్నం చేశారు. సాక్షాత్తు కలెక్టర్నే తూలనాడారు. స్థానిక శాసన సభ్యుడిని కాదని మీరు ఏమి చేయలేరని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు.చంద్రబాబునాయుడు స్థానిక ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పా రు. మధ్యలో కలెక్టర్ ఓవరాక్షన్ చేస్తున్నాడంటూ బూతుపురాణం అందుకున్నాడు. కలెక్టర్ నుంచి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు పద్ధతి ప్రకారం డ్రెడ్జింగ్ చేసేందుకు వచ్చారు. అయితే సోమిరెడ్డి అనుచరులు డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను వెలికి తీస్తే ఎలాంటి ఆదాయం ఉండదని, మధ్యలో ఇసుక దిబ్బలను ఎత్తాలని సూచించారు.ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడిఇందు కోసం తాము 300 ట్రిప్పుల గ్రావెల్ తోలి రీచ్కు దారులు ఏర్పాటు చేస్తున్నామని, రూ.కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. ఆయన (సోమిరెడ్డి) ఇంత చేస్తుంటే.. మీరు ఆయనకు తెలియకుండా ఏమైనా చేసినట్లు తెలిస్తే చాలా గొడవలు అవుతాయంటూ కంఠస్వరం పెంచుతూ మాట్లాడారు. ఈ మాటలను బట్టి చూస్తే ఉచిత ఇసుక పాలసీ డొల్లతనం ఇట్టే అర్థం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, తమ్ముళ్లు ఇసుక ద్వారా సొమ్ము చేసుకోవాలని ఎంతగా పరితపిస్తున్నారో తెలుస్తోంది. ఓ పక్కన రైతులు ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని, పర్యావరణకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇసుక ద్వారా అక్రమ సంపాదనకు తమ లక్ష్యాలను నిర్ధేశించుకుని వెనుక్కు తగ్గడమే లేదు. -
బంగ్లాదేశ్ సంక్షోభం: ఒడిశా అప్రమత్తం.. తీరంలో గస్తీ పెంపు
అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్లో ఉంచామన్నారు. మరోవైపు ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్సింగ్పూర్, భద్రక్ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
భారత జాలర్ల అరెస్టు
కొలంబో: తమ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 18 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. మూడు నౌకలను స్వా«దీనం చేసుకుంది. శనివారం రాత్రి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో డెల్ఫŠట్ దీవులకు సమీపంలోని ఉత్తర సముద్రంలో మత్స్యకారులను అరెస్టు చేసినట్లు, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అరెస్టయిన మత్స్యకారులను కంకేసంతురై ఫిషింగ్ హార్బర్కు తరలించనున్నట్లు శ్రీలంక నేవీ అధికార ప్రతినిధి కెపె్టన్ గయాన్ విక్రమసూర్య తెలిపారు. ఈ ఏడాదిలో శ్రీలంక జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడినందుకు 180 మందికి పైగా భారత మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. -
Patna high court: రిజర్వేషన్ల పెంపు చెల్లదు
పాట్నా: బిహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విద్యా, ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు పెంచుతూ 2023 నవంబర్లో ప్రభుత్వం తీసుకొచి్చన చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. రిజర్వేషన్లు పెంచడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 14, 16ని ఉల్లంఘించడమే అవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది రితికా రాణి చెప్పారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో తీర్పును రిజర్వ్ చేసిందని, గురువారం తుది తీర్పు ఇచి్చందని వెల్లడించారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు పౌరులంతా సమానమే. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగం, ఉపాధి విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు కలి్పంచాలి. కుల గణన ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచినట్లు బిహార్ ప్రభుత్వం న్యాయస్థానంలో వాదించిందని పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది నిర్భయ్ ప్రశాంత్ తెలిపారు. ఇంద్ర సహానీ కేసుతోపాటు మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. విద్యా, ఉద్యోగాల్లో కోటాను 50 శాతానికి మించి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పిందని గుర్తుచేశారు. 75 శాతానికి చేరిన రిజర్వేషన్లు బిహార్ ప్రభుత్వం కుల గణన నిర్వహించింది. రాష్ట్ర జనాభాలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ) 63 శాతం ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఎస్సీ, ఎస్టీలు కలిపి 21 శాతానిపైగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ప్రభుత్వం గతంలోనే ఈబీసీలకు 10 రిజర్వేషన్లు కలి్పంచింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదు కాబట్టి రిజర్వేషన్ చట్టాల్లో సవరణలు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. 50 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల కోటాను 65 శాతానికి పెంచేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బిహార్లో ఈబీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 75 శాతానికి చేరుకున్నాయి. సవరించిన రిజర్వేషన్ చట్టాలను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి బిహార్ సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల జాబితా తొమ్మిదో షెడ్యూల్లో ఉంది. ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం ఉండదు. సుప్రీంకోర్టు 1992లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిహార్ సర్కారు రిజర్వేషన్లు పెంచడాన్ని సవాలు చేస్తూ పలువురు పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. -
అక్రమ వలసలకు చెక్.. సంచలన బిల్లు తెచ్చిన బ్రిటన్
లండన్: అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటున్న బ్రిటన్ వాటిని ఆపేందుకు సంచలన బిల్లు తీసుకువచ్చింది. మంగళవారం(ఏప్రిల్23) ‘సేఫ్టీ ఆఫ్ రువాండా’ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుతో అక్రమ వలసదారులకు అడ్డకట్టపడనుంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారందరినీ ఆఫ్రికా దేశం రువాండాకు తరలిస్తారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోదం తర్వాత ఇది చట్టంగా మారుతుంది. బ్రిటన్కు వచ్చే అక్రమ వలసదారులను ఆపడానికి రువాండా బిల్లు తీసుకువచ్చినట్లు ప్రధాని రిషి సునాక్ తెలిపారు. దేశంలోకి చట్టవిరుద్ధంగా వచ్చేవారు నివసించడానికి ఇక నుంచి వీలులేదని చెప్పారు. అక్రమ వలసదారులను విమానాల్లో తీసుకువెళ్లి దేశం బయట వదిలేస్తామన్నారు. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
‘బ్లాక్’ కోబ్రా
మార్గదర్శి చిట్ ఫండ్స్ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్దారుల పాన్ నంబరు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. – సాక్షి, అమరావతి ఘోస్ట్ చందాదారులతో నల్ల దందా బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్’ మ్యాజిక్ మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో బ్యాలన్స్ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్ షీట్తో సరిపోవాలి. అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్ షీట్ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్క్యాష్ కావు. కేవలం చిట్స్ రిజి్రస్టార్, రిజర్వ్ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం. ‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది
‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. .. దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది. ‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు. తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది. పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి. చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు. – ఎన్.అనంతలక్ష్మి -
అదానీ గ్రూప్పై అవే ఆరోపణలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్పై మరోసారి అక్రమ పెట్టుబడుల ఆరోపణలు తలెత్తాయి. అదానీ ప్రమోటర్ కుటుంబం వెలుగులోలేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) తాజాగా ఆరోపించింది. యూఏఈకి చెందిన నాసెర్ అలీ షాబాన్ అలీ, తైవాన్కు చెందిన చాంగ్ చుంగ్–లింగ్ ఏళ్లపాటు మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్ స్టాక్స్లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్పీ తాజా ఆరోపణలకు తెరతీసింది. వినోద్ అదానీకి చెందిన వ్యక్తి నిర్వహణలోని దుబాయ్ సంస్థ ఈ ఫండ్స్ను నిర్వహిస్తుందని పేర్కొంది. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్ కంపెనీలలో అకౌంటింగ్ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు వెల్లువెత్తి గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. అయితే ఆపై గ్రూప్ వీటిని ఖండించింది. ఆపై షేర్ల ధరల్లో అవకతవకలకు ఆధారాలు లేవంటూ సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆరోపణలను కొట్టివేసింది. తాజాగా ఓసీసీఆర్పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను ఇప్పటికే సుప్రీం కోర్టు నియామక కమిటీ దర్యాప్తులోనూ పరిగణించిన విషయాన్ని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రస్తావించింది. ఇవన్నీ రీసైకిల్ చేసిన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ పెట్టుబడులున్న సంస్థల లబ్ది కోసం ఆరోపణలను తిరగతోడుతున్నట్లు వ్యాఖ్యానించింది. కొన్ని విదేశీ మీడియా వర్గాలు పసలేని హిండెన్బర్గ్ నివేదికను మరోసారి హైలైట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా వీటిని తోసిపుచి్చంది. తాజా ఆరోపణలు ఇలా.. 2013–2018 మధ్య కాలంలో ప్రమోటర్ కుటుంబం తమ నిర్వహణలోని మారిషస్ ఫండ్స్ ద్వారా గ్రూప్ కంపెనీలలో కోట్లాది డాలర్ల నిధులను రహస్యంగా ఇన్వెస్ట్ చేశాయని ఓసీసీఆర్పీ పేర్కొంది. తద్వారా గ్రూప్ షేర్ల ధరలలో భారీ ర్యాలీకి కారణమైనట్లు ఆరోపించింది. ఈ కాలంలో షేర్ల ధరల్లో భారీ ర్యాలీ ఫలితంగా అదానీ గ్రూప్ దేశంలోనే అ త్యంత శక్తివంతమైన బిజినెస్ గ్రూప్లలో ఒకటిగా ఆవిర్భవించినట్టు పేర్కొంది. ఓసీసీఆర్పీ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ అదానీ గ్రూప్ లోని పలు షేర్లు 4.4–2.2% మధ్య క్షీణించాయి. అదానీపై విచారణకు జేపీసీ వేయాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ అదానీ గ్రూప్పై తాజా ఆరోపణల విషయంలో ప్రధాని మోదీ తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ దేశం ప్రతిష్ట మసకబారకుండా ఉండాలంటే అదానీ గ్రూప్పై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పారీ్టలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదానీ విషయంలో ఇండియా కూటమిలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. ‘భారత్లో అందరికీ సమానావకాశాలుంటాయి. పారదర్శకత ఉంటుంది, అవినీతికి తావులేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ, అదానీపై వస్తున్న ఆరోపణలు దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రధానికి సన్నిహితుడైన ఈ పెద్ద మనిషి బిలియన్ డాలర్లతో షేర్ ధరలను పెంచేలా ఎలా చేయగలిగారు? ఆ సొమ్ము ఎవరిది? దీని వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ హస్తం ఉందా?. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. వారు నాసిర్ అలీ షాబాన్, చైనా వాసి చాంగ్చుంగ్ లింగ్. ఈ విదేశీయులను ఈ వ్యవహారంలోకి ఎలా అనుమతించారు? వీటిపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటిపైనా ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి’అని రాహుల్ డిమాండ్ చేశారు. ‘రుజువులు ఇచ్చినా సెబీ అదానీకి క్లీన్చిట్ ఇచ్చింది. క్లీన్చిట్ ఇచ్చిన సెబీలోని ఆ పెద్దమనిషి ఇప్పుడు అదానీ ఎన్డీ టీవీలో డైరెక్టర్. ఎలాంటి విచారణ జరిగిందో దీన్నిబట్టి అర్థమవుతోంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం: సుప్రీం స్పష్టీకరణ
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా Sanjay Kumar Mishra పదవీకాలం పొడగింపుపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు పొడిగింపు చట్టవిరుద్ధమని ప్రకటిస్తూనే.. జులై 31వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగవచ్చని మంగళవారం కేంద్రానికి తెలిపింది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేసే ఈ జాతీయ సంస్థ చీఫ్ బాధ్యతలను 2018 నవంబర్లో ఎస్కే మిశ్రా చేపట్టారు. అయితే రెండేళ్లకే ఆయన వయోపరిమితి రిత్యా(60 ఏళ్ల) రిటైర్ కావాల్సి ఉంది. కానీ, కేంద్రం మాత్రం రకరకాల సవరణలు, ప్రత్యేక ఆదేశాలతో ఆయన పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది. ఈ క్రమంలో రాజకీయ దుమారం చెలరేగగా.. మధ్యలో సుప్రీం కోర్టు సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఆర్డినెన్స్ల వంకతో ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ► 2020 నవంబర్లో మరో ఏడాదికి కేంద్రం పొడిగించగా.. ఆ సమయంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ‘పొడిగింపు ప్రత్యేక సందర్భాల్లో.. అదీ తక్కవ కాల వ్యవధితో మాత్రమే ఉండాలని స్పష్టంగా కేంద్రానికి తెలిపింది. అంతేకాదు.. ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్గా కొనసాగించకూడదని స్పష్టం చేసింది కూడా. ► అయినప్పటికీ.. 2021 నవంబర్లో మరో మూడు రోజుల్లో ఆయన రిటైర్ అవ్వాల్సి ఉండగా.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్1946 తోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003కి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్లు తీసుకురాగా.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో కేంద్రానికి మరింత బలాన్ని దక్కినట్లయ్యింది. ► 1997కి ముందు ఈడీ, సీబీఐల డైరెక్టర్ పదవీకాలం నిర్ధిష్టంగా ఉండేది కాదు. కేంద్రం ఎప్పుడు కావాలనుకుంటే.. అప్పుడు తొలగించేది. ► ఆ తర్వాత పదవీ కాలం రెండేళ్లు చేశారు. ► అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం.. ఐదేళ్ల కాలపరిమితికి పెంచింది. అది ముగిశాక వాళ్ల పని తీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించుకోవచ్చు. ► అలా కిందటి ఏడాది నవంబర్లో మిశ్రాను ఈడీ డైరెక్టర్గా మరో ఏడాది పొడిగించిది కేంద్రం. దీంతో మిశ్రా 2023 నవంబర్లో రిటైర్ కావాల్సి ఉంది. కానీ.. ► సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చేసిన సవరణపై తీవ్ర స్థాయిలో రాజకీయపరంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విడివిడిగా ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీళ్లలో కాంగ్రెస్, టీఎంసీ, తరపున కూడా కొందరు నేతలు ఉన్నారు. అయితే.. రాజకీయ ప్రయోజనాల కోసమే వాళ్లు కోర్టును ఆశ్రయించారని కేంద్రం కౌంటర్ దాఖలు చేసింది. ఆయా పార్టీలకు చెందిన నేతలు మనీలాండరింగ్ ద్వారా ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటున్నారని.. అందుకే కోర్టుకు చేరారని తెలిపింది. ► ఇక ఇదే ఏడాది ఫిబ్రవరిలో అమికస్ క్యూరి(కోర్టు స్నేహితుడు) కేవీ విశ్వనాథన్.. జస్టిస్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనానికి ఎస్కే మిశ్రా బాధ్యతల పొడిగింపు చెల్లదని నివేదించారు. ► ఇక పిటిషన్లపై అన్ని వర్గాల వాదనలు విన్న జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. మే 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ► దఫదఫాలుగా ఎస్కే మిశ్రాను ఈడీ చీఫ్గా కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన పొడిగింపు చెల్లదని ఇవాళ్టి ఆదేశాల్లో స్పష్టం చేసింది. అయితే.. కేంద్రం విజ్ఞప్తి చేయడంతో జులై 31వ తేదీ వరకు కొనసాగవచ్చని మాత్రం పేర్కొంది. -
కరీంనగర్లో అబార్షన్ల కలకలం
కరీంనగర్టౌన్: గర్భంతో ఉన్న తన కోడలుకు క్లినిక్ నిర్వాహకురాలు అబార్షన్ చేసిందంటూ అత్తామామలు ఆసుపత్రిలో గొడవకు దిగి, దాడిచేసిన ఘటన మంగళవారం కరీంనగర్లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన ఓ వివాహిత జ్యోతినగర్లోని ఓ క్లినిక్కు రాగా అత్తామామలు సైతం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకొని తన కోడలు గర్భం తీయించుకుందని గొడవకు దిగారు. నిర్వాహకురాలితో పాటు కోడలి తల్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, దాడికి పాల్పడ్డారు. అయితే తనకు రక్తస్రావం అవుతుంటే చికిత్స చేయించుకునేందుకు వచ్చాను తప్ప.. అబార్షన్ చేయించుకోలేదని కోడలు చెప్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతినగర్ క్లినిక్ వెళ్లి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు సదరు క్లినిక్పై 2019 నవంబర్ 7న వైద్యారోగ్యశాఖ అధికారులు దాడి చేసి అబార్షన్లు జరుగుతున్న విషయంపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి, క్లినిక్ను మూసివేశారు. తాజాగా మంగళవారం జరిగిన ఈ ఘటనతో మళ్లీ ఆ క్లినిక్లో విచ్చలవిడిగా అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్రీట్మెంట్ చేయించుకునేందుకు నగరంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ ధర్మారం మండలం నుంచి ప్రత్యేకంగా పేషెంట్ జ్యోతినగర్లో ఉన్న సాధారణ క్లినిక్కు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముఠాకు చెందిన 18 మంది అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా వరంగల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ దీనిపై దృష్టి సారించారు. దీన్ని చేదించేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించారు. ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ‘ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. ‘గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనెజ్మెంట్, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడు. ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్లు చేసిన ముఠా. స్కానింగ్ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు -
అక్రమ సిమ్కార్డుల దందాపై ఉక్కుపాదం..మీ పేరు మీద ఎన్ని ఉన్నాయ్?
సాక్షి, హైదరాబాద్: టెన్త్ క్లాస్ విద్యార్థి అభయ్ను కిడ్నాప్, హత్య చేసిన నిందితులు బేగంబజార్, సికింద్రాబాద్ల నుంచి నాలుగు ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డులు కొన్నారు. ఈ సిమ్స్ అన్నీ వేరే వ్యక్తుల పేర్లతో, గుర్తింపుతో ఉన్నవే. వీటిని వినియోగించే అభయ్ కుటుంబీకులతో బేరసారాలు చేశారు. ► జేకేబీహెచ్ పేరుతో హైదరాబాద్తో పాటు దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నిన ఉగ్రవాదులు సంప్రదింపులు జరపడానికి ప్రీ–యాక్టివేటెడ్ సిమ్కార్డుల్నే వినియోగించారు. 2016 నాటి ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించిన ఫహద్ ఈ తరహాకు చెందిన తొమ్మిది సిమ్కార్డుల్ని చారి్మనార్ వద్ద ఉన్న ఔట్లెట్లో ఖరీదు చేశాడు. ► పంజగుట్టలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో ఎర వేసి, నిరుద్యోగులు, ప్రధానంగా మహిళల నుంచి డబ్బు కాజేసిన చక్రధర్ గౌడ్ సైతం పెద్ద సంఖ్యలో ప్రీ–యాక్టివెటెడ్ సిమ్కార్డులు వాడాడు. నేరగాళ్లతో పాటు అసాంఘికశక్తులు, ఉగ్రవాదులకు కలిసి వస్తున్న ప్రీ యాక్టివేషన్ దందాకు చెక్ చెప్పడానికి నగర పోలీసు విభాగం సిద్ధమైంది. అందులో భాగంగానే చక్రధర్ గౌడ్కు వీటిని అందించిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని అరెస్టు చేశారు. నిబంధనలు పట్టించుకోని ఔట్లెట్స్... సెల్ఫోన్ వినియోగదారుడు ఏ సరీ్వసు ప్రొవైడర్ నుంచి అయినా సిమ్కార్డు తీసుకోవాలంటే ఫొటోతో పాటు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ) నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అనేక మంది సిమ్కార్డ్స్ విక్రేతలు తమ దగ్గరకు సిమ్కార్డుల కోసం వచ్చే సాధారణ కస్టమర్ల నుంచి గుర్తింపులు తీసుకుని సిమ్కార్డులు ఇస్తున్నారు. పనిలో పనిగా వారికి తెలియకుండా స్కానింగ్, జిరాక్సు ద్వారా ఆయా గుర్తింపుల్ని పదుల సంఖ్యలో కాపీలు తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా ఒక్కో వినియోగదారుడి పేరు మీద సిమ్కార్డులు ముందే యాక్టివేట్ చేస్తున్నారు. అరెస్టులతో పాటు డీఓటీ దృష్టికీ.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బోగస్ ధ్రువీకరణల్ని తీసుకువచ్చే నేరగాళ్లు వాటి ఆధారంగా సిమ్కార్డుల్ని తేలిగ్గా పొందుతున్నారు. ఈ దందాను అరికట్టాలంటే సిమ్కార్డ్ జారీ తర్వాత, యాక్టివేషన్కు ముందు సరీ్వస్ ప్రొవైడర్లు కచి్చతంగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే విధానం ఉండాల్సిందే. పోస్ట్పెయిడ్ కనెన్షన్ మాదిరిగానే ప్రీ–పెయిడ్ను పూర్తిస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత యాక్టివేట్ చేసేలా ఉంటేనే ఫలితాలు ఉంటాయన్నది నిపుణులు చెబుతున్నారు. ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకల్ని డీఓటీ దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. ఎవరికి వారు తనిఖీ చేసుకోవచ్చు.. ప్రతి వినియోగదారుడూ తన పేరుతో ఎన్ని సిమ్కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. www.sancharsaathi.gov.in వెబ్సైట్ ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందులోకి ప్రవేశించిన తర్వాత టాఫ్కాప్ పేరుతో ఉండే నో యువర్ మొబైల్ కనెక్షన్స్ లింక్లోకి ఎంటర్ కావాలి. అక్కడ కోరిన వివరాలు పొందుపరిచి, ఓటీపీ ఎంటర్ చేస్తే మీ పేరుతో ఎన్ని ఫోన్లు ఉన్నాయో కనిపిస్తాయి. అవన్నీ మీకు సంబంధించినవి కాకపోతే ప్రీ–యాక్టివేటెడ్విగా భావించవచ్చు. దీనిపై అదే లింకులో రిపోర్ట్ చేయడం ద్వారా వాటిని బ్లాక్ చేయించవచ్చు. చదవండి: డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు -
ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే రిలీజ్ చేయండి: పాక్ సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్: పీటీఐ అధినేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. అంతకు ముందు.. ఇమ్రాన్ ఖాన్ను గంటలోపు తమ ఎదుట ప్రవేశపెట్టాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. దర్యాప్తు సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను ఆదేశించింది. దీంతో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్ ఖాన్కు కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన అరెస్ట్లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారని మండిపడింది. అల్ ఖాదీర్ ట్రస్ట్ ల్యాండ్కు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ను.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఎనిమిది రోజుల విచారణకు ఇమ్రాన్ ఖాన్కు కస్టడీకి తీసుకుంది కూడా. మరోవైపు ఖాన్ అరెస్టును ఖండిస్తూ.. పాక్లో అల్లర్లు హింసకు పాల్పడ్డారు పీటీఐ కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం ద్వారా పరిస్థితి కాస్త చల్లబడినట్లయ్యింది. PTI Chairman @ImranKhanPTI in Supreme Court today. His arrest has been declared illegal. pic.twitter.com/ewwwIRfqaz — PTI (@PTIofficial) May 11, 2023 The barbaric arrest of Imran Khan buries the dead democracy of Pakistan in a grave! pic.twitter.com/outJDcFakT — Ashok Swain (@ashoswai) May 9, 2023 -
ఇమ్రాన్ ఖాన్ ముమ్మాటికీ దోషే
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ (70)ను వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. అక్రమ భూ బదలాయింపు కేసులో అరెస్టయిన ఆయనను 8 రోజులపాటు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) రిమాండ్కు తరలిస్తూ కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. మరోవైపు తోషఖానా కేసులో ఇమ్రాన్ను ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన ముమ్మాటికీ దోషేనని న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ నిర్ధారించారు. కాగా తనకు ప్రాణభయం ఉందని ఇమ్రాన్ ఒక ప్రకటన విడుదల చేశారు. 24 గంటలుగా వాష్రూమ్కు కూడా వెళ్లలేదని చెప్పారు. తన వైద్యున్ని కలిసే అవకాశమివ్వాలని కోర్టును కోరారు. ప్రధాని షహబాజ్ షరీఫ్ భాగస్వామిగా ఉన్న మనీ లాండరింగ్ కేసులో సాక్షి ‘గుండెపోటు’తో మరణించాడని, తనకూ అదే గతి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రణరంగంగా పాక్ ఇమ్రాన్ అరెస్టును ఖండిస్తూ పీటీఐ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేప ట్టారు. మంగళవారం ప్రా రంభమైన ఆందోళనలు బుధవారమూ కొనసా గాయి. 144 సెక్షన్ను సైతం లెక్కచేయకుండా ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి తదితర నగరాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. వాహనాలను దహనం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అదనపు బలగాలను మోహరించారు. అన్ని విద్యాసంస్థలను మూసేశారు. పరీక్షలను వాయిదా వేశారు. -
అనుమతులు లేకుండా ఐస్క్రీములు తయారుచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్
-
శారదా గ్రూప్ ఆస్తుల వేలం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ తదితర అక్రమ పథకాలను నిర్వహించిన శారదా గ్రూప్ ఆస్తులను వేలం వేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఏప్రిల్ 11న నిర్వహించనున్న వేలానికి రూ. 32 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించింది. ఆస్తులలో కంపెనీకి చెందిన పశ్చిమ బెంగాల్లోని భూములు న్నట్లు సెబీ నోటీసులో ప్రకటించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 మధ్య ఈవేలం నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఆస్తుల అమ్మకంలో సహకరించేందుకు క్వికార్ రియల్టీని, ఈవేలం నిర్వహణకు సీ1 ఇండియాను ఎంపిక చేసుకుంది. శారదా గ్రూప్ ఆస్తుల వేలానికి 2022 జూన్లో కోల్కతా హైకోర్టు అనుమతించడంతో సెబీ తాజా చర్యలకు దిగింది. మూడు నెలల్లోగా ప్రక్రియను ముగించవలసిందిగా కోర్టు ఆదేశించింది. శారదా గ్రూప్ 239 ప్రయివేట్ కంపెనీల కన్సార్షియంగా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్, అస్సామ్, ఒడిషాలలో కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా చిట్ ఫండ్ బిజినెస్ను చేపట్టింది. 2013 ఏప్రిల్లో మూతపడటానికి ముందు 17 లక్షల మంది కస్టమర్ల ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించింది. ముందుగానే శారదా గ్రూప్ ఆస్తులకు సంబంధించి సొంతంగా వివరాలు తెలుసుకోవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. తదుపరి వేలంలో బిడ్స్ దాఖలు చేసుకోమని సూచించింది. -
సూర్యాపేటజిల్లా తుంగతుర్తిలో ఇసుక మాఫియాపై స్థానికుల ఆగ్రహం
-
ఏవోబీ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
-
బీచ్ శాండ్ మైనింగ్లో అక్రమాలను ఎలా నిరోధిస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాలు, మూలకాలు లభించే బీచ్ శాండ్ మైనింగ్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా అనుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అని గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అనుబంధ ప్రశ్న వేశారు. దీనికి పీఎంవో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జవాబిస్తూ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్న సరైనదేనని అన్నారు. గడచిన ఏడెనిమిదేళ్ళలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే బీచ్ శాండ్ మైనింగ్లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలలో ఎలాంటి మెరుగుదల కనిపిస్తోందో స్పష్టమవుతుందని అన్నారు. గ్రానైట్ తవ్వకాల కోసం లైసెన్స్లు పొందిన ప్రైవేట్ సంస్థలు అణు రియాక్టర్లలో వినియోగించే థోరియం తయారీకి అవసరమైన మొనజైట్ వంటి నిక్షేపాలను భారీగా స్మగ్లింగ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరుదైన ఖనిజాలు, మూలకాల స్మగ్లింగ్ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. మైనింగ్ చేస్తున్న ఖనిజ నిక్షేపాలలో వాటి వివిధ ఆకృతులను నిర్ధారించేందుకు శాటిలైట్ ఇమేజింగ్ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. అరుదైన ఖనిజ నిక్షేపాల మైనింగ్లో పాల్గొంటున్నది ప్రైవేట్ సంస్థా లేక ప్రభుత్వ రంగ సంస్థా అన్న దానితో నిమిత్తం లేకుండా స్మగ్లింగ్ను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలలో తోడ్పడవలసిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని పదేపదే కోరుతున్నామని అన్నారు. -
మైనర్ బాలిక కేసులో అక్రమ అరెస్టులు
-
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం
-
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ ధ్వంసం..ఏకంగా 60 డైనమైట్లతో ..
సాక్షి, ఇండోర్: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్ నగర్లో ఉన్న బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలస్ని సుమారు 60 డైనమైట్లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాగర్జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్ ఆర్య ప్రకటించారు. హత్యకు గురైన జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. కిరణ్ యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం. #WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar "There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8 — ANI (@ANI) January 4, 2023 (చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్ కేసులో జైలు శిక్ష.. సర్కార్పై పదివేల కోట్లకు దావా) -
ఈఫిల్ను రాత్రిపూట ఫొటో తీయాలంటే పర్మిషన్ కావాలి..
పారిస్ వెళ్లినవాళ్లెవ్వరైనా ఈఫిల్ టవర్ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అందులోనూ రాత్రిపూట పారిస్ వెలుగుల్లో ఈఫిల్ టవర్ అందాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం. అయితే పగలైనా రాత్రైనా సాధారణ వ్యక్తులు ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. రాత్రిపూట ఈఫిల్ అందాలను పట్టి బంధించడానికి వీల్లేదు. పొద్దంతా తీసిందొక లెక్క... రాత్రిపూట తీసిందో లెక్క అంటున్నారు నిర్వాహకులు. సాధారణ సందర్శకులు ఫోన్స్లోనూ, కెమెరాల్లోనూ ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ రాత్రిపూట ఫొటోస్ తీయడానికి మాత్రం పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట వెలిగే లైట్స్పై కాపీ రైట్ ఉందన్నమాట. పబ్లిష్ చేయడానికైనా, సర్క్యులేట్ చేయడానికైనా ప్రొఫెషనల్స్ ఈఫిల్ టవర్ మేనేజ్మెంట్ కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాలని toureiffel. paris పేర్కొంది. ఈఫిల్ టవర్పై రోజూ 20వేల బల్బులు కాంతులీనుతాయి. టవర్పైన ఉన్న దీపస్థంభం అయితే మరింత ప్రత్యేకమైనది. చదవండి: (Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు) -
ప్రీలాంచ్ మాయ.. గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్న డెవలపర్లు!
సాక్షి, హైదరాబాద్: ‘అమీన్పూర్లోని 10 ఎకరాల స్థల యజమానితో ఓ డెవలప్పర్ రెండేళ్ల క్రితం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 65 లక్షల చదరపు అడుగులు (చ.అ.) బిల్టప్ ఏరియాలో 4 వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నానని ప్రచారం చేశాడు. నిర్మాణ అనుమతులు రాకముందే చ.అ.కు రూ.2 వేల చొప్పున 2 వేల ఫ్లాట్లను విక్రయించాడు. తీరా చూస్తే ఆ భూమి న్యాయపరమైన వివాదాలలో చిక్కుకుంది. ఇంకేముంది కొనుగోలుదారుల నుంచి ముందుగానే రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన డెవలపర్ సైలెంటైపోయాడు’.. ఇలా ప్రీలాంచ్ డెవలపర్లు గృహ కొనుగోలుదారుల గొంతుకోస్తున్నారు. సామాన్యుల సొంతింటి కలలను కొల్లగొడుతున్నారు. కాస్త తక్కువ ధరకు వస్తుందనే కొనుగోలుదారుల బలహీన మనస్తత్వంతో ప్రీలాంచ్ డెవలపర్లకు మంత్రదండంలా ఉపకరిస్తోంది. స్థల యజమానులతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే ఫ్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. ఖాళీ స్థలం చూపించి 10 అంతస్తులు, 20 ఫ్లోర్లు కడుతున్నామని నమ్మబలికి వంద శాతం సొమ్ము చెల్లిస్తే సగం కంటే తక్కువ ధరకే దొరకుతుందని ఆశ చూపెడుతున్నారు. నిజమేనని నమ్మిన కొనుగోలుదారులను నట్టేట ముంచేస్తున్నారు. ఐటీ దాడులైతే కష్టమే.. ప్రీలాంచ్ విక్రయాలలో డెవలపర్కు చేరేది నల్లధనమే. అనధికారిక లావాదేవీలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆయా సొమ్మును పలు ప్రాజెక్ట్లకు లేదా ఇతర ప్రాంతాలలో స్థలాల కొనుగోళ్లకు వినియోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సదరు నిర్మాణ సంస్థపై ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తే గనక.. అసలుకే మోసం వస్తుందని ఓ డెవలపర్ తెలిపారు. అనధికారిక నగదును, బ్యాంక్ ఖాతాలను స్థంభింప చేస్తారు. దీంతో సదరు నిర్మాణ సంస్థ ఇతర ప్రాజెక్ట్లపై దీని ప్రభావం పడుతుందని ఆయన వివరించారు. నగదు సరఫరా మందగించడంతో ప్రాజెక్ట్లు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ అందరే.. కోకాపేట, ఖానామేట్ వేలంలో భూములు దక్కించుకున్న పలు నిర్మాణ సంస్థలు, నానక్రాంగూడలో హైరైజ్ ప్రాజెక్ట్ను ప్రకటించిన మరొక నిర్మాణ సంస్థ, జూబ్లీహిల్స్ ప్రధాన కేంద్రంగా ఉన్న మరొక కంపెనీ.. పెద్ద కంపెనీలతో పాటు చిన్నా చితకా సంస్థలూ ప్రీలాంచ్లో విక్రయాలు చేస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, నార్సింగి, నిజాంపేట, ఎల్బీనగర్, నార్సింగి, పుప్పాలగూడ, తెల్లాపూర్, శామీర్పేట వంటి ప్రాంతాలలో ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు చేపడుతున్నారు. ఈ లాజిక్ తెలిస్తే చాలు.. నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్దీ నిర్మాణ వయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్ + గ్రౌండ్ + అయిదంతస్తుల భవన నిర్మాణానికి చదరపు అడుగు (చ.అ.)కు రూ.2,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.3 వేలు, 15–25 ఫ్లోర్ల వరకు రూ.3,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.4 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్ అయినా ఇంతకంటే తక్కువ ధరకు అపార్ట్మెంట్ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని క్రెడాయ్ తెలంగాణ సెక్రటరీ కె.ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. (చదవండి: నేడు ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి అమిత్ షా.. పోలీసుల ప్రత్యేక నిఘా ) -
అనుమతి లేని మసాజ్ సెంటర్పై దాడి
హైదరాబాద్: లక్డీకాపూల్లోని ది సెంట్ హోటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్పై సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు మేనేజర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
బడి భూమిలో పాగా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని సైతం వదలడం లేదు అక్రమార్కులు. దర్జాగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా పాఠశాల ప్రాంగణం వరుసగా రెండుసార్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు వెలుస్తున్నా... తాత్కాలిక అడ్డగింపు తప్ప శాశ్వత పరిష్కారానికి చొరవ కనిపించడం లేదు. నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల భూములు మాయమవుతున్నా ఇటు విద్యా శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. చెరలో శంకేశ్వర పాఠశాల ప్రాంగణం.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 25 శాతం మినహా మిగిలిన పాఠశాలకు సొంత స్థలాల్లో భవనాలు ఉన్నాయి. వాటికి ప్రాంగణాలు కూడా ఉన్నాయి. పాఠశాలలకు ఆనుకొని ఉన్న స్థల యజమానులు ప్రాంగణాలను ఆక్రమించుకోవడం, అడ్డుకుంటే కోర్టుకు వెళ్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఇదే పరిస్థితిని తలపిస్తోంది సైదాబాద్లోని శంకేశ్వర బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు కేటాయించిన స్థలంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు చదువుతుండటంతో ఆటలకు అనువుగా ఉండేందుకు సుమారు 250 చదరపు గజాల స్థలాన్ని పాఠశాల ప్రాంగణంగా వదిలి మిగతా స్థలంలోని భవన సముదాయంలో పాఠశాల తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. పదేళ్ల క్రితం పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలం యజమాని ప్రాంగణంలోని వంద గజాల స్థలాన్ని అక్రమించి తన ఇంటికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. అప్పట్లో విద్యా, రెవెన్యూ అధికారుల దృష్టికి కొందరు స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనతోనే మిన్నకుండిపోయారు. దీంతో మిగిలిన 150 చదరపు గజాల స్ధలం రక్షించుకునేందుకు అప్పటి సైదాబాద్ కార్పొరేటర్ ప్రత్యేక చొరవ చూపించి పాఠశాల ప్రాంగణం రోడ్డు మార్గాన్ని మూసివేసి స్కూల్ ముందు మార్గంలో గేటు పెట్టించారు. మిగిలిన ప్రాంగణం కూడా మూడేళ్ల క్రితం పాఠశాల ప్రాంగణానికి చెందిన మిగిలిన 150 చదరపు గజాల స్థలంపై కొందరి కన్ను పడింది. ఏకంగా ప్రాంగంణంలోని రెండు భారీ వృక్షాలను తొలగించి సామాజిక భవన్ పేరుతో నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాఠశాల ప్రాంగణం పూర్తిగా కనుమరుగైంది. క్షేత్రస్థాయి సందర్శనకే పరిమితం మూడేళ్లుగా పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై సంబంధిత అధికారుల క్షేత్ర స్థాయి సందర్శనకే పరిమితమైంది. శాశ్వత పరిష్కారం కోసం ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ తదితరులు పాఠశాలను సందర్శించడం, ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించడం తిరిగి వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. తాజాగా కొందరు అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై కింద పాఠశాల కోసం సెల్లార్, పైన సామాజిక వర్గం భవనం కొనసాగేలా సంధిమార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మన బస్తీ– మన బడి కార్యక్రమం కింద పాఠశాల ప్రాంగణం మార్గానికి ప్రహరీ పనులు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై పాఠశాల ప్రాంగణం ఆక్రమణ వ్యవహారంపై హైదరాబాద్ డీఈఓను ఫోన్లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆమె నుంచి స్పందన రాలేదు. (చదవండి: పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు అందుకుంటున్న పిల్లి...ఎందుకో తెలుసా!) -
కన్నతల్లి కర్కశం: ఐదేళ్లుగా కూతురిని హింసించి మరీ..
ఛీ.. ఛీ.. ఈ భూమ్మీద ఏ మహిళ కూడా ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండదేమో!. కూతురు యుక్త వయసుకు రాగానే.. దుర్మార్గానికి తెర తీసింది ఇక్కడో కన్నతల్లి. కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించడమే కాదు.. బలవంతంగా కూతురి నుంచి అండ సేకరణ చేపట్టి దొడ్డిదారిలో సరోగసీ(అద్దె గర్భం) కోసం అమ్మేసుకుంది. ఒకటికాదు.. రెండుకాదు.. ఐదేళ్లుగా ఈ ఘోరం జరుగుతూ వస్తోంది. తమిళనాడు ఈ రోడ్లో కన్నతల్లి చేసిన అక్రమ నిర్భంధ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ కన్నతల్లి తన కూతురి నుంచి బలవంతంగా అండ సేకరణ చేపట్టి.. అక్రమ సరోగసీ కోసం ఆస్పత్రులకు అమ్మేసుకుంది. పైగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నడుపుతూ.. అతనితో కూతురిపైనే అత్యాచారం చేయిస్తూ వచ్చింది. తమిళనాడు ఈ రోడ్లో జరిగిన ఈ ఘోరంపై హైలెవల్ దర్యాప్తు కొనసాగుతోంది. మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టోరేట్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జాయింట్ డైరెక్టర్ విశ్వనాథన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. సోమవారం స్టేట్ హోంలో ఉన్న బాధితురాలిని పరామర్శించి మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఈ రోడ్తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని ఆస్పత్రుల్లో ఈ ఇల్లీగల్ సరోగసీ వ్యవహారం నడిచినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ రోడ్కు చెందిన నిందితురాలు(33).. భర్తకు దూరంగా ఉంటోంది. బిడ్డను తనతో పాటే పెంచుకుంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. కూతురు యుక్తవయస్సుకు రాగానే.. తన ప్రియుడి ద్వారానే అత్యాచారం చేయించింది. గత ఐదేళ్లుగా.. బాధితురాలిపై అత్యాచార పర్వం కొనసాగుతోంది. బాధితురాలి నుంచి అండాలను బలవంతంగా సేకరించి.. ఆస్పత్రులకు అమ్మేసుకుంటూ ఆ తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి.. డబ్బులను పంచుకుంటూ వస్తున్నారు. అంతేకాదు.. కూతురి వయసును ఆధార్కార్డులో మార్పించేసి మరీ ఈ దందాకు పాల్పడుతూ వస్తున్నారు. జూన్ 1వ తేదీన వేధింపులు భరించలేక బాధితురాలు ఇంటి నుంచి పరారైంది. సేలంలోని తన స్కూల్ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుని.. బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడు, మధ్యవర్తి, ఆధార్ను మార్పిడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అంతేకాదు అక్రమ సరోగసీకి పాల్పడిన ఆస్పత్రులపై, వైద్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమిళనాడు ప్రభుత్వ వైద్య శాఖ. -
బుద్దుండక్కర్లేదా?.. అంతా మీకేనా!
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో అక్రమ గనులు.. ప్రత్యేకించి రాళ్ల గనులు, కొండలు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయి. డ్రోన్ సర్వే, టాస్క్ఫోర్స్ కమిటీ, ప్రత్యేక కార్యచరణ తదితర ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ గనుల తవ్వకాలది అదే దారి. ఒక చోట తవ్వకాలకు అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాల్లో గనులు తవ్వేయడం, అధికారులు, రాజకీయ నేతల అండదండలతో విచ్చలవిడిగా గనులు తవ్వుకుని కోట్లాది రూపాయలను వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చర్యలు నామమాత్రమే అవుతున్నాయని పర్యావరణవాదులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ జిల్లాల్లో అధికం బెంగళూరు రూరల్, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, కోలారు, చామరాజనగర, బీదర్, శివమొగ్గ, మండ్య, మైసూరు, దక్షిణకన్నడ, బళ్లారి, తుమకూరు, విజయపుర తదితర జిల్లాల పరిధిలో చాలా చోట్ల అనుమతులు లేకుండా వేలాది ఎకరాల్లో రాళ్ల గనులు తవ్వుతున్నట్లు గనుల శాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. వీటికి అనుబంధంగా వందలాది జల్లిక్రషర్లను ఏర్పాటుచేసుకుని కంకర, రాతి ఇసుకగా మార్చి అమ్ముకుంటున్నారు. మూడేళ్లలో 13 వేల కేసులు గత మూడేళ్ల వ్యవధిలో సుమారు 13 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. 2019 – 20 సంవత్సరంలో 4,935 కేసులు, 2020 – 21లో 5,584, 2021 – 22లో 2,996 కేసులు నమోదయినట్లు సమాచారం. ఇందులో 70.15 శాతం కేసుల్లో అరకొర జరిమానా విధించారు. కొందరికి మాత్రమే జైలు శిక్ష పడింది. గనుల వెనుక బలమైన వ్యక్తులే ఉండడం వల్ల జరిగేదేమిటో అందరికీ తెలిసిందే. గనులు– ఖనిజాలు –1957 చట్టం ప్రకారం గనులు, తవ్వకాలు, రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విషయం. అక్రమ గనుల తవ్వకాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. తరచూ పేలుళ్లు, నేరాలు మండ్యజిల్లాలో ప్రసిద్ధ కేఆర్ఎస్ డ్యాం దెబ్బతినేలా సమీపంలో రాళ్ల గనులను తవ్వుతున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. గతేడాది జనవరిలో శివమొగ్గలో గనుల పేలుడుపదార్థాలు పేలి ఆరుమంది కార్మికులు దుర్మరణం చెందారు. ఆ మరుసటి నెలలోనే చిక్కబళ్లాపురలోనూ ఇదే తరహాలో పేలుళ్లు సంభవించి మరో ఆరుగురు గని కార్మికులు మృత్యువాత పడ్డారు. తరచూ గనుల వద్ద ప్రమాదాలతో ప్రాణనష్టం జరుగుతోంది. అదేరీతిలో కిడ్నాప్లు, హత్యలూ చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి: వీడియో: అబ్బా..! దళిత స్వామిజీతో ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్ -
Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలు అందలేదని.. తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది. "The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit — NDTV (@ndtv) April 20, 2022 స్పందించిన సీజే.. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది. -
సెలూన్ ముసుగులో మసాజ్ సెంటర్.. మహిళలను మభ్యపెట్టి వారితో..
సాక్షి, కుషాయిగూడ( హైదరాబాద్): సెలూన్ ముసుగులో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపి నిర్వాహకులను అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాధిక చౌరస్తా సమీపంలో నిర్వహిస్తున్న ప్యారీస్ సెలూన్ అండ్ స్పాలో అమాయక మహిళలను మభ్యపెట్టి వారితో మసాజ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వాహకులు శివసాయినగర్ కాలనీకి చెందిన జంపాల శివ, ఈస్ట్ మారెడుపల్లికి చెందిన కొలిపాక నవీన్, ఓ విటుడుతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో.. తాగిన మైకంలో అక్కను కొట్టిన తమ్ముడు...అక్క మృతి బాలానగర్( హైదరాబాద్): తాగిన మైకంలో ఓ వ్యక్తి అక్కను కొట్టడంతో దెబ్బలకు తాళలేక ఆమె మృతిచెందింది. ఈ సంఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. సీఐ ఎండి వాహిదుద్దీన్ తెలిపిన మేరకు.. బాలానగర్ డివిజన్ గిరినగర్కు చెందిన కనకలక్ష్మి (40) గత నెల రోజుల నుంచి తల్లిదండ్రులతోనే ఉంటుంది. అయితే తమ్ముడు మల్లేష్ అక్క కనకలక్ష్మితో గొడవపడి ఈ నెల 5న ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యం పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు హిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు మల్లేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: ‘జైద్ లే నాన్నా.. ఒక్కసారి ఇటు చూడు.. ఎంత పనిచేశావ్’ -
పశ్చిమ గోదావరి జిల్లాలో బయటపడ్డ కలప అక్రమ దందా
-
ధర మార్చి.. ఏమార్చి!
-
బిట్కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్కాయిన్పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్.. అక్రమంగా..
రాయగడ(భువనేశ్వర్): ఉపాధ్యాయుడు శిశిర్కుమార్ సిమోలి విజిలెన్స్ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లపై శనివారం ఆకస్మిక దాడులు చేపట్టిన అధికారులు పలు విలువైన దస్తావేజులు, నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జిల్లాలోని కాశీపూర్ సమితి, దొరగుడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు సంబంధించి, కాశీపూర్లోని ఆరు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయన్న సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో విజిలెన్స్ డీఎస్పీలు సుశాంత్కుమార్ బిశ్వాల్, అనంతప్రసాద్ మల్లిక్, కళావతి భాగ్ల నేతృత్వంలో 4 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు. తొలుత దొరగుడ(కాశీపూర్ సమితి)లోని ఇంట్లో తనిఖీలు చేపట్టిన సిబ్బంది రూ.2.88 లక్షల నగదు, 1 ఇన్నోవా కారు, మరొక బొలెరొ కారు, 408 గ్రాముల బంగారం, 229 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు రెండంతస్తుల భవనాలు రెండు, మూడంతస్తుల భవనం ఒకటికి సంబంధించిన దస్తావేజులు, రాయగడ స్టేట్ బ్యాంక్లో జమ చేసిన రూ.21.68 లక్షలకు సంబంధించి, బ్యాంక్ పాస్పుస్తకాలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. -
ఇక ‘అదనంగా మీటర్లు’ తిరగవ్!
గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ లాడ్జి యజమాని కస్టమర్లు రాకపోవడంతో ఓ కొత్త పథకం వేశాడు. లాడ్జిలోని గదులన్నిటికీ ఒక్కో విద్యుత్ మీటర్ బిగించాడు. లాడ్జిని అద్దె ఇల్లుగా మార్చేశాడు. ఒక భవనానికి ఒక మీటరే ఉండాలి. కానీ ఇక్కడ గదికో మీటర్ ఉంది. అపార్ట్మెంట్లలో ఫ్లాట్కు ఒక మీటర్ చొప్పున ఉంటుంది. అయితే కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు ఒక అపార్ట్మెంట్ తీసుకుని అందులో హాస్టల్ పెడుతున్నారు. అంటే ఒకే యాజమాన్యం కిందకు మొత్తం బిల్డింగ్ వచి్చంది. కానీ మీటర్లు మాత్రం ఫ్లాట్కు ఒకటి చొప్పున ఉన్నాయి. ఏలూరుకు చెందిన ఒక వినియోగదారుడి మొబైల్ నంబర్కు నాలుగు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. వీటిలో ఒక సరీ్వసును మాత్రమే ఆయన వాడుతున్నాడు. మిగతా మూడు ఎవరివో, తనకెందుకు బిల్లు వస్తుందో ఆయనకు తెలియడం లేదు. అంటే.. ఆయన సెల్ నంబర్తో అనుసంధానమైన ఇతర సరీ్వసులను వేరెవరో అక్రమంగా వినియోగిస్తుండాలి. సాక్షి, అమరావతి: ఇవి ఇటీవల విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి వచ్చిన కొన్ని ఉదంతాలు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అనేక విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో చాలావరకు అక్రమ సర్వీసులే. కాగా కొన్ని విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాల వల్ల వినియోగదారులకు మంజూరయ్యాయి. ఇలాంటివాటిపై ఇప్పుడు విద్యుత్ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వాడుతున్న మీటర్లను తొలగించడంతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనుంది. బాధ్యుల్లో విద్యుత్ శాఖ సిబ్బంది ఉంటే వారిపైనా శాఖాపరమైన చర్యలు చేపట్టనుంది. ‘డీపీఈ’ ఎప్పట్నుంచో చేస్తున్నదే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో డిటెన్షన్ ఆఫ్ ఫిలపరేషన్ ఎనర్జీ (డీపీఈ) విభాగం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అక్రమ విద్యుత్ సర్వీసులను కనిపెట్టడం దీని విధి. ఇప్పుడు తాజాగా విద్యుత్ సర్వీసుకు ఆధార్ నంబర్ను అనుసంధానించే ప్రక్రియను ఇది జోడించింది. ఇలా చేయడం వల్ల ఒక ఆధార్పై ఎన్ని విద్యుత్ సర్వీసులు మంజూరయ్యాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తద్వారా అక్రమ కనెక్షన్లను ఏరిపారేయవచ్చనేది విద్యుత్ శాఖ అధికారుల వ్యూహం. అంతేకాకుండా ఒక భవనానికి ఒకే యజమాని ఒకటి కంటే ఎక్కువ మీటర్లు వాడటాన్ని అడ్డుకోవచ్చు. అవి అసత్య ప్రచారాలంటున్న అధికారులు డిస్కమ్లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) చేస్తున్న ఈ పనిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక భవనంలో వేర్వేరు పోర్షన్లలో వేర్వేరు కుటుంబాలు ఉన్నప్పటికీ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసి, అన్ని సర్వీసులకు కలిపి ఒకే బిల్లును జారీ చేస్తారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దీంతో స్లాబులు మారిపోయి విద్యుత్ బిల్లు పెరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలకు దూరమవుతారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ఈ అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె. పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వంట గది ఉన్న ఇంటికి ఒకే సర్వీసును మంజూరు చేస్తామని చెబుతున్నారు. వివిధ వర్గాలకు ప్రభుత్వం వర్తింపజేసే సంక్షేమ పథకాలకు తాము చేపట్టిన ప్రక్షాళన చర్యల వల్ల ఎటువంటి భంగం వాటిల్లదని ‘సాక్షి’కి వివరించారు. -
నేరాలు చేద్దామని తుపాకీ కొన్నాడు.. కానీ
సాక్షి, హైదరాబాద్: దినసరి కూలీతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తుపాకీ కొనుగోలు చేశాడు. దాంతో దారినపోయే వారిని బెదిరించి దోపిడీలు చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. అయితే అతడి ప్లాన్ను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు పటాపంచలు చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న మహ్మద్ హుస్సేన్ను గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చార్మినార్కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఇటీవలే రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లిలోని రోషన్ కాలనీకి మకాం మార్చాడు. రోజు వారి కూలీ డబ్బులు చాలకపోవడంతో దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఉత్తర్ప్రదేశ్ నుంచి 9 ఎంఎం తుపాకీ, మేగజైన్, ఆరు బుల్లెట్లను కొనుగోలు చేశాడు. అయితే దోపిడీలకు పాల్పడక ముందే ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు అతడిపై సమాచారం అందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతలకుంట చెక్పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆయుధం ఎవరి నుంచి కొనుగోలు చేశాడు? హుస్సేన్ ప్రణాళికలేంటి తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: పోలీస్స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని.. -
బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పే చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమలుపై కృష్ణా బేసిన్ (పరీవాహక ప్రాంతం)లోని నాలుగు రాష్ట్రాలు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. ఆ తీర్పు చట్టవిరుద్దమని, దాన్ని అమలు చేయవద్దని ఏపీ, తెలంగాణ వాదిస్తుండగా.. తక్షణమే అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్ర కోరుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 రాష్ట్రాలు రాతపూర్వకంగా వాదనలు సమర్పించాయి. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా బలమైన వాదనలను వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. చట్టాన్ని ఉల్లంఘించిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్: ఆంధ్రప్రదేశ్ ♦ కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఇచ్చిన తీర్పును అమలుచేస్తూ 1976 మే 31న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ♦ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల (ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956ను 2002లో కేంద్రం సవరించింది. సవరించిన సెక్షన్–4(2) ప్రకారం 2002కు ముందు నదీజల వివాదాలను పరిష్కరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించకూడదు. సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ సమీక్షించింది. ఇది చట్టవిరుద్ధం. ♦బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా క్యారీ ఓవర్ కింద మా రాష్ట్రానికి 150 టీఎంసీలు కేటాయించింది. ఇందులో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేశాక క్యారీ ఓవర్ కింద 30 టీఎంసీలు, 50% నీటి లభ్యత ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేసిన తర్వాత క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ పద్ధతిలో క్యారీ ఓవర్ కింద నీటి వినియోగం అసాధ్యం. దీన్ని మార్చాలి. ♦ 75%, 65% లభ్యత మధ్య ఉన్న జలాలు, 50% లభ్యత ఆధారంగా మిగులు జలాలు వెరసి 448 టీఎంసీలను నాగార్జునసాగర్కు ఎగువనున్న రాష్ట్రాలకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. వీటి ఆధారంగా కర్ణాటక సర్కార్కు ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడం, అదనంగా 100 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం రావడంలో తీవ్రజాప్యం జరుగుతుంది. ఇది బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఏపీకి శరాఘాతమే. ♦తుంగభద్ర సబ్ బేసిన్ (కే–8)లో 65% లభ్యత ఆధారంగా 36 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయిస్తే.. 12.24 టీఎంసీలు వాడుకునేలా అప్పర్ తుంగ, 18.55 టీఎంసీలు వినియోగించుకునేలా సింగటలూరును కర్ణాటక నిర్మించింది. 9 టీఎంసీల కేటాయింపు ఉన్న అప్పర్ భద్రను 29.90 టీఎంసీలు వాడుకునేలా చేపట్టింది. ♦ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాకముందే అక్రమంగా 300 టీఎంసీలు వాడుకునేలా కర్ణాటక, 90 టీఎంసీలు వాడుకునేలా మహారాష్ట్ర ప్రాజెక్టులు చేపట్టాయి. ♦ ఏపీ, తెలంగాణల్లోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు (చిన్న నీటివనరులను మినహాయించి) 75% నీటి లభ్యత ఆధారంగా 641.74 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ.. 2014–15 నుంచి 2017–18 వరకు సగటున 481 టీఎంసీలే ఈ ప్రాజెక్టులకు వచ్చాయి. ♦ వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిని వాడుకోవడానికి వీలుగా తక్షణమే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని కర్ణాటక సర్కారు చేస్తున్న వాదనలు అన్యాయం. ♦ చట్టవిరుద్ధంగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన జలాల్లో మార్పులు చేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీకి న్యాయం చేయాలి. ఏపీకి న్యాయం చేసే వరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయకూడదు. తీర్పును అమలు చేయవద్దు: తెలంగాణ బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయవద్దు. ఈ తీర్పును అమలు చేస్తే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన క్యారీ ఓవర్ జలాలను మా రాష్ట్రం వాడుకోవడానికి అవకాశం ఉండదు. ఇది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ట్రిబ్యునల్ తీర్పులో మార్పులు చేయాలి. అప్పటిదాకా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయకూడదు. తక్షణం అమలు చేస్తేనే ఉపయోగం: కర్ణాటక బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ 2013 నవంబర్ 19న తుది తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్లయినా ఆ తీర్పు అమల్లోకి రావడం లేదు. ఏటా వందలాది టీఎంసీల కృష్ణాజలాలు వృథాగా కడలిపాలవుతున్నాయి. వాటిని వాడుకోవడానికి చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.13,321 కోట్లు ఖర్చుచేశాం. తక్షణమే తీర్పు అమలు చేస్తే ప్రాజెక్టులను పూర్తిచేసి, కేటాయించిన నీటిని వాడుకుంటాం. దీనివల్ల ఏపీ, తెలంగాణలకు నష్టం ఉండదు. నోటిఫై చేయాల్సిందే: మహారాష్ట్ర బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పటిదాకా అమలు చేయకపోవడం అన్యాయం. తక్షణమే తీర్పును అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలి. దీనివల్ల నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. -
నొప్పి తెలియకుండా విముక్తి
మరొకరి సాయంతో జీవితాన్ని చాలించడాన్ని (అసిస్టెడ్ సూసైడ్) సులభతరం చేసేదే ఈ ‘సార్కో మెషీన్’. నయం కాని వ్యాధులతో బాధపడుతూ... నిత్యం నొప్పిని, మానసిక క్షోభనూ అనుభవిస్తూ అనుక్షణం చచ్చేకంటే... ఎలాగూ బతికే అవకాశాలు లేవు కాబట్టి... పలుదేశాలు స్వీయ సమ్మతితో ప్రాణాలు విడవడాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తున్నాయి. అందులో స్విట్జర్లాండ్ ఒకటి. అసిస్టెడ్ సూసైడ్కు ఈ సార్కో మెషీన్ ఒక సులువైన, బాధ తెలియనివ్వని సాధనం. స్విట్జర్లాండ్లో న్యాయ సమీక్షలో దీనికి ఆమోదముద్ర పడిందని తయారీ సంస్థ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (లాభాపేక్ష లేని సంస్థ. స్వచ్చంద సంస్థ లాంటిది) గతవారం వెల్లడించింది. ఎలా పని చేస్తుందంటే... శవపేటిక ఆకారంలో ఉండే సార్కో త్రీడీ ముద్రిత క్యాప్సుల్. ఎవరైనా ఇందులోకి ప్రవేశించి పడుకొంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సమాధానాలు ఇచ్చాక లోపల ఉండే ఒక బటన్ను నొక్కడం ద్వారా దీన్ని పనిచేసేటట్లుగా చేయవచ్చు. ఎప్పుడు ప్రారంభం కావాలనే సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నైట్రోజన్తో నిండిన ఒక పరికరం ఉపరితలంపై దీని నిర్మాణం జరుగుతుంది. బటన్ నొక్కిన వెంటనే క్యాప్సుల్లోకి శరవేగంగా నైట్రోజన్ నిండుతుంది. సెకన్లలో ఆక్సిజన్ స్థాయి 21 నుంచి ఒకటికి పడిపోతుంది. క్యాప్సుల్లోని వ్యక్తి వినికిడి శక్తిని కొద్దిగా కోల్పోయిన భావన కలుగుతుంది... ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతాడు. శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డయాౖMð్సడ్ స్థాయిలు పడిపోయి మరణం సంభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 సెకన్లలో ముగుస్తుందని దీని రూపకర్త డాక్టర్ ఫిలిప్ నిష్కే తెలిపారు. తీవ్ర భయాందోళనలకు లోనుకావడం, ఊపిరి ఆడని ఫీలింగ్, యాతన... ఇవేవీ ఉండవు. ఆటోమేషన్ చేసే ఆలోచన స్విట్జర్లాండ్లో అసిస్టెడ్ సూసైడ్ చట్టబద్ధంగా అనుమతించడం పరోక్షంగా జరుగుతుంది. నేరుగా దీన్ని అనుమతించే చట్టాలు లేవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకొకరు సహాయపడితే... దాని వెనుకగనక అతనికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని రుజువు చేయగలిగితే శిక్షార్హుడని చట్టం చెబుతోంది. అసిస్టెడ్ సూసైడ్కు ఒక ప్రొసీజర్ ఉంటుంది. జీవించే అవకాశాల్లేని రోగి... తనువు చాలించాలని నిర్ణయం తీసుకొనేటపుడు మానసిక సమతౌల్యంతో ఉన్నట్లు సైకియాట్రిస్టు ధ్రువీకరించాలి. తర్వాత రోగి నోటి ద్వారా ద్రవరూపంలో ఉన్న సోడియం పెంటోబార్బిటాల్ తీసుకుంటాడు. 2 నుంచి 5 నిమిషాల్లోపే నిద్రలోకి... ఆపై గాఢ కోమాలోకి వెళ్లిపోతాడు. అనంతరం మరణం సంభవిస్తుంది. చాలాదేశాల్లో అసిస్టెడ్ సూసైడ్ డాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్లో డాక్టర్లు కాని వారు కూడా ఆత్మహత్యలో సహాయపడవచ్చు. సైకియాట్రిస్టు ధ్రువీకరణ కూడా యాంత్రికంగా జరిగేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని సార్కోకు జోడించే యత్నాలు చేస్తున్నామని డాక్టర్ ఫిలిప్ తెలిపారు. అసిస్టెడ్ సూసైడ్– యుథనేసియా ఒకటేనా! కాదు తేడా ఉంది. యూకే నేçషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం యుథనేసియా/మెర్సీకి ల్లింగ్ (కారుణ్య మరణం)లో ఒక వ్యక్తికి భరింపలేని, నిరంతర బాధ నుంచి విముక్తి ప్రసాదించడానికి డాక్టర్ ప్రాణాలు తీసే మందును తానే ఇంజక్ట్ చేస్తాడు. రోగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిల్లో ఉంటే మెర్సీకిల్లింగ్లో అతని లేదా ఆమె బంధువులు కూడా రాతపూర్వకంగా సమ్మతి తెలుపవచ్చు. అసిస్టెడ్ సూసైడ్... ఒక బాధిత రోగి ప్రాణాలు తీసుకోవడానికి వైద్యుడు ప్రిస్కిప్షన్ రాస్తాడు.. రోగి స్వయంగా ఇంజక్షన్ లేదా నోటిద్వారా మందును వేసుకుంటాడు. స్విట్జర్లాండ్లో మాత్రమే డాక్టర్లు కాని వారు కూడా అసిస్టెడ్ సూసైడ్లో సహాయపడవచ్చు. ఏయే దేశాలు అనుమతిస్తున్నాయి... స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా, కొలంబియా, స్పెయిన్, న్యూజిలాండ్ (6నెలలకు మించి బతకడని ఇద్దరు డాక్టర్లు ధ్రువీకరించాలి) దేశాల్లో చట్టబద్ధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోనూ ఇది అమల్లో ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, న్యూజెర్సీ, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మోంటానా, వెర్మోంట్ల్లో చట్టబద్ధం. ఎవరు అర్హులనే విషయంలో నిబంధనలు మాత్రం వేరుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్లో రెండు అతిపెద్ద అసిస్టెడ్ సూసైడ్ సంస్థలు... ఎగ్జిట్, డిగ్నిటాస్ల సేవలు ఉపయోగించుకొని 2020లో 1,300 మంది విముక్తి పొందారు. చట్టబద్ధత లేని దేశాల వారు స్విట్జర్లాం డ్ వచ్చి మరీ ప్రాణాలు వదులుతున్నారు. ఇది ‘డెత్ టూరిజం’గా మారుతోందనే విమర్శలున్నాయి. నైతికంగా సబబేనా? జాతస్య మరణం ధృవంః. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ, ఇక బతికే అవకాశాలేమాత్రం లేనపుడు నొప్పిని భరిస్తూ బతికుండటానికి బదులు తనువు చాలించడమే మేలని భావిస్తారు బాధితులు. శారీరకంగా నొప్పిని భరిస్తూ, మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూడటమనేది అన్నింటికంటే పెద్ద నరకం. అలాంటి జీవికి సాధ్యమైనంత తేలికైన మార్గంలో ముక్తిని ప్రసాదించడమే మేలనేది కొందరి వాదన. అందుకే చట్టాలు దీన్ని అనుమతిస్తున్నాయి. భారత్లో ఏంటి స్థితి? అసిస్టెడ్ సూసైడ్, యుథనేసియా/మెర్సీ కిల్లింగ్ రెండూ మనదేశంలో చట్ట విరుద్ధం. నేరం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు అరుణా షాన్బాగ్ కేసులో 2011లో ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అరుణా షాన్బాగ్పై వార్డుబాయ్ 1973లో అత్యాచారం చేశాడు. దాంతో కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకోలేదు. 37 ఏళ్లు అలా ఆసుపత్రిలో జీవచ్చవంగా బెడ్పై ఉండిపోయిన ఆమె తరఫున 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడో న్యాయవాది. ఆమెకు విముక్తి కల్పించాలని కోరాడు. మెడికల్ లైఫ్సపోర్ట్ సిస్టమ్ను తొలగించడానికి (పాసివ్ యుథనేసియా) సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ అది జరగలేదు. 42 ఏళ్లు కోమాలో ఉన్న తర్వాత 2015లో న్యూమోనియాతో అరుణ మరణించారు. అనంతరం 2018లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... ఒక వ్యక్తిని వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని రూలింగ్ ఇచ్చింది. ‘వయోజనుడైన ఓ వ్యక్తి మానసిక సమతౌల్యంతో నిర్ణయం తీసుకోగలిని స్థితిలో ఉంటే... ప్రాణాలు నిలిపే పరికరాలను తొలగించడంతో సహా ఎలాం టి వైద్య చికిత్సనైనా నిరాకరించే హక్కు అతను లేదా ఆమెకు ఉంటుంది’ అని స్పష్టం చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..! తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. బ్యాంక్కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు. ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్ అయిపోయింది.. బ్యాంక్లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్ విదేశాలకు చెక్కేశాడు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లా ప్రాజెక్ట్ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆక్రమించి.. రహదారిగా చేసి.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్లోనే లేదు. అయినా సరే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. నకిలీ అనుమతులు సృష్టించి.. 2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు. ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్జోన్లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. చెరువులోకి మురుగు చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు. పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్కు విద్యుత్ శాఖ అధికారులు భూగర్భ కేబుల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు రట్టయిందిలా.. విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ హరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. -
ఏపీ: ప్రైవేటు కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్ఐవో(రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు. -
అక్రమ మైనింగ్ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు
షిల్లాంగ్: మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ మైనింగ్ గనిలో ఐదుగురు కార్మికులు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురూ అస్సాంకు చెందిన వారని సిల్చార్ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. తావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష్య సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్ జైంతియా హిల్స్ ఎస్పీ జగ్పాల్ ధనోవా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జైంతియా హిల్స్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయంపై తనకు అంత అవగాహన లేదని స్థానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
20 ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్.. కోట్లకు పడగలెత్తిన టీడీపీ నేత
సాక్షి, తిరుపతి : టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజు అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పిచ్చాటూరు ఎస్ఐ వంశీధర్ కథనం మేరకు.. పద్మనాభరాజుకు చెందిన లారీల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డికి సమాచారం అందింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెండు బృందాలుగా దాడులకు దిగారు. ఒక బృందం పిచ్చాటూరులో, మరో బృందం నాగలాపురంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మఫ్టీలో కాపు కాచింది. మంగళవారం వేకువ జామున 3.30 గంటలకు కీళపూడిలోని పద్మనాభరాజు రైస్ మిల్లు నుంచి 10.50 టన్నుల రేషన్ బియ్యంతో లారీ చెన్నై వైపు బయలు దేరింది. మార్గ మధ్యంలో అడవి కొడియంబేడు వద్దకు లారీ చేరుకోగానే మాటు వేసిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సినీ ఫక్కీలో లారీని అడ్డుకున్నారు. డ్రైవర్ దిగి పరారయ్యాడు. లారీని తనిఖీ చేయగా అందులో 10.50 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం సహా లారీని స్టేషన్కు తరలించి స్థానిక ఎస్ఐ వంశీధర్కు అప్పగించారు. బియ్యం అక్రమ రవాణాపై డ్రైవర్ తంగరాజ్, టీడీపీ నేత పద్మనాభరాజు సొంత తమ్ముడు కొడుకు వినయ్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బియ్యం సహా టర్బో లారీని స్థానిక సివిల్ సప్లయిస్ డీటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. స్మగ్లర్ పద్మనాభరాజుపై ఎన్నో కేసులు పద్మనాభరాజు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ పలుమార్లు పట్టుబడ్డాడని, స్మగ్లర్గా పలు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇరవై ఏళ్లుగా బియ్యం స్మగ్లింగ్ వృత్తిగా రూ.కోట్లకు పడగలెత్తాడు. 2010లో బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి చర్లపల్లిలో జైలు శిక్ష అనుభవించాడు. అప్పట్లో రాజకీయాల్లో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనుకున్నాడు. వెంటనే తన వృత్తికి అనుకూలంగా ఉన్న టీడీపీలో చేరాడు. ఆ తరువాత టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా తన భార్యను నిలబెట్టి బియ్యం స్మగ్లింగ్ డబ్బులతో గెలిపించుకున్నాడు. అప్పటి నుంచి బియ్యం అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని సత్యవేడు, నగరి నియోజకవర్గాల్లో యథేచ్ఛగా దందాను సాగించాడు. 2018లో టీడీపీ నేతలే అక్రమ బియ్యం రవాణా సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి పట్టివ్వడం గమనార్హం. రెండునెలల కిందట పిచ్చాటూరు లోని దుకాణంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. -
కాంక్రీట్ గోడ నిర్మాణం: రైతులపై కేసు నమోదు
సోనీపట్: హరియాణాలోని సోనీపట్ జిల్లాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై కాంక్రీట్ గోడ నిర్మించినందుకు, బోరు బావి తవ్వినందుకు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), స్థానిక అధికారుల ఫిర్యాదు మేరకు ఐపీసీతోపాటు జాతీయ రహదారుల చట్టం కింద రెండు వేర్వేరు కేసులు పెట్టినట్లు ఆదివారం తెలిపారు. జాతీయ రహదారిపై గోడ నిర్మించడం, బోరుబావి తవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టంచేశారు. ఫిర్యాదు రాగానే ఆయా పనులను నిలిపివేయించినట్లు పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు 44వ నంబర్ జాతీయ రహదారిపై కాంక్రీట్ గోడ నిర్మించారు. బోరు బావి కూడా తవ్వారు. ఈ పనులు పూర్తికాలేదు. చదవండి: బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు.. -
రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ రేప్ కేసులో దళిత యువతి పేరు బహిర్గతం కావడం పట్ల కూడా వివాదం చెలరేగుతోన్న విషయం తెల్సిందే. ఈ విషయంలో పేరు బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలపై అత్యాచారానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని 376, 376 ఏ, 376 బీ, 376 సీ, 376 డీ సెక్షన్ల కింద నమోదయ్యే కేసుల్లో బాధితురాళ్ల పేర్లు బహిర్గతం చేయడం ఐపీసీలోని 228 ఏ సెక్షన్ కింద నేరం. ఈ నేరానికి పాల్పడినవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా పలు సార్లు మార్గదర్శకాలను విడుదల చేసింది. (ఇందిర గుర్తొస్తోంది : ఐరన్ లేడీ ఈజ్ బ్యాక్) బాధితుల అనుమతి లేకుండా వారి పేర్లను బహిర్గతం చేయరాదు. బాధితురాలి ముందస్తు అనుమతితో బహిర్గతం చేయవచ్చు. బాధితులు మరణించిన పక్షంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంక్షేమ సంఘం నుంచి లిఖిత పూర్వక అనుమతితోపాటు బాధితుల సమీప బంధువుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నది సుప్రీం కోర్టు మార్గదర్శకాల సారాంశం. ఈ విషయంలో వార్తా పత్రికలు, ఆడియో, విజువల్ మీడియాలు కచ్చితంగా మార్గదర్శకాలను పాలించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. -
భూ మాయ!
సాక్షి, జనగామ: రూ.కోట్లు విలువైన భూమికి ఎసరు పెట్టారు. ఇతర రైతులకు చెందిన భూముల సర్వే నంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేయడంతో 12 ఏళ్ల క్రి తం జరిగిన ఈ భూ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో జరిగిన భూ మాయపై రెవెన్యూ అధికారులు కూపీ లాగుతుండగా బాధిత రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్, లక్ష్మీతండా శివారు రామచంద్రగూడెంలో పలువురు రైతులకు చెందిన సర్వే నంబర్లతో ఓ వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని నడిపినట్లుగా తెలుస్తోంది. 2008 ఫిబ్రవరి 5వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన కె.లక్ష్మారెడ్డి బూన్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద ఇతర రైతుల సర్వే నంబర్ల పేరుతో జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇతర రైతుల సర్వే నంబర్లను వినియోగించడమే కాకుండా కొందరిని రైతులుగా చూపించి రెండు గ్రామాలకు చెందిన 30 మంది రైతుల సర్వే నంబర్లతో 118 ఎకరాల వరకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఈ పన్నాగానికి పాల్పడినట్లు సమాచారం. దరఖాస్తు చేయడంతో వెలుగులోకి.. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న కె.లక్ష్మారెడ్డి మృతి చెందాడు. దీంతో లక్ష్మారెడ్డి కుమారు డు ఇటీవల పట్టాదారు పాసుపుస్తకాల కో సం రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకున్నాడు. పాసుపుస్తకాల కోసం పొందుపర్చిన సర్వే నంబర్లను పరిశీలించిన వీఆర్ఏ సంబంధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ భూములు గతంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. రెవె న్యూ రికార్డుల్లోని సర్వే నంబర్లలో ఇతర రైతు ల పేర్లు కనిపిస్తున్నాయి. ఈసీలో మాత్రం కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డి పేరు మీద భూమి ఉన్నట్లు వస్తోంది. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారనే విషయంపై ఆరా తీయడంతో రైతుల సర్వే నంబర్లతో ఓ బ్రోక ర్ మృతి చెందిన కె.లక్ష్మారెడ్డికి అమ్మకం చేసినట్లుగా తె లుస్తోంది. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని గుర్తి ంచడం కోసం రెవెన్యూ అధికారు లు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది రైతుల సర్వే నంబర్లు వినియోగించా రు అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉన్న ఫొటోలు, సంతకాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. గుర్తించిన భూమి విలువ రూ.23.60 కోట్లు పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తులో పొందుపర్చిన భూమి విలువ రూ.23.60 కోట్లుగా ఉంటుంది. కె.లక్ష్మారెడ్డి కుమారులు సమర్పించిన పత్రాల్లో ఏడు డాక్యుమెంట్లను గుర్తించారు. వీటిలో 118 ఎకరాలుగా భూమి ఉంది. ఫతేషాపూర్, రామచంద్రాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఆ భూములు ఎకరానికి రూ.20 లక్షలపైనే ఉంది. ఇంకా బాధిత రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ భూముల సర్వే నంబర్లతో దళారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై బాధిత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసీలో తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. భూమినే నమ్ముకున్న రైతులకు అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దరఖాస్తు తీసుకోకుండా పంపించా.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం దరఖాస్తు పట్టుకుని లక్ష్మారెడ్డి కుమారుడు వచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం వచ్చే వరకు ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెప్పా. 25వ తేదీ వరకు ఎలాంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. రిజిస్ట్రేషన్లను మార్చే అధికారం మాకు లేదు. – భన్సీలాల్, తహసీల్దార్, రఘునాథపల్లి -
కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు
సాక్షి, నేరేడ్మెట్ (హైదరాబాద్): పెద్ద పరిశ్రమలు కొనుగోలు చేసిన నాణ్యమైన బొగ్గును దారి మళ్లించి కాజేసి... సగం లోడు నాసిరకం బొగ్గును నింపుతూ మోసం చేస్తున్న కల్తీ మాఫియా గుట్టును ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు రట్టు చేశారు. లారీ యజమానులు, డ్రైవర్లతో కుమ్మక్కై బడా పరిశ్రమలను బురిడీ కొట్టిస్తూ కల్తీ బొగ్గు దందా చేస్తున్న 8మంది నిందితులను అరెస్టు చేశారు. 1.050 టన్నుల నాణ్యమైన బొగ్గుతోపాటు 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, జేసీబీలు, రూ.2.50 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.1.62 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్ చేశారు. శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. హస్తినాపురానికి చెందిన గుండె రాజు 2014 నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లిలో బొగ్గు డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకొని బొగ్గు సరఫరా వ్యాపా రం ప్రారంభించాడు. ఈ యార్డు పక్కనే గగన్పహాడ్కు చెందిన అమీర్ మహ్మద్ డంపింగ్ యార్డు కూడా ఉంది. వీరిద్దరూ కొత్తగూడెం, సింగరేణి నుంచి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు, బొగ్గు బూడిదను కొనుగోలు చేసి తమ డంపింగ్ యార్డులకు తరలిస్తారు. అనంతరం అదే బొగ్గును స్థాని క చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రణాళిక ఇలా... విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్, కాగితం తయారీ, అల్యూమినియం ప్లాంట్లు, ఫార్మా కంపె నీలు, ఉక్కు పరిశ్రమలకు అధిక నాణ్యత కలిగిన బొగ్గు అవసరం. లారీ డ్రైవర్లకు డబ్బులు ఆశజూపి సింగరేణి కాలరీస్ నుంచి, విదేశీ బొగ్గుతో ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే నాణ్యమైన బొగ్గు లారీ లను తమ డంపింగ్ యార్డులకు తీసు కొచ్చి... సగం లోడు ఖాళీ చేసి నాసిరకం బొగ్గును నింపి పరిశ్రమలకు పంపేవారు. బొగ్గు కల్తీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు డంపింగ్ యార్డులపై దాడి చేసి, నిందితులు గుండె రాజు, కాట్రవత్ సోమ, చల్లా అమరేందర్రెడ్డి, కురతాల మల్లేష్, నిజాముద్దీన్, ఎరుకల అంజయ్య, సగరాల సత్యం, రిజ్వాన్లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ఉత్తంపల్లి లక్ష్మణ్, అమీర్ మహ్మద్, ఉమాకొండ పురుషోత్తంరెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. -
మెడికల్ మాఫియా మాయజాలం
-
విశాఖలో మైనింగ్ మాఫియా అక్రమాలు..
సాక్షి, విశాఖపట్నం: మైనింగ్లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్ వేశారు. మొత్తం 9 క్వారీ లీజుల్లో అక్రమాలను అధికారులు గుర్తించారు. అయితే గత కొన్నేళ్లుగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వీవీఆర్ గ్రూప్లో దాడులు చేశారు. ఈ దాడులలో భారీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు 8 క్వారీలకు రూ.114 కోట్లు ఫైన్తో పాటు నాలుగు క్వారీలకు సంబంధించిన అక్రమాలపై ఇప్పటికే వీవీఆర్ గ్రూప్కు నోటీసులు జారీ చేశారు. కాగా 5 క్వారీల్లో తవ్వని వాటికి కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందినట్లు నిర్ధారణయింది. పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. -
గాలిగాళ్ల దోపిడీ
-
లెక్కల్లో గోరంత...తవ్వకాల్లో కొండంత...
జిల్లాలో ఏ చెరువులో గ్రావెల్ కనిపించినా అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు. అనుమతులు అక్కర్లేకుండానే ఇష్టానుసారం తవ్వేసి ఎంచక్కా కాసులు కూడేసుకుంటున్నారు. వీరికి రియల్టర్లు... కాంట్రాక్టర్లు... సహకారం అందిస్తుండటంతో వీరి ఆగడాలకు అంతులేకుండా పోతోంది. పోనీ అధికారులు ఏమైనా అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. వారు కూడా ‘మామ్మూలు’గానే వ్యవహరిస్తున్నారు. దీనివల్ల ఇటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోతోంది సరికదా... ప్రభుత్వ ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. బొబ్బిలి: జిల్లాలో 10,436 చెరువులున్నాయి. ఇందులో దాదాపు 35 శాతానికి పైగా చెరువుల్లోఅడ్డు అదుపు లేకుండా తవ్వేస్తున్నారు. వీరి తవ్వకాల వల్ల చెరువుల మదుములు పాడైపోతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల మదుములు లోతై కొద్దిపాటి నీరు కూడా పక్కనున్న పొలాలకు వెళ్లట్లేదు. తద్వారా రైతుల భూములు బీళ్లవుతున్నాయి. మరో పక్క వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కడమే వీరి పనిగా ఉంది. జిల్లాలోని మైన్స్ అండ్ మినరల్స్ ఆరుకు పైగా ఉండగా అందులో చాలా మట్టుకు వృద్ధి లేదు. మరో పక్క గ్రావెల్ మాత్రం ఏకంగా పెరిగిపోయింది. 2018–19 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఏకంగా 159 శా తం తవ్వకాలు పెరిగిపోయాయి. ఇది కేవలం కాంట్రాక్టర్లు చేపడుతున్న వివిధ పనులు, రియల్ ఎస్టేట్ల కోసం మా త్రమే! 2018–19లో 47,726 టన్నుల గ్రావెల్ను తవి్వతే ఈ ఏడాది ఏకంగా 1,23,704 టన్నుల గ్రావెల్ను తవ్వేశారు. కొద్దిపాటికే అనుమతి... ‘ఓ పది లోడ్లు మాత్రమే వేసుకుంటాం సార్’ అని అధికారులతో ఎంచక్కా మాట్లాడి అనుమతులు తెచ్చుకునే రియల్ట ర్లు, కాంట్రాక్టర్లు ఆ తరువాత వారి విశ్వరూపం చూపెడుతున్నారు. ఏకంగా రాత్రీ పగలూ తవ్వకాలు జరుపుతునే ఉంటారు. దీంతో చెరువులు, వాగులు, వంకలూ రూపును కో ల్పోతున్నాయి. చాలా చోట్ల విపరీతమయిన లోతును తవ్వేసి వదిలేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిండిపోయి అంచనా దొరకక పలువురు చిన్నారులు, యువత అందులో పడి మృత్యువాత పడుతున్నారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో గతంలో పలు చోట్ల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రహదారులు కూడా ధ్వంసం వివిధ రకాల కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రక్లర్లు తమకు కేటా యించిన పనులను చేస్తూ వాహనాలను జోరుగా నడపడం వల్ల గ్రావెల్, ఇసుక వంటివి రోడ్లపైనే పడుతున్నాయి. ఫలితంగా రోడ్లు బురదమయం కావడం లేదా ఇసుకతో నిండిపోవడం జరుగుతోంది. దీనిపై ప్రయాణించే వాహన చోదకులు అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజలు నడవడానికి కూడా వీలుకాని స్థితిలో ఉన్నాయి. బాడంగి మండలం డొంకినవలసలోని వేర్ హౌసింగ్ గోదాము నుంచి అటు రైల్వే స్టేషన్కు ఇటు అంతర్రాష్ట్ర రహదారికి అనుసంధానమైన పక్కా తారు రోడ్డు. కానీ చూడటానికి గ్రావెల్ రహదారిలా కనిపిస్తోంది. కారణం... ఇక్కడ గోదాముల నిర్మాణానికి సమీపంలోని అంబటి బందలో పొక్లెయినర్తో తవ్వకా లు జరిపిన గ్రావెల్ను ఈ రహదారి మీదుగా తరలిస్తున్నారు. ముందు ఓ పక్కనున్న చాకలి బందలో తవ్వి ఇప్పుడు అవతలి వైపున్న అంబటి బంద నుంచి తవ్వేస్తున్నారు. అందువల్ల ఈ రహదారి దుస్థితి ఇలా తయారైంది. చర్యలు తీసుకుంటాం ఏయే ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు అనధికారికంగా జరుపుతున్నారో కనుక్కుని చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. గనుల శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తాం. – పూర్ణచంద్ర రావు, ఉప సంచాలకుడు, గనుల శాఖ -
అక్రమ కంపెనీలపై GHMC కొరఢా
-
‘లాక్’తెంచుకున్న ‘కిక్కు’
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్తో అన్నీ బంద్ అయ్యాయి కానీ, ‘మందు దందా’మాత్రం ఆగలే దు. లాక్డౌన్ అమల్లోకి వచ్చిన 37 రోజుల తర్వా త కూడా మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. కాకపోతే కావాల్సిన బ్రాండ్ దక్కించుకోవడం కాస్త ‘ఖరీదైన’వ్యవహారమే.. ఆబ్కారీ అధికారులకు తెలిసి మరీ బ్లాక్మార్కెట్లో లభిస్తోన్న ఈ మ ద్యం కొనాలంటే జేబు ఫుల్లుండాలి. లాక్డౌన్ పు ణ్యం, వైన్షాప్ యజమానుల కక్కుర్తి, ఆబ్కారీ అధికారుల సహకారం వెరసి రాష్ట్రంలో మద్యం మేలిమి బంగారమంత ఖరీదైపోయింది. వైన్స్ నుంచి దొడ్డిదారిన తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఇందుకు ఎక్సైజ్ యంత్రాంగం కూడా సహకరిస్తుండటంతో వాడపల్లి నుంచి వాంకిడి వరకు, అచ్చంపేట నుంచి భద్రాచలం వరకు అన్ని పట్టణ ప్రాంతాల్లో మద్యం దొరకని చోటంటూ లేదు. విచ్చలవిడిగా సరుకు బయటకి.. వాస్తవానికి, రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించినప్పుడు వైన్ షాపులకు సీల్ వేయలేదు. లాక్డౌన్ గడువు తొలిసారి పెంచినప్పుడు ఆబ్కారీ శాఖ లిఖితపూర్వకంగా ఉత్తర్వులిచ్చింది కానీ అందులో షాపులు సీజ్ చేయాలని పేర్కొనలేదు. ఇదే అదనుగా వైన్స్ యజమానులు సరుకు అక్రమంగా బయటకు తీసుకువచ్చారనే ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని గమనించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంటనే మద్యం దుకాణాలు సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఆ తర్వాత కూడా కొన్నిచోట్ల మంత్రి ఆదేశాలు బేఖాతరు చేస్తూ వైన్షాపులకు సీల్ వేయలేదనే ఆరోపణలున్నాయి. వైన్స్ సిండికేట్లకు ఆబ్కారీ అధికారులు సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని వినిపిస్తోంది. ఎంతగా అంటే ఇటీవల హైదరాబాద్ శివారులోని ఓ దుకాణం నుంచి మద్యం తరలిస్తున్నారని తెలిసి కూడా చర్యలు తీసుకోలేదనే కారణంతో ఒక ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మొక్కుబడిగా అక్కడక్కడా మద్యం పట్టుకున్నట్టు కొద్దోగొప్పో సరుకును ఎక్సైజ్ అధికారులు చూపిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ మద్యం ఖమ్మం సరిహద్దు జిల్లాలైన తెలంగాణలోని సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుంచి వచ్చిందని చెబుతున్నారు. జిల్లాలు, రాష్ట్రాల మధ్య ఏర్పాటుచేసిన సరిహద్దు చెక్పోస్టుల నుంచి మనుషులు రావడమే గగనమైతే మద్యం ఎలా రాగలిగిందో చెక్పోస్టుల సిబ్బందికి, ఎక్సైజ్ అధికారులకే తెలియాలి. ఎవరి వాటా వారికే! రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచే మద్యం విక్రయాలు ఏదో రూపంలో సాగుతున్నాయి. ముందుగానే సరుకు తెచ్చుకున్న వైన్షాపుల యజమానులు దళారుల ద్వారా ఈ మద్యాన్ని కమీషన్లు ఇచ్చి అమ్మిస్తున్నారు. పనిలో పనిగా ఆబ్కారీ అధికారుల చేతులూ తడుపుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే, మద్యం అక్రమ అమ్మకాలు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. గ్రామాల్లోని బెల్టుషాపుల్లో సరుకు ఎప్పుడో ఖాళీ అయిపోయింది. కొన్నిచోట్ల పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు మందు తెచ్చినా రేట్లు ఎక్కువ ఉండడంతో ఎవరూ కొనడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా వరకు పట్టణ ప్రాంతాల్లోనే ఈ వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు ఫుల్లులుగా కొనసాగుతోంది. గ్రేటర్లో సర్వీస్ చార్జీ అదనం! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్తీల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి మద్యం ధరలతో పోలిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ధరలు తక్కువేనని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాయల్ స్టాగ్ (రూ.4,600), ఐబీ (రూ.3,700), ఎంసీ డైట్ (రూ.3,700), బ్లెండర్స్ ప్రైడ్ (రూ.6,000), బ్లాక్ లేబుల్, వైట్ లేబుల్ (రూ.11,000), సిగ్నేచర్ (రూ.5,500), రాయల్ గ్రీన్ (రూ.4,600) చొప్పున అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రూ.100–350 వరకు సర్వీస్ చార్జీ కూడా వసూలు చేస్తున్నారు. ఈ రేట్లకు అమ్మేందుకు యువకులు గ్రూపులుగా పనిచేస్తున్నారు. అమ్మిన తర్వాత పెట్టుబడిదారుడికి ఇవ్వాల్సింది పోను మిగిలిన డబ్బులతో ‘పార్టీ’చేసుకుంటున్నారు. కాగా, బీర్లు నిల్వ ఉండవు కనుక రాష్ట్రంలో ఎక్కడా ఇవి దొరకడం లేదు. ఎక్కడైనా ఉన్నా లైట్ బీర్ రూ.400–500కి అమ్ముతున్నారు. ఖమ్మం మార్కెట్లో పలుకుతున్న రేట్లకు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో రేట్లకు కొంచెం తేడా ఉంది. బ్రాండ్, అవసరాన్ని బట్టి రూ.500 ఎక్కువ తక్కువకు అమ్ముతున్నారు. హైదరాబాద్లో అయితే.. కొనేవాళ్ల కెపాసిటీని బట్టి రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. -
పేదలకు తగ్గించి... పెద్దలకు కలిపేసి
రాజధాని అమరావతి నిర్మాణానికంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పేరిట తీసుకున్న భూముల్లో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయి. పేద, సన్న, చిన్న కారు రైతులను అడ్డగోలుగా మోసగించి స్థానిక నాయకులు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల వరకు సొంతం చేసుకున్నారు. పెద్దల ముసుగులో కొందరు, ప్రజాప్రతినిధుల అనుచరుల పేరిట మరికొందరు, బడాబాబులుగా చెలామణి అయినవారు... ఎవరి స్థాయిలో వారు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. ప్రభుత్వ భూములను కాజేశారు. దేవదాయ, వక్ఫ్ ఆస్తులతో పాటు వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, చేద బావులు, శ్మశాన స్థలాలను కాజేశారు. చివరకు రోడ్లను కూడా కలిపేసుకున్నారు. సాక్షి, కృష్ణా: తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామ పరిధిలో భూ సమీకరణలో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎకరానికి రెండు నుంచి 70 సెంట్ల వరకు అక్రమంగా నొక్కేశారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులు, కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయి గ్రామంలోని వెనుకబడిన వర్గాలు, ఎస్సీల భూములను కాజేశారు. పూలింగ్కు భూమి ఇవ్వకపోతే అది అలాగే మిగిలిపోతుంది. ఎందుకూ పనికిరాదు. చివరకు ప్రభుత్వం లాగేసుకుంటుంది అని బెదిరించారు. సర్వేలో వాస్తవ భూమిని తగ్గించేసి పలుకుబడి కలిగిన ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులకు రికార్డుపరంగా ఇచ్చేశారు. కావేవీ కబ్జాకు అనర్హం నెక్కల్లు గ్రామ సర్వే నెంబరు 54లో చెక్డ్యాం నిర్మితమైంది. దీనికి సంబంధించిన 1.24 ఎకరాలను చేజిక్కించుకున్నారు. సర్వే నెంబరు 159 లో కోమటిగుంట (చెరువు) ఉంది. దీనిలో నుంచి 77 సెంట్లను పూలింగ్ కింద ఇచ్చి ప్లాట్లను కొట్టేశారు. సర్వే నెంబరు 162లో కొండ వాగు ఉంది. దీనిలో 93 సెంట్లు ఆక్రమించేసి పూలింగ్కు ఇచ్చారు. సర్వే నెంబరు 88లో గ్రామ ఊరచెరువు ఉంది. ఇందులో 31.50 సెంట్లు చేజిక్కించుకుని పూలింగ్కు కేటాయించారు. సర్వే నెంబరు 105లో రోడ్డు ఉంది. దీన్ని బొమ్మల రోడ్డు అని పిలుస్తారు. రోడ్డుకు చెందిన 1.15 ఎకరాలను డీకే పట్టాగా పొంది పూలింగ్ కింద ఇచ్చారు. ఇలాంటివి వెలుగులోకి రాని భూ అక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయని నెక్కల్లు గ్రామానికి చెందిన పలువురు ‘సాక్షి’కి తెలిపారు. గ్రామేతరులకు అసైన్డ్ భూములు నెక్కల్లు గ్రామ పరిధిలోని అసైన్డ్ భూములు ఇతర మండలాల వారికి అధికారులు రాసిచ్చేశారు. స్థానిక పేదలకు దక్కిన వాటిని మభ్యపెట్టి మరీ ఇతరులతో కలిసి అధికారులు పంచేసుకున్నారు. నెక్కలు సర్వే నెం.162/2లో 92 సెంట్లను మంగళగిరి మండలం కాజకు చెందిన ఎ. సాంబయ్యకు, అదేసర్వే నెం.లో 93 సెంట్లను తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన ఎన్. బ్రహ్మంకు అధికారులు రాసిచ్చేశారు. కాజకు చెందిన ఎ.సాంబశివరావుకు సర్వే నెం.105లో 1.1 ఎకరం, అదే గ్రామస్తుడైన ఎ.వెంకయ్యకు 162లో 92 సెంట్లు 54/2లో 75 సెంట్లు, 159లో 77, 54/2లో 76 సెంట్లు చొప్పన కాజ గ్రామస్తుడైన శ్రీనివాసరావు, 106లో వెంకటరమణకు ఒక ఎకరం, 159లో కె. రమణకుమారికి ఎకరం, 105లో 1.15 ఎకరాలు కాజ గ్రామానికి చెందిన ఆర్ శ్రీనివాసరావుకు రాసిచ్చారు. అక్రమాలు ఎలా బయటపడ్డాయంటే.. మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏర్పాటైన జేఏసీ ఉద్యమం కొనసాగింపునకు చందాలకు సిద్ధమైంది. రాజధాని గ్రామాల్లోని రైతులు ఒక్కో ఎకరానికి రూ.పది వేలు చొప్పున ఇవ్వాలని తీర్మానించి తొలివిడతగా రూ.రెండు వేలు చొప్పున వసూళ్లు ప్రారంభించింది. నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ తన వంతుగా పెద్దమొత్తాన్ని ఇవ్వడాన్ని గుర్తించిన స్థానికులు రికార్డుల్లో ఎంత భూమిని చూపారనేది ఆరా తీశారు. వాస్తవ భూమికన్నా అదనపు భూమి రికార్డుల్లో ఉందని, ఆ అదనపు భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది పరిశీలింపజేశారు. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టల భూమిని త గ్గించేసి రావెల, ఆయన అనుచరులకు ఇచ్చా రని తేటతెల్లమైంది. ఇదే అంశమై తుళ్లూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది. ప్రశ్నించడంతో చక్కదిద్దే పనిలో అధికారులు.. సీఆర్డీఏ ఏర్పడినప్పటి నుంచి అధికారిణి ఒకరు నెక్కల్లులోనే పనిచేస్తున్నారు. తెలుగుదే«శం ప్రభుత్వం పోయి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పేదలకు గొంతుక వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు. తమ భూములు తగ్గించి ఓ సామాజికవర్గం నేతల పేరిట రాశారని ఆ మహిళా అధికారిని నిలదీశారు. అందుకు తగి న ఆధారాలను కూడా చూపడంతో తప్పుల ను కప్పిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యా రు. రావెలకు కేటాయించిన పది ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లు (101/2020, 102/2020, 103/2020, 104/2020, 105/2020, 106/2020, 107/2020, 108/2020 )ను తాజాగా రద్దుచేశారు. రెండు డాక్యుమెంట్లు ఇంకా రద్దు కాలేదు. కాగా రావెల ఇతరులకు విక్రయించిన అయిదు ప్లాట్ల డాక్యుమెంట్లను మాత్రం రద్దు చేయలేదు. న్యాయం చేయాలి ‘మా గ్రామంలో అక్రమాలు జరిగాయి. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టలకు చెందిన పేద రైతులకు చెందిన భూములను గ్రామంలో పెద్దమనుషులుగా చెలామణి అయిన వారు కాజేశారు. వారికి అప్పటి సీఆర్డీఏ అధికారు లు సహకరించారు. సర్వే పేరిట దారుణ మో సాలకు ఒడిగట్టారు. కౌలు పొందారు. ప్లాట్లు తీసుకున్నారు. వాటిని అమ్ముకుని కోట్లకు కోట్లు కొల్లగొట్టారు’. మాలాంటి పేదలు 29 గ్రామాల పరిధిలో ఎందరో నష్టపోయిన వారున్నారు. ప్రభుత్వమే పేదలకు న్యాయం చేయాలని నెక్కల్లు వాసులు కోరుతున్నారు. భూమి సర్వే పేరిట ప్రారంభించి.. రాజధాని భూసమీకరణ పేరిట నెక్కల్లులో సీఆర్డీఏ పర్యవేక్షణలో జరిగిన సర్వేలో అక్రమాలు కోకొల్లలు అనడానికి ఉదాహరణ మచ్చుకు.. గుమ్మా సదాశివరావుకు సర్వేనెంబరు 157బిలో 1.41 ఎకరాలు ఉండగా 1.32 ఎకరాలు ఉందని తేల్చారు. అదేవిధంగా గుమ్మా కాటంరాజుకు కూడా 1.41 ఎకరాలు అదే సర్వేనెంబరులో ఉండగా 97 సెంట్లు మాత్రమే ఉందని నిర్ధారించారు. మొత్తం 2.82 ఎకరాలలో 51 సెంట్లు లేనట్లు లెక్కతేలింది. బీసీ వర్గానికి చెందిన ఈ సోదరులు తమకు అన్యాయం జరిగిందని ఎందరి చుట్టూ తిరిగినా ఎవరూ చెవికెక్కించుకోలేదు. 83 సంవత్సరాల గంగారపు రత్తమ్మ, 76 ఏళ్ల బడిగంచుల కొండమ్మ అక్కచెల్లెళ్లు. సర్వేనెంబరు 164 డి లో ఒక్కొ క్కరికి 1.10 చొప్పున 2.20 ఎకరాలు ఉంది. అలాగే సర్వేనెంబరు 163లో 10 సెంట్ల చొప్పున 20 సెంట్లు ఉంది. మొత్తం 2.40 ఎకరాలలో 91 సెంట్లు తగ్గిపోయింది. వీరూ వెనుకబడిన వర్గాలకు చెందిన వారే. పూజల రామాంజనేయులు తండ్రి శేషగిరిరావు (80) సర్వే నెంబరు 127లో ఒక ఎకరం ఉండగా 43 సెంట్లు మాత్రమే ఉందని నాటి ప్రభుత్వం లెక్కతేలి్చంది. సర్వేనెంబరు 160లో 1.10 ఎకరాలకు గాను 1.08 ఎకరాలు ఉందని చెప్పింది. మొత్తానికి 59 సెంట్లు లేదని దబాయించింది. బీసీలమైన తమకు అన్యాయం జరిగిందని రెండేళ్లు తిరిగినా పట్టించుకోలేదు సరికదా తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అని బెదిరించడంతో చేసేది లేక మిన్నకున్నారు. ప్రభుత్వం మారిన తరువాత తుళ్లూరు తహసీల్దార్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 82/2020 కింద కేసు నమోదైంది. గుమ్మా సీతారావమ్మ (80)కు సర్వే నెంబరు 133లో ఒక ఎకరం ఉండగా 82 సెంట్లు, 160 సి లో 56 సెంట్లకు గాను 50 సెంట్లు, 166లో 3.13 ఎకరాలకు గాను 3.11 ఎకరాలు ఉన్నట్లు లెక్కతేల్చారు. మొత్తంగా 26 సెంట్లు తగ్గించి చూపారు. పూలింగ్లో భూమి విస్తీర్ణం తగ్గించేశారనే మనోవేదనతో తన తల్లి గుండె ఆగిందని గుమ్మా వెంకట్రావు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ వర్గానికి చెందిన తమకు ఎవరి నుంచి కనీస మాట సాయం కూడా దక్కలేదన్నారు. మాడపాటి వీరరాఘవయ్య 2005లో నెక్కల్లుకు చెందిన రైతు నుంచి 1.10 ఎకరాలను కొనుగోలుచేయగా 96 సెంట్లు మాత్రమే ఉందని సర్వేలో తేల్చారు. సర్వే నెంబరు 163లో 1.34 ఎకరాలు తాటి పాండురంగారావు పేరిట ఉండగా 1.08 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. గుమ్మా బుల్లిబాబు, ముప్పూరి వెంకటేశ్వరరావు, మాపూరి నరసింహారావు... ఇలా నెక్కల్లుకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకు చెందిన 30 కుటుంబాలకు పైగా భూములను కోల్పోయాయి. ఎవరెవరికి రాసిచ్చేశారంటే.. నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ టీడీపీ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ ముఖ్య అనుచరుడు. ఆయనకు నెక్కల్లు సర్వే నెంబరు 50లో 1.19 ఎకరాలు మాత్రమే ఉంది. దీని ఖాతా నెంబరు 741. కానీ ఈ ఖాతా నెంబరులో 3.11 ఎకరాలు అదనంగా చూపారు. ఈ 3.11 ఎకరాలు తమ భూముల్లో తగ్గించేసి గోపాలకృష్ణ పేరిట చేర్చారని బీసీ వర్గాల ఆరోపణ. ఈ భూమిని 9.14 జీవో కింద పూలింగ్కు ఇచ్చి 4,300 చదరపు గజాలు పొందారు. ఇందులో 8 ప్లాట్లు నివాసం, రెండు ప్లాట్లు కమర్షియల్ కింద లాటరీ ద్వారా దక్కాయి. (సీఆర్డీఏ ప్లాట్ల కేటాయింపు వివరాలు డాక్యుమెంటు 5657/2018 లో స్పష్టంగా ఉంది). ఇందులో అయిదు ప్లాట్లను ఇప్పటికే రావెల విక్రయించేశారు. ఈ భూమికి మూడేళ్లుగా కౌలు కూడా పొందారు. రావెల అనుచరులు, ఆయన సామాజిక వర్గానికే చెందిన రామినేని మల్లేశ్వరి 1.14 ఎకరాలు, రామినేని సుబ్బారావు– 1.25 ఎకరాలు, రామినేని మురళి– 50 సెంట్లు, కాకా రాఘవయ్య– 1.20 ఎకరాలు, వై.వెంకట్రావు 50 సెంట్లు పొందారు. వెరసి 4.59 ఎకరాల పేదల భూమిని ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు చేజిక్కించుకున్నారు. కాగా రాఘవయ్య గోపాలకృష్ణకు మేనమామ కావడం గమనార్హం. 9.14 జీవో ద్వారా సీఆర్డీఏ కి పూలింగ్లో ఇచ్చి కౌలు పొందుతున్నారు. ఇవన్నీ పూర్వపు సీఆర్డీఏ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. -
నకిలీ వీసా స్టాంపింగ్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : నకిలీ వీసా స్టాంపింగ్లతో మహిళలను కువైట్కు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో నకిలీ వీసా స్టాంపింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో సీపీ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణానికి చెందిన రెల్లు కుబెందర్ రావు అలియాస్ చిన్న హమాలీగా పని చేసేవాడు. ఆ తర్వాత వెల్డింగ్ పని నేర్చుకున్న అతను 2007 నుంచి 2014 వరకు సింగపూర్, సౌతాఫ్రికాలో పని చేశాడు. 2016లో నర్సరావుపేటలో పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించిన అతను కమీషన్పై చెన్నైకి చెందిన ఎన్బీఎస్ ట్రావెల్స్లో ఎయిర్ టికెట్ బుకింగ్ చేసేవాడు. ఇందుకుగాను అతడికి చెన్నై, కుంభకోణం ప్రాంతానికి చెందిన షేక్ బషీర్ అహ్మద్ సహాయకుడిగా పని చేసేవాడు. తరచు శ్రీలంక వెళ్లే బషీర్ అక్కడ కుమార్ అనే వ్యక్తి నుంచి ఒరిజనల్ స్టాంపులు తెచ్చేవాడు. అనంతరం వాటి ఆధారంగా కుబెందర్రావు, బషీర్, కుంభకోణంకు చెందిన బాలు ప్రసాద్తో కలిసి శంషాబాద్లోని ఓ హోటల్లో నకిలీ వీసాలు తయారు చేసేవారు. నకిలీ వీసాలతో దుబాయికి.. ఈ నకిలీ స్టాంప్ల ఆధారంగా బాలుప్రసాద్ నకిలీ పీఓఇ, ఇసీఆర్, మెడికల్ సర్టిఫికెట్లు రూపొందించేవాడు. అనంతరం సబ్ ఏజెంట్ల ద్వారా తమను సంప్రదించిన మహిళలను విజిటింగ్ వీసాపై దుబాయ్, అక్కడి నుంచి కువైట్ పంపేవారు. కువైట్ చేరుకున్న వారికి లక్ష్మీ, శారద, శ్రీను, సారా అనే వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పించేవారు. ఇందుకు గాను ఒక్కో మహిళ నుంచి రూ. లక్ష వసూలు చేసేవారు. ఇందులో కువైట్లో ఉండే ఏజెంట్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఇచ్చేవారు. ఇదే తరహాలో 21 మందిని కువైట్ పంపినట్లు సీపీ తెలిపారు. వారు ఎక్కడ పనిచేస్తున్నారో త్వరలోనే వివరాలు సేకరిస్తామన్నారు. ఈ విషయమై ఇప్పటికే కువైట్ ఎంబసీకి సమాచారం అందించామన్నారు. ప్రధాన నిందితులు రెల్లు కుబెందర్రావు, షేక్ బషీర్ అహ్మద్తో పాటు సబ్ ఏజెంట్లుగా వ్యవహరించిన మోహన్రావు, అగస్టీ, రుత్తమ్మ, సునీత, వెంకటరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు బాలు ప్రసాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, ప్రింటర్, లాప్ ట్యాప్, 15 మీ సేవా పత్రాలు, 16 పాస్ పోర్ట్లు, 13 వీసా పేపర్లు, 25 ఒరిజినల్ స్టాంపులు, 6 స్టాంప్ ప్యాడ్స్ స్వాదీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన కుమార్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, శంషాబాద్ డీసీపీ సందీప్కుమార్, ఏసీపీ అశోక్కుమార్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్కుమార్, ఎస్ఐలు రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: విస‘వీసా’ జారుతున్నాం -
ఆపరేషన్ అంపలాం సక్సెస్
పోలాకి: ఏళ్ల తరబడి తీరప్రాంత మత్స్యకారు లు, స్థానికులు, పర్యావరణ అభిమానులు చే స్తున్న పోరాటాలు ఫలించాయి. అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ అంపలాం’తో ఆక్రమణలో వున్న వంశధార నదీమతల్లి చెర వీడినట్టయింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆర్డీవో ఎం.వి.రమణ ఆధ్వర్యంలో తహశీల్దార్ ఎ.సింహాచలం సిబ్బందితో కలసి దాదాపు 50మంది పోలీ సు బందోబస్తు మధ్య వంశధార నదీతీరానికి చేరుకున్నారు. అక్కడ పోలాకి–2 రెవెన్యూ పరిధిలో 516 సర్వే నెంబర్లో నదీగర్భంలో అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదా పు 20 ఎకరాల్లోని రొయ్యిల చెరువులను తొలగింపునకు పూనుకున్నారు. అంపలాం గ్రామానికి ఆనుకుని వున్న ఆ ప్రాంతంలో అప్పటి వరకూ ఏం జరుగుతుందో తెలియక అటు ఆక్రమణదారులు, ఇటు స్థానికులు అదే పనిగా చూ స్తూ ఉండిపోయారు. ఈలోగా జేసీబీ యంత్రాలతో గంటల వ్యవధిలోనే ఆక్రమణలు తొలగింపు చేపట్టి ఆపరేషన్ అంపలాం విజయవంతం అయినట్లు అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాసరావు, ఇద్దరు ఆర్ఐలు, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఐదు గురు సర్వేయర్లు, పదిమంది వీఆ ర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు. నరసన్నపేట సీఐ తిరపతి, ఎస్ఐలు చిన్నం నాయుడు, సత్యనారాయణ, 50మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వంశధార ‘సాక్షి’గా కబ్జాదారుల ఆగడాలు.. పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి, నదులు, కాలువలు, చెరువులు, సముద్ర పరివాహక ప్రాంతాల్లో కబ్జాకు తెగబడుతున్న వారికి అధికారులు చేపట్టిన ఆపరేషన్ గట్టి హెచ్చరికే అని చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు రెచ్చిపోయి మరీ భూఆక్రమణలకు పాల్పడ్డారు. వారిపై అప్పట్లో ‘సాక్షి’ లో కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. అయితే నాటి పాలకుల కనుసన్నల్లో నడిచే యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. నదిగా అడ్డంగా గట్టువేసి, మత్స్యకారుల జీవనోపాధి గండికొట్టేలా.. చేసినా సర్వే పేరుతో తాత్సారం చేశారు. నది ప్రవాహ దిశ మార్చుకుని ఇటీవల వరదల్లో ఉగ్రరూపం చూపితే గానీ అప్పట్లో చేపట్టిన ఘనకార్యాన్ని యంత్రాంగం గుర్తించలేకపోయింది. ఆక్రమణల తొలగింపు అసాధ్యం అనుకున్నాం.. నదికి అడ్డంగా గట్టువేసి ఆక్రమించుకున్న భూమిలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఎన్నోసార్లు ఈ విషయంపై మండల, జిల్లాస్ధాయి అధికారులకు ఫిర్యాదు చేశాం. ఇక ఆక్రమణలు తొలగించటం సాధ్యం కాదని అనుకున్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడి నిండా నాలుగు నెలలు కాకముందే ఆక్రమణలు తొలగింపు సంతోషదాయకం. –కోడ లక్ష్మీపతి, మత్స్యకారుడు, రాజారాంపురం కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఆపరేషన్ నిర్వహించాం. ఆక్రమణలు ఎక్కడున్నా ఇదే స్ధాయిలో స్పందిస్తాం. నదీ సంగమ ప్రదేశంలో రొయ్యల చెరువులు తవ్వకంతో నది దిశను మార్చుకుని ఇటీవల వరద కళింగపట్నం వైపు మళ్లింది. మళ్లీ ఇలాంటి ఆక్రమణలు పునరావృత్తం కాకుండా మండల రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశాం. –ఎం.వి.రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతా..
సాక్షి, ప్రకాశం : మైన్స్ అధికారులు కళ్లు మూసుకున్నారు. ఏపీఎండీసీ అధికారులు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు చేయూతనిచ్చింది. పరిస్థితులు ఇంత చక్కగా కలిసి వస్తే గ్రానైట్ యజమానులు ఊరుకుంటారా..? అందుకే తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. కలిసొచ్చిన కాలాన్ని ఒక్క రోజు కూడా వృథా చేయకుండా అడ్డగోలుగా తవ్వుకున్నారు. హద్దులు దాటిన అక్రమ తవ్వకాలు ఇప్పుడు విజిలెన్స్ అధికారుల దాడులలో బహిర్గతమవుతున్నాయి. గడచిన నెల రోజులుగా రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలలో తనిఖీలు చేస్తున విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయట పడుతున్నాయి. క్వారీ యజమానుల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా రాజీ పడకుండా పార్టీలకతీతంగా గత నెల 16వ తేదీ నుంచి విజిలెన్స్ ఏఎస్పీ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహిస్తున్నారు. మైన్స్ అధికారులు క్వారీల యజమానులకు ఇచ్చిన అనుమతులకు మించి తవ్వుకోవడం వలన రాళ్ల నిల్వల్లో భారీ తేడాలు బయట పడుతున్నాయి. తవ్వి తీసిన రాళ్లకు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించిన రాళ్లకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక క్వారీ యజమాని నెలకు 3 వేల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. దానిలో ప్రభుత్వానికి కేవలం వెయ్యి క్యూబిక్ మీటర్లుకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. మిగిలిన 2 వేల క్యూబిక్ మీటర్లు రాయిని అడ్డదారిలో రాయల్టీ లేకుండా చెలామణి చేసుకున్నారు. కానీ, విజిలెన్స్ అధికారుల దాడులలో అలా రాయల్టీ చెల్లించని ఆ రెండు వేల క్యూబిక్ మీటర్లు రాయికి ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీ ధరతో పాటు ఆ రాయికి మార్కెట్ విలువ ఎంతయితే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఫైన్గా వేసే పరిస్థితి ఉంది. అలా అడ్డదారిలో మొత్తం క్వారీలలో తవ్వి తీసుకున్న రాయి మొత్తాన్ని లెక్కలు కడితే దాదాపు రూ.2 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పొంతన లేని గణాంకాలు.. రామతీర్థం క్వారీలలో జరుగుతున్న విజిలెన్స్ అధికారుల తనిఖీలలో పొంతనలేని గణాంకాలు బయటపడుతున్నాయి. క్వారీలో తవ్వి తీసిన రాళ్ల పరిమాణానికి, రికార్డులలో నమోదు చేసి ఉన్న రాళ్లకు పొంతన కుదరటం లేదనే వాస్తవాలు బయటపడుతున్నాయి. క్వారీలో రాయిని తీసిన గుంతలో 10–15 శాతం మాత్రమే రికవరీ వస్తుందని, మిగిలిందంతా వేస్ట్, డస్ట్గాను డంపింగ్లలో పోస్తామని యజమానులు చెబుతున్నారు. కానీ వేస్ట్, డస్ట్ రూపంలో పోగా రికవరీ వచ్చేటువంటి 15 శాతం రాళ్ల లెక్కలు కూడా సక్రమంగా లేవనేది తనిఖీ చేసే అధికారుల వాదన. రికవరీ వచ్చేటువంటి రాళ్లలో దాదాపు సగానికి పైగా రాళ్లకు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా అడ్డదారులలో స్థానిక ఫ్యాక్టరీలకు, అలవెన్స్ల పేరుతో రాయల్టీకి పంగనామాలు పెడుతున్నట్లు అధికారుల తనిఖీలలో బట్టబయలైంది. స్టాకులో తేడాలు ఎక్కువుగా ఉండటంతో ఇటీవల రెండు మూడు క్వారీలలో పెద్ద పెద్ద గ్రానైట్ బ్లాకులను డంపింగ్లలో పెట్టి పైన మట్టిపోసి కప్పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కొన్ని క్వారీలలో మైనింగ్ ప్లాన్ ప్రకారం తవ్వకుండా ఎక్కడ రాయి వస్తే అక్కడ తవ్వుకున్నట్లు, కొన్ని చోట్ల సరిహద్దులను కూడా దాటి ఇతర క్వారీలు లేనిచోట వారికి నచ్చినట్లు తవ్వుకున్నట్లు తనిఖీలలో బయటకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే క్వారీలలో పనిచేసే సిబ్బందికి భద్రత, వైద్యం, సంక్షేమ వంటి అంశాలను పూర్తిగా గాలికొదిలేసినట్లు దాడులలో తేటతెల్లమైంది. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివరాలను లేబర్ డిపార్టుమెంట్ అధికారులు సేకరించాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న విజిలెన్స్ అధికారుల దాడులు ఈనెలాఖరకు పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీలన్నీ పూర్తయ్యాక నివేదకను ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. -
పైరవీలదే పెత్తనం..
సాక్షి, గుంటూరు: అర్హతలతో పనిలేదు పైరవీలు చేస్తే చాలు.. రూ.లక్షలకు లక్షలు ఖర్చుపెడితే పనైపోతుంది. నిబంధనలు అడ్డంకి రావు. పైరవీలు, పైసలు ఉంటే చాలు నిబంధనలను సైతం తుంగలో తొక్కుతారు.. అన్న చందంగా గత ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు జీజీహెచ్లో పాలన సాగింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సిఫార్సు లేఖ ఇవ్వడంతో అడ్డదారిలో ఓ వ్యక్తికి సార్జెంట్ పోస్టు కట్టబెట్టారు. వివరాల్లోకి వెళితే.. జీజీహెచ్లో 200 మంది వరకూ వార్డు బాయ్లు, ఎంఎన్వోలు, తోటీలు, స్వీపర్లు వంటి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి విధులు కేటాయించడం, సర్వీస్ రూల్స్, సెలవులు మంజూరు, హాస్పిటల్ సెక్యూరిటీ తదితర వ్యవహారాలపై పర్యవేక్షణకు సార్జెంట్ ఉంటాడు. సార్జెంట్గా ఆర్మీలో 17 ఏళ్లకు పైగా పనిచేసి, సుబేదార్, రసీల్దార్ హోదా కలిగిఉన్న వ్యక్తులు అర్హులు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి అన్ని అర్హతలు కలిగిన వారిని సార్జెంట్ నియామకం చేపట్టాలి. అయితే జీజీహెచ్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సార్జెంట్ పోస్టు భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కారు. ఎమ్మెల్యే సిఫార్సుతో.. 2016లో అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎం.శ్రీహరి అనే ఎక్స్సర్వీస్మెన్ను సార్జెంట్గా నియమించమని సిఫార్సు లెటర్ ఇచ్చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా శ్రీహరిని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ద్వారా 2017లో సార్జెంట్గా నియమించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారానే సార్జెంట్ను రిక్రూట్మెంట్ చేయాలి. అర్హత కలిగిన వ్యక్తులు లేని పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల్లో సీనియర్ ఉద్యోగిని సార్జెంట్గా కొనసాగించవచ్చు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో సార్జెంట్ నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు ఉద్యోగి తమపై పెత్తనం చెలాయిస్తుండటంపై నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తేమీ కాదు.. జీజీహెచ్లో అనర్హలకు ఉద్యోగోన్నతులు, ఉద్యోగాలు, ఇతర పదవులు కట్టబెట్టడం ఇది కొత్తేమీ కాదు. లైంగిక వేధింపుల కేసులో ఉన్న ఓ వ్యక్తికి ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇచ్చిన ఘన చరిత్ర జీజీహెచ్ది. ఆస్పత్రిలో కింది స్థాయి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడి, వడ్డీ వ్యాపారం పేరుతో అరాచకాలకు పాల్పడిన అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించిన ఘటన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా సరే డబ్బులు వెదజల్లి కొందరు ఉద్యోగులు తమపై ఉన్న మరకలను గతంలో చెరిపేసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సార్జెంట్ను నియమించడం కోసం ఓ అధికారి, అడ్మిస్ట్రేషన్ విభాగంలో పని చేస్తున్న క్లర్క్ రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.గుంటూరు జీజీహెచ్ -
ఆగని అక్రమ రవాణా
సాక్షి, గోపవరం: గోపవరం మండలం మల్లెంకొండ పరిసరాలలో యథేచ్ఛగా ఎర్రచంనదం చెట్లను నరికి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు అటవిశాఖాధికారుల కళ్లు గప్పి చెట్లను నరికి అటవీ ప్రాంతం నుంచి దుంగలను సురక్షిత ప్రాంతానికి చేర్చుకుని అక్కడ నుంచి రవాణా చేస్తున్నారు. మండలంలో సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల కింద దాదాపు 35 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వెనుక జలాలకు ఇరువైపులా అటవీ ప్రాÆతం ఉంది. మల్లెంకొండ పరిసరాలను పెనుశిల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రచందనం, ఇతర అటవీ సంపద ఉంది. సోమశిల వెనుక జలాల ముసుగులో స్మగ్లర్లు , ఎర్ర చందనం నరికి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లెంకొండ మంచినీరు సెల, విశ్వనాథ పురం, సూరేపల్లె కూడలిలో ఎర్రచందనం నరికి దుంగలను తరలించారు. మరికొన్ని దుంగలు అక్కడే ఉన్నాయి. చెట్లు నరికిన మొదళ్లు, దుంగలను చూస్తే నాలుగైదు రోజుల క్రితమే స్మగ్లర్లు చెట్లను నరికినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మండలంలోని పీపీకుంట జాతీయ రహదారిపై అటవిశాఖ చెక్పోస్టు ఉంది. అలాగే ఎస్.రామాపురం వద్ద బేస్క్యాంపు ఏర్పాటు చేశారు. నరికిన ఎర్ర చందనం దుంగలను ఈ రెండు చెక్పోస్టుల ద్వారా సిబ్బంది కళ్లుగప్పి తరలిస్తున్నారా లేక మల్లెంకొండనుంచి తూర్పు భాగానికి వెళితే కాలినడకన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లె వద్దకు వెళ్లే అవకాశం ఉంది. అయితే నరికిన దుంగలను కూలీలు కాలినడకన కొండ దిగువ వరకు తీసుకెళ్లిన దాఖలాలు గతంలో ఉన్నాయి. అక్కడి నుంచి అతి దగ్గరగా నెల్లూరు –ముంబయి జాతీయ రహదారి ఉంది. స్మగ్లర్లు ఈ మార్గాన్నే ఎంచుకుని అటవి సంపదను కొల్లగొడుతున్నారనే సమాచారం అధికారుల వద్ద ఉంది. కాగా ఎర్రచందనం నరికి వేత , అక్రమ రవాణా పై అటవిశాఖాధికారులు , పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లర్ల భరితెగింపు ఏ మేరకు ఉందో చెప్పకనే తెలిసిపోతుంది. కాగా ఎర్రచందనం నరికివేతకు తమిళనాడుకు చెందిన కూలీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారుల అదుపులో తమిళ కూలీలు మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద శనివారం రాత్రి 9 మంది తమిళ కూలీలను చెక్పోస్టు సిబ్బంది పట్టుకుని అధికారులకు అప్పగించారు. బద్వేలు నుంచి¯ð నెల్లూరు వైపు కారులో తమిళ కూలీలు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకుని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మల్లెంకొండలో ఎర్రచందనం చెట్ల నరికివేతపై బద్వేలు అటవీశాఖ రేంజర్ పి.సుభాష్ను సాక్షి వివరణ కోరగా తమకు కూడా సమాచారం అందిందని ఆదివారం ఉదయం సిబ్బందిని మల్లెంకొండ ప్రాంతానికి పంపించామన్నారు. ఇప్పటికే కొంతమంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారిసున్నట్లు తెలిపారు. -
ఇష్టానుసార టెండర్లకు చెక్
సాక్షి, అమరావతి: ఇక ఇష్టానుసారంగా టెండర్ల ఖరారు కుదరదు. స్విస్ చాలెంజ్ ముసుగులో అస్మదీయ సంస్థలకు నామినేషన్పై పనులు కట్టబెట్టడం లాంటి అనైతిక చర్యలకు తెర దించుతూ ఈమేరకు చట్టంలోని లొసుగులను సవరించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఐదేళ్ల పాలనలో ఎడాపెడా టెండర్లను ఖరారు చేయడమే కాకుండా అంచనాలను భారీగా పెంచేసి కమీషన్లు కాజేయటంపైనే టీడీపీ దృష్టి పెట్టింది. సూటిగా చెప్పాలంటే గత సర్కారు రాష్ట్ర ఖజానా నుంచే భారీ దోపిడీకి పాల్పడింది. ఈ నేపథ్యంలో టెండర్ల విధానంలో సమూల మార్పులు తెచ్చి ప్రజాధనాన్ని ఆదా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగానే టెండర్ల స్క్రూటినీ కోసం జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబలింగ్ చట్టం(ఏపీఐడీఈ )–2001లో సవరణలకు మౌలిక సదుపాయాలు, పరిశ్రమలశాఖ కసరత్తు ప్రారంభించింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు సర్వ హక్కులు కల్పించిన బాబు సర్కారు స్విస్ చాలెంజ్ ముసుగులో రాజధాని రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్ధలకు అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్ వద్దకు పంపించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి. జ్యుడిషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా.. ఏపీఐడీఈ చట్టం ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపట్టే ప్రాజెక్టులకే వర్తిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుల పనులన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చట్టంలో సవరణలను ప్రతిపాదించనున్నారు. మరోవైపు ఇదే చట్టంలో టెండర్లను జ్యుడీషియల్ స్క్రూటినీ చేసేందుకు వీలుగా జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్రొవిజన్ చేర్చనున్నారు. దీంతో ఇక పీపీపీ ప్రాజెక్టులతో సహా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల పనుల టెండర్లను పూర్తి పారదర్శకతతో జ్యుడీషియల్ స్క్రూటినీ చేసిన అనంతరమే ఖరారు చేయనున్నారు. తద్వారా టెండర్లలో దోపిడీకి ఆస్కారం లేకుండా రాష్ట్ర ఖజానాకు నిధులు ఆదా అవుతాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. టెండర్ల ఖరారుకు ముందు జ్యుడీషియల్ కమిషన్ పరిశీలనకు పంపిస్తారు. కమిషన్ ఏమైనా మార్పులు చేర్పులు సూచిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాకే టెండర్లను ఖరారు చేస్తారని ఆ ఉన్నతాధికారి వివరించారు. ఈనెల 11వతేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అప్పగించేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు తెచ్చింది. స్విస్ చాలెంజ్ విధానంలో సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారిటీ తొలుత ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించాల్సి ఉండగా టీడీపీ హయాంలో మాత్రం సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత తాపీగా సీఎస్ వద్దకు పంపించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తప్పుబట్టడంతో ఏకంగా సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీనే రద్దు చేస్తూ ఏపీఐడీఈ–2001 చట్టంలో చంద్రబాబు సర్కారు నాడు సవరణలు చేసింది. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరిన విధంగా రాజధాని భూములపై సర్వహక్కులు కల్పిస్తూ మరోసారి కూడా చంద్రబాబు సర్కారు ఏపీఐడీఈ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణలన్నీ సింగపూర్ కంపెనీలకు భారీ ఆర్థిక ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు చేసిన సవరణలన్నింటినీ ఏపీఐడీఈ చట్టం నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీఐడీఈ చట్టంలో సవరణలను తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేకు చట్టం రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం భూములపై ఉన్న హక్కులు ఊహాజనితమేనని, వాస్తవ హక్కులు కాదని, దీంతో భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకరికి చెందిన భూమిని మరొకరు కాజేయడం, తప్పుడు హక్కు పత్రాలను సృష్టించడం లాంటి చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో భూములన్నీ రీ సర్వే కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ఉన్నతాధికారి తెలిపారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర టైటిల్ను కల్పించేందుకు వీలుగా చట్టం తీసుకురానున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. భూములన్నీ సర్వే చేసి వాస్తవ యజమానులకు శాశ్వతమైన హక్కు కల్పించడమే దీని లక్ష్యమని ఆ అధికారి వివరించారు. ఇందులో భాగంగానే గ్రామ సచివాలయాల్లో ల్యాండ్ సర్వే అసిస్టెంట్ల నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. భూములు రీ సర్వే చేసి శాశ్వత హక్కు కల్పించిన తరువాత సివిల్ న్యాయస్థానాలు ప్రశ్నించకుండా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు తెలిపాయి. -
బాలయ్య అడ్డాలో అవినీతి మరక
ఆడపడచులను.. అక్కచెళ్లెమ్మలను తెలుగు తమ్ముళ్లు దగా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ తామై నడిపిస్తూ.. తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా చెలామణి అవడమే కాక.. ఏకంగా అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ రూ. మూడు లక్షల వరకూ అక్రమంగా వసూలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నియామక పత్రాలు నేటికీ అందకపోవడంతో టీడీపీ నేతలను నమ్మి డబ్బు ముట్టజెప్పిన మహిళలు లబోదిబో మంటున్నారు. ఈ పరిస్థితి మరెక్కడో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనిదే. వివరాల్లోకి వెళితే.. సాక్షి, హిందూపురం సెంట్రల్: సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్వాడీ పోస్టుల భర్తీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 15 సహాయక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆశావహులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అంగన్వాడీ పోస్టుల భర్తీ స్థానిక టీడీపీ నేతలకు కాసుల వర్షమే కురిపించింది. ఎమ్మెల్యే పేరు చెప్పుకుని స్థానికేతరులకు కూడా పోస్టు కచ్చితంగా వస్తుందని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షల మొదలు రూ. 3 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు వసూలు చేసుకున్నారు. బాధితుల్లో ఆందోళన నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. నియామకాలు పారదర్శకంగా జరిపితే తమకు ఉపాధి దొరుకుతుందని భావించిన వారి ఆశలపై అప్పట్లో టీడీపీ నేతలు నీళ్లు చల్లారు. రూ. లక్షల్లో డబ్బు వసూలు చేసుకుని పోస్టింగ్ ఆర్డర్లు ఇప్పించకపోవడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పోస్టుల భర్తీని వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టనుండడంతో తమకు పోస్టులు వస్తాయో రావో అనే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. పోస్టులు రాకపోతే తాము ఇచ్చిన డబ్బును టీడీపీ నేతలు వెనక్కు ఇస్తారో ఇవ్వరోననే భయం కూడా వారిని వెన్నాడుతోంది. స్వీయ రక్షణలో టీడీపీ నేతలు అంగన్వాడీ పోస్టులు ఇప్పిస్తామంటూ పలువురు నుంచి రూ. లక్షల్లో దండుకున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. విషయాన్ని కాస్త ఎమ్మెల్యే బాలయ్య దృష్టికెళితే... తమకు ఇబ్బందులు తప్పవని భావించి స్వీయరక్షణలో పడ్డారు. ఇందులో తమ అక్రమ వసూళ్లను కప్పిపుచ్చుతూ టీడీపీని నమ్ముకున్నవారికి పోస్టులు ఎలాగైనా ఇప్పించాలంటూ బాలయ్యను వారు ప్రాధేయపడినట్లు సమాచారం. కాగా, అంగన్వాడీ పోస్టుల భర్తీ విషయంగా చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ నాయకులు భగ్గుమంటున్నారు. అప్పటి నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్ జారీ చేసి, నియామకాలను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. డబ్బు వసూళ్ల అంశం మా పరిధిలోది కాదు హిందూపురం డివిజన్లో 49 అంగన్వాడీ టీచర్లు , 15 సహాయకులు ఖాళీలు ఉండేవి. ఈ పోస్టుల భర్తీకి గత టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వెంటనే అభ్యర్థుల నుంచి నిర్ణీత తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించాం. అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాను కలెక్టర్ కార్యాలయానికి పంపించాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నారన్నది అవాస్తవం. ఇక పోస్టు కోసం నాయకులకు డబ్బు చెల్లించారనేది మా పరిధిలో లేని అంశం. నిబంధనల మేరకే పోస్టుల భర్తీ ఉంటుంది. – నాగమల్లీశ్వరి, సీడీపీఓ, హిందూపురం -
గోల్డ్ మాఫియా!
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటారు పెద్దలు’.. సరిగ్గా ఇలాగే బంగారం పన్ను ఎగవేతకు ఇక్కడి వ్యాపారులు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. దీనికోసం ఏకంగా పరిశ్రమలే ఏర్పాటు చేయడం లేదా అలాంటి పరిశ్రమలతో ములాఖత్ అవ్వడం చేస్తున్నారు. హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇలాంటి గోల్మాల్ వ్యాపారాలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా భారీ స్కామ్లు ఒక్కొక్కటిగా బయటికి రావడం డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ కుంభకోణం కారణంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి.. స్థానిక మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. దీనికి ఇటీవల వెలుగుచూసిన ‘జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్’ఉదంతమే నిదర్శనం. బంగారు ఆభరణాల తయారీకి అనుమతి పొందిన ఈ పరిశ్రమ రాచబాటలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా కోట్ల రూపాయల పన్నులు మిగుల్చుకుని జేబులో వేసుకుంటోంది. అసలేం జరిగింది?... రావిర్యాలలోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్ పరిశ్రమ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారాన్ని స్థానిక మార్కెట్కు బదిలీ చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న బంగారానికి పన్నులు ఉండవు. ఇదే గోల్మాల్కు కారణమైంది. దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలు తయారు చేసి తిరిగి విదేశాలకు ఎగుమతి చేయాలి. కానీ, వీరు అలా పంపకుండా.. చాలా స్వల్ప శాతం బంగారంతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిలో అధిక శాతం రంగురాళ్లు నింపి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిపై అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో సదరు సంస్థపై దాడులు చేశారు. స్వా«ధీనం చేసుకున్న ఆభరణాలను, రికార్డులను చూసిన అ«ధికారులు విస్తుపోయారు. ఓ లావాదేవీలో 19 కిలోగ్రాముల బంగారం, 2 కిలోగ్రాముల రాళ్లు ఉండాలి. కానీ, 20.85 కిలోగ్రాముల రాళ్లు, కేవలం 565 గ్రాముల బంగారమే ఉండటంతో గుట్టు బయటపడింది. చాలాకాలం నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారని, నగరంలో పేరున్న ఓ బడా జువెల్లరీ సంస్థకు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకూ 1,100 కిలోల బంగారాన్ని ఇలా పక్కదారి పట్టించి భారీగా ఆర్జించారని, ప్రభుత్వానికి రూ. వేల కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. రాకెట్ విదేశాల్లోనే ఉందా? వాస్తవానికి 20 కిలోల బంగారం చొప్పున విదేశాల నుంచి ఆర్డర్ వస్తే.. తిరిగి అదే బరువుకు సమానమైన ఆభరణాలు చేసి పంపాలి. కానీ, అలాకాకుండా గ్రాముల్లో బంగారం పూతపూసి, కిలోగ్రాముల్లో రంగురాళ్లు నింపి పంపుతుంటే విదేశాల నుంచి అధికారులకు ఎందుకు ఫిర్యాదు రాలేదన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. విదేశాల్లోనే వీరికి సహకరించేవారు ఉన్నారని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం పరిమాణంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటున్నా.. అవతలి వాళ్లు నోరు మెదపకుండా ఎలా ఉన్నారన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. నోట్ల రద్దు సమయంలో నగరానికే చెందిన మసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లరీస్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.110 కోట్ల మేరకు గోల్మాల్ చేసినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. రూ.82 కోట్లు విలువైన 145 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. -
కోటీశ్వరుడికి రేషన్ కార్డు
సాక్షి, కుప్పం : అధికార పార్టీలో నేతలే భార్య పేరు మీద రేషన్ కార్డు పొందడమే కాకుండా, మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు బిల్లులు చూపి వేల రూపాయలు పొందుతున్నారు. నేతలే అక్రమాలకు పాల్పడితే ఇక క్షేత్రస్థాయి నాయకులు ఏ మేరకు అక్రమాలు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. నాలుగు మండలాల టీడీపీ ఇన్చార్జ్, రెస్కో సంస్థ చైర్మన్ పీఎస్ మునిరత్నం. ఆయనకు పట్టణం లోని ఆర్వీఎం వీధిలో మూడంతస్తుల భవనం ఉంది. స్వగ్రామం కంగుందిలో వందల ఎకరాల భూస్వామి. పి.ఎస్.మునిరత్నం భార్య పేరు మీద కలైసెల్వి పేరుమీదుగా WAP106600901213 నెంబరుతో రేషన్ కార్డును పొందారు. ఈ కార్డు పట్టణంలోని 9వ రేషన్ షాపులో ఉన్నట్లు సమాచారం. కాగా, బ్రహ్మదేవర్లచేనులో స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు బిల్లులు డ్రా చేశారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో అకౌంటు నెం.2714101001401 కింద 2016 జూన్లో మొదటి బిల్లుగా రూ.6వేలు పొందారు. ఆగస్టు 2016న రూ.9 వేల బిల్లును పొందారు. ప్రస్తుతం రేషన్ కార్డు ద్వారా ఎలాంటి పథకాలు పొందడం లేదు. బడుగు, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే అధికార పార్టీలో నేతలకే పరిమితమైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. పట్టణంలో ఉన్న రేషన్ కార్డుతో మారుమూల ప్రాంతం అటవీ గ్రామమైన బ్రహ్మదేవరచేన్లులో కేవలం రూ.15 వేల మరుగుదొడ్ల బిల్లును నియోజకవర్గ ఇన్చార్జ్ పొందడం దారుణంగా మారింది. -
కలప అక్రమ రవాణాకు అడ్డేదీ..?
సాక్షి, త్రిపురారం : అడవుల సంరక్షణకు అధికార యంత్రాంగం చర్యలెన్నీ చేపడుతున్నా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో స్వార్థపరుల గొడ్డలి వేటుకు అటవీ సంపద గురవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూముల నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి తేటతెల్లం చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఉన్న ఫారెస్టు భూముల్లో గల వృక్ష సంపద నానాటికీ కనుమరుగవుతోంది. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసం ఫార్టెస్టు భూముల్లో ఉన్న చెట్లను నరికి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు యజమానులు సోమ్ముచేసుకుంటున్నారు. నాణ్యతా లేని కలపను కోత మిషన్ల వ్యాపారులకు ఇటుక బట్టీలు కాల్చ డానికి వినియోగిస్తుండగా నాణ్యతా ఉన్న కలప ద్వారా అధిక ఆదాయం గడిస్తున్నారు. అధిక ధరకు విక్రయం.. నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఫారెస్టు భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అటవీ భూముల్లో లభిస్తున్న అడవివేప, మద్ది తదితర విలువైన చెట్లతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను నరికి వాటి నుంచి లభించే కలపను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అధికారుల కళ్లుకప్పి నిత్యం ట్రాక్టర్లను తరలిస్తున్నారు. కలప వ్యాపారులు పగటివేళల్లో నరికివేసిన చెట్లను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేసి చెట్లను నరికివేస్తున్న కలప వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మామూళ్లు పుచ్చుకుంటూ.. ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదపై పర్యవేక్షణ ఉంచి దాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎవరైన అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడినా మామూళ్లు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదను కాపాడుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాల్టాకు తూట్లు.. పర్యావరణ పరిరక్షణకు నీరు, భూమి, చెట్లు ప్రధానం. వీటిని కాపాడుకుంటేనే మానవమనుగడ సాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విచ్ఛలవిడిగా వినియోగించకుండా ప్రభుత్వం ‘వాల్టా’చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అక్రమార్కులు నిబంధనలు ఉల్లఘిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
అవినీతి ‘విక్రమార్కుడు’
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి విక్రమార్కుడి దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం ఆ ఉద్యోగి స్టైల్. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి ఉన్నతాధికారులను సైతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. మాట వింటే వాటా ఇస్తాడు. వినకపోతే వార్నింగ్ ఇస్తాడు. కార్యాలయంలో వాహనాలను సైతం బినామీ పేర్లతో పెట్టుకున్నాడు. కొంత కాలంగా రెవన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి తక్కువ సమయంలోనే లక్షలు గడించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థలం విలువ బట్టి మామాలు పట్టణంలో ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు స్థలానికి సంబంధించిన పన్ను వారి పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మార్చాలంటే ఆ ఉద్యోగి అడిగినంత ముట్టజెప్పాల్సిందే. స్థలం విలువను బట్టి మామూలు ఎంత ఇచ్చుకోవాలో నిర్ధారిస్తాడు. ఉద్యోగి అడిగినంత అప్పజెప్తే వెంటనే స్థలయజమానికి పన్ను రాసి ఇస్తాడు. ఈ నేపథ్యంలో నూతనంగా ఓ ఇళ్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఆ ఉద్యోగిని పన్ను మార్పు కోసం సంప్రదిస్తే.. తాను అడిగినంత ఇస్తే పన్ను తగ్గించి రాస్తానని చెప్పినట్లు సమాచారం. ఇలా ఇతని ఆగడాలతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. టీడీపీ నేతలకు పన్ను చెల్లింపుల్లో వెసులుబాటు... టీడీపీ నేతలకు చెందిన బిల్డింగ్లకు సంబంధించి పన్ను బకాయిలు రూ.లక్షల్లో ఉన్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లగా కొందరు టీడీపీ నేతలు పన్నులు చెల్లించకుండా ఉన్నారు. వారి వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని వత్తిడి చేయకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె వాహనాలూ అతనివే... స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల అద్దె వాహనాలను సదరు ఉద్యోగి బినామి పేర్లతో ఉంచి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నేతల అండదండలు ఉండటంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయకుండా దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి నెలకు దాదపు రూ.35 వేలు సంపాదించటమే కాక, ఉద్యోగ విధుల్లో అవినీతికి పాల్పడుతూ రూ.లక్షలు గడిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం అతడిపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం విమర్శలకు దారి తీస్తోంది. -
మాజీ ఎమ్మెల్యే హల్చల్
పందిరిపల్లిగూడెం (కైకలూరు): ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అటవీ శాఖ నిబంధనలకు కొల్లేరు గ్రామాల్లో తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరోసారి ‘చింతమనేని’ అవతారం ఎత్తారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఫోన్లో రేంజర్ను ఇష్టానుసారం తిట్టారు. కొల్లేరు నాయకులతో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. దీంతో కొల్లేరు పెద్దింట్లమ్మ దర్శనానికి వచ్చే యాత్రికులు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళితే పందిరిపల్లిగూడెం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు రోడ్డును ఆర్అండ్బీ అ«ధికారులు నిర్మించడానికి గ్రావెల్ తోలారు. బుధవారం కొల్లేరు పరిశీలనకు వచ్చిన అటవీ శాఖ డీఎఫ్వో అనంత్శంకర్, రేంజర్ విజయ కొల్లేరు అభయారణ్య పరిధిలో అటవీ శాఖ అనుమతి లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని, పనులను అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం పనులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. జయమంగళ హల్చల్.. పెద్దింట్లమ్మ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్డును వేస్తుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఎంటీ? అని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెచ్చిపోయారు. పెద్దింట్లమ్మ దర్శనానికి పార్టీ నాయకులతో వచ్చిన ఆయన దారిలో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. ఫారెస్టు రేంజర్ విజయతో ఫోన్లో ఇష్టానుసారం మాట్లాడారు. ముందుగా రోడ్డు ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పినా ఆమె మాట వినలేదు. చివరకు రేంజర్.. జయమంగళకు ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దేవస్థానానికి చేరే భక్తులు గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. చివరకు సీఐ రవికుమార్ వచ్చి భక్తులకు దారి ఇవ్వాలని చెప్పారు. ఆర్అండ్బీ సిబ్బంది ఎట్టకేలకు రోడ్డు వేయడానికి దించిన మెటీరియల్ను వెనక్కు తీసుకువెళ్ళారు. అనుమతులు తీసుకోవాలి.. కొల్లేరు అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులను అడ్డగోలుగా తవ్వితే పట్టించుకోని అటవీ శాఖ అధికారులు భక్తులకు అవసరమైన రోడ్డు నిర్మాణంలో ఆంక్షలు విధించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అయితే, అటవీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం ముందుగా తమకు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. పందిరిపల్లిగూడెం రోడ్డు పక్కా అభయారణ్యంలో ఉందని స్పష్టం చేస్తున్నారు. -
చిన్న వెంకన్న చెంత.. ఇదేమి చింత
ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలకు ఇష్టారాజ్యంగా లైసెన్సులు ఇవ్వడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోను మద్యం ఏరులై పారుతోంది. దీంతో భక్తుల మనోభవాలు దెబ్బతింటున్నాయి. జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా ఉంది. గతంలో చిన్నతిరుపతి క్షేత్రానికి వచ్చే భక్తులకు గరుడాళ్వార్ విగ్రహం స్వాగతం పలికేది. ఇప్పుడు మద్యం దుకాణాలు, వాటి బోర్డులే ఆహ్వానం పలుకుతున్నాయి. క్షేత్రంలోని దేవస్థానం ఆర్చిగేట్లు, స్వామివారి మండపాలు, దేవతామూర్తుల విగ్రహాలకు కూతవేటు దూరంలోనే మద్యం దుకాణాలు ఉండటంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టంలోని నియమ నిబంధనలను పాలకులు, అధికారులు తుంగలోకి తొక్కి మరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనలను అమలు చేస్తున్నారు. క్షేత్రంలో గుడికి, బడికి వంద మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలు ఉన్నాయంటున్న వ్యాపారులు విక్రయాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ చట్టం ప్రకారం ఇది తప్పని అడిగేవారు లేకపోవడంతో ప్రముఖ క్షేత్రాల్లో మద్యం దుకాణాలకు ప్రభుత్వం ఇష్టానుసారం లైసెన్సులను ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైసెన్సుల్ని రద్దు చేయాలి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టం సెక్షన్ 2 లోని సబ్ సెక్షన్ 27 ప్రకారం దేవతామూర్తుల కైంకర్యాలకు వినియోగించే తెప్పోత్సవ మండపాలు సైతం గుడిలో భాగమే. అంతేకాదు మతపరమైన ఆరాధనా స్థలాలు, మందిరాలు, పుణ్యక్షేత్రాలు, ఉప పుణ్యక్షేత్రాలు ఇలా అన్నింటి సమూహమే ఆలయమని చట్టం చెబుతోంది. దీని ప్రకారం శ్రీవారి క్షేత్రంలో శివ మండపం, విలాస మండపం, ఆర్చిగేట్లు, దేవతామూర్తుల విగ్రహాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదు. అవి క్షేత్రంలో అమలవడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రాల్లో పవిత్రత దెబ్బతింటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులే టార్గెట్ మద్యం వ్యాపారులు భక్తులనే లక్ష్యంగా చేసుకుని క్షేత్రాల్లో మద్యం విక్రయాల్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. వివాహాది శుభకార్యాలు జరిగే సమయాల్లో అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ద్వారకాతిరుమలలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. క్వార్టర్ బాటిల్పై ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ. 10లు వ్యాపారులు వసూలు చేస్తున్నారు. మందుబాబులు మాత్రం మద్యం దొరికితే చాలన్నట్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం క్షేత్రంలో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రముఖ క్షేత్రాల్లో అడ్డుకట్ట వేయాలి ఇప్పటికైనా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు స్పందించి, ప్రముఖ క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసి, క్షేత్రాల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. హిందూ మత పరిరక్షకులు క్షేత్రాల్లో మద్యం విక్రయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. చినవెంకన్నను దర్శించేందుకు క్షేత్రానికి వచ్చి, తాగి పడిపోతున్న భక్తుల వల్ల, యాత్రికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అంటున్నారు. చిన్న తిరుపతిలో మాడ వీధులు లేకపోవడం వల్ల స్వామివారి వాహనాలు క్షేత్ర పురవీధుల్లో తిరగాల్సి వస్తోంది. దీంతో క్షేత్రంలో ఉన్న మద్యం దుకాణాల మీదుగా శ్రీవారి వాహనాలు తిరుగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రాష్ట్రంలోని ప్రధాన క్షేత్రాల్లో మద్యం విక్రయాలకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
గుడి చుట్టూ అధికార దొంగలు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతల దోపిడీకి గుడి, బడి ఏదీ తేడా లేకుండా పోతోంది. ఆలూరు మండలం హత్తిబెళగల్కు సమీపంలో శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన చుట్టూ పరిణామాలను గమనిస్తే మరిన్ని వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఈ పేలుడు ప్రాంతానికి సమీపంలోనే సోమేశ్వర ఆలయం ఉంది. కొండపై ఉన్న ఈ ఆలయం చుట్టూ ఉన్న కొండను సైతం పేలుస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. క్వారీ లీజు తీసుకున్న ప్రాంతానికి దూరంగా గుడి చుట్టూ ఉన్న రాయిని డిటోనేటర్లతో పగలగొడుతున్నారు. అలాగే గుడిచుట్టూ అధికారపార్టీ నేతలు గుంతలు వేస్తున్నారు. తీసుకున్న లీజు ప్రాంతం కొంత మేర ఉంటే.. అంతా తమదే అన్నట్టు సోమేశ్వర ఆలయం చుట్టూ అక్రమ మైనింగ్కు పాల్పడుతుండడాన్ని అక్కడి ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారులు మాత్రం కనీసం అటువైపుగా కన్నెత్తి చూడటం లేదు. పైగా మైనింగ్ అధికారులు కొందరు.. ఈ అధికారపార్టీ నేతకు చెందిన మైనింగ్ ప్రాంతంలోనే కొద్దిరోజుల క్రితం భారీగా ‘పార్టీ’ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పేలుళ్లకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అధికారపార్టీ ఒత్తిళ్లతో పాటు భారీగా మామూళ్లు ముడుతుండటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుడి చుట్టూ గుంతలు గుప్తనిధుల కోసం జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో పీర్ల గుడికి సమీపంలో నేరుగా ప్రభుత్వమే తవ్వకాలు చేపట్టింది. నెలల తరబడి ఈ తంతు సాగుతోంది. ఎక్కడ కనబడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. కనీసం పురావస్తు శాఖ నుంచి అనుమతి కూడా లేదు. కేవలం కలెక్టర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలతోనే ఈ తతంగం సాగుతోంది. ఇప్పుడు అధికారపార్టీ నేతలు కూడా ఆలూరు మండలం హత్తిబెళగల్కు సమీపంలో ఉన్న సోమేశ్వరస్వామి ఆలయం చుట్టూ తవ్వకాలు చేపట్టారు. క్వారీ కోసం లీజుకు తీసుకున్న భూమితో సంబంధం లేకుండా ఈ తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కూడా ఎలక్ట్రికల్ డిటోనేటర్లు (ఈడీ) పెట్టి గుడిచుట్టూ ఉన్న బండలను పేల్చేశారు. ఆలయం కింద నుంచి ఆలయానికి వెళ్లే మార్గం వరకూ అనధికారికంగా తవ్వకాలు చేశారు. హత్తిబెళగల్కు కూతవేటు దూరంలో జరుగుతున్న ఈ అక్రమ పేలుళ్లపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన పేలుడు సంఘటన కూడా ఆలయానికి సమీపంలోనే చోటుచేసుకుంది. ఈ ఆలయానికి ప్రతి సోమవారం, అలాగే పౌర్ణమి, అమావాస్య రోజున చుట్టుపక్కల నుంచి భారీగా జనం వస్తుంటారు. రాత్రి సమయాల్లో గుడి సమీపంలోనే 100 మంది వరకూ నిద్రిస్తుంటారు. ఒక రాత్రి నిద్ర చేసిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ. ఒకవేళ శుక్రవారం రాత్రి జరిగిన పేలుడు కాస్తా సోమవారం జరిగి ఉంటే మా పరిస్థితి ఏమిటంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊహించుకుని భీతిల్లుతున్నారు. -
దేవుడికి దిక్కెవరు?
వీరఘట్టం: అందరికీ ఆపద్బాంధవుడు భగవంతుడు. ఎవరికి కష్టం వచ్చినా అతనికే మొక్కుకుంటారు. అయితే ఆ దేవుడికే నేడు కష్టం వచ్చింది. తనకు చెందిన విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేయాలో.. ఎవరికి మొక్కుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారుల్లో కొంతమంది దేవుడు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే అపవాదును సైతం ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటున్నారనడంలో సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి తనకు చెందిన భూములకు కౌలు రాక, తనకు నిత్యం ధూపదీపాలతో నైవేద్యం పెడుతున్న అర్చకులకు వేతనాలు లేవని తెలిసి భగవంతుడు బాధపడుతున్నాడు. దేవుడు భూమే కదా అని.. మన పొలంలో సెంటు భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించినా వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సర్వే నంబర్ల వారీగా హద్దులు వేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భూమిని మన చేతిలోకి తీసుకుంటాం. సెంటు స్థలం కోసం ఇలా చేస్తే ఆక్రమణలో ఉన్న వేలాది ఎకరాల ఆలయ భూముల కోసం మరెంత చేయాలి. కాని ఆ పరిస్థితి పాలకుల్లో..సంబంధిత శాఖలో కనిపించడం లేదు. దేవుడి భూమే కదాని చిన్నచూపే దీనికి కారణంగా పలువురుభావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలు గు వేల ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణ ల్లో ఉన్నట్లు అధికారులే గుర్తించారు. దీనిపై పలు చోట్ల కోర్టులు దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ భూములు మాత్రం ఇంకా ఆక్రమణదారుల చేతిల్లోనే ఉండిపోయావి. మరి కొన్ని చోట్ల కేవలం నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక దేవాలయాల నిర్వహణ సక్రమంగా లేకుండాపోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. దేవుడి భూములు లీజుకు తీసుకున్న కొంతమంది రైతులు ఏటా పంటలను సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారు. అయితే ఏళ్ల తరబడి దేవాదాయ శాఖకు లీజులు చెల్లించడం మానేశారు. లీజులు చెల్లించని భూములను వదిలేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు అంగీకరించడం లేదు. మరికొన్ని చోట్ల సొంత భూములుగా భావించి పంటలను చేసుకుంటున్నారు. దీంతో ఈ భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు నిర్ధారించుకొచ్చిన దేవదాయ శాఖాధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి మొత్తం 4 వేలు ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించారు. సోంపేట, రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో దేవాలయ భూములు ఎక్కువగా ఆక్రమణల్లో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు.. ఆక్రమణలకు గురైన దేవుడు భూములపై కొన్ని చోట్ల దేవదాయశాఖాధికారులు కోర్టులను ఆశ్రయించారు. ఈ భూములు దేవదాయ శాఖకు చెందినవిగా చాలాచోట్ల రుజువయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా వీటిని స్వాధీనం చేసుకోవడానికి వెళుతున్న అధికారులకు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆక్రమణదారులకు మద్దతుగా నాయకులు మాట్లాడుతుండడంతో దేవా దాయశాఖ అధికారులు ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన భూములు ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తామై నడిపిస్తున్న సిబ్బంది! భూముల లీజు విషయంలో కొంతమంది దేవాదాయశాఖ సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అన్నీ తామై రైతులతో జత కట్టి వారి దగ్గర నుంచి ఎకరాకు 5 బస్తాల వరకు లీజు తీసుకుంటున్నప్పటికీ.. దేవ దాయ శాఖకు మాత్రం రెండు బస్తాలకు మించి లెక్కలు చూపడం లేదని పలువురు అంటున్నారు. లీజు చెల్లించని రైతుల నుంచి భూములు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్దనే భూములను ఉంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్వహణ భారం దేవాలయాలకు భూముల రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే కొన్ని ఆక్రమణల్లో ఉండటం, మరికొన్నిచోట్ల నామమాత్రంగా లీజు వసూలు అవుతుండడంతో ఆదాయం అరకొరగా లభిస్తోం ది. ఫలితంగా అనేక చోట్ల దేవాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ కారణంగా అనేక దేవాలయాలు అభివద్ధికి దూరమవుతున్నాయి. ధూపదీపనైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. కనీసస్థాయిలో లీజు వసూలు చేసేందుకు కూడా అధికారులు గట్టిగా ప్రయత్నం చేయడం లేదు. బహిరంగ వేలం వేయకపోవడంతో ... ఒకరైతు వద్ద కేవలం మూడేళ్లు మాత్రమే భూములను లీజుకు ఉంచాలి. అనంతరం మరో రైతుకు మార్చాలి. అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ఆలయాల పరిధిలోని అధికారుల లోపాయికారి సహకారంతో ఒకే రైతు వద్ద ఏళ్ల తరబడి భూములను వదిలేయడంతో ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయ భూములను బహిరంగ వేలం వేయకపోవడంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉండడమే కారణమే విమర్శలు వస్తున్నాయి. లోపాయికారి ఒప్పందాలు.. సాధారణంగా ఒక రైతు నుంచి మరో వ్యకి ఎకరా భూమిని కౌలు తీసుకుంటే అక్కడ నీటి సౌకర్యం ఆధారంగా ఏడాదికి 8 నుంచి 10 బస్తాల ధాన్యం లీజు చెల్లిస్తారు. ప్రస్తుతం దేవాదాయ శాఖకు 6,250 ఎకరాల నుంచి లీజులు వస్తున్నాయి. పైన చెప్పిన లెక్క ప్రకారం ఎకరాకు 8 బస్తాలు వంతున వచ్చినా సుమారు 50 వేల బస్తాల ధాన్యం రావాల్సి ఉంది. ఎక్కడా ఈ పరిస్థితి కని పించడం లేదు. లీజులు తీసుకున్నవారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ఎకరానికి రెండుబస్తాలకు మించి లీజు ఇవ్వడం లేదు. చర్యలు చేపడతాం దేవాదాయశాఖ భూముల అన్యాక్రాంతం.. నామమాత్రపు లీజు విషయాన్ని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.వి.వి. ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఆక్రమణలో ఉన్న దేవుడి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. పాలకొండ జగన్నాథస్వామి ఆలయానికి కూడా సుమారు 80 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఇవిఎక్కడ ఉన్నాయో, ఎవరు కౌలుకు చేస్తున్నారో, ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 11,200 ఎకరాల ఆలయ భూముల్లో 4 వేల ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఆఫ్రిది అది చట్టవిరుద్దం!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ జంతుప్రేమికుల ఆగ్రహానికి గురైంది. ‘జంతువులను రక్షించడం మర్చిపోకండి, వాటికి మన ప్రేమ ఎంతో అవసరం ఉందంటూ’ జింకకు పాలు తాగిస్తూ దిగిన ఫోటో, తన కూతురు ఫోటోను బూమ్ బూమ్ ఆఫ్రిది షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆల్రౌండర్ షేర్ చేసిన ఫోటోలో తన కూతురుతో పాటు ఆమె వెనకాలా ఓ పెద్ద సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. దీనిపై ఆగ్రహించిన జంతు ప్రేమికులు స్వేచ్చగా అడవిలో తిరగాల్సిన సింహాన్ని ఇలా గోలుసులతో కట్టిపడేస్తే జంతువులను ప్రేమించటం కాదని ఘాటుగా స్పందించారు. ఇక మరికొందరు క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టవిరుద్దమని ఆఫ్రిదిని కడిగిపాడేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫ్రిది ఎలాంటి వివరణ ఇవ్వలేదు. I’m absolutely appalled with what #ShahidAfridi is doing. You can’t keep a #lion out of its natural habitat all chained up & then claim that u r loving animals. The lion looks weak & so done with life. I feel so bad for it. #PETA #AnimalRights #cricket #Pakistan pic.twitter.com/IiphTknlhX — Mia Utopian (@mia__utopian) June 9, 2018 -
నో చట్టం.. నో ఫారెస్ట్
ఖాకీ చిత్రం ఇటీవల విడుదలయింది. కార్తీ హీరో. ఓ సిన్సియర్ పోలీసు ఆఫీసరు కరుడుగట్టిన ముఠా ఆచూకీ తెలిసి పట్టుకోవడానికి ఓ రాష్ట్రానికి పోలీసు సిబ్బందితో జీపులో వెళతాడు. గ్రామంలో ఎదురుగా ముఠా సభ్యులు కనిపిస్తారు. అదుపులోకి తీసుకోవడానికి వెళితే ఊరంతా మూకుమ్మడిగా దాడి చేస్తుంది. దీంతో ప్రాణభయంతో అందరూ పరుగులు తీస్తారు. సేమ్ టూ సేమ్ ఇదే సన్నివేశం ఇప్పుడు కొల్లేరులో కనిపిస్తోంది. చేంజ్ ఏంటంటే పోలీసు స్థానంలో ఫారెస్టు సిబ్బంది ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కొల్లేరు ఓటు బ్యాంకు కోసం పచ్చనేతలు చట్టాలకు తూట్లు పడేలా అక్రమార్కులకు అభయమిస్తున్నారు. అభయారణ్యంలో అక్రమంగా చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. కైకలూరు : కొల్లేరులో బరితెగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. యథేచ్ఛగా మంచినీటి చెరువుల పేరుతో అభయారణ్యాన్ని తవ్వేస్తున్నారు. టీడీపీ నాయకులు తెరవెనక ఉండి, మహిళలను ముందించి అటవీ చట్టాలకు పాతరేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలు తుంగలో తొక్కుతున్నా ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొల్లేరు ఆక్రమణల పర్వం కళ్లెదుట, కాగితాల్లో సర్వే నంబర్లతో సహా తేటతెల్లం అవుతున్నా అడ్డుకోవడంలో అటవీ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. రాజకీయ చట్రంలో ఇరుసులా ఇరుక్కుని బిక్కుబిక్కుమంటూ వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలు పునరావృతం ఎన్నికలు దగ్గరపడేకొద్ది కొల్లేరులో ఆక్రమణలపర్వం ఊపందుకుంది. 2016 జూలై నెలలో మండవల్లి మండలం పులపర్రు, చింతపాడు, దెయ్యంపాడు, కైకలూరు మండలం కొల్లేటికోట, కొట్టాడ గ్రామాల్లో పట్టపగలు చెరువులను తవ్వేశారు. అప్పట్లో పులపర్రులో అడ్డుకున్న ఫారెస్టు అధికారులను తరిమేశారు. జీపును సైతం పక్కకు తోసేశారు. ఇవే ఘటనలు పులపర్రులో తిరిగి పునరావృతమయ్యాయి. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నాలుగు పొక్లెయిన్లతో తాగునీటి చెరువు పేరుతో భారీ గట్లు వేశారు. యథావిధిగా మహిళలను ముందుంచి అటవీ అధికారులను అడ్డుకున్నారు. తవ్వకాల తెర వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం. పాత్రికేయులపై దాడులు పులపర్రు గ్రామంలో జరుగుతున్న ఆక్రమణను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయులపై అక్రమార్కులు మహిళలతో దాడులు చేయిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తుంటే, తిరిగి మహిళలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్న అభయారణ్యంలో పొక్లెయిన్లతో తవ్వుతుంటే సీజ్ చేయలేని అటవీ సిబ్బంది, అంతా అయిపోయిన తర్వాత తూతూమంత్రగా కేసులు నమోదు చేసి సరిపెడుతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఫారెస్టు సిబ్బంది కోమటిలంక రోడ్డు నిర్మాణం అంశంలో కైకలూరు టౌన్ స్టేషన్లో కేసు నమోదు చేసినా అది బుట్టదాఖలయ్యింది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’.. కొల్లేరు గ్రామాల్లో ఆక్రమణలు జరిగే అవకాశముందని ఫిబ్రవరి 22న ‘దీపం ఉండగానే’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అటవీ సిబ్బంది ఈ కథనంపై కసరత్తు చేశారు. కలెక్టరు ఆరా తీశారు. అయినా ఆక్రమణల పర్వాన్ని అడ్డుకోవడంలో అటవీశాఖ హైడ్రామా నడిపించింది. ఇవే ఘటనలు పలు గ్రామాల్లో నెలకొని శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కేసులతో సరి పట్టపగలు పులపర్రు గ్రామంలో రెండోసారి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనపై యథావిధిగా అటవీ అధికారులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రతి ఏటా ఆక్రమణలు జరగడం, కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారుతోంది. పులపర్రు గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ‘అంతా నేను చూసుకుంటాను మీరు కానిచ్చేయండి’ అంటూ ఆక్రమణదారులకు భరోసా ఇవ్వడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు భావిస్తున్నారు. చర్యలు తీసుకుంటాం మండవల్లి మండలం పులపర్రులో అభయారణ్యంలో చెరువు గట్లు ఏర్పాటు చేసిన ఘటన వాస్తవం. దీనిపై పూర్తి విచారణ చేయాలని సిబ్బంది ఆదేశించాను. అటవీ శాఖ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గ్రామస్తులకు అభయారణ్య చట్టాలను వివరించి ఏర్పాటు చేసిన అక్రమ గట్లను తొలగిస్తాం. – సాయిబాబా, అటవీశాఖ, డీఎఫ్వో కొల్లేరు కాంటూరు కుదింపు జరగాలి కొల్లేరు అభయారణ్యాన్ని కుదింపు చేయాలని కొల్లేరు పరివాహక ప్రజలు కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొల్లేరు సమస్యలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజలకు న్యాయం జరుగుతుంది. – దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, కైకలూరు అక్రమ తవ్వకాల్లో టీడీపీ నాయకుల హస్తం కొల్లేటిలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉంది. కాంటూరు 5లో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో కొత్త చెరువుల తవ్వకాలకు ఊతం ఇస్తున్నారు. ఈ కారణంగా ఏదో ఒక నెపంతో కొల్లేటిలో చెరువుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. – మన్నేపల్లి ఆదాం, పీసీసీ సభ్యులు, మండవల్లి తాగునీటి చెరువులకు అవకాశం ఇవ్వాలి ప్రభుత్వాధికారులు కొల్లేరు గ్రామాల్లో తాగునీటి చెరువుల తవ్వకాలకు అవకాశం కల్పించాలి. ఆపరేషన్ కొల్లేరు కారణంగా కొల్లేరు ప్రజలకు నష్టం వాటిల్లింది. గ్రామాల్లో తాగునీటి చెరువుల విస్తీర్ణం, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా లేదు. కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. – ఘంటసాల వెంకటేశ్వరరావు, ఏపీ మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక -
ప్రాణాలతో చెలగాటం
కొవ్వూరు: మనిషి ప్రాణాలు నిలబెట్టే ఔషధ విక్రయ కేంద్రాల నిర్వహణలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్నారు. అద్దె సర్టిఫికెట్స్పై అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. కొన్ని దుకాణాల్లో అడ్డుఅదుపు లేకుండా కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. స్టాకు రిజిస్టర్లు లేకుండానే లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఔషధ తనిఖీ అధికారులకు పట్టడం లేదు. అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 వరకు మెడికల్ షాపులున్నాయి. 450 హోల్సేల్ దుకాణాలున్నాయి. 14 బ్లడ్బ్యాంక్లు, మూడు బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు, మూడు మందుల తయారీ కంపెనీలు న్నాయి. ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా ఏ మందులో ఏఏ పదార్థాల మిశ్రమం ఏమిటి అనే దానిలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ రోగానికి ఏ మందులు వాడతారు. ఏవిధంగా వినియోగించాలన్నదీ తెలియాలంటే ప్రతి మెడికల్ షాపుల్లోను ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఔషధానికి బదులు మరో ఔషధం ఇస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఫార్మసిస్టులు లేకుండానే నిత్యం వందల కోట్ల మెడిసిన్స్ వ్యాపారం సాగుతోంది. నెలవారీగా మూమూళ్లు దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి నెలకి రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కో షాపు ద్వారా రూ.6 వేలు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులను ఔషధ తనిఖీ అధికారులు మధ్యవర్తులుగా ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 2,500 దుకణాలున్నాయి. వీటి ద్వారా ఈ విధంగా లెక్కలు వేస్తే సుమారు నెలకి రూ.12.50 లక్షల వరకు మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారని చెబుతున్నారు. మొక్కుబడిగా తనిఖీలు ప్రస్తుతం జిల్లాలో మెడికల్ దుకాణాల తనిఖీ అంతా మొక్కుబడి తంతుగానే సాగుతుంది. జిల్లాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు తణుకు, కొవ్వూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. వీరిలో ప్రస్తుతం భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక్కో ఇన్స్పెక్టర్ నెలకి నలభై దుకాణాలు తనిఖీలు, ఐదు శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. రెండు శాంపిల్స్ ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలు, కమ్యూనిటీ ఆసుపత్రుల నుంచి మూడు ట్రేడర్స్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత సంబంధిత కంపెనీలు, వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. చాలా చోట్ల మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్టులే ఉండటం లేదు. వాస్తవంగా వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి అనుగుణంగా మందులు విక్రయాలు చేయాలి. కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వాలి. కొన్ని దుకాణాల్లో నకిలీ మందులు, నాసిరకం మందులు విక్రయాలు సాగిస్తున్నప్పటికీ మొక్కుబడి తంతుగానే తనిఖీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం మందులను, ఫిజీషియన్ శాంపిల్స్ను చిల్లర విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మందుల షీట్పై ముద్రించిన తేదీని వాళ్ల వద్ద ఉంచుకుని రెండో వైపు కత్తిరించి ఇవ్వడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. -
మందుల్లేవ్..?
సాక్షి, ఆదిలాబాద్: సర్కారు దవాఖానాలకు ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మందుల కోటా ప్రతీ ఏడాది మిగిలిపోయి ల్యాప్స్ అవుతున్నాయి. మరో పక్క ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు అత్యవసరంలో 20 శాతం మందులు బయట నుంచి కొనుగోలు చేసే అవకాశాన్ని మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. అయినప్పటికీ ధర్మాస్పత్రుల్లో సాధారణ మందులు కూడా లభించకపోవడం చోద్యంగా కనిపిస్తోంది. కోటాలో మందులు మిగిలిపోతాయి.. అత్యవసరం పేరిట ఆస్పత్రి వర్గాలు మందులు కొనుగోలు చేస్తాయి.. అయినా పేద రోగులకు మాత్రం ఆస్పత్రిలో సాధారణ మందులు కూడా లభించవు. దీంతో బయట మెడికల్లో పేద రోగులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బులు లేకనే చికిత్స, మందులు ఉచితంగా లభిస్తాయని రిమ్స్కు వస్తే ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి నిత్యం కనిపిస్తోంది. పేద రోగులకు చికిత్స, మందులు పూర్థి స్థాయిలో ఉచితంగా అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో డ్రగ్స్ రూ.14.66 కోట్లకు గాను రూ.10.95 కోట్లు వినియోగించారు. రూ.3.70 కోట్ల విలువైన డ్రగ్స్ ల్యాప్స్ అయ్యాయి. రూ.4.04 కోట్లు సర్జికల్ ఐటమ్స్గాను రూ.3.31 కోట్లు వినియోగించగా, రూ. 72.92 లక్షల విలువైన సర్జికల్ ఐటమ్స్ మిగిలిపోయాయి. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఏప్రిల్లో మందుల కోటాను విడుదల చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి, భైంసా, మంచిర్యాల, నిర్మల్ ఏరియా ఆస్పత్రులు (ఏహెచ్), ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, సిర్నూర్, ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్సీ), నిర్మల్లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్), ఉమ్మడి జిల్లాలోని 72 పీహెచ్సీలు, పట్టణ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రతి ఏడాది మందుల కోటా టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచే మంజూరు అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు మందుల సరఫరా జరుగుతుంది. గత ఏడాది పరిస్థితే మళ్లీ జిల్లాలో కనిపిస్తోంది. ఈ ఏడాది కూడా కేటాయించిన మందుల కోటా మిగిలిపోతుండగా ఆస్పత్రుల్లో మాత్రం పేదలకు మందులు లభించని పరిస్థితి. ఈ తారతమ్యాన్ని పరిష్కరించడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే మందుల కోటాను పెంచాల్సి ఉంది. ఈ–ఔషధి, ఈ–ఆస్పత్రి పేరిట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటునప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య చికిత్సలతోపాటు మందులు లభించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. మందుల కొనుగోలులో అక్రమాలు ప్రతి ఏడాది మూడు నెలలకు ఓసారి నాలుగు కోటాల్లో మందులను ఆస్పత్రులకు విడుదల చేస్తారు. ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరిల్లో ఈ మందులను విడుదల చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి కావాల్సిన మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో లేని పక్షంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీలు కోటాపై 20 శాతం మందులు బయట నుంచి కొనే అవకాశం ఉంది. బయట నుంచి కొనే మందుల విషయంలో ఆస్పత్రిల్లో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఒక ఆస్పత్రికి డిమాండ్ ఉన్న మందులు, మరో ఆస్పత్రిలో అవే మందులు వృథాగా ఉంటే ఆ ఆస్పత్రి నుంచి ఈ ఆస్పత్రికి మందులను తరలించే చెయిన్ సిస్టమ్ ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గిరిజనులు అత్యధికంగా ఉండే ఆసిఫాబాద్, ఖానాపూర్, ఉట్నూర్ వంటి ఆస్పత్రుల్లోనూ మందుల కోటా పెద్ద ఎత్తున మిగిలిపోతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎంత అవసరమో అంతే కొంటాం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో లేని మందులను బయట నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎంత అవసరమో అంత మేరకే కొంటాం. రిమ్స్ కొనుగోలు కమిటీ అనుమతి మేరకు మందులను కొనుగోలు చేస్తాం. కోటాపై 20 శాతం కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది. మందుల వినియోగం పై ప్రతి ఏడాది ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. – డాక్టర్ అశోక్, రిమ్స్ డైరెక్టర్ -
అంతా రహస్యం..!
మంగంపేట(ఓబులవారిపల్లె) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏపీఎండీసీ మంగంపేట గనుల్లో గురువారం రెండున్నర అడుగుల వెడల్పుతో.. పది మీటర్ల మేర సొరంగ మార్గం బయల్పడిన విషయం తెలిసిందే. అయితే మైనింగ్ కార్యకలాపాలకు అడ్డు వస్తుందనే ఉద్దేశంతో.. ఏపీఎండీసీ అధికారులు అప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా రహస్య మార్గాన్ని మూసివేశారు. మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకుండా, అక్కడ ఏమీ లేదని ప్రకృతి సహజంగా ఏర్పడిందని ఏపీఎండీసీ అధికారులు దాట వేయడం వెనుక.. ఆంతర్యమేమిటనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయాన్నీ అధికారులు వెల్లడించకపోవడంతో ప్రజలకు అంతా రహస్యంగా మారింది. బ్లాస్టింగ్లను సైతం తట్టుకుని నిలిచిన రహస్య మార్గం(ఫైల్ ఫోటో) గనుల్లో బ్లాస్టింగ్ సైతం తట్టుకుని.. మంగంపేట గనుల్లో 1970లో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 47 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి. అప్పట్లో మైనింగ్ మెన్వెల్ బ్లాస్టింగ్తో తవ్వకాలు జరిపి.. బెరైటీస్ ఖనిజాన్ని వెలికితీసేవారు. ప్రస్తుతం బ్లాస్టింగ్కు 10 నుంచి 20 టన్నుల పేలుడు పదార్ధాలు వినియోగిస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పేలుళ్లకు తట్టుకుని రహస్య మార్గం చెక్కు చెదరకుండా ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీంతో అప్పట్లో నిర్మించిన రహస్య మార్గాలు ఎంత పటిష్టమైనవో అర్థమవుతుంది. ఈ మార్గంలో ఇప్పటికీ మనిషి వెళ్లేందుకు వీలుగా గోడలు, పైకప్పు చెక్కు చెదరకుండా ఉన్నాయి. మట్లిరాజుల పాలనలో... మండలంలోని ఎర్రగుంటకోట (వైకోట)ను గతంలో మట్లిరాజులు పాలించే వారు. మట్లిరాజు అయిన వెంకటరామరాజు వంశీయులు తమ సంపదను దాచి పెట్టేందుకు, శత్రువుల బారి నుంచి కుటుంబ సభ్యులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు వీలుగా అక్కడక్కడా రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల్లో బయటపడ్డ సొరంగ మార్గం కూడా వారు నిర్మించినదేనని ప్రజలు భావిస్తున్నారు. ఉపరితల భూభాగం నుంచి 30 నుంచి 40 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. వైకోట నుంచి మంగంపేట మీదుగా బుడుగుంటపల్లె వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే.. గుప్త నిధుల సమాచారం లేక మట్లిరాజుల కాలం నాటి చరిత్రకు సంబంధించిన విషయం ఏమైనా లభిస్తుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ శాఖ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా వారు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. -
తవ్వేకొద్దీ అక్రమాస్తులు
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ అవినీతి జలగల అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీఆర్వోలు కాండ్రేగుల సంజీవ్కుమార్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జీవీఎంసీ అధికారి మునికోటి నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి అక్రమార్జనపై అధికారులు మరింత లోతుగా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సంజీవ్కుమార్ బినామీలు బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖార్జునరావు, సామ ఉదయనాగరాజును ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, అప్పారావు ఆదివారం ఉదయం నుంచి విచారించారు. విచారణలో కీలకమైన ఒక ల్యాప్టాప్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటికే వీరి అక్రమార్జన రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. తాజాగా గుర్తించిన అక్రమాస్తులివీ - సంజీవ్కుమార్ బినామీగా వ్యవహరించిన బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖర్జురావు(ఒకప్పుడు బిల్డర్) పేరు మీద ఆదిత్యవర్థన్ డెవలప్మెంట్ అనే సంస్థ పేరిట కొత్తవలస సమీప గంగువాడ గ్రామంలో 200 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. - సుమారు రూ.ఆరు కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు లాప్ట్యాప్లో గుర్తించారు. దీంతో లాప్ట్యాప్ను సీజ్ చేశారు. - చెతన్యనగర్లో ఉన్న శ్రీసాయి ఆదిత్య నిలయం –1లోని 303 ప్లాట్ పి.విజయ పేరు మీద ఉంది. అయితే ఈ ప్లాట్లో సోమవారం సోదాలు చేయనున్నారు. సంజీవ్కుమార్ అక్రమార్జనకు తతంగం అంతా ఇక్కడి నుంచే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. - రెల్వే న్యూ కాలనీలో సుజన కనస్ట్రక్షన్ పేరు మీద బినామీలతో సంజీవ్కుమార్ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నాడు. - అదేవిధంగా సంజీవ్కుమార్ వినియోగిస్తున్న కారులో నుంచి పలు విలువైన డాక్యుమెంట్లతోపాటు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. - ఎన్టీపీసీ వద్ద సంజీవ్కుమార్ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. - సంజీవ్కుమార్ వద్ద ఉన్న ఫిస్టల్ బటన్ నొక్కితే రెగ్యులర్గా మంటలు వస్తున్నాయి. ఈ ఫిస్టల్తోపాటు బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. - మునికోటి నాగేశ్వరరావు భార్య పేరుమీద ఆమె తల్లిదండ్రులు కానుకగా 339 గజాల స్థలం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.10 కోట్లు ఉంటుందని నిర్థారించారు. - అదేవిధంగా అతని బావమరిది యాసిడ్ శ్రీను వద్ద సుమారు రూ.85 లక్షలు విలువచేసే ఆస్తులు గుర్తించారు. లాకర్లలో భారీగా అక్రమాస్తులు! సంజీవ్కుమార్కు సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఎస్బీహెచ్, ఐఓబీ, ఆంధ్రాబ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్లలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిని సోమవారం తెరవనున్నారు. ఇవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు ఆభరణాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీఆర్వో పోలిశెట్టి వెంకటేశ్వరావుకు సంబంధించి ఎన్ఏడీలోని యాక్సెస్ బ్యాంక్లో ఉన్న లాకర్లు తెరిచారు. అందులో 790 గ్రాముల బంగారం, కిలో వెండి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మార్చి 16 వరకు రిమాండ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో అరెస్ట్ అయిన వీఆర్వోలు సంజీవ్కుమార్, వెంకటేశ్వరావు, జీవీఎంసీ విద్యుత్ విభాగం మజ్దూర్ ఉద్యోగి నాగేశ్వరరావులను శనివారం శనివారం మూడో పట్టణ పోలీస్స్టేషన్లో ఉంచి ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16వరకు వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే సంజీవ్కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఆయనకు బీపీ పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంకోజీపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రిమాండ్కు తరలిస్తారు. సంజీవ్కుమార్ బినామీ సుబ్రహ్మణ్య మల్లికార్జునరావును విచారిస్తున్న సీఐ అప్పారావు -
అందరూ చూస్తుండగానే ఆత్మహత్య
హైదరాబాద్: అందరూ చూస్తుండగా ఓ గుర్తు తెలియని మహిళ క్వారీ గుంతలో పడి ఆత్మహత్య చేసుకుంది. వారిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ శివారులోని గాజుల రామారం దేవేందర్నగర్ ప్రాంతంలో కొన్ని క్వారీ గుంతలున్నాయి. ఏళ్ల తరబడి వీటిని వినియోగించకపోవడంతో నిండా నీళ్లు చేరాయి. ఈ గుంతల వద్ద దేవేందర్నగర్ వైపు కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో గురువారం ఉదయం రెవెన్యూ అధికారులు కూల్చివేతల్ని చేపట్టారు. అంతలో గుంతలకు అవతలి వైపున ఉన్న ఖైసర్నగర్ నుంచి ఓ వివాహిత నడుచుకుంటూ రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో ముందుకు వెళ్లవద్దంటూ వారిస్తూ, అరుస్తూ ఆమె వైపునకు కొందరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు తమ సెల్ఫోన్లలో వీడియో తీయడం మొదలెట్టారు. ఏమీ పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్లిన ఆమె క్వారీ గుంతలోకి దిగుతూ ఆరడుగులు వేసింది. హఠాత్తుగా పట్టుతప్పి కాలు జారడంతో నీళ్లల్లోకి పడిపోయింది. తలకు రాళ్లు తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆమె నీళ్లలో పడిన కొద్దిసేపటికే చనిపోయింది. మృతదేహాన్ని స్థానికులు వెలికితీయగా జగద్గిరిగుట్ట పోలీసులు వచ్చి దానిని మార్చురీకి తరలించారు. మృతురాలి గురించిన వివరాలు తెలియకపోవడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఠాణాలకు సమాచారమిచ్చారు. గత రెండు రోజుల్లో నమోదైన మిస్సింగ్ కేసుల్నీ పరిశీలిస్తున్నారు. మృతురాలు ఎవరన్నది తెలిస్తే తప్ప ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు. మరణాలకు కేరాఫ్ అడ్రస్ దేవేందర్నగర్ శివార్లలో మొత్తం 14 క్వారీ గుంతలున్నాయి. ఇవి ప్రమాదాలకు, ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయాయి. రెండేళ్లలో ఈ ప్రాంతంలో 14 మంది చనిపోయారు. క్వారీ గుంతల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని కలెక్టర్ కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసినా అతీగతీలేదు. ఇకనైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మరణాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘అక్రమ ఉద్యోగుల’ క్రమబద్ధీకరణ!
అంగట్లో కూరగాయల్లాగా ఉద్యోగాలను అమ్మేశారు.. పోస్టులు లేకున్నా ఎడాపెడా నియామకాలు చేపట్టారు. నియామకాలపై నిషేధం ఉన్నా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1,731 మందిని దర్జాగా నియమించేశారు. ఈ విషయం ఇటీవల వెలుగు చూసేసరికి ‘అరే.. ఇదేం విడ్డూరం’అంటూ ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ కొద్ది రోజులకే పరిస్థితి మారిపోయింది. ఆ నియామకాలన్నింటినీ సక్రమం చేసేందుకు ఫైలు కదిలింది.. పైగా నజరానాగా ఆ అక్రమ ఉద్యోగులందరికీ వేతన సవరణ చేసేందుకు రంగం సిద్ధమైంది. దళారులు తలుచుకుంటే జరగనిదేముంది... అదీ అక్రమాలకు నిలయంగా మారిన దేవాదాయశాఖలో మరింత సులభమని మరోసారి రుజువైంది. సాక్షి, హైదరాబాద్: ఎన్నో అవినీతి ఆరోపణలతో పరువుపోగొట్టుకున్న దేవాదాయశాఖలో తాజాగా జరుగుతున్న తంతు విస్మయం కలిగిస్తోంది. నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నందున కొత్త నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించిన కాలంలో దొడ్డిదారిన చేరిన అక్రమ ఉద్యోగులను క్రమబద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వం ఇటీవల వేతన సవరణ చేసింది. వేతన సవరణ కసరత్తు సమయంలో దేవాదాయశాఖలో నియామకాలపై నిషేధం ఉన్న సమయంలో 1,731 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న విషయం బయటపడింది. దీంతో కంగుతున్న ఉన్నతాధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో అక్రమంగా నియమితులైన వారికి వేతన సవరణ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన సర్కారు వారికి వేతన సవరణను వర్తింపచేయొద్దని ఆదేశించింది. డిసెంబర్ నుంచి కొత్త వేతనాలు రావాల్సి ఉన్నందున వారిని పక్కనపెట్టి మిగతా వారికి వేతనాలు పెంచి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసింది. దీంతో ఆ అక్రమ ఉద్యోగులపై చర్యలు తప్పవనుకున్నారు. 2004లో దేవరయాంజాల్శ్రీరామచంద్రస్వామి భూముల అక్రమ ధారాదత్తం వెలుగు చూసినప్పుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దేవాదాయశాఖలో పెద్ద సంఖ్యలో అక్రమంగా ఉద్యోగుల నియామకం జరిగినట్లు తేలింది. దీనికి ఓ కమిషనర్, కొందరు అధికారులు బాధ్యులని గుర్తించిన ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. అక్రమంగా నియమితులైనట్లు తేలిన కొందరు ఉద్యోగులను కూడా తొలగించింది. దళారుల మాయ... దేవాదాయశాఖలో తాజాగా బయటపడిన అక్రమ ఉద్యోగులను ఇప్పుడు కూడా ప్రభుత్వం తొలగిస్తుందన్న ప్రచారం జరిగింది. అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నందున జీతాల రూపంలో దేవాదాయశాఖపై ఆర్థికభారం కూడా పడుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో కొందరు దళారులు రంగప్రవేశం చేశారు. అక్రమ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు భారీగా డబ్బు వసూలు చేశారు. ఆ తర్వాత తెరవెనక ఇంకేం మతలబులు చోటుచేసుకున్నాయోగానీ అక్రమ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేసేందుకు అడ్డుగా ఉన్న అంశాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఆ ఉద్యోగులకు కూడా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్ చేసిన దేవాదాయశాఖ అర్చక ఉద్యోగ సంఘాలకు ఆ మేరకు సమాచారం కూడా అందింది. ఈ నెలాఖరు వరకు ఆ తంతు పూర్తవుతుందని భావిస్తున్నారు. మార్చి నుంచి వారికి కూడా వేతన సవరణ అమలవుతుందని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే అక్రమార్కులకు భరోసా లభించి భవిష్యత్తులో వారు మరిన్ని అక్రమాలకు తెగబడేలా ప్రోత్సహించినట్లు అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
అక్రమ గ్యాస్ ఏజెన్సీ గుట్టు రట్టు
విశాఖపట్నం: జిల్లాలోని ఆరిలోవ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న గ్యాస్ ఏజెన్సీ గుట్టును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు రట్టు చేశారు. ఈ ఏజెన్సీపై అధికారులు దాడులు జరిపి 330 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.26 లక్షల 69 వేల ఉంటుంది. -
పాక్ వింత నిర్ణయం కోళ్లు, ఆవుల మీద పన్ను
-
కోళ్లు, ఆవులపై పాక్ వింత నిర్ణయం
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రభుత్వం తుగ్లక్ పాలనను తలపించేలా ప్రజలపై పన్నులు విధిస్తోంది. పెంచుకునే కోళ్లు, ఆవులు, ఇతర పెంపుడు జంతువుల మీద పన్నులు చెల్లించాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ ప్రభుత్వ ఆదేశాలపై గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇటువంటి పన్నులను చెల్లించేది లేదని తెగేసి చెప్పారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. చిరువర్తకుల వ్యాపారాలపై పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా విధించిన పన్నును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం నాడు వేల సంఖ్యలో ప్రజలు దుకాణాలు మూసివేసి రోడ్లమీదకు వచ్చి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమపై అక్రమ పన్నులు విధిస్తోందని.. ప్రజలు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా బిల్గిత్, బల్టిస్తాన్లలో వ్యాపారులు పూర్తిగా దుకాణాలు మూసివేశారు. పన్నులను ఉపసంహించేంతవరకూ అంతేకాక ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేదిలేదని వ్యాపారులు తేల్చి చెప్పారు. ఇళ్లలో పెంచుకునే కోళ్లమీద, పాడి ఆవులు, బర్రెల మీద మేం పన్నులు చెల్లించాలా? ఇంట్లో 5 మందికన్నా అధికంగా ఉంటే పన్నులు కట్టాలా? ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉంటాయా? అని స్కుర్దు ప్రజలు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే.. రేప్పొద్దున గడ్డం పెంచకపోతే పన్ను.. పెంచితే పన్ను వేస్తారేమోనని వ్యగ్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ పన్నులను ఎట్టి పరిస్థితుల్లో చెల్లించేది లేదని.. అవసరమైతే.. ఇస్లామాబాద్ను ముట్టడిస్తామని గిల్గిత్, బల్టిస్తాన్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. -
మిగులు.. కొక్కులు!
ఎంఎల్ఎస్ పాయింట్లలో చేతివాటం - డిలర్కిచ్చే బియ్యంలో చిలక్కొట్టుడు - క్వింటాకి రెండు కేజీల మేర దోపిడీ - నెలసరి 5వేల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు.. - ఎందుకొచ్చిన తలనొప్పని డీలర్ల మౌనం - బొక్కుడు తిలాపాపం తలా పిడికెడు 2962 - జిల్లాలోని చౌక ధరల దుకాణాలు 24 - ఎంఎల్ఎస్ పాయింట్లు 11.92 లక్షలు - కార్డులు 1.81 లక్షల క్వింటాళ్లు - ప్రతి నెలా సరఫరా చేస్తున్న బియ్యం 50 టన్నులు - నల్లబజారుకు తరలుతున్న బియ్యం మడకశిర ఎంఎల్ఎస్ పాయింట్ లెక్కల్లో 1200 బస్తాలు తేడా వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి గోడౌన్ ఇన్చార్జిగా ఉన్న ఆర్ఐ రమేశ్ని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హిందూపురంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ జయశేఖర్ని ఆర్ఐగా నియమించారు. బదిలీపై వచ్చిన ఆర్ఐకి అప్పటి వరకు అక్కడున్న ఆర్ఐ క్లోసింగ్ రికార్డుతో పాటు స్టాక్ రికార్డును చూపి స్వాధీనం చేయాల్సి ఉంది. ఆ సందర్భంగా 1200 బస్తాలు తేడా ఉన్నట్లు జయశేఖర్ గుర్తించారు. స్వాధీనం చేసుకుంటే సమస్య తన మెడకు చుట్టుకుంటుందనే భయంతో ఆయన సెలవులో వెళ్లిపోయారు. ‘‘ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతి జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అంగీకరించారు.’’ జూన్ 9న ఎరువాకను ప్రారంభించేందుకు రాయదుర్గం నియోజకవర్గం ఉడేగోళం గ్రామానికి వచ్చిన ఆయన, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. రేషన్ దుకాణాల్లో 1.5 శాతం అవినీతి జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే ఎక్కడా ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంతో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. పుట్టపర్తి మండల పరిధిలో 39 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 2,444.06 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 510 కార్డులు ఉండగా.. 69.90 క్వింటాళ్ల కోటాలో 67 క్వింటాళ్లు మాత్రమే తరలించారు. మడకశిర మండల పరిధిలో 60 చౌక దుకాణాలు ఉండగా.. కార్డుల సంఖ్య 24,952. కేటాయించిన బియ్యం 3,855.67 క్వింటాళ్లు. ఈ మండలంలోని ఒక చౌక దుకాణం పరిధిలో 503 కార్డులు ఉండగా.. 82.50 క్వింటాళ్ల కోటాలో 80 క్వింటాళ్లతో సరిపెట్టారు. అనంతపురం అర్బన్: పేదల బియ్యానికి రెక్కలొచ్చాయి. మండల లెవల్ స్టాక్ పాయింట్లు(ఎంఎల్ఎస్) కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. డీలర్లు ఇచ్చే ఇండెంట్ ఆధారంగా స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కొన్నిచోట్ల అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెలా దాదాపు 5వేల క్వింటాళ్ల(50 టన్నులు) బియ్యం నల్లబజారుకు తరలుతోంది. ఒక్కో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సగటున 7,500 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. డీలర్లకు ఇచ్చే బియ్యంలో క్వింటాకు రెండు కేజీల వరకు నొక్కేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా కనీసంగా 200 క్వింటాళ్ల బియ్యం మిగుల్చుకుంటున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కితే డీలర్షిప్కు ఎసరు వస్తుందనే భయంతో డీలర్లు కూడా ఈ భారాన్ని మౌనంగానే భరిస్తున్నారు. 70 క్వింటాళ్లు ఇవాల్సి ఉన్న డీలర్కు 67 క్వింటాళ్లతో సరిపెడుతున్నారు. అధికారులతో గొడవ పడి లేని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుంటున్నట్లు పుట్టపర్తికి చెందిన ఒక డీలర్ తెలిపారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసే సమయంలో ఈ నష్టాన్ని సర్దుబాటు చేసుకుంటున్నట్లు వాపోయాడు. బియ్యం ఎందుకు తక్కువిస్తున్నారంటే.. బియ్యం తక్కువగా ఇవ్వడంపై కొందరు అధికారులు ఒక వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం టెయిర్ వెయిట్(సంచి తూకం) ఇవ్వడం లేదని చెబుతున్నారు. క్వింటాకు రెండు బస్తాలు వస్తాయని, వీటి బరువు ఒక కేజీ 100 గ్రాములు ఉంటుందన్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బియ్యమే కింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక లోడింగ్ అన్లోడింగ్లో కనీసం ఒక కేజీ మేర తరుగు ఉంటుందని.. అంటే క్వింటా మీద రెండు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర వస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. దీనిని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇస్తుండవచ్చని చెప్పుకొస్తున్నారు. తరుగుని అంచనా వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించిందని, ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నిర్దేశించిన ఎంఎల్ఎస్ పాయింట్లలో తూకాలను, తరుగుని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. స్టాక్ తూకం వేయిస్తున్నాం జయశేఖర్ శుక్రవారం విధుల్లో చేరారు. ఎంఎల్ఎస్ పాయింట్లో ఉన్న స్టాక్ తూకం వేయించే ప్రక్రియ శనివారం చేపడతాం. అక్కడికి ప్రత్యేకంగా టెక్నికల్ అధికారి భానుని పంపిస్తున్నాం. మొత్తం స్టాక్ తూకం వేయడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొరత ఎంతనే విషయం తెలుస్తుంది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా కొన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం తక్కువగా ఇస్తుండొచ్చు. వీటిని నిరోధించేందుకే ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, ఈ పాస్, లారీ వే బ్రిడ్జిని అమల్లోకి తీసుకొస్తున్నాం. – డి.శివశంకర్రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
అక్రమ రవాణాకు చెక్
నూతన జీఎస్టీ విధానంతో జరిగిన మేలు పప్పులు, నూనెలపై ఏకీకృత పన్ను విధింపు ఇంత వరకూ ఐదు శాతం పన్ను ఎగవేతకు వ్యాపారుల ఆపసోపాలు యానాం నుంచి నిలిచిన అక్రమ సరుకు దిగుమతులు చెక్పోస్టు ఎత్తివేత అమలాపురం టౌన్ : దేశ వ్యాప్త జీఎస్టీ విధానంతో రాష్ట్రాల మధ్య పన్నుల వత్యాసాలు చెరిగిపోయాయి. ఒక రాష్ట్రంలో పన్నులు లేని కొన్ని వస్తువులను ఇతర రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి చేసుకునే అక్రమ రవాణాలు ఆగిపోయాయి. దీంతో మన జిల్లాలో అంతర్భాగమై ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని ఫ్రెంచి యానాం నుంచి నిత్యం జరిగే వివిధ ఆహార దినుసులు, అపరాల తదితర వస్తువుల అక్రమ రవాణాకు సైతం అడ్డుకట్ట పడింది. పుదిచ్ఛేరి రాష్ట్రానికి పన్నుల పరంగా కొన్ని వెసులబాట్లు ఉండేవి. దాంతో అక్కడి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు భారీ ఎత్తున సరుకు అక్రమంగా రవాణా అయ్యి జిల్లాలో పన్నుల ఎగవేత జరిగేది. ఇప్పుడు జీఎస్టీతో ముఖ్యంగా పప్పు ధాన్యాలు, వంట నూనెలు, చక్కెర తదితర ఆహార వస్తువులపై సమాంతర పన్నులు విధించటంతో ఒక విధంగా అక్రమ రవాణా నిలిచిపోయింది 5 శాతం పన్ను ఎగవేత కోసం.. ఫ్రెంచి యానాంలో అన్ని రకాల పప్పు ధాన్యాలు, వంట నూనెలు తదితర ఆహార వస్తువులపై 0 శాతం పన్ను అమలయ్యేది. అదే మన రాష్ట్రంలో వాటిపై 5 శాతం పన్ను ఉండేది. ఈ పన్ను ఎగవేతకు కొందరు వ్యాపారులు అక్కడి నుంచి పప్పులు, నూనెలను జిల్లాలోకి అక్రమంగా రవాణా చేసి కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాలకు తరలించేవారు. దీని వల్ల జిల్లా వాణిజ్య పన్నుల శాఖకు రోజుకు రూ.పది లక్షల చొప్పున, నెలకు రూ.మూడు కోట్ల నష్టం వాటిల్లేది. ఒడిషా నుంచి వంట నూనె పీపాల లారీలు, ఇతర రాష్ట్రాల నుంచి పప్పుల లారీల సరుకు ఫ్రెంచి యానానికి దిగుమతి అవుతున్నట్లు బిల్లులు ఉండేవి. అవి మన జిల్లాలోని బడా హోల్సేల్ వ్యాపారాలకు చేరేవి. ఇదంతా ఓ రాకెట్లా సాగేది. అమలాపురానికి రెండు రోజులకోసారి ఫ్రెంచి యానాం బిల్లుతో వచ్చిన పప్పులు, వంట నూనెల లారీలు అక్రమ రవాణాతో వచ్చి రహస్యంగా దిగుమతి అయ్యేవి. చెక్ పోస్టు ఎత్తివేత : పన్నుల వ్యత్యాసం, సరిహద్దు సమస్యతో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఫ్రెంచి యానాం నుంచి అక్రమ రవాణాలను అరికట్టేందుకు కొన్నేళ్ల కిందట యానాం సమీపంలోనే ఓ చెక్పోస్టు పెట్టింది. యానాం నుంచి 0 శాతం పన్నుల సరుకులను జిల్లాలోకి ప్రవేశించకుండా ఈ దీనిని ఏర్పాటు చేసినప్పటికీ జీఎస్టీ అమలు తరువాత ఎత్తివేశారు. అయితే జీఎస్టీ నుంచి మద్యం, డీజిల్, పెట్రోలులకు మినాహాయింపు ఉండటంతో యానంలో వాటికి ఉన్న తక్కువ ధరల వెసులబాటు అలానే కొనసాగుతోంది. -
అక్రమ తవ్వకాల్లో హైడ్రామా
తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేతలు అనుమతి పత్రాలు లేవన్న తహసీల్దారు, నిర్వాహకులు వాహనాలను నిలిపివేసిన వైఎస్సార్ నేతలు తీవ్ర హైడ్రామా నడుమ పుట్టుకొచ్చిన అనుమతి పత్రాలు అనుమతి ఒక చోట.. తవ్వకాలు మరోచోట ఇదో రకం దోపిడీగా అంటూ మండిపడిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ లీలాకృష్ణ మండపేట / కపిలేశ్వరపురం : సామాన్యులు గోదావరిలో గంపెడు ఇసుకను తీసుకుంటే సవాలక్ష అనుమతులు కోరే అధికారులు రెండు రోజులుగా లక్షలాది రూపాయలు విలువచేసే ఇసుకను తరలించుకుపోతున్నా చేష్టలుడిగి చూశారు. అక్రమ తవ్వకాలపై వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు నిలదీసే సరికి తెల్లమోహం వేశారు. అనుమతి ఉందంటూనే తమ వద్ద ఆ పత్రాలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతో హుటాహుటీన అనుమతి పత్రాలు తెప్పించారు. కాగా అనుమతి ఇచ్చిన చోట కాకుండా నదీ గర్భంలో తవ్వకాలు చేస్తుండటంతో ఇదో రకం దోపిడి అంటూ వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ మండిపడ్డారు. కపిలేశ్వరపురం మండలంలోని ఇసుక ర్యాంపులో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు సాగిపోతున్న విషయం విదితమే. జిరాయితీ మాటున నదీ గర్భం నుంచి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. అక్రమ తవ్వకాల వెనుక అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. రూ. కోట్లాది విలువైన ఇసుక తరలిపోతున్న తీరును నిగ్గు తేల్చేందుకు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి సోమవారం అధికారులను వివరణ కోరేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. కోరుమిల్లి ర్యాంపు బాట నుంచి ఇసుక తరలిపోతుందని అనుమతులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. కలెక్టర్ నుంచి అనుమతి ఉన్నట్టు నిర్వాహకులు చెప్పారని, అయితే కాపీ తన వద్ద లేదని, మైన్స్ అధికారులను కలవాలని తహసీల్దారు అన్నారు. సామాన్యుడు ర్యాంపులో బస్తా ఇసుక తీసుకెళ్తేనే నేరమని అడ్డగించే రెవెన్యూ అధికారులు భారీ స్థాయిలో ఇసుకను తరలిస్తుంటే కనీస పర్యవేక్షణ లేకపోవడం ఆశ్చర్యంగా ఉదని లీలాకృష్ణ అన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ర్యాంపును సందర్శించారు. పదికి పైగా భారీ వాహనాలను తరలిపోతుండగా నిలువరించి బైఠాయించారు. నిర్వాహకులు కూడా అనుమతి పత్రం తమ వద్ద లేదని చెప్పారు. దీంతో సాయంత్రం వరకు ర్యాంపు వద్ద బైఠాయింపు కొనసాగించారు. ఎస్సై బి.రాజేష్కుమార్ కూడా అనుమతి సంగతి రెవెన్యూ వారు చూసుకుంటారని సమాధానం చెప్పారు. ఆగమేఘాలపై అనుమతి పత్రం రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుందన్న చందాన లీలాకృష్ణ ఆందోళన కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో సాయంత్రం వేళ కాకినాడ నుంచి అనుమతి పత్రాన్ని నిర్వాహకులు తీసుకొచ్చి చూపించారు. దాన్ని చదవగా పలు ఆశక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏడో తేదీనే అనుమతి ఇచ్చినట్టు ఉంది. మరి మూడు రోజులుగా స్థానిక, మండల స్థాయి అధికారుల వద్ద కాపీలు లేకపోవడం, అదే విషయాన్ని వారు పలుమార్లు మీడియాకు చెప్పడం గమనార్హం. ఈ ప్రశ్నలకు బదులేది? ‘ సాంకేతిక పరిజ్ఞాణాన్ని ఎంతగానో అభివృద్ధి చేసానని చెప్పుకునే చంద్రబాబు పాలనలో జిల్లా అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని మండలానికి తెచ్చేందుకు మూడు రోజులు పట్టడం, కనీసం రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారుల వద్ద కూడా కాపీ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ‘ ఉచిత ఇసుకను తరలించేందుకు వినియోగించిన బాటనే నిర్వాహకులు వినియోగించడంతోపాటు. అదే ర్యాంపులో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ‘ జిరాయితీ భూమిలో ఇసుక మేటల తవ్వకాలకు అనుమతి ఇవ్వగా ర్యాంపును ఆనుకుని నదీ గర్భంలో యదేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం తవ్వకాలు జరుగుతున్న చోట కనీసం మొక్క, కానీ చెట్టుకానీ లేవు అది జిరాయితీ భూమి ఎలా అవుతుందని అడుగుతుంటే అధికారులు తెల్లమోహం వేస్తున్నారు. ఇదో రకం ఇసుక దోపిడీ : లీలాకృష్ణ ఈ సందర్భంగా లీలాకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రోద్భలంతో ఇసుక అక్రమ తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయనడానికి కోరుమిల్లి ర్యాంపులో జరుగుతున్న వ్యవహారమే ఉదాహరణ అని ధ్వజమెత్తారు. కర్రి పాపారాయుడుతో కలిసి లీలాకృష్ణ మాట్లాడుతూ జిరాయితీ భూమిలో ఇసుకను తవ్వడానికి రెవెన్యూ శాఖాధికారుల అనుమతి తప్పనిసరని మండల రెవెన్యూ అధికారే అనుమతి ఉన్నదీ లేనిదీ చెప్పలేదంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరితెగిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు. రూ. కోట్లాది విలువైన ఇసుకను కాకినాడలోని అధికారపార్టీ నేతలకు చెందిన సంస్థల ప్రాజెక్టులకు ఇసుకను తరలిస్తున్నారని, రోజంతా ఉద్యమం చేస్తేనే అనుమతి కాపీని తీసుకొచ్చారంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మూడు రోజులుగా అనుమతి పత్రం లేకుండా ఇసుకను తరలిస్తున్నా పోలీస్, రెవెన్యూ, మైన్స్ అధికారులు కనీసం పట్టించుకోలేదంటే అధికార పార్టీ నేతలు వ్యవస్థను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు మేడపాటి ప్రసాదరెడ్డి, గంగుమళ్ళ రాంబాబు, పొలమాల సత్తిబాబు, గుత్తుల శ్రీనివాస్, నేల సూర్యకుమార్, సవిలే జయంత్, పెయ్యల యాకోబు, మాతా నాగేశ్వరరావు, సర్రాకుల అబ్బులు, పీతల శ్రావన్కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలు
జిరాయితీ భూమి పేరుతో పనులు కాకినాడకు చెందిన కంపెనీ ప్రాజెక్టుకు తరలింపు అనుమతులున్నాయంటూ వాదన పత్తాలేని అధికార గణం నటుడు బాలకృష్ణ బంధువుల పనిగా అనుమానం కపిలేశ్వరపురం (మండపేట) : కోరుమిల్లి గ్రామంలో ఏదో రూపంలో ఇసుక అక్రమాలు సాగుతూనే ఉన్నాయి...ర్యాంపులు నిర్వహణలో ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల స్వయం నిర్వహణలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమ గుట్టలను అధికారులు స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ర్యాంపులు మూతపడ్డాయి. అయినా గ్రామంలో ఇసుక తరలింపు ఆగలేదు. కాకినాడకు చెందిన ఓ రెసిడెన్సీ సంస్థకు ఈ గ్రామం నుంచి శనివారం భారీ వాహనాల్లో ఇసుకను తరలించారు. ఆ సంస్థ బంధువులకు ఈ గ్రామంలో గోదావరి తీరాన జిరాయితీ భూములున్నాయి. ఆ భూముల్లో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించుకుంటున్నామన్న వంకతో భారీ స్థాయిలో ఇసుకను కాకినాడకు తరలించేస్తున్నారు. అందుకోసం ఉచిత ఇసుక విధానం కోసం వినియోగించిన ర్యాంపు బాటనే నేరుగా వినియోగిస్తున్నారు. వారి చర్యలకు దన్నుకోసం స్థానిక అధికార పార్టీ నేతలను చేరదీశారు. ఇసుక తరలింపు విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ర్యాంపును సందర్శించగా పలు ఆశక్తిగల అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇసుకను తీసుకెళ్తున్న కాకినాడలోని సంస్థ, ఇసుకను తరలిస్తున్న కోరుమిల్లిలోని భూములు సీఎం చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ బంధువులకు చెందినవని తెలియ వచ్చింది. కోరుమిల్లిలోని జిరాయితీ భూముల్లో ఇసుక మేటలు వేశాయని, మేటలను తొలగించుకుని పంటల సాగు చేసుకునే వీలు కల్పిస్తూ అనుమతులు కోరుతూ గతంలో దరఖాస్తు చేశారు. ర్యాంపులు మూత పడడంతో సంస్థకు ఇసుక అత్యవసరం కావడంతో ఆ అవకాశాన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. తవ్వకాలకు అనుమతి ఉన్నదీ లేనిదీ స్పష్టతలేని పరిస్థితి. అనుమతి పత్రాలు చూపాలని మీడియా ప్రతినిధులు కోరగా తమ వద్ద లేవంటూ నిర్వాహకులు సమాధానం దాటవేశారు. తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం ఇసుక ర్యాంపును ఆనుకుని ఉండటం, అక్కడ ఎలాంటి సాగు పంటలు లేకపోవడంతో జిరాయితీ భూములు పేరు చెప్పి ర్యాంపులో తవ్వకాలు జరుపుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా తమకు 16.16 ఎకరాలు జిరాయితీ భూమి ఉందని గోదావరి నదిలో కలిసిపోవడంతో తవ్వకాలు నదిలో చేస్తున్నట్టుగా కనిపిస్తుందంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇంత భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు అధికారులెవరూ అటువైపు రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తహసీల్దార్ కేపీ నరసింహులు, మైన్స్ అధికారులను వివరణ కోరగా కలెక్టరు అనుమతి ఇచ్చిందీ లేనిదీ తమకు తెలీదని సమాధానమిచ్చారు. గతంలో కోరుమిల్లిలో ఇసుక గుట్టలు పెట్టినప్పుడే అధికారులు వెంటనే స్పందించిన అధికారులు ఇప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రాకపోవడంతో తవ్వకాలు వెనుక అధికార పార్టీ రాష్ట్ర నాయకుల హస్తం ఉందన్న వాదన బలంగా ఉంది. -
అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ పాలన
► ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలారు ► ప్లీనరీకి పార్టీ శ్రేణులు తరలి రావాలి ► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి కడప అగ్రికల్చర్: అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఆదివారం కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు పి రవీంద్రనాథరెడ్డి, ఎస్బి అంజద్బాషా పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ తన మేనిఫెస్టోలో 600 హామీలతో కూడిన బుక్లెట్ విడుదల చేసిందన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆ హామీలను నెరవవేర్చలేదని ప్రశ్నిస్తే ప్రతిపక్షనేతలపైన, ప్రజలపైన కేసులు పెట్టారన్నారు. జేసీ దివాకర్రెడ్డి విమానయాన సిబ్బందిపై దాడికి తెగబడితే ఇది తప్పు ఇలా చేయకూడదని సీఎం చెప్పిన పాపాన పోలేదంటే దీని అర్థం ఇలానే చేయండి మనకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామన్నట్లు ఉందని అన్నారు. సీఎం, ఆయన తనయుడు లోకేష్ కనుసన్నల్లోనే భూ కుంభకోణాలు, ఇసుక మాఫీయాలు, అక్రమాలు రాష్ట్రంలో విచ్చల విడిగా చోటు చేసుకుంటున్నా నోరు మెదపలేదన్నారు. నవనిర్మాణ దీక్షలు ఎందుకో..: నవనిర్మాణ దీక్షలను ఎందుకు నిర్వహించారో అర్థం కావడంలేదని సాక్షాత్తు అధికారులే అన్నారని, ఎక్కడ అభివృద్ధి జరిగిందని, సీఎం, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలు ప్రతి పనిలోనూ దోచుకుతింటున్నారని అధికారులే చెబుతున్నారన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. -
అక్రమంగా చేపల వేట
నిషేధాజ్ఞల ఉల్లంఘన అడ్డుకున్న గ్రామస్తులు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల వేలం అల్లవరం (అమలాపుం) : సముద్రంలో చేపల వేట నిషేధాన్ని ఉల్లంఘించిన మూడు మెకనైజ్డు బోట్లను అల్లవరం గ్రామస్తులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన పొట్టు జగదీష్, యానాం, దరియాలతిప్ప ప్రాం తానికి చెందిన లంకే నాగూరుబాబుకు చెందిన మూడు మెకనైజ్డు బోట్లు నిబంధనలు ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగించాయి. వేటాడిన చేపలను ఓడలరేవు తీరం నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా గురువారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని మత్స్యశాఖాధికారులకు సమాచారం అందించారు. ఎఫ్డీఓ డేవిడ్రాజు ఆధ్వర్యంలో అల్లవరం మండలం ఓడలరేవు మెరైన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మత్స్యసపందను లారీలోకి లోడ్ చేస్తున్న సమయంలో దాడి చేశారు. లారీని, మూడు మెకనైజ్డు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్షల విలువైన మత్స్య సంపదను వేలం వేసేందుకు మత్స్యశాఖాధికారులు నిర్ణయించారు. మత్స్యశాఖ ఆధరైజ్డ్ అధికారి సీహెచ్.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఓడలరేవు జెట్టీ ప్రాంతంలో మూడు టన్నుల తూర చేపలకు వేలం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేపల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కిలోకు రూ.25 ప్రభుత్వ ధర నిర్ణయించగా, కాకినాడకు చెందిన సీహెచ్.చిన్ని రూ.36 చొప్పున పాటను దక్కించుకున్నారు. కంటైనర్లో ఉన్న చేపలను గ్రామస్తుల సమక్షంలో తూకం వేసి పాటదారుడుకి అప్పగిస్తామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో బోటుకు రూ.2500 చొప్పున జరిమానా విధించారు. వేలం పాటలో కాకినాడ ఎఫ్డీఓ ఆర్వీఎస్ ప్రసాద్, కె.వెంకటేశ్వరరావు, అల్లవరం ఎఫ్డీఓ డేవిడ్రాజు, సీహెచ్.ఉమామహేశ్వరరావు, సర్పంచి కొల్లు సత్యవతి, కొల్లు త్రిమూర్తులు, కాకినాడ బోటు ఓనర్స్ అధ్యక్షుడు ఓలేటి గిరి, అవనిగడ్డ శేషగిరిరా>వు తదితరులు పాల్గొన్నారు. -
ఆగని ఆర్బీఐ అధికారుల అక్రమాలు
బెంగళూరు: డీమానిటైజేషన్ తరువాత బ్యాంకు అధి్కారుల అక్రమాలకు హద్దులేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన కేంద్ర బ్యాంకు సీనియర్ ఉద్యోగులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దేశంలో జరుగుతున్న అక్రమలావాదేవీలను అరికట్టాల్సిన ఆర్బీఐ అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగదు మార్పిడి చేస్తున్న మరో ఇద్దరు ఆర్ బీఐ సిబ్బందిని సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆర్బీఐలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద నైకా కాగా, మరొకరు స్పెషల్ అసిస్టెంట్ ఆఫ్ క్యాష్ డిపార్ట్మెంట్ ఏకే కేవిన్ అని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.1.99 కోట్ల పాత నోట్ల మార్పిడికి పాల్పడ్డారనే ఆరోపనలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా అక్రమ నోట్ల మార్పిడి కేసులో బెంగళూరు ఇది రెండవ కేసు. డిసెంబర్13 బెంగళూరులో ఆర్బీఐ అధికారి(రూ.1. 51కోట్లు)మైఖేల్ అరెస్టు కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
డ్రైవింగ్ స్కూళ్లే అడ్డాలు
సాక్షి,సిటీబ్యూరో : రవాణాశాఖలోని పౌరసేవలను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఆన్లైన్ లక్ష్యం నీరుగారుతోంది.లర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు తదితర కార్యకలాపాలను వినియోగదారులు ఆన్లైన్లో నమోదు చేసుకొని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పౌరసేవలను పొందేందుకు ఏర్పాటు చేసిన ఈ సదుపాయం యదావిధిగా మధ్యవర్తులు, దళారుల అక్రమార్జనకు ఊతంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి గుర్తింపు,అనుమతి లేకుండా అడ్డగోలుగా వెలిసిన డ్రైవింగ్ స్కూళ్లు దళారులకు అడ్డాలుగా మారాయి. ఆన్లైన్లో స్లాట్లు నమోదు చేయడం మొదలు వినియోగదారులకు డ్రైవింగ్ లెసైన్స చేతికి వచ్చే వరకు ఈ నకిలీ స్కూళ్లే తతంగం నడిస్తున్నాయి. ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూళ్లు,ఆర్టీఏ అధికారులు ఒక వ్యవస్థీకృతమైన సంస్థగా ఏర్పడి ఈ అక్రమదందాకు పాల్పడుతున్నారు. ప్రహసనంగా ఆన్లైన్.... మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించే లక్ష్యంతో రవాణాశాఖ ప్రతిష్టాత్మకంగా ఆన్లైన్ సేవలను అమలులోకి తెచ్చించిది. సుమారు 63 రకాల పౌరసేవల కోసం వినియోగదారులు ఈ సేవ కేంద్రాల్లో, ఆన్లైన్ సెంటర్లో స్లాట్ నమోదు చేసుకొని నిర్ణీత తేదీ, సమయం ప్రకారం ఆర్టీఏను సంప్రదించాలి, అయితే దళారులు వినియోగదారులతో బేరమాడుకొని రంగంలోకి దిగుతున్నారు.ఆన్లైన్లో స్లాట్ నమోదు చేయడం నుంచి పౌరసేవలు పూర్తయ్యే వరకు వినియోగదారుల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇందుకు అక్రమార్జనే ధ్యేయంగా వెలసినడ్రైవింగ్ స్కూళ్లు అడ్డాలుగా మారుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీఏ గుర్తింపు పొందిన స్కూళ్లు 2500 వరకు ఉండగా ఎలాంటి అనుమతి లేని, దళారులు తమ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసుకున్నవి 6 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. డ్రైవింగ్ స్కూళ్లపై ఆర్టీఏ నిఘా, నియంత్రణ లేకపోవడంతో ఇవి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకున్న కొందరు ఎంవీఐలు,ఆర్టీఓలు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను గాలికొదిలి విచ్చలవిడిగా లెసైన్సలు ఇచ్చేస్తున్నారు. కొరవడుతున్న నియంత్రణ .... గ్రేటర్లోని కొండాపూర్, మేడ్చల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్, ఇబ్రహీంపట్నం టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లెసైన్సలను అందజేస్తోంది. వీటితో పాటు ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, మలక్పేట్, కూకట్పల్లి, తదితర కార్యాలయాల్లో లెర్నింగ్ లెసైన్సలు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు స్థానిక ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స తీసుకోవాలి. అనంతరం డ్రైవింగ్లో నాణ్యమైన శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లెసైన్స కోసం డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లకు వెళ్లాలి.కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు.లెర్నింగ్ లెసైన్సల కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేయడం నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్సల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా ఈ నకిలీ డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు అధికారులు లెసైన్సులు ఇచ్చేస్తున్నారు. ఇలా దోపిడీ... ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు వాహనదారుల నుంచి రూ.5000 నుంచి రూ.7000 ల వరకు వసూలు చేస్తున్నాయి. అన్నీ తామే పూర్తి చేస్తామంటూ వాహనదారులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి.నెల రోజుల వ్యవధిలోనే లెసైన్స ఇప్పిస్తామని మోసానికి పాల్పడుతున్నాయి. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్లో అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి. -
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో ఆదోని ఫస్ట్
టౌన్ ప్లానింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతిరెడ్డి ఆదోని టౌన్: అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణలో రీజియన్లో ఆదోని, ప్రొద్దుటూరు ప్రథమ స్థానంలో నిలిచాయని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకటపతి రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన సహచర ఉద్యోగులతో కలిసి ఆదోని మున్సిపాలిటీని సందర్శించారు. అర్ధాంతరంగా ఆగిపోయిన ఆస్పరి బైపాస్ రోడ్డును పరిశీలించారు. పట్టణంలో పలు వార్డుల్లో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఆస్తులు, కట్టడాలను పరిశీలించారు. అనంతరం టౌన్ప్లానింగ్ సెక్షన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 10,346 దరఖాస్తుల్లో 5వేలు పరిష్కారమయ్యాయన్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.496 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. క్రమబద్ధీకరణ చేసుకోని యజమానులు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని త్వరగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఆస్తులపై పన్నులు రెట్టింపు విధించడం లేదా భవంతులు కూల్చివేయడం జరుగుతుందన్నారు. భవంతుల నిర్మాణం, ఇతరత్రా వాటి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి 24గంటల్లోగా అనుమతి లభిస్తుందన్నారు. ఆన్లైన్లో మంజూరు మేరకే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా భవంతులు నిర్మించుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో టీపీఏలు భాస్కర్, జయరామ్, ఆదోని టౌన్ప్లానింగ్ అధికారి మహబూబ్ బాషా ఉన్నారు. -
అక్రమాల ‘బ్రాండ్’!
మూడు నెలలకే మూతపడిన కొత్తమెస్ – లోకల్ బ్రాండు వంట సామగ్రి కొనుగోలు! – స్టీమ్కుక్కర్లు వెడేక్కుతుండడంతో పనిచేయడానికి సిబ్బంది నిరాకరణ – రూ.60 లక్షలు వృథా – మెస్హాల్ సరిపోకనే మూసినట్లు అధికారుల వివరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాయలసీమ యూనివర్సిటీ అధికారులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంట సామగ్రి కొనుగోలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామగ్రి లోకల్ మేడ్ కావడం, అవి వెడేక్కిపోతుండడంతో సిబ్బంది పని చేయలేక చేతులు ఎత్తేసినట్లు సమాచారం. దీంతో రూ.60 లక్షలతో నూతంగా నిర్మించిన మెస్ మూడు నెలలకే మూతపడింది. అయితే అధికారులు మాత్రం విద్యార్థుల సంఖ్యకు మెస్హాల్ సరిపోవకపోవడంతోనే మూసేసినట్లు చెబుతున్నారు. లోకల్ బ్రాండు సామగ్రి కొనుగోలు.. వర్సిటీలో బాల బాలికలకు వేర్వేరు హాస్టళ్లు, మెస్ హాళ్లు ఉన్నాయి. బాలికలు భ్రమరాంబ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వీరికి అక్కడే మెస్ హాల్ ఉంది. బాలురుకు తుంగభద్ర, సంగమేశ్వరం, కృష్ణా హాస్టళ్లున్నాయి. గతేడాది వరకు మూడు హాస్టళ్ల విద్యార్థులు తుంగభద్ర హాస్టల్లోని మెస్లో భోజనం చేసేవారు. మూడు హాస్టళ్లలో కలిపి ఏటా దాదాపు 350–400 మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో వేమన హాస్టల్ సమూదాన్ని కొత్తగా మెస్గా మార్చారు. ఇందులో అధునాతన పరికరాల కొనుగోలు కోసం రూ.60 లక్షలను కేటాయించారు. వీటితో మినరల్ వాటర్ ప్లాంటు, సీసీ కెమెరాలు, వైఫై సౌకర్యం, స్టీమ్కుక్కర్లు, కూర్చోని భోజనం చేయడానికి కుర్చీలు, బెంచీలు, ప్లేట్లు, గ్లాసులతోపాటు వంట సామగ్రిని కొనుగోలు చేశారు. వేడెక్కుతున్న స్టీమ్కుక్కర్లు.. రూ.60 లక్షలతో కొత్త మెస్ కోసం ప్రముఖ బ్రాండ్ కంపెనీల వస్తువులను హైదరాబాద్లో కొనుగోలు చేసినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. స్వయంగా రిజిస్ట్రార్, వార్డెన్ సామగ్రిని పరిశీలించినట్లు చెప్పారు. అయితే వాటిని లోకల్గానే కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్టీమ్ కుక్కర్లు వంట సమయంలో వేడెక్కుతుండడంతో సిబ్బంది పనిచేయడానికి విముఖతను చూపడంతో మెస్ను మూసివేసినట్లు సమాచారం. మెస్లోని మినరల్ వాటర్ ప్లాంటు ఒక్కరోజూ చుక్క నీరివ్వలేదని సిబ్బందే పేర్కొంటున్నారు. విద్యార్థులకు సరిపోవడం లేదని... జూలై నుంచి ప్రారంభమైన కొత్త మెస్ హాల్లో ఫస్టియర్ విద్యార్థులు భోజనం చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. బాలుర విభాగంలో ఫస్టియర్ విద్యార్థులు దాదాపు 150 మంది ఉన్నారు. కొత్త మెస్ హాల్ సీటింగ్ క్యాపాసిటీ 70–75 మందికి సరిపోతుంది. అంటే రెండు బంతుల్లో వారంతా భోజనం చేయవచ్చు. దీంతో విద్యార్థులకు పెద్ద ఇబ్బందేమీ లేదు. కేవలం లోకల్ బ్రాండ్ సామగ్రి కారణంగానే మెస్కు తాళం పడినట్లు అర్థమవుతోంది. విచారణ జరపాలి నూతన మెస్హాల్ వస్తువుల కొనుగోలు భారీ అవినీతి జరిగింది. స్థానికంగా దొరికే వంట సామగ్రిని కొనుగోలు చేసి ఎక్కువ బిల్లులు పెట్టకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఆడిట్ను పక్కాగా చేపట్టాలి. లేదంటే ఆందోళన తప్పదు. – రాఘవేంద్ర, అంబేద్కర్ విద్యార్థి అసోసియేషన్ ఎలాంటి అవినీతి లేదు కొత్త మెస్ హాల్ వంట సామగ్రి కొనుగోలులో ఎలాంటి అవినీతి లేదు. లోకల్గా కొన్నట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారం. సిబ్బంది తక్కువగా ఉండడంతోనే తాత్కాలికంగా బంద్ చేశాం. అంతేకాక కొన్ని మైనర్ రిపేర్లు ఉన్నాయి. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తాం. – వై.నరసింహులు, వీసీ, రాయలసీమ యూనివర్సిటీ -
మద్యం ప్రియులకు కిక్కు..నితీష్కు షాక్
-
కబ్జాదారుల చెరవీడిన పార్కు
– అక్రమ కట్టడాల్ని కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది – ఆక్రమణలపై స్థానికుల ఆగ్రహం – సాక్షి కథనానికి స్పందన విజయవాడ (గాంధీనగర్) : కోట్లాది రూపాయల విలువచేసే కార్పొరేషన్ స్థలం కబ్జాకోరుల చెరవీడింది. సాక్షి కథనంతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో చలనం వచ్చింది. ‘పార్కులపై కబ్జాకాండ’ శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు నగర శివారు కండ్రికలోని పార్కు స్థలంలో టీడీపీ ప్రజాప్రతినిధులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. నాలుగు ఇళ్ళు, ఒక రేకుల షెడ్డును పొక్లెయినర్ సహాయంతో నేలమట్టం చేశారు. కబ్జాలపై భగ్గుమన్న ప్రజాగ్రహం కబ్జా బాగోతాలపై అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ స్థలాలు, శ్మశానవాటికలు కబ్జాకు గురవుతున్నాయంటూ కండ్రిక వాసులు ఆరోపించారు. పేదలు కాల్వగట్లపై ఇళ్లు నిర్మించుకుంటే తొలగించే అధికారులు కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలను కాజేస్తుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్కు స్థలంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారా? అంటూ అక్కడికి వచ్చిన టౌన్ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసే సమయంలోనే అక్కడ ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు సైతం అధికారులు తీరును ఎండగట్టారు. -
మద్యం ప్రియులకు కిక్కు..నితీష్కు షాక్
న్యూఢిల్లీ : బిహార్ను సంపూర్ణ మద్య నిషేధంగా మలుస్తానని ప్రకటించిన నితీష్ ప్రభుత్వానికి పట్న హైకోర్టు షాకిచ్చింది. యాంటీ-లిక్కర్ యాక్ట్ చట్టవిరుద్ధమని తేల్చేసింది .ఆ చట్టాన్ని నిలిపివేస్తున్నట్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. సంపూర్ణంగా మద్యం నిషేధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బిల్లు-2016ను పట్నా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ చట్టం ప్రకారం ఎవరి ఇంట్లోనైనా లిక్కర్ బాటిల్ కనిపిస్తే ఆ కుటుంబంలోని పెద్దలందరినీ అరెస్టు చేసే అవకాశముంటుంది. ఈ చట్టానికి బిహార్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదం తెలిపాయి. చట్టసభల ఆమోదం తర్వాత నెలకే ఆ రాష్ట్ర గవర్నర్ రామ్నాథ్ కోవింద్ కూడా ఈ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగస్టు 1నుంచి ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టాన్ని తప్పుపడుతూ చట్టవిరుద్ధమని పట్న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కొత్త బిల్లులోని సెక్షన్లలన్నింటిలోనూ బెయిల్ లభించదు. కేవలం కోర్టులు మాత్రమే బెయిల్ మంజూరు చేయగలవు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం స్పెషల్ కోర్టులు మాత్రమే మద్య నిషేధ ఉల్లంఘన కేసులను విచారించగలవు. ఈ స్పెషల్ కోర్టులు ఇప్పటివరకు అవినీతి, సీబీఐకు సంబంధించిన కేసుల విచారణలోనే ఊపిరి సలుపుకోకుండా ఉన్నాయి.ఈ చట్టంలో మరో కఠినమైన నిబంధనన ఏమిటంటే, ఏ ప్రాంతంలోనైనా బెల్లం, ద్రాక్షపండ్లు కనిపించినా సరే లిక్కర్ తయారు చేస్తున్నట్టు భావించి అరెస్ట్ లు చేసే అధికారం ముంటోంది. ఈ బిల్లుపై పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. -
రేషన్ బియ్యం పట్టివేత
విజయవాడ (భవానీపురం) : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. కోదాడ నుంచి కాకినాడకు 170 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతోందన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయపాల్ నేతృత్వంలో సిబ్బంది భవానీపురం బైపాస్ రోడ్లో కాపు కాశారు. ఉదయం 11.30 గంటల సమయంలో బియ్యం లోడుతో వస్తున్న లారీని అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 230 గన్నీ బ్యాగ్స్, 112 తెల్ల సంచుల్లో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ లోడులో పైవరుసలో సాధారణ బియ్యం బస్తాలను పేర్చి అడుగున రేషన్ బియ్యం బస్తాలను ఉంచారు. లారీలోని రేషన్ బియ్యాన్ని గొల్లపూyì మార్కెట్ యార్డ్లోని ఎంఎల్ఎస్ పాయింట్లో దించి, ఇన్చార్జి నరసింహారావుకు అప్పగించారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.5.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం లారీని, డ్రైవర్ నాగరాజును భవానీపురం పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు ఎన్ఎస్ఎస్ అపర్ణ, ఎస్కే నభి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ, ఆర్ఐ ఎ.లత పాల్గొన్నారు. -
కలప దందా.. కాసుల వరద..!
ఇక్కడ దుంగకు రూ.వెయ్యి.. అక్కడ ఫీట్కు రూ.1,200 ఈ అక్రమ బిజినెస్తో స్మగ్లర్లకు పైసలే పైసలు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు జన్నారం : అడవిలో ఉంటున్న కొందరు గిరిజనులను మచ్చిక చేసుకుని.. ఆ ప్రాంతం అటవీ సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పుతూ ఇక్కడి నుంచి తీసుకుపోయే కలప దుంగలకు మూడంతలు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. ఇలా తమ బిజినెస్ను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డివిజన్లోని జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్లలో ఈ బిజినెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయట పడిన విషయాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల సహకారం స్మగ్లర్లకు వరంగా మారింది. స్మగ్లింగ్ జరుగుతోందిలా... జన్నారం, తాళ్లపేట్, ఇంధన్పల్లి రేంజ్ల పరిధిలోని పలు అటవీ ప్రాంతాల నుంచి కొందరు గిరిజనులు దుంగలు కొట్టి, వాటిని జన్నారం మండలానికి చెందిన కొందరు జట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. వారు గిరిజనుల వద్ద నుంచి రూ.1000 కి ఒక టేకు దుంగ(సైజు 10–6, సుమారుగా 3 ఫీట్లు) కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా గోదావరి వరకు ఎడ్లబండి లేదా, సైకిళ్లపై తరలిస్తారు. అక్కడ మరో వ్యక్తి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి కలపను ఆ వ్యక్తి ఫీటుకు రూ.1,200 నుంచి రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తారు. అంటే రూ.వెయ్యితో కొనుగోలు చేసిన దుంగకు రూ.3 వేల నుంచి రూ.5,400 వరకు వస్తున్నాయి. ఇలాంటి వ్యాపారం ఏదీ ఉండదని, స్మగ్లర్లు ఈ రూటును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో సంబంధిత ప్రాంత బీట్ అధికారికి నెలకు కొంత చొప్పున మాట్లాడుకుని నెలనెలా చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇటీవల ఓ అధికారి నిర్మించుకున్న ఇంటికి కూడా కలప ఇక్కడి నుంచే స్మగ్లర్లు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ జోక్యం కలప పట్టుకున్న రెండో రోజు నుంచి రాజకీయ జోక్యం కల్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఆయన మా పార్టీకి చెందినవాడు. స్మగ్లర్ కాదు.. కేసులు లేకుండా చేయాలని అటవి అధికారులకు ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుకున్న వారిని వదిలేస్తే ఇక పట్టుకోవడం ఎందుకని కూడా అటవీ శాఖ అధికారులంటున్నారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా సహకరించాలని కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తాం స్మగ్లింగ్కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇటీవల కలప పట్టుకున్న ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశాం. మాకు పోలీసుల సహకారం ఉన్నందున స్మగ్లర్లు తప్పించుకునే అవకాశం లేదు. ఎంతటివారైన చర్యలు తప్పవు. పెట్రోలింగ్ ద్వారా రాత్రి అడవిలో తిరుగుతున్నాం. – షౌకత్హుస్సేన్, రేంజ్ అధికారి -
పేదల బియ్యం.. పెద్దల భోజ్యం
* సరిహద్దులు దాటించేస్తున్న అక్రమార్కులు * నరసరావుపేట, సత్తెనపల్లి కేంద్రంగా దందా * ముఖ్య నేత తనయుడి ఆధ్వర్యంలోనే నిర్వహణ! అక్రమార్కులు పేదల బియ్యాన్నీ వదలడం లేదు. వారి కడుపుకొట్టి.. తమ జేబులు నింపుకొంటున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సేకరించిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటించేస్తున్నారు. నరసరావుపేట: పేదల బియ్యానికి భద్రత కొరవడింది. సరిహద్దులు దాటి మరీ విదేశాలకు తరలిపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలు కేంద్రంగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత తనయుడు పట్టణ ప్రజాప్రతినిధి ఒకరిని ఏజెంటుగా పెట్టుకొని బియ్యం మాఫియా నడుపుతున్నాడు. రేషన్ డీలర్లకు సరకు చేరగానే వారి నుంచి బియ్యాన్ని సేకరించి గోతాలు మార్చేస్తున్నారు. వరల్డ్ రైస్ పేరుతో కాకినాడ పోర్టుకు వాటిని తరలిస్తున్నారనే ఆరోరపణలు బలంగా వినిపిస్తున్నాయి. పలుమార్లు పట్టుబడినా.. గతేడాది సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలోని ఎస్ఆర్కేటీ జంక్షన్ వద్ద పాడుబడిన గోడౌన్లో తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం డంపును పట్టుకున్నారు. అందులో సుమారు రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం బస్తాలు ఒకేచోట పట్టుబడిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఈ డంపులో వరల్డ్ రైస్ పేరుతో ఉన్న రేషన్ బియ్యం బస్తాలను గమనించిన అధికారులే విస్తుపోయారు. టీడీపీ నాయకులు, రేషన్ డీలర్ల ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరుగుతుండటంతో అధికారులు కూడా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో బియ్యం సేకరణ కేంద్రాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లుకు మార్చారు. అక్కడ కొంతకాలంగా నిర్వహించిన అనంతరం ఇప్పుడు నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం కేంద్రంగా బియ్యం సేకరణ నిర్వహిస్తున్నారు. ఈ నెల ఆరో తేదీ రాత్రి పెట్లూరివారిపాలెంలో పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 44 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవటం గమనార్హం. జిల్లాలో బియ్యం మాఫియా కార్యకలాపాలు విస్తరిస్తుండటం ప్రమాదకర సంకేతాలనిస్తోంది. పిడుగురాళ్లలోనూ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రకరకాలుగా బియ్యం సేకరణ.. జిల్లాలోని 57 మండలాల్లో 2731 రేషన్ షాపులు ఉండగా, వాటిలో అత్యధిక శాతం టీడీపీ కార్యకర్తల చేతిలోనే ఉన్నాయి. జిల్లాలో 13.39 లక్షల రేషన్ కార్డులు ఉండగా, వాటిలో రూ.10.26 లక్షల కార్డుదారులకు ప్రతినెలా 13,600 టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. లబ్ధిదారులకు వాటిలో సగం కూడా సక్రమంగా పంపిణీ కావటం లేదు. నరసరావుపేట, సత్తెనపల్లిలో టీడీపీ అధికారంలోకి రాగానే డీలర్లు నూతనంగా నియమించినవారు కావటంతో బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారు. సహకరించకపోతే డీలర్షిప్లు రద్దు చేస్తామని, కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. రేషన్ బియ్యం ఒక రూపాయికే కేజీ చొప్పున ఇళ్లకు తీసుకెళ్లినవారి నుంచి కేజీకి రూ.8 చొప్పున చెల్లించి మధ్య దళారులు సేకరిస్తున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సర్వర్ పనిచేయటం లేదనే సాకుతో డీలర్లు లబ్ధిదారులకు స్లిప్లు ఇచ్చి బియ్యం ఇవ్వకుండా పదేపదే షాపుల చుట్టూ తిప్పుకొంటున్నారు. చివరికి కేజీకి రూ.7 చొప్పున రేషన్ కార్డుదారుల చేతిలో డబ్బు పెట్టి పంపిస్తున్నారు. ఈ విధంగా మిగిలిన బియ్యాన్ని డీలర్లు కేజీ రూ.12కు అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. వాటిని బియ్యం మాఫియా కేజీ రూ.25 చొప్పున ఎగుమతి చేస్తూ తమ జేబులు నింపుకొంటున్నారు. నిజాలు నిగ్గుతేలుతాయి : నల్లపాటి బియ్యం మాఫియాపై లోకాయుక్త నిర్వహించే దర్యాప్తుతోనైనా నిజాలు నిగ్గుతేలుతాయనే నమ్మకం తనకు ఉందని ఎన్సీవీ అధినేత నల్లపాటి రామచంద్రప్రసాద్ తెలిపారు. బియ్యం మాఫియాపై ఆయన లోకాయుక్తలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాఫియాను అరికట్టాలని, పేదల బియ్యానికి భద్రత కల్పించాలని, లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అంతా అప్రజాస్వామికం
– నోటిఫికేషన్ లేకుండానే వర్శిటీల పాలకమండలి సభ్యుల నియామకం – సమాన అవకాశాలకు పాతరేసిన ప్రభుత్వం – సీనియర్ ప్రొఫెసర్ కోటాలో అనుభవంలేని ప్రొఫెసర్ల ఎంపిక ఎస్కేయూ/ జేఎన్టీయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సభ్యుల నియామకం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్–1991కు విరుద్ధంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరిగిన వర్శిటీల్లోని పరిపాలన, ఆర్థిక పరమైన అత్యున్నత హోదాగల పాలక మండలి సభ్యుల నియామకంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ ప్రొఫెసర్లకు తెలియకుండా భర్తీ : ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల యాక్ట్ – 1991 , సెక్షన్ 18 (2) ప్రకారం పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్కు నామినేషన్లు ఆహ్వానించాల్సి ఉంది. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో ఒక సీనియర్ ప్రొఫెసర్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రిన్సిపల్, క్యాంపస్ కళాశాలలో ఒక ప్రొఫెసర్ / అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక అధ్యాపకుడు, అనుబంధ కళాశాలల్లో ఒక ప్రిన్సిపల్, విభిన్న రంగాల నుంచి నలుగురు ప్రముఖుల నుంచి నామినేషన్లు దాఖలు చేయాలి. కానీ నియామకాల్లో అలా ఎవరినీ కోరలేదు. కనీసం యూనివర్సిటీ నుంచి ఎంపిక చేయబోయే వారి బయోడేటాలు తెప్పించుకోలేదు. ఎస్కేయూలో జీవో నం. ఎంఎస్ 13, జేఎన్టీయూ అనంతపురంలో జీవో నం.15 ప్రకారం నేరుగా పాలకమండలి సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎంపిక చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాన అవకాశాలకు పాతర : రాజ్యాంగంలోని 14వ అధికరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. పాలకమండలి సభ్యుల నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకునేవారు. నిష్ణాతుల దరఖాస్తులు పరిశీలించే అవకాశం ఉండేది. ఆంధప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్–1991 ప్రకారం సెక్షన్ 33 (2) ప్రకారం పాలక మండలి సభ్యుల నియామకంలో తప్పిదాలు జరిగినా.. చట్టాన్ని అతిక్రమించి భర్తీ చేసినా ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలి. పాలకమండలి సభ్యులు ఛాన్సలర్ విశ్వాసం ఉన్నంత వరకూ పదవిలో ఉంటారు. మూడేళ్ల కాలంలో ఛాన్సలర్ వారిని ఎప్పుడైనా తొలగించొచ్చు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే కీలకమైన పాలకమండలి సభ్యుల ఎంపికలో మాత్రం నియంతత్వ ధోరణితో వ్యవహరిస్తుండడం వివాదాస్పదమవుతోంది. ఎస్కేయూ వీసీకి ఫిర్యాదు : తాజాగా పాలకమండలి సభ్యుల నియామకం చేసిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్కు కొందరు అధ్యాపకులు గత నెల రెండో వారంలో ఫిర్యాదు చేశారు. సీనియర్ ప్రొఫెసర్ కోటాలో పాలక మండలి సభ్యుడిని నియమించారు. 2013లో ప్రొఫెసర్గా ఉద్యోగోన్నతి వచ్చిన వారు సీనియర్ ప్రొఫెసర్ ఎలా అవుతారని అందులో పేర్కొన్నారు. వర్సిటీల యాక్ట్కు విరుద్ధంగా భర్తీ చేశారని చాన్సలర్ దష్టికి తీసుకెళ్లాలని అందులో కోరారు. -
అక్రమ వలసదారులను పంపిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: తను అధికారంలోకి వస్తే అమెరికాలో అక్రమంగా వలసవచ్చిన వారిని క్రమబద్ధీకరించే అవకాశమే లేదని.. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమంగా వచ్చేవారికి అడ్డుకట్ట వేసి, ఇప్పటికే వచ్చిన వారికి బహిష్కరిస్తామన్నారు. ఇలా వచ్చిన వారే డ్రగ్ డీలర్లుగా మారుతున్నారన్నారు. ప్రస్తుత చట్టాలతో ఒబామా అందరినీ దేశంలోకి ఆహ్వానించారన్నారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యలను హిల్లరీ క్లింటన్ ఖండించారు. విద్వేశపూరిత వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఎప్పటికీ మారడన్నారు. అమెరికాలో 1.1 కోట్ల మంది విదేశీయులు అక్రమంగా ఉంటుండగా.. ఇందులో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. -
సన్నగా.. తరలిపోగా!
జిల్లాలో బియ్యం మాఫియా – కర్ణాటకకు తరలిపోతున్న రేషన్ బియ్యం – డీలర్ల నుంచి సేకరిస్తున్న ఏజెంట్లు – నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా వ్యవహారం – తాజాగా విజిలెన్స్ దాడుల్లో తేటతెల్లం సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డీలర్లతో పాటు కార్డుదారుల నుంచీ రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని మిల్లుల్లో ఆడించి సన్నబియ్యంగా మారుస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఒక బ్రాండ్ పేరున్న సంచుల్లో నింపి లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి ఈ విధంగా రేషన్ బియ్యం కాస్తా సన్న బియ్యం రూపంలో తరలిపోతోంది. విజిలెన్స్ విచారణలో ఈ విషయాలన్నీ తాజాగా బయటపడ్డాయి. నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు కేంద్రంగా ఈ బియ్యం మాఫియా చెలరేగిపోతుందని సమాచారం. ఏజెంట్ల ద్వారా సేకరణ రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి తరలించేందుకు మాఫియా భారీగానే యాక్షన్ ప్లాన్ చేసి వ్యవహారం నడుపుతోంది. ప్రధానంగా ఈ బియ్యం మాఫియా బియ్యం సేకరించేందుకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. కిలో బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10లతో కొనుగోలు చేస్తున్నారు. రూపాయికే వచ్చిన బియ్యానికి అధిక ధర వస్తుండటంతో అటు డీలర్లు, ఇటు దొడ్డుబియ్యం తినని కార్డుదారులు ఈ ఏజెంట్లను ఆశ్రయించి బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కాస్తా ఏజెంట్లు.. బియ్యం మాఫియాకు రూ.14లకు విక్రయిస్తున్నారు. ఆ తర్వాత మాఫియా కాస్తా దొడ్డు బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి బ్రాండ్ రూపంలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయాలన్నీ తాజాగా నందికొట్కూరు కేంద్రంగా నడుస్తున్న బియ్యం మాఫియాపై విజిలెన్స్ దాడుల సందర్భంగా తేటతెల్లమయినట్లు తెలిసింది. రూపాయి.. ముపై ్ప రూపాయలవుతోంది వాస్తవానికి రేషన్షాపుల్లో కార్డుదారులకు కిలో బియ్యం రూపాయికే లభ్యమవుతోంది. ఈ బియ్యాన్ని డీలర్లతో పాటు రేషన్ బియ్యం తినని కార్డుదారుల వద్ద నుంచి మాఫియా సేకరిస్తోంది. ఇక్కడి నుంచి కర్ణాటకకు తరలిపోతున్న ఈ బియ్యం ధర కాస్తా అక్కడ కిలో రూ.30 పలుకుతోంది. అంటే కిలో రూపాయి బియ్యం కాస్తా రూ.30 అవుతోందన్నమాట. నందికొట్కూరు కేంద్రంగా ఖాదర్ బాషా నడుపుతున్న ఈ బియ్యం మాఫియా వ్యవహారం తాజాగా విజిలెన్స్ దాడుల్లో బయటపడింది. ఇలాంటి బియ్యం మాఫియా జిల్లావ్యాప్తంగా రెచ్చిపోతున్నట్టు సమాచారం. ఈ మాఫియాకు అటు అధికారుల అండదండలతో పాటు అధికారపార్టీ నేతల ఆశీస్సులు ఉండటంతో వ్యవహారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. -
అక్ర‘మార్కు’ల్లో దడ
‘లీకేజీ ర్యాంకులు పొందిన వారిలో ప్రభుత్వ అధికారులు, వ్యాపార వర్గాల పిల్లలు వరంగల్ : ఎంసెట్–2 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అక్రమంగా మార్కులు సాధించిన వారిలో దడ పుట్టిస్తోంది. ఈ వ్యవహారంలో హస్తం ఉన్న వారిని సీఐడీ అరెస్టు చేస్తుండడంతో తదుపరి వంతు తమదేనన్న భావన వీరిలో వస్తున్నట్లు తెలిసింది. లక్షలాది రూపాయలు పోసి ర్యాంకులు సాధిస్తే ఎంసెట్ –2 రద్దుతో పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇదిలా ఉండగా లీకేజీ ప్రశ్న పత్రాలు ఎవరెవరు తీసుకున్నారన్న కోణంలో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఏమి జరుగుతుందోనన్న విషయం తెలియకపోవడంతో ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్న వారిలో టెన్షన్ మొదలైంది. భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాలకు చెందిన వారితోపాటు నగరంలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల పిల్లలు, వ్యాపారుల పిల్లలు పెద్ద సంఖ్యలో ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని సీఐడీ ఆదుపులోకి తీసుకోవడంతో వారికి డబ్బులు ఇచ్చిన వారిని ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పలువురు ప్రభుత్వ అధికారుల పేర్లు బయటపడే అవకాశాలున్నాయి. తమ పేర్లు బయటపడితే ఇంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలను ఏసీబీ అధికారులు చెప్పాల్సి వస్తుందన్న భయం వారిని వెంటాడుతోంది. -
రాళ్ల సొమ్ము.. ‘రాజుల’ పాలు
♦ రూ.లక్షల విలువ చేసే గ్రానైట్ రాళ్లు పక్కదారి ♦ అక్రమంగా ఓ కంపెనీ ఆవరణలో నిల్వ ♦ అక్కడి నుంచి దారిమళ్లించిన పెద్దమనుషులు ♦ వత్తాసు పలికిన అధికారులు!ప్రజాధనం దుర్వినియోగం మెదక్: రాజుల సొమ్ము రాళ్ల పాలు.. సామెతను తిరగ రాస్తే రాళ్ల సొమ్ము రాజుల పాలు అవుతుంది. సరిగ్గా ఇదే జరి గింది ఇక్కడ. ప్రజల సొత్తు పరుల పాలైంది. లక్షలాది రూపాయల విలువ చేసే గనేట్ రాళ్లు పక్కదారి పట్టాయి. వీటిని ఓ కంపెనీలో అక్రమంగా నిల్వ చేశారు. అక్కడి నుంచి గట్టుగా మరోచోటుకు తరలించారు. ఓ కాంట్రాక్టర్ నిర్వాకానికి అధికారులు వత్తాసు పలికారు. ఈ తతంగం వెనుక పలువురు ప్రజాప్రతినిధులు హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మెదక్ పట్టణంలో నర్సాపూర్ వెల్కంబోర్డు నుంచి పట్టణ శివారులోని బోధన్ ప్రధానరోడ్డు వరకు ఇరువైపులా రూ.3.50 కోట్లతో గత 2001లో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో మురికి కాల్వలు నిర్మించారు. ఈ యేడు మెదక్ పట్టణంలోని రోడ్ల వెడల్పుతోపాటు ఇరువైపులా ఉన్న మురికి కాల్వలను సీసీతో నిర్మించేందుకు రూ.15.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో 1.6 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణంతోపాటు సుమారు మూడు కిలో మీటర్ల మేర మురికి కాల్వలను సీసీతో నిర్మించాల్సి ఉంది. కాగా ఈ పనులను ఓ ప్రజాప్రతినిధి బంధువు చేజిక్కించుకున్నట్టు తెలిసింది. దీంతో 15 ఏళ్ల క్రితం గనేట్ రాళ్లతో నిర్మించిన మురికి కాల్వలను జేసీబీలతో తవ్వారు. అందులో వచ్చిన గనేట్ను మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులోని డాంబర్ కంపెనీ, కంకర మిషిన్ ఆవరణలో గుట్టలు గుట్టలుగా పేర్చారు. అంతేకాకుండా డాంబర్ కంపెనీలో వీటిని అడుగు రాళ్లుగా వాడుతున్నట్టు తెలిసింది. ఈ రాళ్లనే పాపన్నపేటలో నిర్మిస్తోన్న ఓ ప్రభుత్వ భవనానికి వాడినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ బండరాళ్లను 2001లో సుమారు కోటి రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఈ రాళ్లను ప్రస్తుతం వేలం వేసినా ప్రభుత్వానికి సుమా రు రూ.50 లక్షల ఆదాయం వచ్చేదని పలువురు అభిప్రాయపడుతున్నా రు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో చిన్నసైజు రాయి రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. ఈ మురికి కాల్వల సైజు రాయి పెద్దగా ఉండటంతో రూ.20 వరకు విక్రయిస్తుంటారు. లక్షలాది రాళ్లను డాంబర్, కం కర మిషిన్ యజమానికి ఎందుకు అప్పగించారో అధికారులకే తెలి యాలి. సదరు కాంట్రాక్టర్కు, అధికారులకు మధ్య ఉన్న సంబంధంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ కంపెనీ యజమానికి పలువురు ప్రజాప్రతినిధులు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలుస్తోంది. అతని వెనుక ఉన్నది కూడా సదరు ప్రజాప్రతినిధులేనన్న ఆరోపణలున్నాయి. ప్రజల సొత్తును రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్కు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులు స్పందించి డాంబర్ కంపెనీలో నిల్వ ఉంచిన రాయిని ఏం చేశారో? తేల్చాలని అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఔను, అక్కడే నిల్వ చేశాం... మెదక్ పట్టణంలోని మురికి కాల్వల నుంచి తీసిన రాయిని మెదక్ మండలం ఔరంగాబాద్ శివారులోని డాంబర్ కంపెనీ ఆవరణలో నిల్వచేసిన మాట వాస్తవమే. పాతరాయి కావడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఈ రాయిని పాపన్నపేట మండలంలోని ఓ భవన నిర్మాణానికి వినియోగించిన విషయం నాకు తెలియదు. - రియాజ్, ఆర్అంబ్బీ జేఈ -
అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు. -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే: కేసీఆర్
సదరు విద్యా సంస్థల గుర్తింపు రద్దు అసలుదేదో, నకిలీదేదో తేల్చాలని ఆదేశం వాటిలోని విద్యార్థులకు నష్టం జరగనివ్వొద్దు విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రమాణాలతో కూడిన విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు పేద విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం తక్షణం రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు రూ. 3,061 కోట్ల చెల్లింపునకు ఆర్థిక శాఖకు ఆదేశం రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే బోగస్ విద్యా సంస్థలు ప్రభుత్వ సొమ్మును కాజేసే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ బోగస్ విద్యా సంస్థల వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతున్నారని పలు విచారణల్లో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఏది బోగస్ సంస్థో, ఏది అసలు సంస్థో తేల్చాలని నిర్దేశించారు. ‘‘అక్రమాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాటి గుర్తింపును కూడా రద్దు చేస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సదరు బోగస్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వారిని ఇతర విద్యా సంస్థల్లో చేరుస్తామని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో పలు విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పటిదాకా విద్యార్థులకు బకాయి పడిన రూ.3,061 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన ఆదేశించారు. ఆదర్శం... అక్రమార్కులపాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు తదితర విద్యా సంబంధిత అంశాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఇతర కులాల్లోని పేదలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత స్థాయి అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ‘‘హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఇస్తున్న సన్న బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా వర్తింపజేయాలని ఇప్పటికే నిర్ణయించాం. పేదలకు మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు అందించడానికి, ఫీజు రీయింబర్స్మెంట్కు, మెస్ చార్జీల చెల్లింపుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రభుత్వం పెట్టే ఈ ఖర్చు అక్రమార్కులపాలు కావడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు’’ అని సీఎం అభిప్రాయపడ్డారు. సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అనేక అక్రమాలు బయటపడ్డాయని ఆయనన్నారు. ‘‘ఇప్పటికే రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు. బోగస్ విద్యా సంస్థలూ ఉన్నాయి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలూ పూర్తి స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేలా చూసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుంది’’ అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ‘‘విద్యా సంస్థల్లో అధ్యాపకులున్నారా? ఫర్నిచర్ ఉందా? ఇతర సౌకర్యాలున్నాయా? లేబొరేటరీలున్నాయా? ఆయా విద్యా సంస్థల్లోని అడ్మిషన్లు నిజమైనవేనా, బోగసా? ఇలాంటి అన్ని విషయాలపైనా సమగ్ర విచారణ చేయండి. ప్రభుత్వ గుర్తింపుకు నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా కూడా గమనించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్, జంటనగరాల పోలీస్ కమిషనర్లు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కొరడా
♦ రైసు మిల్లులపై దాడులు ♦ రేషన్ బియ్యం కొనుగోళ్లపై తనిఖీలు ♦ మూడు బృందాల విచారణ పెద్దశంకరంపేట: పీడీఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో జిల్లా అధికారులు పేటలోని మూడు రైసుమిల్లులపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులు రేషన్ బియ్యం సరఫరాపై విచారణ చేపడుతున్నారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారనే సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో గత కొన్ని రోజులుగా అనుమానం వచ్చిన మిల్లులపై జిల్లా స్థాయి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ రూ.కోట్లు గడిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉన్న పేట మండలంలోని మూడు రైసుమిల్లులపై ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నుంచి మూడు రైసుమిల్లుల్లో బస్తాలను అధికారులు లెక్కించారు. ఇతర రాష్ట్రాలనుంచి బియ్యం ఎగుమతిదిగుమతులవుతున్నాయని పలువురు పిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో జేసీ ఆదేశాల మేరకు రైసుమిల్లుల్లో అధికారులు సోదా నిర్వహించారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్లకు చెందిన తహశీల్దార్లు, సిద్దిపేట, సంగారెడ్డికి చెందిన ఏఎస్ఓల బృందం తనిఖీలు చేపట్టింది. గత అరు నెలల విద్యుత్ వాడకంపై కూడా అధికారులు విద్యుత్ శాఖ ఏఈ ద్వారా సమాచారం సేకరించారు. మిల్లర్లు వాడిన విద్యుత్, మర పట్టిన ధాన్యానికి గల తేడాలను అధికారులు గుర్తించారు. అధికారులు దాడులు చేయవచ్చనే సమాచారంతో ముందుగానే పీడీఎస్ బియ్యం లేకుండా మిల్లర్లు జాగ్రత్త పడినట్లు సమాచారం. -
రోడ్డుపై నడుస్తూ మెసేజ్ లు చూసినా..
న్యూయార్క్: రోడ్లపై నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదని ఆలా చేయడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు సైతం విరుద్ధమని అమెరికాలో ఇప్పటికే చట్టాలు చేశారు. ఇకమీదట రోడ్లపై ఫోన్లో మెసేజ్ లు చూడటం, సందేశాలు టైప్ చేయడం వంటివి కూడ నేరంగానే పరిగణించబోతున్నారట. చట్ట వ్యతిరేక చర్యగా భావించి తగిన శిక్షను కూడ అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. 'డిస్ట్రాక్టెడ్ వాకింగ్' విశ్వవ్యాప్త సమస్యగా మారుతున్న నేటి తరుణంలో, సమస్యలపై నిపుణులు దృష్టిసారించారు. కదిలే సమయంలో ఫోన్ లోని చిన్నపాటి బ్లూ స్క్రీన్ చూడటంవల్ల కళ్ళకు తీవ్ర హాని కలగడంతోపాటు, ప్రమాదాలకు దారి తీయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గ్లోబల్ మీడియా కంపెనీ మాషబుల్ లెక్కల ప్రకారం అమెరికాలో పాదచారుల మరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గమనించారు. పెడస్ట్రియన్ డెత్స్ 2005 లో 11శాతం ఉండగా.. ఆ సంఖ్య 2014 నాటికి 15 శాతానికి చేరుకున్నట్లు సర్వేలద్వారా తెలుసుకున్నారు. రోడ్ దాటుతున్నపుడు ఫోన్ వాడితే 250 డాలర్ల జరిమానా కట్టాలంటూ హవాయిలో రూపొందించిన బిల్లు పెండింగ్ లో ఉండగా... ఇప్పుడు రోడ్డుపై నడుస్తూ మేసేజ్ లు చేయడం కూడ చట్ట విరుద్ధంగా పరిగణించాలంటూ న్యూ జెర్సీలోని చట్టసభ సభ్యురాలు ఒకరు డిమాండ్ చేశారు. పాదచారులు ఫోన్లు వంటి కమ్యూనికేషన్ పరికరాల్లో మెసేజ్ లు చేయడం, సందేశాలను చూడటం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని పమేలా లాంపిట్ డిమాండ్ చేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 50 డాలర్ల జరిమానాతోపాటు, 15 రోజుల జైలు శిక్షను కూడ అమలు చేయాలని ఆమె కోరారు. రోడ్లపై పరధ్యానంగా ఉండటం అటు డ్రైవర్లకు ఇటు ప్రయాణీకులకు ప్రమాదాలను తెచ్చిపెడుతుందన్నారు. వాహనాలు నడుపుతూ ఫోన్లు మాట్లాడటం వల్ల కలిగే నష్టమే, పరధ్యానంగా రోడ్లపై నడిచేవారివల్ల కలుగుతుందని, వారికి విధించినట్లే వీరికి కూడ జరిమానా విధించాలని లాంపిట్ డిమాండ్ చేశారు. -
లేని వారిపై బురద చల్లడం దేనికి?
‘మిస్సమ్మ బంగ్లా’ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత సాక్షి, హైదరాబాద్: లేని వారిపై బురద చల్లడం ఎందుకని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అనంతపురంలోని మిస్సమ్మ బంగ్లాలో 7.30 ఎకరాలను అక్రమంగా అమ్మారని, ఈ వ్యవహారం వైఎస్ ప్రభుత్వ హయాం లోనే జరిగిందని టీడీపీ సభ్యులు శనివారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘ఈ కేసుకు సంబంధించి సీఐడీ విచారణ చివరిదశలో ఉందని, ఈ నెలాఖరుకు పూర్తవుతుందని మీరే(మంత్రి) చెబుతున్నారు కదా? విచారణను పూర్తి చేయండి. దోషులుంటే చర్యలు తీసుకోండి. అంతేగానీ లేని వారిపై బురద చల్లడం దేనికి? ఇది వైఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందనే మాట అవాస్తవం’’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై వైఎస్ కుటుంబ సభ్యులపైన, వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపైనా ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, అధికారపక్ష ఎమ్మెల్యేలు ప్రభాకర్చౌదరి, పార్థసారథి తదితరులు ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు తప్పుబట్టారు. ఇది కోర్టులో ఉన్నందున దీని గురించి సభలో మాట్లాడటం తప్పని శ్రీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. సభలో లేనివారిపై బురద చల్లడం మంచిది కాదన్నారు. బద్వేలు, కోడూరు పట్టణాల్లో మైనారిటీలకు చెందిన విలువైన ఆస్తులను అధికారపార్టీ వారు ఎలా స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
అ‘వే బిల్లులు’.. పదేపదే ఇసుక
గొట్టివాడ రీచ్లో ఆగని దందా ‘సాక్షి’ కథనానికి స్పందించి అడ్డుకున్న రైతులు.. అక్రమాలు బట్టబయలు పాత బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు నిర్ధారణ కోటవురట్ల: గొట్టివాడ ఇసుక రీచ్లో అక్రమ దందా వాస్తవమేనని తేలిపోయింది. అధికారిక తరలింపు ముసుగులో అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారు. ఒక వేబిల్లుతో సుమారు 20 లారీల వరకు ఇసుకను అక్రమంగా తరలిపోతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమ దందాపై ‘ఇసుకపై కన్నేసిని పచ్చ గద్దలు’ శీర్షికతో ఈ నెల 13న సాక్షిలో ప్రచురితమైన కథనం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దీంతో గురువారం గొట్టివాడ గ్రామస్తులు ఇసుక రీచ్పై దాడి చేసి లారీలను అడ్డగించారు. వేబిల్లులను తనఖీ చేయగా పలు ఆసక్తి కర విషయాలు వెల్లడయ్యాయి. స్థానికులకు చిక్కిన పాత బిల్లులు ఈ నెల 8వ తేదీ, 15వ తేదీకి చెందిన సుమారు 30 బిల్లులను స్థానికులు పట్టుకున్నారు. రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే బిల్లును పలుమార్లు వినియోగిస్తున్నారని వెల్లడికావడంతో మండిపడ్డారు. కాసులకు కక్కుర్తిపడి రైతులను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం మండలానికి భారీగా ఇసుకను తరలించవలసిన అవసరం ఏమిటని నిలదీశారు. అక్రమ దందాను ఆపకపోతే రీచ్ నుండి ఒక ఇసుక లారీని కూడా కదలనివ్వమని హెచ్చరించారు. అమలుకాని నిబంధనలు వాస్తవానికి అచ్యుతాపురం మండలంలో అవసరాల కోసం అక్కడి తహసీల్దారు శంకర్రావు పలు లారీలకు అనుమతి ఇస్తూ వేబిల్లులు ఇస్తున్నారు. ఆ వేబిల్లుపై మండల ఇంజినీరింగు అధికారి, స్థానిక సర్పంచ్ సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వేబిల్లును కోటవురట్ల తహసీల్దారు సునీలారాణి చేత ఆమోదించుకోవలసి ఉంటుంది. ఇంతతతంగం ఉంటే గాని ఇసుక లారీ కదిలే పరిస్థితి ఉండదు. ఇవేమీ పట్టించుకోకుండా కాని ఒకే వేబిల్లును పదే పదే వినియోగించి ఇసుకను భారీగా తరలించుకుపోతున్నారు. ఇందుకు అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తుండగా స్థానికంగా ఉన్న ఓ టీడీపీ కార్యకర్త దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో లారీ నుండి సుమారు రూ.2 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. అదే లారీ నుండి రెవెన్యూ సిబ్బంది రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమ దందాపై సీబీఐ కన్ను మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాపై సీబీఐ కన్ను పడినట్టు సమాచారం. స్థానికులు సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఎంత అనే పలు అంశాలతో సీబీఐకి స్థానికులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ ఆకస్మిక దాడి చేసి దర్యాప్తు చేసే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు అంటున్నారు. సీబీఐ వరకు విషయం వెల్లడంతో రెవెన్యూ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు తెలిసింది. సిబ్బందిపై తహసీల్దారు ఆగ్రహం ఈ వ్యవహారంపై తహసీల్దారు సునీలారాణి తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ సిబ్బందిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఒక్క లారీ వెళ్లినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో పాటు కొత్త సిబ్బందిని పరిశీలనకు నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
‘మధ్యాహ్నం’లో కక్కుర్తి!
♦ బియ్యం బస్తాల తూకంలో అక్రమాలు ♦ ‘మధ్యాహ్న’ పథకం బియ్యం సరఫరాలో చేతివాటం ♦ తక్కువ తూకంతో బడులకు చేరుతున్న కోటా ♦ అర క్వింటాలు బ్యాగులో 45 నుంచి 47 కిలోలే.. ♦ ఇతర దుకాణాల్లో తూకమేయగా వెలుగులోకి.. ♦ ఏటా 493 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పిల్లలకు పెట్టే అన్నంలోనూ అక్రమార్కులు కక్కుర్తిపడుతున్నారు. వారి నోటికాడి బువ్వనూ లాక్కుంటున్నారు. చదువుపై ఆసక్తి పెంచడంతోపాటు పౌష్టికాహార పంపిణీ కింద తలపెట్టిన మధ్యాహ్న భోజన పథకం అమలులో మరో మోసం వెలుగుచూసింది. పథకం అమలులో భాగంగా పాఠశాలలకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల తూకంలో భారీ వ్యత్యాసం ఉంటోంది. ప్రతి బస్తా తూకంలో నాలుగు నుంచి ఐదు కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్టు బయటపడుతోంది. జిల్లాలో ఏటా 493 మెట్రిక్ టన్నుల బియ్యం ఈ విధంగా పక్కదారి పడుతున్నట్టు సమాచారం. నిర్ధేశిత కోటా ప్రకారం ఒక పాఠశాలలో నెలరోజులపాటు సరిపోవాల్సిన బియ్యం.. రెండ్రోజుల ముందే నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరు టీచర్లు బడికి వచ్చే కోటాను బయట మార్కెట్లో తూకం వేస్తే ఈ వాస్తవం వెలుగుచూసింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో 2,369 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,594 ప్రాథమిక పాఠశాలలు, 250 ప్రాథమికోన్నత పాఠశాలలు, 525 ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఎయిడెడ్ పాఠశాలలున్నా యి. వీటిలో 3.75 లక్షల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం కింద వీరికి ఏటా 8,220 మెట్రిక్ టన్ను ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాఠశాలల పనిదినాల్లో విద్యార్థులందరికీ ఈ కోటాతో మధ్యాహ్న భోజనాన్ని అందించవచ్చు. అయితే నిర్ధేశించిన కోటాకంటే తక్కువ మొత్తంలో బియ్యం అందడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. సీల్డ్ బ్యాగే కదా అని అనుకుంటే.. ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచే అందుతుంది. అక్కడ తూకం వేసిన తర్వాత నిర్ధేశించిన కోటా మేరకు మండల కేంద్రాలకు చేర్చితే.. అ తర్వాత పాఠశాలలకు ఆ కోటా వెళ్తుంది. అయితే బడికి అందాల్సిన మేరకు సీల్డ్ బ్యాగులు వచ్చినప్పటికీ.. వాటిని తూకం వేస్తే మాత్రం తక్కువ మొత్తంలో బియ్యం ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీంతో పిల్లలకు అరకొరగా భోజనాన్ని వడ్డించాల్సి వస్తోంది. ఇటీవల హయత్నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్ధేశిత కోటా మేరకు బియ్యం వచ్చినప్పటికీ.. వాటిని సమీపంలో ఉన్న దుకాణంలో తూకంవేస్తే సగటున బ్యాగుకు 4- 5 కిలోల మేర తక్కువ వచ్చినట్టు బయటపడింది. ఇదేతరహాలో అన్ని పాఠశాలల్లో బియ్యం తక్కువున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. జెడ్పీహెచ్ఎస్ ఉప్పల్, జెడ్పీహెచ్ఎస్ రాగన్నగూడ, జెడ్పీహెచ్ఎస్ ఇంజాపూర్, సోమన్గుర్తి, పరిగి బాలుర ఉన్నత పాఠశాలల్లో ఇదేతరహాలో బియ్యం తూకంలో తేడాలు వచ్చినట్టు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గతవారం ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఏకంగా కలెక్టర్ రఘునందన్రావుకు బియ్యం తూకంలో తేడాలున్నట్లు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్ది అనైతిక పాలన
-
3 లక్షల అప్పు కాని 16 లక్షల చెల్లింపు!
-
సో్లార్ ప్రాజెక్టులో అక్రమాలు
-
అవినీతి పాఠాలే..
ఉపాధ్యాయుల బది‘లీలలు’ నిజమే 52 మంది అక్రమంగా బదిలీ నిర్ధారించిన విద్యాశాఖ అధికారులు చర్యలు శూన్యం.. గత తప్పిదాలే పునరావృతం ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: శిశువుకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు ధర్మం, నీతి, న్యాయం బోధించాల్సిన పాఠశాలలో ‘అక్రమాల’ ప్రాక్టికల్స్ సాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు బాధ్యుణ్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డీఈవో రాజేశ్వర్రావును సస్పెండ్ చేసింది. (ఇటీవల మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు). కానీ అక్రమ పోస్టులు ఏవో... ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పటి వరకు గుర్తించకపోవటం, వారికి ఎలాంటి శాఖాపరమైన చర్యలు లేకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాత డీఈవో చేసిన తప్పదాలు కప్పిపెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూన్లో ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ చేపట్టింది. అర్హత ఉన్న మొత్త 4,394 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా వారిలో 1,200 మంది సాధారణ ఉపాధ్యాయులు, 375 ప్రధానోపాధ్యాయులను బదిలీ చేశారు. ఈ బదిలీల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ విచారణ చేపట్టి అక్రమాలు నిజమే అని నిర్ధారించింది. 52 మంది ఉపాధ్యాయులు అక్రమంగా బదిలీ అయ్యారని ప్రాథమికంగా నిర్ధారించింది. మరింత శోధన చేస్తే మరి కొంతమంది అక్రమార్కులు కూడా బయటికి వస్తారని సూచించింది. కానీ అక్రమాలకు పా ల్పడిన టీచర్లపై ఇప్పటి వరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు లేకపోవడం గమనార్హం. ఫోకల్ పోస్టుకు రూ. 50 వేలు.... పదోన్నతులు ప్రారంభమయ్యే నాటికే రేషనలైజేషన్ (హేతుబద్దీరణ) ప్రక్రియ పూర్తిచేసి ఆ సమాచారం ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంచాలి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఆ వివరాలను రోజుల తరబడి ఆన్లైన్లో పెట్టకుండా తాత్సారం చేయడంతోనే అక్రమాలకు బీజం పడిందని అధికారులు నిర్ధారించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయు పోస్టులు, ఖాళీలు, హేతుబద్దీరణలో సర్ప్లెస్ అయిన పోస్టులను, అలాట్ అయిన పోస్టుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూపించాల్సి ఉండగా.. విద్యాశాఖ అధికారులు వాటి వివరాలను గోప్యంగా ఉంచి కొన్ని ఖాళీలను ఆన్లైన్లో బ్లాక్ చేసి పెట్టారు. తరువాత ఆ పోస్టులను తమ అనుకూలమైన వారికి అమ్ముకున్నారు. ప్రధానంగా 30 శాతం హెచ్ఆర్ఏ అదనంగా ఉండి, హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, సంగారెడ్డి, నర్సాపూర్ మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులకు కోసం ఉపాధ్యాయులు ఎగబడ్డారు. ఎవరికి తోచిన విధంగా ఉత్తరం, దక్షిణాలతో పైరవీలు చేసుకున్నారు. ఫోకల్ స్థాయిని బట్టి ఒక్కొక్క అక్రమ బదిలీకి రూ. 25 వేల నుంచి రూ. 50 వరకు ముట్టజెప్పినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఉపాధ్యాయ బదిలీల్లో ప్రిఫరెన్షియల్ కోటా ఉంది. వితంతువులు, దంపతుల్లో అనారోగ్యం ఉన్నవారు ఈ విభాగం పరిధిలోకి వస్తారు. ప్రిఫరెన్సియల్ కోటా కింద 77 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. కోటాలో 15 మంది ఉపాధ్యాయులు తప్పుడు ధ్రువపత్రాలను సవృర్పించి అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ‘స్పౌ’ కేసుల్లో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు తేలింది. ఐదేళ్లకు ఒకసారి వినియోగించుకోవాల్సిన ఈ వెసులుబాటును కొంతమంది ఉపాధ్యాయులు ఏడాది తిరగక ముందే మరోసారి వినియోగించుకున్నట్లు తేలింది. కొంతమందైతే భార్యాభర్తలు కాకుండానే భార్యభర్తలుగా తప్పుడు పత్రాలు చూపించి పోస్టింగ్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. విద్యాశాఖ అధికారులు గుర్తించిన 52 మందిపై చర్యలు తీసుకొని అర్హులకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికిపై డీఈవో నజీమొద్దీన్ వివరణ కోరగా అక్రమ బదిలీల వ్యవహారంపై ఆర్జేడీ అధికారి ఆధ్వరంలో విచారణ కొనసాగుతోందని, దీనిపై తానేమి చెప్పలేనన్నారు. -
డిల్లీలో ముదురుతున్న ఆక్రమణల తొలగింపు వ్యవహరం
-
అక్రమ కట్టడాల కూల్చివేత
-
’సాక్షి’ని చూసి బ్రోకర్లు పరుగులు
-
కదులుతున్న ఏఎస్సై మోహన్రెడ్డి ఫైనాన్స్ దందా
-
‘సబల’ నిధులు స్వాహా..!
ఐసీడీఎస్లో మరో అక్రమం ⇒ రూ.75 లక్షలు ఖజానా నుంచి అడ్వాన్స్ గా డ్రా ⇒ శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే..! ⇒ కలెక్టర్నే తప్పుదోవ పట్టించిన వైనం ⇒ సబల నిలిపివేతతో నిధుల కైంకర్యానికి పన్నాగం ఆదిలాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మరో భారీ అక్రమం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సీడీపీవో లక్షల నిధుల స్వాహా వ్యవహారం మరువక ముందే.. తాజాగా ఈ వ్యవహారాన్నే తలదన్నేలా మరోటి చోటుచేసుకుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందకుండానే ట్రెజరీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సబల పథకానికి సంబంధించిన రూ.75 లక్షలు అడ్వాన్స్గా డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం నిలిచిపోతుందని ముందుగానే తెలిసిన శాఖలోని పలువురు అధికారులు.. ఈ నిధులను తమ కమీషన్ల కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పథకం నిధులు మరో పథకానికి మళ్లించొద్దని నిబంధనలున్నా.. అధికారులు తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతిలేకుండానే.. ఐసీడీఎస్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రతి కొనుగోలుకు సం బంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను చైర్మన్గా ఉన్న కలెక్టర్ అనుమతి పొంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో సబల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతినెలా కిశోర బాలికలకు 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె సరుకులను అందజేస్తారు. కాగా.. గత మార్చిలో రూ.75 లక్షలు ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ నుంచి అడ్వాన్స్గా డ్రా చేశారు. నూనె కొనుగోలు కోసం రూ.75 లక్షలు డ్రా కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు ప్రతిపాదించారు. కలెక్టర్ అనుమతితో ఆ నిధులను డ్రా చేశారు. అయితే.. ఇప్పటి వరకు నూనె కొనుగోలు కోసం ఏపీ ఆయిల్ ఫెడ్కు చెల్లించకపోవడం గమనార్హం. ఆ నిధులను అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అధికారులపై ఇందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కోడిగుడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబల నిధులను కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించాలనే యత్నాలు ఏ విధంగా సబబన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలకు భారీగా కమీషన్లు ముడుతుండడంతోనే ఈ నిధులు మళ్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయం అధికారులు దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అడ్వాన్స్గా డ్రా చేసిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కలెక్టర్కు ప్రతిపాదించిన దానిలో నూనె కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ నిధులను తమ కమీషన్ల కక్కుర్తి కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్కు చెల్లించాలని చూడ్డం విస్తుకలిగిస్తోంది. ఐసీడీఎస్కు చైర్మన్గా ఉన్న కలెక్టర్నే ఈ వ్యవహారంలో ఐసీడీఎస్ అధికారులు తప్పుతోవ పట్టించారు. ఇప్పుడు ఆ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమంటే కలెక్టర్ వరకు వ్యవహారం వెళ్తుందని వారిలో గుబులు మొదలైంది. సబల నిలిపివేత.. సబల పథకం నిలిపివేస్తున్నట్లు మే 5న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తుండగా తాజాగా నిలిపివేశారు. కిశోర బాలికలకు ప్రతినెలా 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె, 16 కోడిగుడ్లను అందజేసేవారు. ప్రతి లబ్ధిదారుడికి రోజూ రూ.5 విలువైన సరుకులను నెల కోసం అందిస్తారు. 11 నుంచి 18 ఏళ్ల వయసుగల బడిబయట పిల్లలు సుమారు 1.23 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నిలిపివేశారు. పథకం నిలిచిపోతుందని తెలిసే జిల్లా యంత్రాంగాన్నే తప్పుతోవ పట్టించి పీడీ కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులను అడ్వాన్స్గా డ్రా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ‘సాక్షి’ వివరణ కోరగా మార్చి నెలలో సబలకు సంబంధించిన రూ.75.76 లక్షలను నూనె కొనుగోలు కోసం ట్రెజరీ నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. వీటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు. -
రూ.50 కోట్లకు కుచ్చుటోపీ
దేశ విదేశాల్లో 32 వేల మందిని గొలుసుకట్టు పేరుతో మోసం చేసిన న్యూజిలాండ్ మహిళ కర్ణాటకలో 300 మంది, హైదరాబాద్లో 100 బాధితులు మహిళతో సహా నలుగురి అరెస్ట్ బెంగళూరు : గొలుసుకట్టు వ్యాపారం పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్న విదేశీయురాలితో సహా నలుగురు వ్యక్తులను నగర సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విదేశీయురాలి చేతిలో దేశ విదేశాల్లో కలిపి దాదాపు 32 వేల మంది మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు మీడియాకు గురువారం వెల్లడించిన వివరాల మేరకు.. మూలతహా న్యూజిల్యాండ్కు చెందిన డేనిసే అనే మహిళ చట్టవ్యతిరేకంగా గొలుసుకట్టు వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ సంస్థలో ప్రాథమిక సభ్యుడిగా చేరేవారు రూ.8 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సంస్థలో ఏజెంట్గా విధులు నిర్వర్తించేవారు రూ.25 వేలు చెల్లించాలి. ప్రాథమిక సభ్యత్వం పొందినవారు కాని ఏజెంట్గా చేరిన వారు కాని తర్వాత మరో ఇద్దరిని చేర్చాలి. ఇందుకు గాను ప్రాథమిక సభ్యత్వం పొందిన వ్యక్తికి ఒక్కొక్క సభ్యున్ని చేర్పించినందుకు గాను 25 నుంచి 50 శాతం సంస్థ కమీషన్గా చెల్లిస్తుంది. అదే విధంగా నూతనంగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు గాను వారికి కూడా కమిషన్ అందుతుంది. ఈ మేరకు పాకిస్తాన్, దుబైతోపాటు చాలా దేశాల్లో ఏజెంట్లను చేర్పించుకుని గొలుసుకట్టు వ్యాపారం చేసింది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో బెంగళూరు నగరాన్ని చేరుకుని ఓ రాజ్భవన్కు దగ్గరగా ఉన్న పంచనక్షత్రాల హోటల్లో బసచేసింది. తర్వాత వివిధ ఇన్సురెన్స్ కంపెనీల్లో ఏజెంట్లుగా పనిచేస్తున్న మహ్మద్ కురుం, కిరణ్ మోది, హితేష్ మోదిని లోబరుచుకుని వారి ద్వారా రాష్ట్రంతోపాటు పొరుగున ఉన్న ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా లావాదేవీలు ప్రారంభించారు. అక్టోబర్ నుంచి విదేశీయురాలు రాజ్భవన్కు దగ్గరలోని హోటల్లో ఉండటం, ఆమె నడవడిక అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కూపీలాగారు. ఖచ్చితమైన సమాచారంతో ఆమె బసచేస్తున్న హోటల్పై దాడిచేశారు. ప్రధాన నిందితురాలు డేనిస్తోపాటు మిగిలిన ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ల్యాప్ట్యాప్, కొన్ని హార్డ్డిస్క్లు, ఫోన్లు స్వాధీనం చేసుకుని నిపుణుల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈమె చేతిలో దాదాపు 32,339 మంది రూ.50 కోట్ల వరకూ మోసపోయినట్లు వెలుగుచూసింది. నిందితులను కబ్బన్పార్క్ పోలీస్స్టేషన్లో సీసీబీ పోలీసులు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. డేనిసే చేతిలో వివిధ దేశాల్లో మోసపోయిన వారు... అమెరిక - 2 వేల మంది, ఇండియా - 1,700, మలేషియా - 28 వేలు, న్యూజిలాండ్ - 500, దుబాయ్ - 200, పాకిస్తాన్ - 100 దేశంలోని వివిధ రాష్ట్రాల్లో... కర్ణాటక-300, మహారాష్ట్ర-800, ఢిల్లీ-100, పంజాబ్ -100, మధ్యప్రదేశ్ -300, హైదరాబాద్ -100 మంది -
మందు బాబులకు ముప్పు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో అక్రమ, నకిలీ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలోని కొందరు అధికారుల అండతోనే ఈ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. దీనిబారిన పడి మందు బాబుల ఆరోగ్యం గుల్లవుతోంది. సర్కారు ఖాజానాకు కూడా భారీగా గండిపడుతోంది. పేరుమోసిన కొందరు మద్యం వ్యాపారులతో పాటు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. వ్యాపారులకు అధికార పార్టీ అండ ఉండడం, తమకూ కాసుల పంట పండుతుండడంతో ఆబ్కారీ అధికారులు.. ప్రజల ఆరోగ్యం, సర్కారు ఆదాయాన్ని గాలి కొదిలేశారు. అక్రమ వ్యాపారానికి జై కొడుతున్నారు. ‘అనంత’లోని దుకాణాలకు కర్ణాటక నుంచి అక్రమ మద్యం రవాణా అవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. కర్ణాటక సరిహద్దు మండలాలైన కుందుర్పి, కంబదూరు, శెట్టూరు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్, గుమ్మఘట్ట, చిలమత్తూరు, రొద్దం, విడపనకల్లు, మడకశిర, అగళి, అమరాపురం, గుడిబండ, రొళ్ల మీదుగా జిల్లాలోకి కర్ణాటక మద్యం ప్రవేశిస్తోంది. ఈ పరిధిలోని చెక్పోస్టు అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు అక్రమ రవాణాకు అనధికారిక అనుమతి ఇచ్చేశారు. ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్తో భారీ లాభాలు రాష్ట్రంలోని మద్యం ఎక్ట్రా నూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ)తో తయారవుతోంది. అదే కర్ణాటకలో రెక్టిఫై స్పిరిట్ (ఆర్ఎస్)తో తయారు చేస్తున్నారు. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్ కాగా.. ఆర్ఎస్ సింగిల్ ఫిల్టర్. ఈఎన్ఏ లీటర్ రూ.42-45 ఉంటే.. ఆర్ఎస్ రూ.28-30కే మందు బాబులకు ముప్పు లభిస్తుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక మద్యం ఆంధ్రా కంటే తక్కువ ధరకే దొరుకుతోంది. ఛీప్ లిక్కర్ 180 ఎం.ఎల్ క్వార్టరు బాటి ళ్లు ఒక్కో కేసులో 48 ఉంటాయి. ఒక్కో క్వార్టర్ బాటిల్ ధర మార్కెట్లో రూ.45 ఉంది. ఛీప్ లిక్కర్ కంటే కొంచెం మెరుగ్గా ఉండే డిప్ 90 ఎం.ఎల్ బాటిళ్లు ఒక్కో కేసులో 96 ఉంటాయి. ఒక్కో డిప్ బాటిల్ విలువ రూ.55. కర్ణాటకకు చెందిన ఛీప్, డిప్ రకాలు ‘అనంత’కు చేరుతున్నాయి. ఇవి మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జిల్లాలో నెలకు సగటున రూ.75 కోట్ల మద్యం అమ్మకాలు సాగితే, అందులో కర్ణాటక మద్యం వాటా రూ.7-9 కోట్ల వరకు ఉంటోంది. ఈ లెక్కన ఏటా రూ.84 కోట్ల నుంచి రూ.108 కోట్ల అక్రమ మద్యం జిల్లాలో అమ్ముడవుతోంది. పైగా జిల్లాలో మద్యం విక్రయాలు ఎమ్మార్పీ కంటే రూ.10-15 అధికంగా సాగుతున్నాయి. దీనివల్ల వ్యాపారులకు మరింత లాభం చేకూరుతోంది. ఆబ్కారీ కనుసన్నల్లోనే.. హిందూపురం, కొత్త చెరువుతో పాటు పలు ప్రాంతాల్లోని దుకాణాల్లో కర్ణాటక మద్యం చాలాసార్లు అధికారుల కంట పడింది. ఓబిరెడ్డి అనే వ్యాపారి గతేడాది అక్టోబరులో 250 లీటర్ల కర్ణాటక మద్యం రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో అతనితో పాటు కొన్ని దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయినా అక్రమ దందా ఆగలేదు. కర్ణాటక మద్యం విక్రయాలు జరిగే దుకాణాలపై దాడులు చేయకుండా ఉండేందుకు ప్రతినెలా ఒక్కో దుకాణం నుంచి రూ.10-15 వేలు అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. కర్ణాటక లేబుళ్లను మార్చి వ్యాపారులు మద్యం విక్రయిస్తున్నారు. ఇది మరో రకం కల్తీ బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్షాపుల్లో విక్రయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో చవకగా వస్తుందని మన రాష్ట్రంలో పన్ను ఎగ్గొట్టి కొనుగోలు చేసి విక్రయించే సరుకు రెండో రకం. దీన్ని ‘సెకండ్స్’అంటారు. ఎలాంటి ఎక్సైజ్ డ్యూటీ చెల్లించకుండా స్పిరిట్, అవసరమైన పదార్థాలతో సొంతంగా తయారు చేసి విక్రయించేది మూడో రకం(థర్డ్). జిల్లాలో ఈ రకం విక్రయాలు కూడా జోరందుకుంటున్నాయి. కర్ణాటక నుంచి తెచ్చే మద్యాన్ని బేసిన్లు, టబ్లలో పోసి నీళ్లు, రంగు, స్పిరిట్ కలిపి మద్యం సీసాల్లో నింపి అమ్ముతున్నారు. కాగా, నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయడానికి బాధితులు జంకుతున్నారు. ఫిర్యాదు చేస్తే వైన్ షాపు యజమాని నుంచి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.త్వరలోనే కేసు నమోదు చేస్తాం: జీవన్ సింగ్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్కర్ణాటక మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వ్యాపారుల పేర్లు కూడా తెలిశాయి. నిఘా పెట్టాం. వారిని త్వరలోనే పట్టుకుంటాం. దుకాణాల్లో స్టాకు వివరాలు తీసుకుంటున్నాం. గతేడాదితో పోల్చితే స్టాకు తగ్గితే.. అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నాం. ఉన్న మద్యాన్ని తనిఖీ చేస్తున్నాం. కర్ణాటక మద్యం విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేశాం. నకిలీ మద్యం తయారీ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. దీనిపైనా రెండు కేసులు నమోదు చేశాం. సిబ్బంది పాత్రపై విచారిస్తాం. అక్రమ, నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించే ప్రసక్తే లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ బిల్లులు వస్తే అన్నింటికీ చెక్ పడుతుంది. నకిలీ మద్యంతోప్రాణాపాయం నకిలీ మద్యం మనిషిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మద్యంలో కల్తీ స్థారుుని బట్టి మెదడు, లివర్, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. క్రమేణా ఆ సమస్య పెరిగి పెద్దదవుతుంది. కల్తీ తీవ్రత అధికమైతే కంటిచూపు పోవడంతో పాటు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి కోమాలోకి పోయే ప్రమాదముంది. ఏ క్షణంలోనైనా ప్రాణాలు కూడా పోవచ్చు. ఛీప్, నకిలీ మద్యం కారణంగా చాలా మందికి లివర్ సమస్యలు పెరుగుతున్నారుు. మద్యపానమే హానికరం. అలాంటిది ఛీప్, నకిలీ మద్యం సేవిస్తే ముప్పు తప్పదు. - డాక్టర్ శివకుమార్, సర్వజనాస్పత్రి, అనంతపురం -
హజ్హౌస్ వద్ద విద్యుత్ ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లి హ జ్హౌస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్లోని కండ్వా జిల్లాకు చెందిన రూపేందర్(22) కౌశిల్(21) రింకేష్(22), సుశీల్యాదవ్(22)లు మృతి చెందగా, నగీన్, మునీష్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మునీష్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు ఉస్మానియాలో చికిత్సలు అందిస్తున్నారు. వీరంతా జూబ్ల్లీబస్స్టేషన్ వద్ద జమ్నా సర్కస్ లో పని చేసేందుకు నెల రోజుల కిందట వచ్చి, తిరిగి స్వస్థలానికి వెళ్లేందుకు నాంపల్లి రైల్వేస్టేషన్కు బయలు దేరారు. హజ్హౌస్ వద్దకు చేరుకోగానే భారీ వర్షం కురియడంతో రక్షణ కోసం పక్కనే ఉన్న బస్టాప్లో నిలబడ్డారు. భారీ వర్షానికి బస్టాప్ ముందు వరదనీరు వచ్చిచేరింది. ఇదే సమయంలో అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్న కరెంటు వైరు ఊడిపోయి హజ్యాత్ర కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లపై పడింది. దీంతో బస్టాప్లోని ఇనుప పైపులకు విద్యుత్ సరఫరా జరిగి వాటికి ఆనుకుని నిల్చున్న వారికి విద్యుత్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని మెడ్విన్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అందులో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని ఉస్మానియాకు తరలించగా, వారిలో ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మేయర్ మాజిద్హుస్సేన్, డీజీపీ అనురాగ్శర్మ సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశాలు జారీ చేశారు. -
దేవలయ భూముల్ని కబ్జా చేశారు!
-
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు నిలిపి వేయండి : సుప్రీం
-
టీడీపీకి పోలీసుల వత్తాసు
- మా జెడ్పీటీసీ అరెస్టు అక్రమం - ఎమ్మెల్యేలపై కేసులు అన్యాయం - పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి - వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని ఒంగోలు అర్బన్ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆరోపించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుట్ర కోణంలో భాగంగా జెడ్పీ చైర్మన్ ఎన్నిక రోజే తమ పార్టీ మార్కాపురం జెడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డిని డీఎస్పీ రామాంజనేయులుతో తెలుగు తమ్ముళ్లు అరెస్టు చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నా జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు టీడీపీ ఎన్నో ఎత్తులు వేయగా పోలీసు యంత్రాంగం వాటికి సహకరించిందని నూకసాని విమర్శించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అండతో వైఎస్సార్ సీపీ నాయకులపై దౌర్జన్యాలకు దిగిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ కుట్రలకు వైఎస్సార్ సీపీ బ్రేక్ టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోలేకపోయిందని బాలాజీ వ్యంగ్యంగా అన్నారు. తనను టీడీపీలో అణగదొక్కుతున్నారని, ఈ సారికి సహకరించాలని ఈదర హరిబాబు కోరినందునే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఆయనకు అండగా నిలిచారని వివరణ ఇచ్చారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న ఉద్దేశంతోనే ఈదర కోరికను వైఎస్సార్ సీపీ అంగీకరించిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ సభ్యులు తన మాయలో పడ్డారని ఈదర హరిబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ఈదర మాటలు ఏరుదాటాక తెప్ప తగలేసినట్లు ఉన్నాయని, సీనియర్ నాయకునిగా అలా మాట్లాడటం సరికాదని బాలాజీ హితవు పలికారు. ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ధే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తోందని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలు, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం మానుకోకుంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాలాజీ హెచ్చరించారు. ఆయనతో పాటు పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ఉన్నారు. -
క్షయ విభాగంలో డబ్బు జబ్బు
సాక్షి, ఏలూరు : ప్రభుత్వ శాఖలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలొస్తే వాటి అధిపతులు వెంటనే సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ.. జిల్లా క్షయవ్యాధి నివారణ కేంద్రంలో అవినీతికి అడ్డూపదుపూ లేకుండా కొనసాగుతూనే ఉంది. చిన్నపాటి వర్షానికే నీరుచేరి ముంపుబారిన పడే ఈ కార్యాలయానికి ప్రహరీ గోడను నిర్మించుకోలేకపోతున్నప్పటికీ.. తప్పు డు బిల్లులతో సొమ్ములు దోచుకుంటున్నారు. క్ష య నివారణ కేంద్రంలో 22 మంది శాశ్వత , 46 మంది తాత్కాలిక ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా, డీఎంహెచ్వో ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ఈ విభాగంలో ప్రతి పనీ వీరి ఆదేశాలకు లోబడే జరగాలి. కానీ ఎన్ని ఆరోపణలొచ్చినా ఈ విభాగంపై ఉన్నతాధికారులుదృష్టి సారించకపోవడం విశేషం. పొంతనలేని లెక్కలు ఈ విభాగం అవసరాల కోసం ఇటీవల కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు. ల్యాప్టాప్లు, ట్యాబ్లు విసృ్తత వాడుకలోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో సాధారణ డెస్క్టాప్ కంప్యూటర్కు రూ.52వేలు ఖర్చయ్యిందంటే ఆశ్చర్యమే. రేకు బీరువాలకు గోద్రేజ్ అని స్టిక్కర్ వేసి తీసుకువచ్చేశారు. చిన్నసైజు ప్రింటర్, స్కానర్లకు రూ.24 వేలు ఖర్చు చూపించారు. రెండు కంప్యూటర్ టేబుళ్ల కోసం రూ.9,300 లెక్క చూపారు. కంప్యూటర్ ముందు కూర్చోవడానికి కొన్న కుర్చీ ఖరీదు రూ.7,200. ఇలాంటివి మూడు కొన్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఇవన్నీ ఒకే కాంట్రాక్టరు నుంచి తీసుకున్నారు. ఒక్కో వస్తువుకు ముగ్గురు కాంట్రాక్టర్లు బిడ్ వేసినప్పటికీ అన్ని టెండర్లలోనూ ఆ కాంట్రాక్టర్కు చెందిన కంపెనీయే తక్కువ మొత్తం కోట్ చేసిందట. లక్షలు ఖరీదు చేసే టీబీ మం దులను పాడవకుండా చూసేందుకు ఏసీ అమర్చేలా 2009లో అనుమతి లభించినప్పటికీ నేటికీ కొనలేదు. కానీ దాదాపు రూ.1,98,265 ఖర్చు చేసి ఫర్నిచర్ కొన్నారు. లెక్కల్లో చూపిన ఖర్చులో సుమారు సగం సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోరుుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బిల్లులను ధ్రువీకరించిన ఉన్నతాధికారుల భాగస్వామ్యంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ అక్కమాల చిట్టా గతేడాది డిసెంబర్ 9వ తేదీన స్థానిక ఆర్ఆర్ పేటలోని డీసీసీబీ బ్యాంకు నుంచి క్షయ నివారణ శాఖకు చెందిన ఇద్దరు కాంట్రాక్టు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా పే స్లిప్లు సృష్టించి ఒక్కొక్కరూ రూ.50 వేల చొప్పున వ్యక్తిగత రుణాలు తీసుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా రూ.200 చొప్పున కమిషన్ను ఉన్నతాధికారికి సమర్పించేవారు. ఈ విషయాలను ‘సాక్షి’ అప్పట్లో బయటపెట్టటంతో డబ్బులు తీసుకోవడం మానేశారు. ల్యాబ్కు ఉపయోగించే పరికరాలను రూ.2.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసేందుకు బడ్జెట్ నిధులు విని యోగించారు. వాటిలో సగం సొమ్ము పక్కదారి పట్టిందని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఈ విభాగంలో కోట్లాది రూపాయల బడ్జెట్ లావాదేవీలన్నీ ఓ తాత్కాలిక ఉద్యోగి చేతుల మీదుగా నడుస్తున్నాయి. ఇదే ఉద్యోగి డేటా ఎంట్రీ ఆపరేటర్గా, అకౌంటెంట్గా రెండు ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఓ పోస్టు ఖాళీ చూపించారు. కానీ.. దానిని భర్తీ చేయకుండా అదే కాంట్రాక్టు ఉద్యోగి నేటికీ రెండు జీతాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నా దృష్టికి రాలేదు క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో రూ.లక్షలు ఖర్చుచేసి వస్తువులు కొన్న విషయం నా దృష్టికి రాలేదు. ఈ విభాగానికి సంబంధించి ఏది కొనాలన్నా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డిస్ట్రిక్ కోఆర్డినేషన్ హెల్త్ సర్వీసెస్ అధికారి, జిల్లా క్షయ నివారణాధికారి అనుమతి ఉండాలి. సిబ్బంది ఏం కొన్నారు, ఎంత ఖర్చు చేశారనే అనే విషయాలను పరిశీలించి ఒకటి రెండు రోజుల్లో చెబుతాను. -లక్ష్మణ్ జితానంద్, జిల్లా క్షయ నివారణ శాఖ ఇన్చార్జి అధికారి -
అక్రమాలకు పచ్చజెండా..!
- ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ చెక్పోస్టు - ఎలాంటి బిల్లులు లేకపోయినా సున్నం ఉత్పత్తుల రవాణ - చోద్యం చూస్తున్న మైనింగ్ విజిలెన్స్ అధికారులు పిడుగురాళ్ల: సున్నం ఉత్పత్తులకు పిడుగురాళ్ల ప్రసిద్ధి చెందిన పట్టణం. ఇక్కడ తయారయ్యే సున్నం మన రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం రవాణా అవుతోంది. సున్నం ఉత్పత్తులైన కాల్చిన సున్నం, సెమ్పౌడర్, లైమ్పౌడర్, చిప్స్, ముగ్గుకు పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. * ఈ రకాలను పేపరు, షుగర్, ఐరన్ ఓర్ తదితర పరిశ్రమల్లో వాడుతుంటారు. * పస్తుతంరోజుకు 120 నుంచి 150 లారీల సరకు ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. * కాల్చిన సున్నం, సెమ్పౌడర్ రవాణాకు మైనింగ్, వే బిల్లులు తప్పనిసరి. * మైనింగ్ బిల్లుకు రూ.1200, వే బిల్లుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ట్యాక్స్ చెల్లించాలి. * చిప్స్, ముగ్గు, లై మ్పౌడర్ తదితర ఉత్పత్తులకు 10 టన్నులకు రూ.400 మైనింగ్ బిల్లు చెల్లించాలి. బిల్లులు లేకుండానే రవాణా * నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే మైనింగ్ శాఖ నుంచి మైనింగ్ బిల్లులు, వాణిజ్య పన్నుల శాఖ నుంచి వే బిల్లులు మంజూరు చేస్తుంటారు. * ఈ వ్యాపారంలో ఎటువంటి అనుమతులు, లెసైన్స్లు లేకుండా వ్యాపారం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. * స్థానికంగా బిల్లులు కలిగిన వ్యాపారులను ఆశ్రయించి తమ వాహనాలను గమ్యస్థానాలకు చే ర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ ఆదాయాన్ని నష్ట పరుస్తున్నారు. * వ్యాపారం చేయని లెసైన్స్దారుల నుంచి కొందరు మైనింగ్, వే బిల్లులు తీసుకుని అసలు లెసైన్స్లు లేని వ్యాపారుల సున్నం లారీలను వారే స్వయంగా రవాణా చేస్తుంటారు. * మైనింగ్ బిల్లుకు రూ.1200 ఖర్చవుతుండగా, బిల్లులు కలిగిన వ్యాపారులు సున్నం వ్యాపారుల నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తూ ఎలాంటి బిల్లులు అవసరం లేదని, అంతా తామే చూస్తామని చెప్పి అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారంలో చెక్పోస్టు అధికారుల పాత్ర కీలకంగా వుండడంతో బిల్లులు లేని లారీలు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. * మైనింగ్ చెక్పోస్టు అధికారులతో టన్నుకు ఇంతని లెక్క కుదుర్చుకుని ఎటువంటి బిల్లులు లేకుండా సున్నం ఉత్పత్తులను రవాణా చేస్తున్నారు. చెక్పోస్టులు లేకపోవటంతో అక్రమాలు * గతంలో పొందుగల, చిలకలూరిపేట, విజయవాడ మార్గాలలో మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులు ఉండేవి. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం చెక్పోస్టులను ఎత్తివేసి మొబైల్ టీములను ఏర్పాటు చేసింది. ఇది అక్రమ బిల్లుల వ్యాపారులకు కలిసొచ్చింది. * మొబైల్ టీముల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. * పిడుగురాళ్ల నుంచి రవాణా అవుతున్న సున్నం ఉత్పత్తుల వాహనాలలో 80 శాతం వరకు మైనింగ్, వే బిల్లులు లేకుండా కేవలం క్యాష్పైనే నడుస్తున్నట్టు స్వయంగా వ్యాపారులే చెబుతున్నారు. * ఇలా అక్రమ రవాణా వల్ల మైనింగ్, వే బిల్లుల రూ పంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. వివరణ * సున్నం అక్రమ రవాణాపై దాచేపల్లి మైనింగ్ ఏడీ జి. రామచంద్రరావును వివరణ కోరగా విచారణ చేస్తానన్నారు. * అక్రమ రవాణా వ్యవహారాలను మైనింగ్ విజిలెన్స్ ఏడీ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఆయనను సంప్రదించాలని సూచించారు. * మైనింగ్ ఏడీ రామచంద్రయ్యను వివరణ కోరగా అక్రమ రవాణా వ్యవహారాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్నారు. -
అక్రమం ఎవ్వరు చేసినా అక్రమమే!
-
మూడో రోజు కొనసాగుతున్న కూల్చివేతలు.
-
అక్రమ కట్టడాలు కూలిపోతున్నాయ్!
-
పెద్దల జేబుల్లోకి పిల్లల నిధులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2010లో అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ప్రతి గురువారం సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలి. అంతేకాకుండా ప్రతి పీహెచ్సీ వైద్యాధికారి తన పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు సంవత్సరంలో రెండు పర్యాయాలు నేరుగా వైద్య పరీక్షలు చేయాలి. ఏ విద్యార్థికైనా ఆరోగ్యం బాగోలేకపోతే సమీపంలో ఆస్పత్రులకు రిఫర్ చేయాలి. ఈ క్రమంలో విద్యార్థులను పాఠశాల నుంచి ఆస్పత్రి తీసుకెళ్లేందుకు అయ్యే చార్జీలు, భోజనం కోసం జవహార్ బాల ఆరోగ్య రక్ష కింద విడుదల నిధులను ఖర్చు పెట్టాలి. ఇదంతా సామాజిక ఆరోగ్య పౌష్టికాహార కేంద్ర సముదాయం(సీహెచ్ఎన్సీ) ఆధ్వర్యంలో జరగాలి. ఈ క్లస్టర్ పరిధిలోని మండలాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ రిఫర్ చేసే సమయంలో అయ్యే ఖర్చులన్నీ భరించాలి. ఈ కార్యక్రమం అంతటినీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కనుసన్నల్లో జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్ పర్యవేక్షించాలి. కానీ జిల్లాలో ఈ విధంగా జరగడం లేదు. ప్రతి వారం వైద్య సిబ్బందితో తనిఖీలు గానీ, ఆరు నెలలకొకసారి పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు గానీ సక్రమంగా జరపడం లేదు. తూతూమంత్రంగా చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. విడుదలైన నిధులను మాత్రం పక్కదారి పట్టిస్తున్నారు. 2013-14 సంవత్సరానికి గాను ఎస్.కోట సీహెచ్ఎన్సీకి రూ.79 వేలు, గజపతినగరానికి రూ.52 వేలు, భోగాపురానికి రూ.52 వేలు, బొబ్బిలికి రూ.52 వేలు, బాడంగికి రూ.31 వేలు, నెల్లిమర్ల సీహెచ్ఎన్సీకి రూ.62 వేలు మంజూరయ్యాయి. ఎక్కడా విద్యార్థులకు పరీక్షలు చేసి, అనారోగ్యం ఉన్న విద్యార్థులను గుర్తించిన దాఖలాలు లేవు. ఆయాసీహెచ్ఎన్సీలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాదాపు విడుదలైన నిధులన్నీ నిరుపయోగంగా ఉండిపోయాయి. వాటిపై జిల్లా స్థాయి అధికారుల దృష్టి పడింది. ఖర్చు పెట్టకుండా ఉన్న నిధులన్నీ వెనక్కి ఇచ్చేయాలని సీహెచ్ఎన్సీ అధికారులను మౌఖికంగా ఆదేశించారు. దీనికి సీహెచ్ఎన్సీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విడుదలైన నిధులను నేరుగా ఇవ్వలేమని, ఖర్చు కాని కారణంగా తమకు ఏ ఖాతా నుంచి వచ్చాయో ఆ ఖాతాకే జమ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, జిల్లా స్థాయి అధికారులు వినిపించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా తామే ఖర్చు పెడతామని, నిధులిచ్చేయాల్సిందేనని ఒత్తిడి చేశారు. దీంతో సీహెచ్ఎన్సీ అధికారులు తలొగ్గక తప్పలేదు. జిల్లా అధికారులు చెప్పినట్టుగా వినకపోతే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో తమకు విడుదలైన నిధులను నేరుగా అందజేసేశారు. ఇంకేముంది చేతికొచ్చిన నిధులను ఒక్క నెలలోనే ఖర్చు చేసేసినట్టు జిల్లా స్థాయి అధికారులు చూపించేశారు. దీంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికైతే, ఆ నిధులను సీహెచ్ఎన్సీ అధికారులు తప్ప మిగతా వారు ఖర్చు చేసే అవకాశం లేదు. ఒక వేళ నిధులు మిగిలిపోతే అదే ఖాతాలో వేసి సరండర్ చేసేయాలి. విడుదలైన నిధులను ఏడాది పొడవునా ఖర్చు పెట్టాలే తప్ప ఒక్క నెలలో వెచ్చించడం సరికాదు. ఇందుకు భిన్నంగా జిల్లాలో ఖర్చవడంతో సందేహాలు నెలకొన్నాయి. దాదాపు పక్కదారి పట్టాయన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఇదే విషయమై జవహర్ బాల ఆరోగ్య రక్ష జిల్లా కో ఆర్డినేటర్ సుబ్రహ్మణ్యంను ‘సాక్షి’ వివరణ కోరగా సీహెచ్ఎన్సీల నుంచి నిధులు వెనక్కి తీసుకోవడం వాస్తవమేనన్నారు. కాకపోతే, వాటిని తాము యూనిఫాంగా ఖర్చు పెట్టేశామని చెప్పారు. -
పోలవరం ఆర్డినెన్స్ అక్రమం: కవిత
-
అడ్డగోలు వడ్డింపు
రిమ్స్ క్యాంపస్, న్యూస్లైన్: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో.. అన్న రీతిలో ఉన్నతాధికారులు వ్యవహరించారు. ఎంతో డిమాండ్.. మరెంతో ఆదాయం సమకూర్చే రిమ్స్ క్యాంటీన్ను అడ్డగోలుగా తమ వారికి కట్టబెట్టారు. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ను టెండర్ ద్వారా దక్కించుకోవాలని కొంతకాలంగా ఎదురుచూస్తున్న పలువురిని అసలు టెండర్ ప్రక్రియే లేకుండా చేసి తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈ పని రిమ్స్ అధికారులే చేశారా అంటే.. అబ్బే తాము కాదు.. జిల్లా ఉన్నతాధికారే సిఫారసు చేశారని చెప్పుకొస్తున్నారు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సాగిన ఈ అడ్డగోలు భాగోతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో ఇప్పటికి వరకు రోగులు, వారితో వచ్చే వారికి క్యాంటీన్ లే దు. రిమ్స్గా మారకముందు.. జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉన్నప్పుడు 2005 వరకు ఇక్కడ క్యాంటీన్ ఉండేది. ఆస్పత్రి స్థాయి పెరిగి రిమ్స్గా మారినా.. ఇప్పటివరకు క్యాంటీన్ మాత్రం ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రోజూ రిమ్స్కు వచ్చే రోగులు, వారి బంధువులు ప్రతి దానికీ బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట క్యాంటీన్ ఏర్పాటు చేయాలని రిమ్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే చాలా కాలం ఆ నిర్ణయం అలాగే ఉండిపోయింది. ఏమైందోగానీ.. ఇటీవల అధికారులు హడావుడిగా క్యాంటీన్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తి కావచ్చింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయాల్సిన సమయం వచ్చింది. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. నిబంధనల ప్రకారం క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్ట్ ఖరారు చేయడానికి టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ ఎటువంటి టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయకుండానే నోటిమాటతో ఓ వ్యక్తికి కాంట్రాక్టును కట్టబెట్టేందుకు రిమ్స్ అధికారులు సిద్ధమయ్యారు. రిమ్స్కు కాస్త దూరంలో కొద్ది నెలల క్రితం వరకు ఓ హోటల్ నడిపిన వ్యక్తికి దీన్ని అప్పగించే తతంగాన్ని దాదాపు పూర్తి చేసేశారు. అది కూడా చాలా తక్కువ ధరకే ఖరారు చేసినట్లు విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. ఓ మహిళా సంఘం పేరుతో సదరు వ్యక్తికి క్యాంటీన్ కాంట్రాక్ట్ కట్టబెట్టేస్తున్నారు. ఇందుకోసం కేవలం రూ.50వేల డిపాజిట్, నెలకు రూ.5వేల అద్దెగా నిర్ణయించినట్టు రిమ్స్ వర్గాల ద్వారానే తెలిసింది. టెండర్లు పిలవకుండా అడ్డదారిలో ఏ విధంగా క్యాంటీన్ను కేటాయిస్తారంటూ టెండర్ వేసేందుకు గత రెండేళ్లుగా ఆసక్తితో ఎదురుచూస్తున్నవారు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. రిమ్స్ ఆదాయానికి గండి ఈ అడ్డగోలు దందా కారణంగా రిమ్స్ ఆదాయానికీ భారీగానే పడుతుందని అంటున్నారు. జిల్లాకే పెద్ద దిక్కయిన రిమ్స్ నిత్యం వందలాది రోగులు, వారి బంధువులు వస్తుంటారు. పెద్ద సంఖ్యలో ఇన్ పేషెంట్లు ఉంటారు. వారితోపాటు సహాయకులు ఉంటారు. రిమ్స్ మొత్తానికి ఇదే ఏకైక క్యాంటీన్ కావడం.. ఇతర హోటళ్లు, టీస్టాళ్లు రిమ్స్ ఆవరణకు ఆవల దూరంగా ఉండటం వల్ల రిమ్స్లో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్కు డిమాండ్ ఎక్కువగా ఉండి, ఆదాయం కూడా భారీగా వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే అంచనాతో టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. క్యాంటీన్కు ఉన్న డిమాండ్ను బట్టి డిపాజిట్ కనీసం రూ.2 లక్షలైనా వసూలు చేయాల్సి ఉంటుందని, నెలవారీ అద్దె కనీసం రూ. 10వేల నుంచి 15వేల వరకు నిర్ణయించాల్సి ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. కానీ దీనికి భిన్నంగా అతి తక్కువ డిపాజిట్, నెలసరి అద్దెకే క్యాంటీన్ను ధారాదత్తం చేసేయడానికి అధికారులు సిద్ధపడటం వెనుక లాలూచీ ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్ ద్వారా క్యాంటీన్ కాంట్రాక్ట్ ఖరారు చేస్తే ఇంతకంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుందని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారి సిఫారసు? క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టును పలానా వ్యక్తికి ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారి ఒక సిఫారసు చేశారని రిమ్స్ ఉన్నతాధికారి ఒక చెప్పారు. కనీసం టెండర్లయినా పిలవాలి కదా? అని ప్రశ్నిస్తే.. ఆ పిలుస్తాం లెండి అని మాట దాట వేశారు. దీన్ని బట్టి క్యాంటీన్ కాంట్రాక్టు ఖరారులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అం దరికీ న్యాయం చేయాల్సిన జిల్లా ఉన్నతాధికారే అడ్డదారిలో వేరొకరికి క్యాంటిన్ను ధారాదత్తం చేస్తే ఎలా అని క్యాంటీన్ నిర్వహణను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. ఒకవేళ రిమ్స్ అధికారులే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడి ఉంటే జిల్లా ఉన్నతాధికారి కల్పించుకొని టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అక్రమ గ్యాస్ రీఫిలింగ్ సెంటర్లపై దాడి