cyber attack
-
నివా బూపా హెల్త్పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
సడన్ ఫేమ్.. డీప్సీక్పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్సీక్(DeepSeek)పై సైబర్దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్(AI Chat Bot) సేవలందించే డీప్సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్సీక్కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్సీక్కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
సెన్స్ చూపితేనే.. సీన్ మారేది!
రూ.20 లక్షలు.. ఓ పేద కుటుంబానికి అసాధ్యమైన మొత్తం. దిగువ మధ్య తరగతికి జీవితం. మధ్య తరగతికి కొన్ని దశాబ్దాల కష్టం. ఉన్నత వర్గాలకు సైతం పెద్ద లెక్కే. ఇంతటి నగదుని నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్లో పోగొట్టుకున్నారు. దీనిపై ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరగాళ్ల మాటకు భయపడిపోతున్న సామాన్యులు సాధారణ పోలీసులు శాంతిభద్రతలు, నేరాలకు సంబంధించిన వ్యవహారాలు, సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ఫ్రాడ్స్, కస్టమ్స్ అధికారులు సుంకం ఎగవేత, అక్రమ రవాణా వ్యవహారాలు పర్యవేక్షిస్తారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. రూ.20 లక్షలకు సంబంధించిన కేసు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిస్తే.. 1. బాధితుడికి సైబర్ నేరగాళ్లు తాము ఇంటర్నేషనల్ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. మీ ఆధార్ కార్డుతో బ్యాంకాక్కు బుక్ అయిన పార్శిల్లో పాస్పోర్టులు, ఏటీఎం కార్డులు, బ్యాంకు పత్రాలు, 140 గ్రాముల డ్రగ్ కూడా ఉందన్నారు. ఆ పార్శిల్కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ బాధితుడు చెప్పడంతో... తాము ఫోన్కు ఢిల్లీ సైబర్ సెల్కు బదిలీ చేస్తున్నామన్నారు. విదేశాలకు పంపే నిషేధిత, నియంత్రిత వస్తువులకు సంబంధించిన కేసు కస్టమ్స్ పరిధిలోకి వస్తుంది. మాదక ద్రవ్యాలతో కూడిన డ్రగ్ పార్శిల్కు సంబంధించిన కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ నాబ్), ఎక్సైజ్, టాస్్కఫోర్స్ లేదా సాధారణ పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఢిల్లీ సైబర్ సెల్ వంటి ఏజెన్సీలకు ఈ తరహా కేసులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. కొరియర్ ఆఫీసులకు, పోలీసులకు మధ్య ఎలాంటి లింకులు ఉండవు. అలాంటప్పుడు కొరియర్ సంస్థ తాము చేసిన కాల్ని పోలీసులు బదిలీ చేయడం అసాధ్యం. 2. బాధితుడితో సైబర్ సెల్ అధికారిగా మాట్లాడిన సైబర్ నేరగాడు మీ ఆధార్ దురి్వనియోగంపై ఫిర్యాదు చేయాలంటూనే అదే ఆధార్తో తెరిచిన నాలుగు బ్యాంకు ఖాతాలు మనీలాండరింగ్కు వాడారని చెప్పాడు. మనీలాండరింగ్ సంబంధిత అంశాలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పర్యవేక్షించే అంశం. ఈ తరహా కేసుల్ని వీళ్లే నమోదు చేసి, దర్యా ప్తు చేస్తుంటారు. ఆ వివరాలు సైబర్ సెల్కు తెలిసే అవకాశమే ఉండదు. ఆధార్ కార్డు దురి్వనియోగం పైనా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఉండే ఆస్కారం లేదు. 3.అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితుడితో మాట్లాడి ‘డిజిటల్ అరెస్టు’ చేశారు. మీపై నిఘా ఉందంటూ బాధితుడికి చెప్పి ప్రతి గంటకూ తమను సంప్రదించాలని స్పష్టం చేశాడు. స్థానిక పోలీసుల నుంచి సీబీఐ వరకు ఏ ఏజెన్సీ కూడా డిజిటల్ అరెస్టు అనేది చేయదు. కేసు నమోదు తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలు, ఇతర వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తారు. ఆపై దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. నిఘా ఉంచాల్సి వస్తే దానికి వారి మార్గాలు వారికి ఉంటాయి తప్ప వీడియో కాల్ ద్వారా మాత్రం కాదు. 4.బాధితుడిని భయపెట్టడంలో భాగంగా సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు విషయం ఎవరికీ చెప్పొద్దని, దీన్ని రహస్యంగా ఉంచకపోతే మీతో పాటు కుటుంబీకుల కిడ్నాప్ లేదా హత్య చేస్తామని బెదిరించారు. ∙రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏజెన్సీ కూడా ఇలాంటి షరతు పెట్టదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పోలీసులు, సీఐడీ, సీబీఐ సహా ఏ విభాగమైనా ఓ వ్యక్తిని అరెస్టు చేస్తే... దానిపై వారి సంబం«దీకులకు కచి్చతంగా సమాచారం ఇవ్వాలి. ఎవరికి సమాచారం ఇచ్చామనే విషయాన్నీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలనే నిబంధన ఉంది. అలాంటిది ఇక కిడ్నాప్లు, హత్యలు చేసే ఆస్కారం పోలీసులకు, ఏజెన్సీలకు ఎలా ఉంటుందనేది విస్మరించకూడదు. 5.ఇది జరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు బాధితుడికి సీబీఐ, ఆర్బీఐ పేర్లతో ఉన్న రెండు నకిలీ లేఖల్ని వాట్సాప్ ద్వారా పంపారు. వాటిలో బాధితుడికి మనీలాండరింగ్తో పాటు ఫోర్జరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఉంది. ∙ఆర్బీఐ, సీబీఐలతో సైబర్ క్రైమ్ పోలీసులు అవసరమైనప్పుడు మాత్రమే సంప్రదింపులు జరుపుతారు. ఏదైనా కేసుకు సంబంధించి వాళ్లు ఇచి్చన ఆధారాలు, సమాచారాన్ని కేవలం కోర్టుకు మాత్రమే సమరి్పస్తారు. ఇలా బాధితుడికి వాట్సాప్ చేసి, డబ్బు డిమాండ్ చేయడం జరగని పని. 6.ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే తాము చెప్పినట్లు చేయాలని బాధితుడిని భయపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు పంపారు. వాటిలో విడదల వారీగా రూ.20 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ∙కేసుల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి రకం వాటిలో శిక్షలు పడితే.. రెండో రకం వాటిలో కేవలం జరిమానాలే విధిస్తారు. అనధికారికంగా ఇతరుల పాస్పోర్టులు కలిగి ఉండటం, వీటిని విదేశాలకు పంపే ప్రయత్నం చేయడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ఇవన్నీ తీవ్రమైన నేరాలు. వీటికి కాంపౌండబుల్ అఫెన్సుల మాదిరిగా జరిమానాలు విధించరు. 7.ఈ బాధితుడు సైబర్ నేరగాళ్లు డబ్బు డిపాజిట్ చేయమంటూ హెచ్డీఎఫ్సీ, ఫెడరల్ బ్యాంక్ ఖాతాల వివరాలు ఇచ్చారు. వీటిలోకి నగదు బదిలీ చేసిన బాధితుడు దాని కోసం తన ఫిక్సిడ్ డిపాజిట్లనూ క్యాన్సిల్ చేశాడు. ∙పోలీసులు లేదా ఏదైనా ఏజెన్సీకి నగదు చెల్లించాల్సి వస్తే సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాలకు చెల్లింపులు ఉండదు. కేవలం డీడీలు, చెక్కులు, చలాన్ల రూపంలోనే ఈ చెల్లింపులు జరుగుతాయి. బ్యాంకు ఖాతాలోకి జమ చేయాల్సి వచ్చినా అది ప్రభుత్వానికో, పోలీసు అధిపతి పేరుతో ఉన్న దానికో మాత్రమే జమ చేయాలి. -
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్పోర్ట్లు, క్రెడిట్ కార్డ్లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్వర్డ్ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
హలో అన్నాడు.. రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నాడు
బెంగళూరు : హలో సార్..! మేం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఆధార్ కార్డ్తో మనీ లాండరింగ్, ఆధార్ కార్డ్కు జత చేసిన సిమ్ను తప్పుడు ప్రకటనల కోసం వినియోగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ అగంతకుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో ఓ ఐటీ ఉద్యోగి రూ.11.8 కోట్లు పోగొట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల టెక్కీ డిజిటల్ అరెస్ట్ అయ్యారు. నవంబర్ 11న బాధితుడికి తాను ట్రాయ్ అధికారినంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన సిమ్ కార్డుతో అక్రమ ప్రకటనలు, మహిళల్ని వేదించేలా వారికి మెసేజ్లు పంపేందుకు ఉపయోగిస్తున్నారని, దీనిపై ముంబైలోని కోల్బా సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు చెప్పాడు. దీంతో బాధితుడు భయాందోళనకు గురయ్యాడు. మేం మీకు ఫోన్ చేసిన విషయాన్ని గోప్యంగా ఉంచండి. కేసును ఆన్లైన్లో విచారిస్తాం. సహకరించండి. వర్చువల్గా విచారించేందుకు మీరు ఓ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని కోరాడు. ఆ తర్వాత బాధితుడికి నకిలీ ముంబై పోలీసు యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఓ వ్యాపార వేత్త మీ ఆధార్ కార్డ్ను ఉపయోగించి రూ.6 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీనిపై కేసు నమోదైందని మరింత భయపెట్టించాడు. అయితే, నవంబర్ 25న, పోలీసు యూనిఫాంలో ఉన్న మరొక వ్యక్తి బాధితుడికి ఓ యాప్ నుంచి కాల్ చేశాడు. మీ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ప్రస్తుతం, మీరు మా విచారణకు సహకరించాలి. లేదంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. ముందుగా వెరిఫికేషన్ నిమిత్తం చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించాడు. బాధితుడు అరెస్టుకు భయపడి నిందితులు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు రూ.11.8కోట్లను ట్రాన్స్ ఫర్ చేశాడు. అది సరిపోదని ఇంకా కావాలని డిమాండ్ చేయడం తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే తాను మోసపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఇచ్చింది రూ.720 ..పోయింది రూ.4.49 లక్షలు
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహిళను టార్గెట్గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరుతో ఎర వేశారు. ఆమెకు రూ.720 లాభం ఇవ్వడం ద్వారా నమ్మకం కలిగించి ఏకంగా రూ.4.49 లక్షలు టోకరా వేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఓ వివాహితకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా ట్రేడ్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎర వేశారు. దానికి ముందు కొన్ని టాస్్కలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో ఆయా వీడియోలు, ఫొటోలను షేర్ చేయడం, ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని నమ్మబలికారు. మొదటి టాస్క్ పూర్తి చేసిన ఆమెకు రూ.120, రెండో టాస్క్ పూర్తి చేయడంతో రూ.300 చెల్లించారు. దీంతో వారిపై పూర్తిగా నమ్మకం కలిగిన గృహిణి తాను పెట్టుబడులు పెడతానంటూ వాట్సాప్ ద్వారా సందేశం ఇచ్చారు. దీంతో ఆమెకు ఓ లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు అందులో ఖాతా తెరవడం ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నారు. తొలుత రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన ఆమెకు రూ.300 లాభంతో రూ.1300 చెల్లించారు. ఆపై పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయిస్తూ, త్వరలోనే లాభాలు వస్తాయని కాలయాపన చేశారు. మొత్తమ్మీద రూ.4.49 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత రిఫండ్ కోరితే మరికొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తేనే వస్తుందని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే... తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రైవేట్ ఉద్యోగికి పెళ్లి కూతురి పేరుతో ప్రొఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.05 లక్షలు కాజేశారు. దీనికోసం వాళ్లు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కథ చెప్పారు. నగర యువకుడు తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకోగా... మలేíÙయాలో ఉంటున్న విశాఖపట్నం యువతిగా ఓ యువతి తన ప్రొఫైల్ పంపింది. వాట్సాప్ ద్వారా ఇద్దరూ కొన్నాళ్లు చాటింగ్ చేసుకున్నారు. ఆపై తన తండ్రి క్రిప్టో కరెన్సీ యాప్స్లో పెట్టుబడులు పెట్టి, లాభాలు పొందటంతో నిష్ణాతుడని చెప్పింది. తొలుత నిజమైన క్రిప్టో కరెన్సీ యాప్లోనే పెట్టుబడి పెట్టి, లాభాలు పొందేలా చేశారు. ఆపై నకిలీ యాప్ లింక్ను పంపి, అందులో రూ.2.05 లక్షలు ఇన్వెస్ట్ చేయించి కాజేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తెలుగు మ్యాట్రిమోనీ నుంచి వాట్సాప్ ద్వారా బాధితుడికి ఓ మెసేజ్ వచి్చంది. అందులో సైబర్ నేరగాళ్లు పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలుగా పరిచయమై ఎర వేస్తున్నారని, ఆపై వివిధ అంశాల్లో తమ అంకుల్, తండ్రి నిష్ణాతులని చెప్పి మోసం చేస్తున్నారని ఉంది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తక్షణం ఫిర్యాదు చేయండిఅపరిచితులతో ఎలాంటి లావాదేవీలు వద్దు. ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అంటూ వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఎవరైనా సైబర్ నేరాల బారినపడితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి లేదా 8712665171 నెంబర్ను వాట్సాప్ ద్వారా,(cybercrimespshyd@gmail.com) మెయిల్కు ఐడీకి ఈ–మెయిల్ ద్వారా సంప్రదించి లేదా (www.cybercrime.gov.in) వెబ్సైట్లోకి వెళ్లి ఫిర్యాదు చేయాలి. – సైబర్ క్రైమ్ పోలీసులు -
క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ
చౌటుప్పల్ రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ రోజువారి కార్యకలాపాల్లో అమలు చేస్తుండగా.. సైబర్ నేరగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని వినియోగిస్తూ అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారింది. విద్యావంతులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం యాప్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది.ఏపీకే ఫైళ్లతో ప్రమాదం..సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(ఏపీకే) ఫైళ్లను వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే.. సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫలితంగా మనకు సంబంధ లేకుండానే మన ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. తమ ఫోన్ హ్యాక్ అయ్యిందని తెలియని వారు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్యారా సొమ్ము పంపితే వెంటనే హ్యాక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా పిన్ నంబర్ తెలుసుకుని నిమిషాల్లో ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్ డివైస్ డిస్ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీని ప్రకారం ఆ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్లకు ఫోన్ హ్యాకింగ్కు గురైన వ్యక్తి పంపినట్లు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. నిజంగానే మనకు తెలిసిన వ్యక్తి నుంచే ఈ మెసేజ్ వచ్చిందని భావించి ఏపీకే ఫైళ్ల లింక్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం పేరిట లింక్ పంపుతున్నారు. ఈ లింక్ను ఓపెన్ చేసినా కూడా ఫోన్ హ్యాక్ అయ్యి మనకు సంబంధం లేకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులను సైబర్ నేరగాళ్లు లాగేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర లింక్లను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ అవ్వడం ఖాయం.నకిలీ లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలిసైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో లింక్లు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కినట్లే అవుతుంది. ఎవరైనా సైబర్ మోసానికి గురైనా, ఫోన్ హ్యాక్ అయ్యి తమ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ నంబర్ 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.– మన్మథకుమార్, చౌటుప్పల్ సీఐ -
మీషోపై పడ్డ సైబర్ నేరగాళ్లు: ఎన్ని కోట్లు దోచేశారంటే..
సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే మోసం చేశారని గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏకంగా మీషో కంపెనీని మోసం చేసి ఏకంగా రూ. 5.5 కోట్లు నష్టాన్ని కలిగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సైబర్ నేరగాళ్లు మీషో ఈ-కామర్స్ కంపెనీలో ఫేక్ సెల్లర్గా నటిస్తూ.. అదే ప్లాట్ఫామ్లో నకిలీ ఖాతాల ద్వారా ఆర్డర్లు చేసేవారు. ఆర్డర్ డెలివరీ చేసుకున్న తరువాత వాటి స్థానంలో విరిగిపోయిన లేదా పాడైపోయిన పాత వస్తువులను పెట్టి మళ్ళీ రిటర్న్ చేసేవారు. దీనిని నిజమని నమ్మించడానికి వీడియోలు కూడా క్రియేట్ చేసేవారు. ఆ తరువాత డబ్బు వెనక్కి తీసుకునేవారు.మోసగాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య ఇదే వరుసలో మోసాలు చేస్తూ.. మీషో నుంచి రూ. 5.5 కోట్లు వసూలు చేశారు. డబ్బు జమచేసుకోవడానికి వీరు వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారు. ఈ మోసాన్ని కంపెనీ గుర్తించిన తరువాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మీషో కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత.. పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పాల్గొన్న ఇతర నిందితులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.హ్యాకర్లు.. మీ అనుమతి లేకుండానే మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంది. మొబైల్ హ్యాక్ చేస్తే.. డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్పత్తులను (మొబైల్స్, ట్యాబ్స్, మ్యాక్స్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.CERT-In యాపిల్ ఉత్పత్తులను ప్రభావితం చేసే రెండు బలహీనతలను గుర్తించింది. అవి ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS). వీటిని వాడుకొని సైబర్ నేరగాళ్లు మీ మొబైల్స్ హ్యక్స్ చేస్తారు.ఇదీ చదవండి: దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..18.1.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. అలాగే 17.7.2కి ముందు యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. 15.1.1కి ముందు వెర్షన్స్ అయిన యాపిల్ మ్యాక్ఓఎస్ సుక్వోయా, 2.1.1కి ముందున్న యాపిల్ విజన్ఓఎస్, 18.1.1కి ముందు ఉన్న యాపిల్ సఫారీ ఉత్పత్తులను హ్యాకర్స్ సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, సరికొత్త సాఫ్ట్వేర్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. -
జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ జాబ్ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్కు తీసుకెళ్లింది. స్కామర్లు.. రిక్రూటర్లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్ను అందించారు.అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుస్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్లు పంపుతోంది. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
కొంప ముంచిన వాట్సాప్ గ్రూప్: రూ.50 లక్షలు మాయం
భారతదేశంలో ఆన్లైన్ మోసాల కారణంగా భారీగా మోసపోతున్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్దులు, యువకులు, పారిశ్రామిక వేత్తలు సైతం ఆన్లైన్ మోసాలకు బలైపోతున్నారు. తాజాగా ఇలాంటి మరో కేసు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.హైదరాబాద్కు చెందిన 63 ఏళ్ల వ్యక్తి స్టాక్ డిస్కషన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్లో చేరడంతో భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, కునాల్ సింగ్ తన మార్గదర్శకత్వంతో కొంతమంది క్లయింట్స్ ఎక్కువ లాభలను పొందినట్లు, తనను తాను ప్రఖ్యాత ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకున్నాడు.స్టాక్ మార్కెట్లో గొప్ప లాభాలను పొందాలంటే ఆన్లైన్ క్లాసులకు చేరాలని వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ వెల్లడించాడు. క్లాసులకు జాయిన్ అవ్వాలంటే.. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన లింక్స్ ఓపెన్ చేయాలని పేర్కొనడంతో.. బాధితుడు ఇదంతా నిజమని నమ్మేశాడు. అంతే కాకుండా స్కైరిమ్ క్యాపిటల్ అనే ప్లాట్ఫామ్ ద్వారా పెట్టుబడి పెట్టమని స్కామర్లు ఆదేశించడంతో బాధితుడు అలాగే చేసాడు.ప్రారంభంలో బాధితుని పెట్టుబడికి.. స్కామర్లు మంచి లాభాలను అందించారు. అయితే ఇంకా ఎక్కువ లాభాలు రావాలంటే.. ఎక్కువ పెట్టుబడి పెట్టాలని స్కామర్లు పేర్కొన్నారు. అప్పటికే లాభాల రుచి చూసిన బాధితుడు ఏకంగా రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత స్కామర్లు చెప్పిన వెబ్సైట్ నుంచి లాభాలను తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు అది సాధ్యం కాలేదు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే..టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపే సోషల్ మీడియా గ్రూపులతో ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకూడదు. అంతగా మార్కెట్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే.. నిపుణులు నిర్వహించే తరగతులకు హాజరవ్వొచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర నెర్కకోవచ్చు. -
కెనడా ‘సైబర్ ముప్పు’ జాబితాలో భారత్
ఒట్టావా/న్యూఢిల్లీ: ఇండియా విషయంలో కెనడా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఇండియా నుంచి తమకు సైబర్ ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఏయే దేశాల నుంచి సైబర్ ముప్పు ఉందన్నదానిపై గత నెల 30న కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ(సైబర్ సెంటర్) ఓ జాబితా విడుదల చేసింది. ఇందులో ఇండియాను సైతం చేర్చింది. నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్మెంట్(ఎన్సీటీఏ) 2025–26లో చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తర్వాత ఇండియా పేరును చేర్చడం గమనార్హం. భారత ప్రభుత్వం నియమించిన వ్యక్తులు గూఢచర్యం కోసం తమ ప్రభుత్వ నెట్వర్క్పై సైబర్ ముప్పు కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్సీటీఏ జాబితాను ప్రతి రెండేళ్లకోసారి విడుదల చేస్తుంటారు. 2018, 2020, 2023–24 నాటి జాబితాలో ఇండియా పేరులేదు. తొలిసారిగా 2025–26 జాబితాలో ఇండియా పేరు చేర్చారు. ఇదిలా ఉండగా, భారత్ నుంచి సైబర్ ముప్పు పొంచి ఉందంటూ కెనడా విడుదల చేసిన జాబితాపై భారత విదేశాంగ శాఖ అధికారి రణ«దీర్ జైస్వాల్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని భారత్కు వ్యతిరేకంగా మా ర్చాలన్నదే కెనడా కుట్ర అని ఆరోపించారు. -
గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సైబర్ దాడులు
మోసాలకు ఫుల్స్టాప్ అనేదే ఉండదు. రోజుకో కొత్తరకం మోసం, వంచన వెలుగుచూస్తూనే ఉంటాయి. దొంగతనాలు, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసం, సైబర్ నేరాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజల నుంచి బడా అధిపతుల వరకు అందరిని మోసగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు.తాజాగా దేశంలో సైబర్ దాడులు కూడా పెచ్చుమీరుతున్నాయి. నెట్వర్క్ సాధనాలు, కంప్యూటర్ సిస్టమ్, సర్వర్లు వంటి డిజిటల్ పరికారలకు చెందిన డేటాను దొంగిలించమే సైబర్ అటాక్. తమ తమ ప్రయోజనాల కోసం డేటాను దొంగిలించి, నాశనం చేయడం, మార్చడం వంటివి చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు.అయితే రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ దాడుల కారణంగా దేశ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతోంది. దేశంలో 2033 నాటికి సైబర్టాక్లు 1 ట్రిలియన్కు పెరుగుతాయని PRAHAR అనే ఎన్జీవో అంచనా వేసింది. అదే 2047 నాటికి 17 ట్రిలియన్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న హోదా, ఖ్యాతి కారణంగా దాడులు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ మేరకు ప్రహార్ ‘ది ఇన్విజిబుల్ హ్యాండ్’ పేరుతో నివేదికను న్యూఢిల్లీలో నేడు ఆవిష్కరించింది.దీని ప్రకారం.. సైబర్టాక్లు లేదా సైబర్వార్ఫేర్ వంటివి భారత్కు వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పుగా తయారయ్యింది. సోషల్ మీడియా వాడకం, గేమింగ్, బెట్టింగ్ వంటివి ఆధునాతన సబైర్ మానిప్యులేషన్కు దారి తీస్తుంది., దేశంపై దాడులకు సాధనాలుగా మారుతున్నాయిసైబర్టాక్లు లేదా సైబర్వార్ఫేర్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన ముప్పు. సైబర్స్పేస్ అనేది కొత్త యుద్దభూమి. దీనిపై భారత్ దాడికి దిగాల్సిందే. అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం మెరుగుదల, డిజిటల్ యాప్లు, ప్లాట్ఫారమ్లను వైట్లిస్ట్ చేయడం, పౌరులకు అవగాహన కల్పించడం వంటివి ఎంతో అవసరం. పెరుగుతున్న సైబర్ దాడులు దేశంలో బలమైన సమగ్ర సైబర్ రక్షణ విధానం రూపొందించి, దాని అమలు చేసే ఆవశ్యకతను తెలియజేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా సైబర్టాక్లు 2024 మొదటి నెలలో 76% పెరిగాయి. బర్నేరగాళ్లు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. దిని సైబర్ భద్రతా చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. గతేదాడి దేశం 79 మిలియన్లకు పైగా సైబర్ అటాక్లను ఎదుర్కొంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పోలిస్తే మూడో స్థానంలో ఉంది. ఇక గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 15% పెరుగుదలను గుర్తించింది. 2024 500 మిలియన్లకు పైగా అటాక్కు కనిపించాయి. 2024 రెండవ త్రైమాసికంలో సైబర్టాక్లు 46% పెరిగాయి.2024 మొదటి నాలుగు నెలల్లో, సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు రూ. 1,750 కోట్లకు పైగా కోల్పోయారు. ఈ విషయం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో 740,000 ఫిర్యాదుల ద్వారా వెల్లడైంది. బంగ్లాదేశ్ శ్రీలంక వంటి పొరుగు దేశాలలో ఇటీవలి రాజకీయ తిరుగుబాట్లు పరిణాల్లోనూ సైబర్ నేరస్థుల పాత్ర ఉండవచ్చనే సందేహాలను లేవనెత్తుతున్నాయి. సైబర్టాక్లపై నేషనల్ కన్వీనర్ & ప్రహార్ ప్రెసిడెంట్ అభయ్ మిశ్రా తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు. ‘“సైబర్టాక్లు రెండు రకాలు. మొదటిది ఆర్థిక లాభం సిస్టమ్లలోని దుర్బలత్వాన్ని ఉపయోగించుకునే సాంప్రదాయ హ్యాకర్లు. రెండవది పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది. బలవంతం, బెదిరింపుల ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడానికి వారిని రిక్రూట్ చేస్తుంది. అక్రమ బెట్టింగ్ యాప్లలో ఇటువంటి వ్యూహాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ వ్యూహం బంగ్లాదేశ్లో మోహరించిన విధానాలను కూడా పోలి ఉంటుంది, ఇక్కడ సాధారణ పౌరులను అస్థిరపరిచే సాధనాలుగా మార్చుతారు. ప్రభుత్వ సంస్థలను లోపల నుంిచి అణగదొక్కారు. భారత భద్రతా సంస్థలు అటువంటి అవకాశాల ప్రాబల్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి’ అని తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో అక్రమ ప్లాట్ఫారమ్ల విస్తరణ ఉంది. ఈ విదేశీ యాజమాన్యంలోని ప్లాట్ఫారమ్లు, భారతదేశ నిబంధనలకు వెలుపల ప్రత్యేకంగా యువతను డబ్బు కోసం లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి మరియు అదే డబ్బును తిరిగి దేశంలోకి మళ్లించి ఇబ్బందులను రేకెత్తిస్తాయి. అక్రమ ఆన్లైన్ జూదం, జూదగాళ్ల వల్ల కలిగే నష్టాలు రూ.1 లక్ష కోట్లుదాటవచ్చని అంచనాలు సూచిస్తున్నాయి. చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ బెట్టింగ్ అప్లికేషన్ల ద్వారా జరిగే లావాదేవీలు సంవత్సరానికి రూ2 లక్షల కోట్ల (సుమారు USD 24 బిలియన్లు) వరకు చేరుకుంటాయని తెలిపింది.అయితే జాతీయ భద్రత పేరుతో గేమింగ్, ఆన్లైన్ జూదం ప్లాట్ఫామ్స్ను మూసివేయాలి. అలాగే దేశంలో ఆన్లైన్ సంస్థలను పరిమితులు విధించాలనిసూచించింది. చట్టవిరుద్ధమైన ప్లాట్ఫారమ్ల బారిన పడకుండా యువతను నిరోధించాలని తెలిపింది . -
Cybercrime: ఫేస్బుక్ టు వాట్సాప్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చేసే సైబర్ నేరగాళ్లు నానాటికీ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. ఒకప్పుడు ఫేస్బుక్, ఆపై డీపీ ఫ్రాడ్స్ చేసే ‘ఈ– నేరగాళ్లు’ ఇప్పుడు ఈ రెండిటినీ ‘కలిపేశారు’. ఫేస్బుక్ ద్వారా ఎంటరైన తర్వాత వాట్సాప్ డీపీ వరకు వెళ్తున్నారు. లాక్ చేయని ప్రొఫైల్స్లోని వివరాల ఆధారంగా చాటింగ్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కామ్స్లో ఆర్థిక నష్టం అంతగా లేకున్నా.. న్యూసెన్స్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఈ తరహా స్కామ్స్ పెరిగాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రొఫైల్ లాక్ చేసినప్పటికీ ‘రిక్వెస్ట్’తో.. ఫేస్బుక్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై కొంత వరకు అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనే క మంది తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్ని కచ్చితంగా లాక్ చేసి ఉంచుతున్నారు. అలా ఉన్న వాటిని కేవలం ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వాళ్లు మాత్రమే చూడగలరు. దీనికి విరుగుడుగా సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎత్తు వేస్తు న్నారు. ఎక్కువగా యువతులు, కొన్ని సందర్భాల్లో సదరు ఫేస్బుక్ యూజర్కు పరియచం ఉన్న వారి పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. దీని ఆధారంగా తాము టార్గెట్ చేసిన వారికి రిక్వెస్ట్ పంపుతున్నా రు. దీన్ని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం సైబర్ నేరగాళ్లకు ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసే అవకాశం దక్కుతోంది. నకిలీ ప్రొఫైల్తో డబ్బు డిమాండ్.. ఇలా ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతాలోకి ఎంటర్ అవుతున్న సైబర్ నేరగాడు అందులోని వివరాలు, ఫొటోల ఆధారంగా నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాడు. దీని ఆధారంగా మెసెంజర్లో చాటింగ్ చేస్తూ డబ్బు అడగటంతో పాటు ఫ్రెండ్స్ లిస్టులోని వారికే ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నాడు. వీటిని అందుకున్న వాళ్లల్లో అనేక మంది తమ స్నేహితుడే మరో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడని భావించి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆపై వారితోనే ఇదే పంథా అవలంబిస్తున్నారు. మరోపక్క సదరు వ్యక్తి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారిలో ఎవరైతే తమ ప్రొఫైల్లో ఫోన్ నంబర్ ఉంచుతున్నారో వారిని మరో విధంగా టార్గెట్ చేస్తున్నారు. చిన్న మొత్తాలే కావడంతో నో కంప్లైంట్.. సైబర్ నేరాల్లో ఎవరి పేరుతో అయితే నకిలీ ప్రొఫైల్, డీపీ క్రియేట్ అయ్యాయో... వారితో పాటు నగదు బదిలీ చేసిన వాళ్లు సైతం సైబర్ క్రైమ్ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. అయితే.. సైబర్ క్రిమినల్స్ కొల్లగొడుతున్నది చిన్న మొత్తాలే కావడంతో అత్యధికులు పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఇది నేరగాళ్లకు కలిసి వచ్చే అంశంగా మారుతోంది. మరోపక్క ఫిర్యాదు, కేసు నమోదు జరిగినా.. ఉత్తరాదిలో ఉండే ఈ నేరగాళ్ల కోసం ఇక్కడ నుంచి పోలీసు బృందాలు పంపడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చిన్న మొత్తాలతో ముడిపడి ఉన్న కేసుల్లో దాదాపు అన్నీ మూతపడటం కూడా నేరగాళ్లకు అనుకూలంగా మారుతోంది.ఆ ఫొటోలే వినియోగించి వాట్సాప్ డీపీ..సైబర్ నేరగాళ్లు తాము రూపొందించిన నకిలీ ప్రొఫైల్లోని ఫొటోలు, వర్చువల్ నంబర్లు వాడి వాట్సాప్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటికి డీపీలుగా అసలు యజమానులవి పెడుతున్నారు. ఈ వాట్సాప్ ఖాతాల ఆధారంగా ఫ్రెండ్స్ లిస్టులోని వ్యక్తుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపుతున్నారు. ఫేస్బుక్ మెసెంజర్లో అడిగినట్లే వీటి ద్వారానూ అత్యవసరమని, గూగుల్ పే లిమిట్ అయిపోయిందని చెబుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాలు అందుకునే ఎదుటి వ్యక్తుల్లో కేవలం డీపీలు మాత్రమే వాళ్లు తన స్నేహితుడు, బంధువు డబ్బు అడుగుతున్నాడని భావించి బదిలీ చేస్తున్నారు. -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ మొదలైనవారు ఉన్నారు.ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకాఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Beware of Scam Calls! Received a call from a 'CBI Officer' or any government official asking for sensitive details? It's a scam! Don't fall for it.Report any cybercrime at 1930 or https://t.co/pVyjABtwyF#I4C #CyberSafety #DigitalArrest #ReportScams #AapkaCyberDost pic.twitter.com/XBEJjKr6u0— Cyber Dost (@Cyberdost) October 5, 2024 -
సైబర్ వలలో ప్రముఖ పారిశ్రామికవేత్త: రూ.7 కోట్లు మాయం
వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ను.. సైబర్ మోసగాళ్ల ముఠా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 7 కోట్లు మోసగించింది. దీనిని ఛేదిస్తూ పంజాబ్ పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని లూథియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు.ఎస్పీ ఓస్వాల్ను మోసగించిన ముఠాలో మరో ఏడుగురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కుల్దీప్ సింగ్ చాహల్ వెల్లడించారు. ముఠాలోని మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు, వారంతా అస్సాం, పశ్చిమ బెంగాల్కు చెందినవారని ఆయన తెలిపారు.సైబర్ మోసగాళ్లలో ఒకరు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని, పారిశ్రామికవేత్తకు నకిలీ అరెస్ట్ వారెంట్ చూపించి డిజిటల్ అరెస్ట్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఓస్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటల్లో కేసును ఛేదించారు.ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్దేశంలో ఇలాంటి సైబర్ మోసాలు చాలా పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియనివారు ఫోన్ చేసి బెదిరించినా? డబ్బు డిమాండ్ చేసినా? సంబంధిత అధికారులకు వెంటనే వెల్లడించడం ఉత్తమం. లేకుంటే భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్కు సంబంధించిన సర్వర్ను అహ్మదాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారౖడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం
సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటేటెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు. -
సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
ఇప్పటివరకు మనుషులకు, జంతువులకు, వ్యాపారాలకు, వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి వినే ఉంటారు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఏకంగా సైబర్ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. దీనికోసం రోజుకు కేవలం మూడు రూపాయలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..టెక్నాలజీ రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ మోసాలు కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. సైబర్ మోసాల భారీగా పడి నష్టపోయిన ప్రజలు చాలామందే ఉన్నట్లు గతంలో చాలా కథనాల్లో తెలుసుకున్నాం. ఈ నష్టాలను భర్తీ చేయడానికి చిన్న ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా కొన్ని సంస్థలు తీసుకురావడం జరిగింది.ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, ఈ-మెయిల్ స్పూపింగ్, సైబర్ స్టాకింగ్ మొదలం వాటికి ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఇవన్నీ చిన్న మొత్తంలో కవరేజికి పనికొస్తాయి. ఈ రిస్క్ కవరేజీలు రోజుకు మూడు రూపాయల వద్ద లభిస్తున్నాయి. భారీ మొత్తంలో జీవిత భీమా, వెహికల్స్ ఇన్సూరెన్స్ మాదిరిగా లభించదు.ఇదీ చదవండి: ఈ-సిమ్ పేరుతో మోసం.. రూ.27 లక్షలు మాయం సైబర్ నేరగాళ్లు ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఇందులో నకిలీ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, టెక్స్ట్ మెసేజస్, ఫ్రాడ్ కాల్స్, పేస్ మార్పింగ్, ఓటీపీ వంటివి ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే.. నేరగాళ్లు ప్రజలను దోచుకోవాడానికి అన్ని విధాలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాయలో పడితే.. భారీ నష్టాలను చవి చూడాలి ఉంటుంది. కాబట్టి ఈ భారీ నుంచు కొంత ఉపసమయం పొందటానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగోపడుతుంది. -
భారత్, యూఎస్ కంపెనీల సర్వర్లపై చైనా దాడి?
చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ ఇండియాతోపాటు అమెరికాలోని కొన్ని కంపెనీల సర్వర్లపై దాడికి పాల్పడినట్లు లుమెన్ టెక్నాలజీస్కు చెందిన బ్లాక్ లోటస్ ల్యాబ్స్లోని భద్రతా పరిశోధకులు తెలిపారు. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం వోల్ట్ టైఫూన్ అని పిలువబడే చైనీస్ హ్యాకింగ్ గ్రూప్ అమెరికా, ఇండియాలోని ఇంటర్నెట్ కంపెనీలపై దాడికి పాల్పడింది. అందుకోసం కాలిఫోర్నియాకు చెందిన వెర్సా నెట్వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ సాఫ్ట్వేర్లోని భద్రతా లోపాన్ని ఉపయోగించుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.చైనీస్ గ్రూప్ చేసిన ఈ సైబర్ దాడివల్ల అమెరికాకు చెందిన నాలుగు ఇంటర్నెట్ కంపెనీలు, భారత్లోకి ఒక కంపెనీ ప్రభావితం చెందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. వెంటనే స్పందించిన సదరు కంపెనీలు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ల నిర్వహణకు సహాయపడే వెర్సా నెట్వర్క్ల సాఫ్ట్వేర్లో లోపం కనుగొన్నారు. గతంలో వెర్సా బగ్ను గుర్తించి జూన్ 2023లో పరిష్కారాన్ని విడుదల చేసినప్పటికీ, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తిరిగి దాడికి గురయ్యాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గనున్న చిన్న బ్యాంకుల రుణ వృద్ధి..!వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ సర్వర్లు యూఎస్లోని నీటి వసతి, పవర్ గ్రిడ్ వంటి కీలక సేవలందించే సాఫ్ట్వేర్లలో చొరబడ్డాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. వోల్ట్ టైఫూన్ నిజానికి ‘డార్క్ పవర్’ అని పిలువబడే ఒక క్రిమినల్ గ్రూప్ అని, దానితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి సైబర్అటాక్ల పేరుతో అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపింది. -
Washington: ఎయిర్పోర్టుపై సైబర్ దాడి.. ప్రయాణికుల అవస్థలు
ప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంపై సైబర్ దాడి జరిగింది. దీంతో ఇంటర్నెట్, ఫోన్, ఈ- మెయిల్ ఇతర కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ అధికారులు ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ లాన్స్ లిటిల్ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుతం అత్యవసర సేవలను పునరుద్ధరించడానికి, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు 24 గంటలూ పనిచేస్తున్నామని తెలిపారు. ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ), కస్టమ్స్ అండ్ సెక్యూరిటీతో సహా ఇతర ఫెడరల్ ఏజెన్సీలు ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నాయన్నారు.డెల్టా, అలాస్కా ఎయిర్లైన్స్తో సహా కొన్ని విమానయాన సంస్థలు సైబర్ఎటాక్ కారణంగా సేవలను నిలిపివేశాయి. కాగా విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు చేశారు. ప్రయాణికులు విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలని, బోర్డింగ్ పాస్లు, బ్యాగ్ ట్యాగ్లు' పొందేందుకు విమానయాన సంస్థల మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించాలని కోరారు. -
బ్యాంక్ లింక్ పంపి.. రూ.11లక్షలు దోచేశారు
జనగామ: ఇంటి నిర్మాణానికి మూడేళ్లుగా బ్యాంకులో పొదుపు చేసుకుంటున్న సొమ్మును సైబర్ మాయగాళ్లు ఏపీకే లింక్ పంపి దాన్ని డౌన్లోడ్ చేయగానే క్షణాల్లో నగదును మాయం చేశారు. ఫోన్ ఔట్ గోయింగ్ పని చేయడం లేదని.. అనుమానం వచ్చి బ్యాంకు వెళ్లి ఆరా తీయగా ఖాతాలో సొమ్ము లేదని చెప్పడంతో ఖంగుతిన్నాడు సదరు ఖాతాదారుడు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ పట్టణం హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన పోలోజు రామేశ్వర్ ఆర్టీసీ కండక్టర్గా పని చేస్తున్నాడు. సొంతింటి కళను సాకారం చేసుకునేందుకు మూడేళ్ల క్రితం పునాది వేశాడు. అప్పటి నుంచి ఇంటి నిర్మాణానికి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేస్తూ స్థానిక యూనియన్ బ్యాంకులో రూ.11లక్షల వరకు జమ చేశాడు. ఇంటి నిర్మాణ పనులకు అవసరమైనప్పుడు బ్యాంకు నుంచి కొంత నగదును డ్రా చేసుకుంటున్నాడు. కాగా ఈ నెల 8వ తేదీన వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన రామేశ్వర్.. తిరుగు ప్రయాణంలో తన ఫోన్కు యూనియన్ బ్యాంకుకు సంబంధించిన ఏపీకే యాప్ లింక్తో ఫేక్ మెసేజ్ వచ్చింది. బ్యాంకు ఖాతా సేఫ్టీ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ మోసగాడు పంపించిన యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. సైబర్ నేరస్తుడు సదరు వ్యక్తికి ఎటువంటి అనుమానం కలుగకుండా తన ఫోన్ ఔట్ గోయింగ్ కాల్ వెళ్లకుండా చేశాడు. అదే రోజు రాత్రి రామేశ్వర్ యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు, శుక్రవారం రూ.4.21 లక్షలు, మొత్తంగా 16 లావాదేవీల ద్వారా రూ.11.21 లక్షల నగదును డ్రా చేసుకుని, రూ.142 మాత్రమే మి గిల్చారు. ఫోన్ కలవడం లేదని అనుమానం వచ్చిన బాధితుడు రి పేరు సెంటర్కు వెళ్లి సరి చేయగా, డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రా వడంతో అక్కడ నుంచి హుటాహుటిన బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అ ధికారులు ఖాతా నంబర్ను పరిశీలించిన తర్వాత పెద్ద మొత్తంలో డ బ్బులు డ్రా అయినట్లు తెలిపారు. ఇందులో రూ.9.21 లక్షల నగదు అ నుమానం కలుగకుండా డ్రా చేయగా, రూ.2లక్షలు మాత్రం చెన్నైలో ని సిద్దపుడూర్ సెంట్రల్ బ్యాంకు నుంచి రాహుల్ అనే వ్యక్తికి నెఫ్ట్ చేసిన ట్లు గుర్తించినట్లు బాధితుడు రామేశ్వర్ తెలిపారు. బాధితుడు పో లీ సులను ఆశ్రయించగా 1930కు ఫోన్ చేసి సైబర్ క్రైంలో ఫిర్యాదు చే యించారు. వెంటనే కేసును విచారించిన పోలీసులు, రూ.1.37 లక్షల ను హోల్డ్ చేసినట్లు మెసేజ్ వచ్చినట్లు రామేశ్వర్ తెలిపారు. పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. -
అమీర్పేట కంపెనీపై సైబర్ అటాక్: రూ.10 కోట్లు..
టెక్నాలజీ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అదనుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మాత్రమే కాకుండా కొన్ని కంపెనీలను కూడా దోచేస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినప్పటికీ.. ఇటీవల హైదరాబాద్లోని అమీర్పేటలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్లోని అమీర్పేటకు చెందిన ఓ ఎక్స్పోర్ట్ కంపెనీ సైబర్ దాడికి గురైంది. నేరస్థులు ఏకంగా రూ. 10 కోట్లు కొట్టేయడానికి కంపెనీ ఈమెయిల్ సిస్టమ్ హ్యాక్ చేశారు. దుబాయ్ కంపెనీ నుంచి అమీర్పేట కంపెనీకి రూ. 10 కోట్లు రావాల్సి ఉంది. దీనికోసం సంస్థ దుబాయ్ కంపెనీకి మెయిల్ పంపింది.దుబాయ్ సంస్థ చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. అయితే అందులో అమీర్పేట సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్ కాకూండా.. సిడ్నీలో ఉన్న నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంకు అకౌంట్కు డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్లో ఉండటం గమనించి వెంటనే స్పందించారు.వెంటనే గమనించిన అప్రమత్తమవ్వడంతో లావాదేవీలు జరగకుండా ఆపగలిగారు. ఈ సంఘటన జరిగిన తరువాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి అమీర్పేట కంపెనీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సెక్షన్ 318, 319 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టం
టెక్నాలజీ పెరుగుతోంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకం ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు అధిమవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెబిట్/ క్రెడిట్కార్డు - ఇంటర్నెట్ బ్యాంకింగ్లో జరిగిన సైబర్ మోసాల వల్ల ప్రజలు రూ.177 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ నష్టం రూ.69.68 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2021-22లో ఇది రూ.80.33 కోట్లు, 2020-21లో రూ.50.10 కోట్లు, 2019-20లో రూ.44.22 కోట్లుగా ఉందని చెప్పారు. అనధికార లావాదేవీలు జరిగినపుడు బ్యాంకులు స్పందించి చర్యలు తీసుకునేంత వరకు కస్లమర్లే దీనికి బాధ్యత వహించాలి. ఈ లావాదేవీల వల్ల కలిగే నష్టాన్ని పరిమితం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా అనధికార లావాదేవీలు జరిగిన మూడు పనిదినాల్లోగా సంఘటనను రిపోర్ట్ చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్కు సాంకేతికలోపం కారణమని రుజువైతే దానికి బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. ఏదేమైనా అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు దృష్టికి తేవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: మూడు నెలల్లో రూ.60 లక్షల కోట్లు లావాదేవీలు -
పెట్టుబడి తక్కువ.. మోసం ఎక్కువ
సాక్షి, అమరావతి: ప్రముఖ ఎల్రక్టానిక్స్ తయారీ సంస్థ పేరిట ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో వేల మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆన్లైన్లో పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రెట్టింపు ఆదాయం లభిస్తుందని బురిడీ కొట్టించారు. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయామని విశాఖతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బు, లింక్ క్లిక్ చేస్తే చాలు అంటూ నెట్ఫ్లిక్స్ ఫాలో అనే యాప్ పేరిట 2021లో గుంటూరు, కృష్ణా, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది బాధితులను బురిడీ కొట్టించారు. రూ. లక్షల్లో సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేశారు. ఇలాంటి నేరగాళ్లు, గొలుసుకట్టు ఇన్వెస్ట్మెంట్ సైబర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరుకు చెందిన రవి ఫోన్ నంబర్ను ఐపీజీ అనే పేరుతో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినట్టు నోటిఫికేషన్ వచి్చంది. కొద్దిసేపటికి గ్రూప్ అడ్మిన్ ‘రూ.800 పెట్టుబడి పెడితే ఏడాదంతా రోజుకు రూ.35 చొప్పున ఆదాయం’ అంటూ మెసేజ్ పెట్టింది. గ్రూప్ సభ్యులు కొందరు కొన్ని స్క్రీన్షాట్స్ షేర్ చేసి తాముసంపాదిస్తున్నాం అంటూ వంతపాడారు. ఇవన్నీ చూసిన రవి వాళ్లను నమ్మి అడ్మిన్ సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.800 పెట్టుబడి పెట్టాడు. తనకు తెలిసిన మరికొందరితోనూ పెట్టుబడి పెట్టించాడు. ప్రారంభంలో వాళ్లు చెప్పినట్లే చెల్లిస్తూ వచ్చారు. ఇది బావుందని భావించి రవి రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. అంతే రెండు రోజుల్లోనే యాప్ పనిచేయకుండా పోయింది. మెసేజ్లకు అడ్మిన్ రిప్లై ఇవ్వలేదు. దీంతో మోసపోయానని రవి గుర్తించి లబోదిబోమన్నాడు. తక్కువ పెట్టుబడి. ఎక్కువ ఆదాయం.. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఇంట్లో కూర్చుని టాస్్కలు పూర్తి చేస్తే డబ్బు వచ్చి ఖాతాలో జమ అవుతుంది అంటూ సైబర్ నేరగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. వీళ్ల ఉచ్చులో పడి పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, యువత తమ కష్టార్జితాన్ని సమరి్పంచుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నమ్మించిమోసం చేస్తారు.. అదనపు ఆదాయం వస్తుందనికొందరి ఆశే.. సైబర్ మోసగాళ్లకు వరమవుతోంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వరకూ నమ్మకంగా ఉంటూ ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. బాధితులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. టెలీగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారా నేరగాళ్లు ప్రజలను ఆకట్టుకుంటున్నారు. గ్రూప్లు క్రియేట్ చేసి ఫలానా స్కీమ్ ద్వారా ఫలానా లాభం ఉంటుందని ఆకర్షిస్తున్నారు. ఈ తరహా యాప్లు, వెబ్సైట్లు రోజు రోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఏదైనా యాప్, వెబ్సైట్ను సందర్శించే ముందు ఒకటి రెండుసార్లు పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయండిలా దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఫిర్యాదులు చేయడానికి కేంద్ర హోమ్ శాఖ ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచి్చంది. https://www. cybercrime.gov.in./ వెబ్సైట్ ద్వారా, 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి బాధితులు మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు. అదే విధంగాసమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్/సాధారణ పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఒక వేళ ఓటీపీ, ఆన్లైన్ బ్యాంకింగ్ల ద్వారా మోసానికి గురై డబ్బు పోగొట్టుకున్నట్లయితే వెంటనే ఫిర్యాదు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. 2023లో దేశ వ్యాప్తంగా సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోరి్టంగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో నమోదైన సైబర్ మోసాల ఫిర్యాదులు ఇలా..» ఢిల్లీ 58,748» బిహార్ 42,029» ఛత్తీస్గఢ్ 18,147» తెలంగాణ 71,426» ఆంధ్రప్రదేశ్ 33,507» కర్ణాటక 64,301 » కేరళ 23,757 -
విండోస్లో సైబర్ అటాక్..? స్పష్టతనిచ్చిన సీఈఓ
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ‘బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్’ అనే మెసేజ్ వచ్చింది. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందించే క్రౌడ్స్ట్రైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ఈ ఘటన సైబర్ అటాక్ కాదని క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ స్పష్టం చేశారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ క్రౌడ్స్ట్రైక్ వల్ల ఏర్పడిన సమస్యను అంగీకరించారు. ‘క్రౌడ్స్ట్రైక్ ప్రపంచ వ్యాప్తంగా సిస్టమ్లను ప్రభావితం చేసే అప్డేట్ విడుదల చేసింది. దానివల్ల నిన్న మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించాం. కస్టమర్లకు అసరమయ్యే సాంకేతిక మద్దతును సమకూర్చేలా, తిరిగి తమ సిస్టమ్లను పూర్వ స్థితికి తీసుకొచ్చేలా పనిచేస్తున్నాం’ అని సత్య ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.— Satya Nadella (@satyanadella) July 19, 2024మైక్రోసాఫ్ట్ విండోస్లో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ మెసేజ్ రావడంతో ఇదో సైబర్ అటాక్ అని ప్రాథమికంగా కొందరు భావించారు. విండోస్ సెక్యూరిటీ సర్వీసులు అందిస్తున్న క్రౌడ్స్ట్రైక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ దీనిపై స్పష్టతనిచ్చారు. ‘మైక్రోసాఫ్ట్ సేవల్లో కలిగిన అసౌకర్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం. ఈ ఘటన భద్రతా ఉల్లంఘన లేదా సైబర్అటాక్ కాదు. వినియోగదారులు డేటా భద్రంగా ఉంది. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దాన్ని పరిష్కరించేందుకు పనిచేస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని సిస్టమ్లను బ్యాకప్ చేశాం. విండోస్లోని ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ వల్ల సమస్య ఏర్పడింది. ప్రామాణిక సమాచారం కోసం దయచేసి కంపెనీ వెబ్సైట్ను అనుకరించండి’ అని వివరణ ఇచ్చారు.Today was not a security or cyber incident. Our customers remain fully protected.We understand the gravity of the situation and are deeply sorry for the inconvenience and disruption. We are working with all impacted customers to ensure that systems are back up and they can…— George Kurtz (@George_Kurtz) July 19, 2024ఇదీ చదవండి: ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎర్రర్ మెసేజ్..ఈ ఘటన వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, బ్యాంకులు, అత్యవసర సేవలతో సహా వివిధ రంగాల్లోని టెక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దాంతో క్రౌడ్స్ట్రైక్ సంస్థకు ఏకంగా రూ.1.34 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. -
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు.. మెసేజ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.బ్యాంకుల పేరిట వాట్సాప్లలో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాట్సాప్కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
హ్యాకింగ్.. ‘పోలీస్’ షేకింగ్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల వ్యవధిలో తెలంగాణ పోలీసు శాఖకు చెందిన రెండు కీలక యాప్లు హ్యాకింగ్కు గురవడం కలకలం సృష్టిస్తోంది. సైబర్ నేరగాళ్లు తెలంగాణ పోలీస్కు చెందిన హాక్ ఐ యాప్తోపాటు పోలీస్ అంతర్గత విధుల్లో అత్యంత కీలకమైన టీఎస్కాప్ యాప్ను సైతం హ్యాక్ చేశారు. వీటి నుంచి హ్యాకర్లు పోలీస్ శాఖకు సంబంధించిన కీలక డేటాను, ఫొటోలను చేజిక్కించుకుని.. డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన కేసులను పరిష్కరించే పోలీసులు తమ సొంత యాప్లు హ్యాక్ గురైన విషయాన్ని గుర్తించడంలో మాత్రం ఆలస్యం జరిగింది. హాక్ ఐ యాప్ హ్యాకింగ్ గురైన తర్వాత వారం రోజులకు టీఎస్కాప్ యాప్ హ్యాక్ అయిందని.. రెండింటి హ్యాకింగ్ ఒకే హ్యాకర్ కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు. హాక్ ఐ యాప్ హ్యాకింగ్కు గురవడంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇప్పటికే ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్శాఖకు సంబంధించిన కీలక యాప్ల హ్యాకింగ్ నిజమేనని.. రెండింటిని హ్యాక్ చేసింది ఒకరేనా, వేర్వేరు వ్యక్తులా అన్నది తేల్చాల్సి ఉందని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కీలక వ్యవహారాలన్నీ అందులోనే.. తెలంగాణ పోలీసుల రోజువారీ విధుల్లో టీఎస్కాప్ యా ప్ది ప్రధాన భూమిక. 2018లో ప్రారంభించిన ఈ యాప్లో పాత నేరస్తుల సమాచారం, క్షేత్రస్థాయిలో నిందితులను గుర్తించేందుకు అవసరమైన ఫేషియల్ రికగ్నిషన్ యాప్, సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్), రవాణాశాఖ సమాచారం వంటి మొత్తం 54 సర్విసులు పోలీసులకు క్షేత్రస్థాయి విధుల కోసం అందుబాటులో ఉంటాయి. లక్షలాది మంది నేర స్తుల ఫొటోలు, వేలిముద్రలు, ఇతర వివరాలు, గత కొన్నేళ్లలో నమోదైన నేరాల వివరాలు, రోడ్డు ప్రమాదాలు, ఆయా కేసులలో నిందితులు, బాధితుల ఫోన్ నంబర్లు, దర్యాప్తులో అవసరం మేరకు ఆధార్కార్డు, ఇతర ధ్రువపత్రాల వివరాలు, వాహనాల నంబర్లు, సీసీ టీవీ కెమెరాల జియో ట్యాగింగ్ వివరాలు, క్రైం సీన్ ఫొటోలు, వీడియో లు, సాక్షుల స్టేట్మెంట్ రికార్డులు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వివరాలు ఇలా చాలా సమాచారాన్ని టీఎస్కాప్ యాప్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఇంత కీలమైన యాప్ హ్యాక అవడంపై పోలీస్శాఖలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆన్లైన్లో డేటా అమ్మకం? టీఎస్కాప్ యాప్లోని యూజర్ డేటాను సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి.. తన డిజిటల్దత్తా పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో ‘టీఎస్కాప్ సహా మొత్తం తెలంగాణ కాప్ల నెట్వర్క్ను ఎవరో హ్యాక్ చేశారు.ఈ సాఫ్ట్వేర్ను రూపొందించిన కంపెనీ.. యాప్లో పాస్వర్డ్లను ప్లెయిన్ టెక్ట్స్గా పొందుపర్చడం, యాప్ సీసీటీఎన్ఎస్కు కనెక్ట్ అయి ఉండటం వంటివి సులభంగా హ్యాక్ అవడానికి కారణాలై ఉండొచ్చు’’అని పేర్కొన్నారు. హ్యాకర్ కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి ఆన్లైన్ ఫోరమ్లలో నమూనా డేటాను పోస్ట్ చేశాడని., నేరస్తుల రికార్డులు, తుపాకీ లైసెన్సులు, ఇతర డేటాను కూడా పొందుపర్చాడని తెలిపారు. హ్యాకింగ్ క్రైం ఫోరం అయిన బ్రీచ్ ఫోరమ్స్లో పేర్కొన్న ప్రకారం.. టీఎస్కాప్, హాక్ ఐ నుంచి లీకైన డేటాలో 2 లక్షల మంది యూజర్ల పేర్లు, ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు , అడ్రస్లు 1,30,000 ౖ రికార్డులు, 20 వేల ప్రయాణ వివరాల రికార్డులను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కీలక విభాగాలు, పోలీస్ అధికారుల వివరాలు కూడా..? హాక్ ఐ, టీఎస్కాప్ యాప్లు హ్యాకింగ్కు గురవడంతో.. సైబర్ నేరగాళ్ల చేతికి ఏసీబీ, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, సీసీఆర్బీ, సీసీఎస్, సీఐడీ, కంట్రోల్ రూమ్లు, సీపీ ఆఫీస్లు, డీసీఆర్బీలు, గ్రేహౌండ్స్, జీఆర్పీ, ఇంటెలిజెన్స్, ఐటీ కమ్యూనికేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎస్పీ ఆఫీసులు, ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్లు, స్పెషల్ యూనిట్లు, టాస్్కఫోర్స్, ట్రాఫిక్, టీజీఎస్పీ ఇలా చాలా విభాగాల సమాచారం చిక్కి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. డేటా భద్రత పరిశోధకుడు శ్రీనివాస్ కోడాలి కూడా.. ‘‘అధికారుల పేర్లు, పోలీసు స్టేషన్ అనుబంధాలు, హోదాలు, ఫొటోలతో సహా సమాచారం డార్క్వెబ్లో అమ్మకానికి పెట్టారు, వందల మంది పోలీసు అధికారుల వివరాలు అందులో ఉన్నాయి’’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యుత్తమ టెక్నాలజీ ఉన్న టీఎస్కాప్ యాప్కు గతంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నుంచి ‘సాధికార పోలీసు విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’విభాగంలో అవార్డు దక్కింది. అలాంటి టీఎస్కాప్ యాప్ హ్యాక్ అవడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు సులువుగా ఉండే పాస్వర్డ్లు పెట్టుకోవడంతో హ్యాకింగ్ సులువైనట్టు ప్రచారం జరుగుతోంది. ఈ డేటా బ్రీచ్పై ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
అదంతా ఇన్ఫోసిస్ చేసిందే.. ఐటీ దిగ్గజంపై క్లయింట్ నిందలు
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys )డేటా లీకేజీ నిందలు ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్ కీలక క్లయింట్లలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ అమెరికా ( Bank of America ) తమ 57,028 మంది కస్టమర్లను ప్రభావితం చేసిన సైబర్ దాడుల సంఘటనకు ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ ( Infosys McCamish Systems )కారణమని ఆరోపించింది. ఇన్ఫోసిస్ బీపీఎం అనుబంధ సంస్థ అయిన మెక్కామిష్ సిస్టమ్స్, గత ఏడాది నవంబర్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ సంఘటనతో ప్రభావితమైంది. దాని ఫలితంగా నిర్దిష్ట అప్లికేషన్లు, సిస్టమ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇన్ఫోసిస్ మెక్కామిష్ అనేది ప్లాట్ఫారమ్-ఆధారిత బీపీవో సంస్థ. ఇది జీవిత బీమా, యాన్యుటీ ఉత్పత్తులు, రిటైర్మెంట్ ప్లాన్లకు సంబంధించిన కంపెనీలకు సేవలను అందిస్తుంది. మెక్కామిష్ నిర్దిష్ట పరిశ్రమ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్లను పునఃవిక్రయిస్తుంటుంది. ఈ సంస్థను 2009లో ఇన్ఫోసిస్ బీపీఎం (గతంలో ఇన్ఫోసిస్ బీపీవో) కొనుగోలు చేసింది. "2023 నవంబర్ 3 సమయంలో ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్ (IMS)లో సైబర్ దాడులు జరిగాయి. ఒక అనధికార థర్డ్ పార్టీ చొరబడి సిస్టమ్లను యాక్సెస్ చేసిన ఫలితంగా కొన్ని ఐఎంఎస్ అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా అందించే వ్యత్యాస పరిహారం ప్లాన్లకు సంబంధించిన డేటా ప్రభావితమై ఉండవచ్చని 2023 నవంబర్ 24న ఐఎంఎస్ తెలియజేసింది. అయితే బ్యాంక్ సిస్టమ్లపై ఎటువంట ప్రభావం లేదు" అని కస్టమర్లకు అందించిన నోటీసులో బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. ఇదీ చదవండి: హడలిపోతున్న తరుణంలో చల్లటి కబురు.. ఐటీ కంపెనీల ప్లాన్ ఇదే..! -
వాట్సప్లో కొత్తమోసాలు.. జాగ్రత్తసుమా!
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతోంది. దానికితోడు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయి. సామాన్యులు, చదువురానివారు, బాగా చదువుకున్నవారు, పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రజలు సైబర్దాడికి బలవుతున్నవారే. అయితే వీటన్నింటికి ప్రధాన కారణం వాట్సప్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాక దాదాపు గరిష్ఠకాలం వాట్సప్లోనే గడుపుతుంటాం. అందులో వివిధ వ్యక్తులతో అన్ని వివరాలు చర్చించుకుంటాం. గోప్యంగా ఉండాల్సిన చాలా వివరాలు స్కామర్లు తెలుసుకుని ఆర్థికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మనల్ని వేదిస్తే చాల ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సప్కాల్స్తో జాగ్రత్త.. తెలియని నంబర్ల నుంచి సైబర్ నేరస్థులు నేరుగా కాకుండా వాట్సప్లో మిస్డ్ కాల్ చేస్తుంటారు. సాధారణంగా అయితే కాల్ లిఫ్ట్ చేసేంతవరకు రింగ్ అవుతుంది కదా. ఈ స్పామ్ కాల్స్ రెండు మూడు రింగ్ల తరువాత కాల్ కట్ అవుతుంది. అన్నోన్ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఈ విషయాన్ని గ్రహించాలని చెబుతున్నారు. హ్యాకర్స్ యాక్టివ్ వినియోగదారులను గుర్తించేందుకు ఇలా మిస్డ్ కాల్స్ చేస్తుంటారని బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రిసెర్చ్(బీపీఆర్డీ) పేర్కొంది. నిరుద్యోగులకు ఎర.. ఏటా పెరుగుతున్న నిరుద్యోగం ఒక సమస్య అయితే. వారిని సైబర్ నేరస్థులు ట్రాప్ చేసి వేదింపులకు గురిచేయడం మరో సమస్యగా మారుతుంది. నిరుద్యోగులకు గుర్తించి స్కామర్లు వారికి వాట్సప్లో మెసేజ్లు పంపుతారు. అప్పటికే ఎన్నో ఒత్తిడులతో ఉన్న నిరుద్యోగులు వాటిని నమ్మి వాటికి రిప్లై ఇస్తున్నారు. దాంతో మన ఫోన్లోని వివరాలు వారికి చేరుతున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరిట విభిన్ని ఖాతాల నుంచి ఇలాంటి సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అవసరమై వివరాలు పంపించాల్సి వస్తే క్రెడబిలిటీ ఉన్న ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా సమాచారం ఇవ్వాలంటున్నారు. ఏదైనా ఇంటర్వ్యూకు హాజరవ్వాలంటే వీలైతే నేరుగా వెళ్లి కలిసి సదరు కంపెనీలతో మాట్లాడాలని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలు చోరీ.. వాట్సప్లో వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫీచర్లో భాగంగా తమ స్క్రీన్ను అవతలి వ్యక్తి ఉపయోగించే వీలుంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరస్థులు బాధితుడి బ్యాంకు ఖాతాల వివరాలు, గోప్యమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అనంతరం ఖాతాలోని డబ్బు కొల్లగొడుతున్నారు. ఇదీ చదవండి: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ట్రేడింగ్ సలహాలతో.. కరోనా తర్వాత మార్కెట్లు భారీగా ర్యాలీ అయ్యాయి. దాంతో ఆ లాభాలు చూపించి సామాన్యులకు ఎరవేస్తున్నారు. ట్రేడింగ్లో నైపుణ్యం కలిగిన వ్యక్తులమంటూ పలువురు వాట్సప్లో మెసేజ్లు చేస్తున్నారు. తమ సలహాలు పాటిస్తే లాభాలు పొందవచ్చని నమ్మిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్లో లేని అనధికారిక అప్లికేషన్ లింక్లను పంపించి దానిలో ఖాతా తెరిపించి పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ప్రారంభంలో వినియోగదారులకు కొంత లాభాలు చూపించి, పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాకా ఖాతాలో డబ్బు కొట్టేస్తున్నారు. -
యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపీఐ యాప్స్ వినియోగం బాగా పెరిగింది. దీంతో చాలా మంది జేబులో డబ్బు పెట్టుకోవాలన్న సంగతే మరచిపోయారు. ఎక్కడికెళ్లినా స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోతుంది. కిరాణా కొట్టులో వస్తువులు కొనే దగ్గర నుంచి షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసే వరకు అన్నీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తున్నారు. దీన్నే అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు నకిలీ క్యూఆర్ కోడ్ల ద్వారా యూజర్ల వ్యక్తిగత వివరాలను దొంగలిస్తున్నారు. ఇది ఆ తరువాత రోజుల్లో ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది. యూపీఐ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన వెంటనే అది యూజర్లను ఒక వెబ్సైట్కు తీసుకెళ్తుంది. అక్కడ చెల్లించాల్సిన పేమెంట్ ఎంటర్ చేసి చెల్లిస్తారు. కానీ సైబర్ నేరగాళ్ళకు సంబంధించిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసిన తరువాత అది కూడా వేరొక వెబ్సైట్కి కనెక్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ సాధారణంగా నిజమైన వెబ్సైట్ మాదిరిగానే కనిపిస్తుంది. అందులో యూజర్ వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేయమని చెబుతుంది. దీనిని నమ్మి వినియోగదారుడు సమాచారం ఎంటర్ చేస్తే.. వివరాలన్నీ కూడా స్కామర్కు వెళ్ళిపోతుంది. యూజర్ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్కామర్ అకౌంట్ నుంచి డబ్బు కాజేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చెబుతారు.. ఇదేగానీ జరిగితే యూజర్ పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ ఇలాంటి స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలు! బహిరంగ ప్రదేశాల్లో ఉండే క్యూఆర్ కోడ్లను ఎట్టి పరిస్థితుల్లో స్కాన్ చేయకూడదు. క్యూఆర్ కోడ్లు మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం లేదా ఇమెయిల్ రూపంలో వస్తే వాటిని స్కాన్ చేయకూడదు. సోషల్ మీడియాలో కనిపించే క్యూఆర్ కోడ్ల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. లింక్ను కలిగి ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేముందు, యూఆర్ఎల్ చెక్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తే.. అలాంటి వాటిని విస్మరించడం మంచిది. ఇలాంటి మోసాలను నివారించడానికి బిల్డ్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. మీ డిజిటల్ అకౌంట్స్ పాస్వర్డ్లను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. -
‘డిజిటల్ అరెస్ట్’ గురించి తెలుసా..?
పదేళ్ల కిందట క్రైమ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న క్రైమ్ వేరు. దానివల్ల కలిగే బాధ మారకపోయినా.. క్రైమ్ జరిగేతీరు, దాని విధానం, రూపం మారుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్లో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి షాపింగ్ చేయటం తెలిసిందే. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం కొత్త విషయమేమీ కాదు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగడం మామూలై పోయింది. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం..డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం మరో తరహా మోసం. అయితే తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే.. సైబర్ నేరాలు పెచ్చుమీరుతున్న రోజుల్లో రోజుకో కొత్తరకం మోసాలు వెలుగు చూస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ ఇలాంటిదే. ఇందులో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్ అరెస్ట్’. డిజిటల్ అరెస్ట్ కొత్త సైబర్ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల మనదేశంలో వెలుగులోకి వచ్చిన ఘటనలే దీనికి నిదర్శనం. నోయిడాకు చెందిన ఒక మహిళకు ఒకరు ఫోన్ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్ కార్డుతో సిమ్ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయారు. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయాడు. తదుపరి విచారణ కోసం కాల్ను ట్రాన్స్ఫర్ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్ కాల్ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్ఫర్ చేసుకున్నాక గానీ కాల్ కట్ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. మరేం చేయాలంటే.. భారతీయ చట్టాల్లో ఇప్పటివరకూ డిజిటల్ అరెస్ట్ అనేదే లేదన్న సంగతి తెలుసుకోవాలి. ఎవరైనా దర్యాప్తు అధికారులమని చెప్పి, విచారణ చేస్తున్నామంటే భయపడొద్దు. వెంటనే కాల్ను కట్టేయాలి. మరోసారి ఆలోచించుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్లకు విషయాన్ని తెలియజేయాలి. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు గానీ అధికారులు గానీ కాల్ చేసి బెదిరించటం, భయపెట్టటం చేయరు. కాబట్టి అలాంటి కాల్ వస్తే దాన్ని గుర్తించాలి. వారి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి. మరీ ఎక్కువగా బెదిరిస్తే అన్ని వివరాలతో నోటీసు పంపించమని అడగాలి. పోలీస్ స్టేషన్కు వచ్చి వారిని కలుస్తానని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య సమాచారాన్ని వెల్లడించొద్దు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో ముడిపడిన వివరాలను ఇవ్వద్దు. -
రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే..
సైబర్ యుగంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకుని మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేస్తున్నారు. రుణయాప్ల పేరుతో తోచినంత లాగేస్తున్నారు. కొన్ని టాస్క్లు ఇచ్చి అవిపూర్తి చేసిన తర్వాత ఆన్లైన్ పెట్టుబడి పెట్టాలంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పిన్ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సిమ్ స్వాప్ చేసి మన ఫోన్కు అందాల్సిన మెసేజ్లను మళ్లించి, డబ్బు లాగేస్తున్నారు. ఇలా నిత్యం జరుగుతున్న మోసాల ద్వారా కేవలం తెలంగాణలోనే ఏకంగా దాదాపు 8 నెలల్లో రూ.707 కోట్లమేర సొమ్ము గుంజినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన 16,339 సైబర్ నేరాల్లో 15 వేల వరకు ఆర్థిక మోసాలే నమోదయ్యాయి. ముఖ్యంగా అయిదు నేరవిధానాల ద్వారా ఆన్లైన్లో ఆర్థికమోసాలు జరుగుతున్నట్లు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్సీఎస్బీ) నిపుణులు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఒక్క తెలంగాణలోనే 40 శాతానికిపైగా ఉండటాన్ని బట్టి రాష్ట్రంపై సైబర్ నేరస్థులు ఎలా పంజా విసురుతున్నారో అర్థమవుతోంది. తెలంగాణలో సైబర్ నేరస్థులు ఎనిమిది నెలల్లో రూ.707.25 కోట్లు మోసానికి పాల్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే రోజూ రూ.3 కోట్లు మోసం చేస్తున్నారు. అలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఎలా మోసం చేస్తున్నారంటే.. వస్తువులు విక్రయిస్తామంటూ.. ఏదైనా వాహనం లేదా వస్తువును అమ్మకానికి పెట్టినట్లు వెబ్సైట్లలో ప్రకటనలిస్తారు. కొనుగోలుకు ఆసక్తిచూపే వారితో వాహనం విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో ఉందని.. రవాణా ఛార్జీలు పంపిస్తే చాలు మీరు కోరిన ప్రదేశానికి పంపిస్తామని మాటలు చెబుతున్నారు. అలా రూ.వందలతో మొదలుపెట్టి వీలైనంత వరకు కొట్టేస్తున్నారు. పెట్టుబడి పెట్టాలంటూ.. మోసగాళ్లు పార్ట్టైమ్ ఉద్యోగాల పేరిట సందేశాలు పంపి స్పందించిన వారిని టాస్క్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. తాము సూచించే వెబ్సైట్లో వీడియోలు పరిశీలించి రేటింగ్ ఇస్తే చాలు భారీగా డబ్బులొస్తాయని చెబుతున్నారు. ముందు కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టించి టాస్క్ను పూర్తి చేస్తే భారీ లాభం ఇస్తున్నారు. దీంతో వారు మరింత పెట్టుబడి పెడుతున్నారు. లక్షలు పెట్టాక మోసం చేస్తున్నారు. పార్సిళ్ల పేరుతో.. సైబర్ నేరస్థులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకో పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కస్టమ్స్ అధికారులకు అప్పగించామని చెబుతున్నారు. కొద్దిసేపటికే కస్టమ్స్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారంట్ జారీ అయిందని చెబుతున్నారు. న్యాయపరమైన చిక్కులు తప్పిస్తామంటూ రూ.లక్ష నుంచి వీలైనంత మేరకు వసూలు చేస్తున్నారు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. అప్గ్రేడ్ చేస్తామంటూ.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను అప్గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. తాము పంపే ఆ లింక్ ద్వారా సమాచారం నింపాలని మాల్వేర్ను పంపించి కార్డుల ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబరుతోపాటు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను తీసుకొని ఖాతా ఖాళీ చేస్తున్నారు. -
ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే..
సైబర్ నేరస్థులు జనాలను మోసం చేయడానికి రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామందికి సినిమాలంటే ఇష్టం ఉంటుంది. అదే కొత్త సినిమాలంటే మరీ ఎక్కువ ఆసక్తి. రిలీజ్ కాగానే చూడాలనే ఆశ. దాంతో ఎలాగూ ఫోన్లో సరిపడా డేటా ఉంటుంది కాబట్టి కొత్త సినిమాల కోసం వెతుకుతారు. కానీ ప్రస్తుతం అధికారికంగా విడుదలైన తర్వాతే ఓటీటీలో సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఓటీటీలో మూవీ వచ్చినా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే భావనతో ఇతర ప్లాట్ఫామ్ల్లో సెర్చ్ చేస్తున్నారు. అలా జనాలు చేస్తున్న ప్రయత్నాలే సైబర్ నేరగాళ్లకు మార్గం సుగమం చేస్తున్నాయి. కొత్త సినిమా కోసం వెతికే ప్రయత్నంలో భాగంగా చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ను వినియోగిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ కాగానే సంబంధిత ప్లాట్ ఫామ్లో సబ్ స్క్రిప్షన్ లేకున్నా టెలిగ్రామ్లో ప్రత్యక్షమవుతుంది. దీంతో యూజర్లు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఇబ్బడి ముబ్బడిగా చేరిపోతున్నారు. సరిగ్గా అక్కడే యూజర్ల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ఇదీ చదవండి: ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..! సినిమా పేరు సెర్చ్ చేయగానే టెలిగ్రామ్లో ఫ్రీ డౌన్ లోడ్ అనే లింక్లు కనిపిస్తాయి. యూజర్లు దాన్ని క్లిక్ చేస్తున్నారు. వెంటనే ఫ్రీగా సినిమా చూడాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనే పాప్అప్ వస్తుంది. అలా వచ్చిన సూచన పూర్వాపరాలు చెక్ చేసుకోకుండా సదరు యాప్ను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. దాంతో వెంటనే పర్సనల్ డేటా, అందులో వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్ల చేతిలో పడుతున్నాయి. అటుపై వారు చేతివాటం ప్రదర్శించి.. ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తున్నారని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సైబర్ దోస్త్’ తెలిపింది. ఈ తరహా మోసాల పట్ల అలర్ట్గా ఉండాలంటూ.. టెలిగ్రామ్ లింక్ల ద్వారా వచ్చే యాప్లను డౌన్ లోడ్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. -
ఆందోళనలో దేశీయ కంపెనీలు.. ముప్పు తప్పదా..?
న్యూదిల్లీ: దాదాపు అన్ని రంగాలూ, సకల కార్యకలాపాలూ అంతర్జాలంతో అనుసంధానమైవుతున్న డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. దీని ద్వారా వేగవంతమైన అద్భుత ప్రయోజనాలు ఒక కోణమైతే.. హ్యాకింగ్లూ, వైరస్ దాడులూ, మోసాలూ దీని మరో కోణం. దీంతో సైబర్ భద్రత అనివార్యమైంది. చాలా కంపెనీలకు సైబర్ భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన 2023 గ్లోబల్ రిస్క్ సర్వే–ఇండియా నివేదికలో సైబర్ సెక్యూరిటీపై కంపెనీలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు వెల్లడయ్యింది. దీని ప్రకారం భారతీయ కంపెనీలకు పొంచి ఉన్న రిస్కుల్లో సైబర్ సెక్యూరిటీ అగ్ర స్థానంలో ఉంది. రాబోయే 12 నెలల్లో తమ సంస్థలకు అత్యధికంగా సైబర్ సెక్యూరిటీ రిస్కులు పొంచి ఉన్నాయని సుమారు 38 శాతం మంది రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో వాతావరణ మార్పులు (37 శాతం మంది), ద్రవ్యోల్బణం (36 శాతం), ఇతరత్రా డిజిటల్.. టెక్నాలజీ (35 శాతం) రిస్కులు ఉన్నాయి. 67 ప్రాంతాలకు చెందిన 3,910 మంది బిజినెస్, రిస్క్ మేనేజ్మెంట్ లీడర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 163 భారతీయ సంస్థలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీపరమైన రిస్కు గతేడాది నివేదికలో మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానానికి చేరింది. నివేదికలో మరిన్ని వివరాలు.. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ సంస్థలు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేసుకునేందుకు భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వాటిలో 55 శాతం సంస్థలు వచ్చే 1–3 ఏళ్లలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నాయి. 71 శాతం దేశీ సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ, ఐటీ డేటాను సేకరించి, విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 61 శాతంగా ఉంది. దేశీ వ్యాపార దిగ్గజాలు రిస్కు తీసుకునే సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు రిసు్కల వల్ల వచ్చే అవకాశాలను గుర్తించడంలోనూ సముచితంగా వ్యవహరిస్తున్నాయి. ఆలోచనా ధోరణిలో ఈ తరహా మార్పులనేవి సంస్థ పురోగతికి దోహదపడనున్నాయి. 99 శాతం దిగ్గజాలు ఇటు రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూనే అటు వృద్ధి సాధించగలమనే ధీమాతో ఉన్నాయి. ఇందులో 66 శాతం సంస్థలు అత్యంత ధీమాగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఈ గణాంకాలు వరుసగా 91 శాతం, 40 శాతంగా ఉన్నాయి. టెక్నాలజీల్లో విప్లవాత్మక మార్పులను రిసు్కలుగా కాకుండా అవకాశాలుగా భారతీయ వ్యాపార సంస్థలు భావిస్తున్నాయి. 69 శాతం దేశీ ఎగ్జిక్యూటివ్లు జనరేటివ్ ఏఐని ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా వీరి సంఖ్య 60 శాతంగా ఉంది. ఇదీ చదవండి: చనిపోయినా సంపద సేఫ్..! కానీ.. రిస్క్ మేనేజ్మెంట్ కోసం జెనరేటివ్ ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను కూడా కంపెనీలు పెద్ద యెత్తున వినియోగించుకుంటున్నాయి. ఆటోమేటెడ్ రిస్క్ అసెస్మెంట్, స్పందన కోసం 48 శాతం దేశీ సంస్థలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇది 50 శాతంగా ఉంది. -
డార్క్వెబ్లో ‘బీఎస్ఎన్ఎల్’ యూజర్ల డేటా
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ వినియోగదారుల సమాచారాన్ని చోరీచేసిన ఓ హ్యాకర్ ఆ వివరాలను ఆన్లైన్లో విక్రయానికి పెట్టాడు. దీంతో ఆయా కస్టమర్ల గోప్యతకు విఘాతం కలిగింది. తనను ‘పెరిల్’గా పేర్కొన్న ఓ హ్యాకర్.. డార్క్వెబ్లో ఆ సమస్త వివరాలను పొందుపరిచాడు. దీంతో యూజర్ల గుర్తింపు బహిర్గతమవడంతోపాటు వారి సమాచారం సాయంతో మరో ఆర్థిక మోసం, ఆన్లైన్మోసానికి ఆస్కారం ఏర్పడింది. దాదాపు 29 లక్షల వరుసల డేటాను సంపాదించానని హ్యాకర్ తన డార్క్వెబ్ పేజీలో పేర్కొన్నాడు. శాంపిల్గా మొదట 32,000 లైన్ల డేటాను అందరికీ కనిపించేలా పెట్టాడు. ఆయా బీఎస్ఎన్ఎల్ ఫైబర్, ల్యాండ్లైన్ యూజర్ల పేరు, ఈమెయిల్ ఐడీ, బిల్లుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత డేటాను వెబ్సైట్లో విక్రయానికి పెట్టాడు. కస్టమర్ ఇన్ఫర్మేషన్, నెట్వర్క్ వివరాలు, ఆర్డర్లు, హిస్టరీ అందులో ఉన్నాయి. డేటా చోరీతో వెంటనే అప్రమత్తమై తమ యూజర్ల డేటా రక్షణకు బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగాయి. ‘ ఇది బీఎస్ఎన్ఎల్కు, దాని వినియోగదారులపై విస్తృతస్థాయిలో దు్రష్పరిణామాలు చూపిస్తుంది’ అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఇండియా ఫ్యూచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కనిష్క్ గౌర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్.. స్విగ్గీ ఖాతా ద్వారా రూ.38,000 మాయం!
ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోవైపు సైబర్ నేరాలు కొత్త అవతారాల్లో పుట్టుకొస్తున్నాయి. గతంలో బ్యాంక్ నుంచి కాల్ చేసినట్లు ప్రజలను మోసం చేసి ఓటీపీ వంటి వివరాలను తెలుసుకుని అకౌంట్లలో ఉండే డబ్బు మాయం చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు అవసరం లేకుండానే డబ్బు కాజేయడానికి ఓ కొత్త మార్గం కనిపెట్టేసారు. దీంతో మన ప్రమేయం లేకుండానే ఖాతాల్లో సొమ్ము మాయమైపోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల బెంగళూరులో 'చెన్నకేశవ' అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దెబ్బకు రూ.38,000 పోగొట్టుకున్నాడు. నిజానికి ఈ మోసం స్విగ్గీ ఖాతా ద్వారా జరిగినట్లు తెలిసింది. ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్న చెన్నకేశవకు స్విగ్గీ నుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసుకున్న చెన్నకేశవ ఆర్డర్ నిర్దారించాడని ఒకటి నొక్కండి, లేకుంటే రెండు నొక్కండి అంటూ వచ్చింది. దీంతో అతడు ఆర్డర్ చేసుకోలేదు కాబట్టి ఒకటి నొక్కాడు. ఈ క్రమంలోనే అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఓటీపీని అందించాలని వాయిస్ మెసేల్ ద్వారా అడగటంతో ఆ వివరాలు ఎంటర్ చేసాడు. కానీ మళ్ళీ ఓటీపీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తానికి అతని ఖాతా నుంచి ఏకంగా సైబర్ నేరగాళ్లు రూ. 38,720 ఖర్చు చేసినట్లు తెలుసుకున్నాడు. ఇదీ చదవండి: ఇలా ఎలా అనిపించిన ఓలా.. జరిగిన మోసాన్ని గ్రహించిన చెన్నకేశవ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు అతని Swiggy ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, హిస్టరీ వివరాలు మొత్తం డిలీట్ చేసినట్లు కనిపించింది. ఈ సంఘటనపై స్విగ్గీని కూడా సంప్రదించారు. దీనిపైన సమగ్ర విచారణ జరపడానికి కొంత సమయం అవసరమని, అప్పటి వరకు చెన్నకేశవ స్విగ్గీ అకౌంట్ బ్లాక్ చేయడం ద్వారా లేజీపే ముందస్తు చర్యలు చేపట్టి తదుపరి అనధికార మినహాయింపులను నిరోధించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా స్విగ్గీ యూజర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
బెడ్ అమ్మబోయి రూ.68 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. ఎలా అంటే?
బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ OLXలో తాను ఉపయోగించిన బెడ్ను విక్రయించడానికి ప్రయత్నించి ఏకంగా రూ. 68 లక్షల నష్టాన్ని చవిచూశాడు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివాసం ఉంటూ నగరంలోని ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఈ మోసానికి బలైపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించిన సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన 36 సంవత్సరాల ఇంజినీర్ రూ. 15000లకు బెడ్ విక్రయించడానికి ఓఎల్ఎక్స్ యాప్లో ఫోటోలను అప్లోడ్ చేసాడు. ఇది చూసి కొనుగోలు చేయాలనుకున్న ఓ వ్యక్తి (మోసగాడు), బెడ్ అమ్మాలనుకున్న ఇంజినీర్కు ఫోన్ చేసాడు. ఇంజినీర్ వెల్లడించిన ధరకే కొనుగోలు చేస్తానని చెప్పిన మోసగాడు UPI లావాదేవీకి సంబంధించిన సాంకేతిక సమస్యలున్నట్లు, పరిష్కరించుకోవడంలో భాగంగా తనకు రూ. 5000 పంపాలని వెంటనే తిరిగి పంపిస్తానని చెప్పాడు. ఆ మోసగాని మాటలు విన్న టెకీ రూ. 5వేలు పంపించాడు. మోసగాడు మొదట్లో రూ. 10వేలు పంపించాడు. ఇలాగే మళ్ళీ రూ. 5వేలు, రూ. 10వేలు, రూ. 15వేలు డిమాండ్ చేస్తూ మొత్తానికి భారీగానే సబ్బు గుంజేసాడు. ఇదీ చదవండి: ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ డబ్బు పంపించే క్రమంలో మోసగాడు టెకీకి రూ. 30000 షేర్ చేసాడు. మోసగాడు టెక్కీని లింక్ను ఉపయోగించి డబ్బును తిరిగి ఇవ్వమని, OTPని షేర్ చేయమని కోరాడు. ఇంజనీర్ OTP ట్రాప్లో పడిపోగానే, అతను ఏకంగా 68 లక్షల రూపాయల కోల్పోయాడు. రూ. 68 లక్షలు పోగొట్టుకున్న టెకీ పోలీసులకు పిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సైబర్ లేదా ఆన్లైన్ మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ తరహా మోసాల వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. -
సైబర్ వల నుంచి తప్పించుకోవాలంటే ఇలా చెయ్యండి చాలు!
విజయవాడ: విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువకుడు పీజీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతగా వ్యాపారం చేయాలన్నది అతని కల. ‘ఇంట్లో కూర్చుని వ్యాపారం చేసి నెలనెలా రూ.లక్షల్లో సంపాదించొచ్చు’ అంటూ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అతడిని ఆకట్టుకుంది. మెసేజ్ పంపిన వారితో చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ‘కొన్ని వెబ్ లింక్లు ఓపెన్ చేసి టాస్క్లు పూర్తి చేస్తే వెంటనే నగదు మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని’ సైబర్ నేరగాళ్లు అతడిని నమ్మించారు. రిజిస్ట్రేషన్కు కొంత నగదు చెల్లించి తొలి రెండు టాస్క్లు పూర్తి చేయగానే నగదు చెల్లించారు. ఆ తరువాత ఆ యువకుడు మరింత ఉత్సాహంతో కొత్త టాస్క్లు కొని పూర్తిచేశాక అతని వ్యాలెట్లో డబ్బు కనిపించినా విత్డ్రా కాకపోవడంతో సదరు వ్యక్తులను వాట్సాప్, టెలిగ్రాం చాటింగ్తో సంప్రదించాడు. ‘ఏదో ఎర్రర్ వస్తుంది.. మీరు టాస్క్లు పూర్తి చేయండి.. నగదు ఎక్కడికీ పోదు’ అని నేరగాళ్లు అతడిని భరోసా ఇచ్చారు. వారిని నమ్మి విడతల వారీగా రూ.80 లక్షలు చెల్లించాక మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు విజయవాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, సైబర్ నేరస్తుల బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. మోసం చేసేది ఇలా.. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీతో మోసాలకు తోడు టెలిగ్రాం, వాట్సాప్ల సాయంతో ఉద్యోగ, వ్యాపార ప్రకటనతో నిరుద్యోగులు, చిరుద్యోగులు, మధ్యతరహా వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. పలు మార్గాల ద్వారా ప్రజల ఫోన్ నంబర్లను సేకరిస్తున్న నేరగాళ్లు ముందుగా వాట్సాప్/ టెలిగ్రాంలో ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. ఇంట్లో కూర్చుని, ఖాళీ సమయంలో పని చేస్తే కుటుంబ ఖర్చులౖకైనా వస్తాయన్న ఆశతో ఉన్న వారిని సైబర్నేరగాళ్లు చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు. చాటింగ్కు నంబర్లు కనిపించని టెలిగ్రాం యాప్నే నేరగాళ్లు ఉపయోగిస్తారు. వర్క్ ఎలా చెయ్యాలి, ఇన్స్టా, ఫేస్బుక్, యూ ట్యూబ్ వీడియోలకు ఎలా లైక్లు కొట్టాలి, ఎలా షేర్ చేయాలి, ఎంత డబ్బు వస్తుంది.. అనే విషయాలను చాటింగ్లోనే వివరిస్తారు. మచ్చుకు కొన్ని వీడియోలను వాళ్లే పంపించి టాస్క్లు ఇస్తారు. నమ్మించేందుకు తొలి రోజే కొంత నగదును వారి బ్యాంక్ ఖాతాలో వేస్తారు. రెండో రోజూ కొన్ని టాస్క్లు ఇచ్చి నగదు చెల్లిస్తారు. ఆ తరువాత నుంచి ఎక్కువ డబ్బు సంపాదించాలంటే పేరున్న కంపెనీలు ఆన్లైన్లో విక్రయించే వస్తువులకు రేటింగ్ ఇవ్వాలని, ఈ పని రిజిస్ట్రేషన్ కోసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. వెబ్సైట్ వాలెట్లో డిపాజిట్ సొమ్ము, ప్రాఫిట్, విత్డ్రా వివరాలు నిత్యం స్క్రీన్పై కనపడుతూనే ఉంటాయని నమ్మబలుకుతారు. సొమ్ము డిపాజిట్ చేసి టాస్క్లో దిగిన తరువాత.. చెల్లించిన సొమ్ముకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు కలిపి ప్రాఫిట్ బాక్స్లో చూపిస్తారు. అయితే ఆ డబ్బు విత్డ్రా అవ్వదు. ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే మరి కొంత నగదు చెల్లించి రెండో టాస్క్ పూర్తి చేయాలని నమ్మిస్తారు. ప్రాఫిట్ బాక్స్లో ఉన్న నగదు కంటే డిపాజిట్ చేయాల్సిన నగదును తక్కువగానే చెబుతారు. ప్రాఫిట్ బాక్స్లో ఎక్కువగా ఉన్న నగదును చూసి ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్లకు బాధితులు నగదు చెల్లిస్తూనే ఉంటారు. అవతలి వ్యక్తి మాయగాడని తెలుసుకునే లోపు రూ.లక్షల్లో మోసపోతారు. ఆ తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పెరుగుతున్న మోసాలు.. సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 కేసులు నమోదు చేస్తున్నాం. ఇటీవల ఓ యువతి రూ.10 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేసింది. సులువుగా డబ్బులు వస్తాయనే ఆశతోనే ప్రజలు మోస పోతున్నారు. 'ఉద్యోగం ఇచ్చే వ్యక్తి నెలకు జీతం ఇస్తాడే కానీ మన నుంచి ముందుగా డబ్బులు తీసుకోడనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.' ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాలతో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ క్రైం పోలీస్స్టేషన్, విజయవాడ ఇవి చదవండి: కడపలో తల్లీతనయుల అదృశ్యం! -
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
'పార్ట్ టైం జాబ్' కోసం ఈ లింక్ క్లిక్ చేస్తున్నారా.. జర జాగ్రత్త! లేదంటే..
సాక్షి, సంగారెడ్డి: పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన మెసేజ్ కు స్పందించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఒకరు రూ.3 లక్షల 55 వేలు, మరొకరు రూ.7 లక్షల 48 వేలు మోసపోయిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. అమీన్పూర్ పరిధిలోని బంధన్ కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం జాబ్ పేరుతో నవంబర్ 2న మెసేజ్కు వచ్చింది. దీనికి స్పందించిన అతను తన వివరాలను నమోదు చేసి నగదు పెడుతూ అపరిచిత వ్యక్తి ఇచ్చిన టాస్క్లు పూర్తి చేశాడు. మొత్తం మూడు లక్షల 55 వేలు పెట్టాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి సోమవారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పార్ట్టైం ఉద్యోగం పేరిట నవంబర్ 4వ తేదీన మెసేజ్ వచ్చింది. దానికి స్పందించి తన వివరాలను నమోదు చేశాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా ముందుగా రూ.2000 చెల్లించి, టాస్కులు చేస్తూ వచ్చాడు. అయితే అపరిచిత వ్యక్తి పెట్టిన నగదును, వచ్చిన కమిషన్లు క్రియేట్ చేసిన వాలెట్లో చూపిస్తూ వచ్చాడు. చివరికి దీంతో తాను పెట్టిన రూ.ఏడు లక్షల 48 వేలతో పాటు కమిషన్ ఇవ్వాలని అడగడంతో అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం అమీన్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి చదవండి: నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం! -
ఇలాంటి కాల్స్ వస్తున్నాయా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతున్నారు, కొత్త మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు మోసగాళ్లు ఫోన్ చేసి మీ సిమ్ కార్డు సర్వీస్ నిలివేస్తున్నట్లు, ఆలా జరగకుండా ఉండాలంటే మేము చెప్పినట్లు చేయాలని చెబుతున్నారు. ఇలాంటి మోసాలపైన 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DOT) కొన్ని సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వినియోగదారులకు ఫోన్ చేసి మరి కొన్ని గంటల్లో సిమ్ డీయాక్టివేట్ అవుతుందని, సర్వీస్ నిలిపివేయనున్నట్లు భయపెడుతూ.. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని వివరాలు కావాలని అడుగుతారు. ఇది నిజమే అని నమ్మి వివరాలు వెల్లడిస్తే మోసాలు జరుగుతాయని DOT వెల్లడిస్తూ.. ఎవరూ ఇలాంటి వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించింది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. ఇలాంటి కాల్స్ తరచూ వస్తే, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)కి ఫిర్యాదు చేయవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ శాఖ పేర్కొంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ అరికట్టడానికి కొన్ని సంస్థలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైట్లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన యూఎస్ ట్రెజరీ ట్రేడ్లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్దాడికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్బిట్ 3.0 అనే రాన్సమ్వేర్ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్వేర్ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్వేర్లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్లోని స్పామ్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్వేర్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి లాక్బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్కు ప్రత్యేకమైన పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్వేర్ దాడుల్లో 28శాతం లాక్బిట్ ద్వారా జరిగినవేనని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్పాయింట్ నివేదిక చెబుతుంది. -
ఆస్పత్రులపై సైబర్ నీడ..వెలుగులోకి షాకింగ్ విషయాలు!
సైబర్ నేరగాళ్లు ఆగడాలు శృతి మించుతున్నాయి. ఇంతవరకు ఆన్లైన్ మోసాలకు లేదా కొత్త తరహాలో వ్యక్తుల డేటాను తస్కరించి బ్లాక్మెయిల్తో డబ్బులు గుంజడం వంటి సైబర్ నేరాలు చూశాం. అక్కడితో ఆగకుండా దేవాలయాల్లాంటి ఆస్పత్రులపై కూడా సైబర్ నీడ పడింది. వాటిని కూడా టార్గెట్ చేసి రోగుల వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అమెరికాలో లాస్వేగస్లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..లాస్వేగస్లోని ప్లాస్టిక్సర్జరీ క్లినిక్ హాంకిన్స్ అండ్ సోహ్న్ హెల్త్కేర్ హ్యాకర్ల బారిన పడింది. ఆ క్లినిక్కి వచ్చిన రోగులు వ్యక్తిగత డేటా, ఆపరేషన్కి ముందు తర్వాత తీసిన వ్యక్తిగత న్యూడ్ ఫోటోలతో సహా హ్యాక్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చాంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రి వివాదంలో చిక్కుకుపోయింది. హెల్త్కేర్ సెక్టార్కి సంబంధించి రోగులు డేటా భద్రత విషయమై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన సైబర్ సెక్యూరిటీ అవసరాన్ని తెలియజేస్తోంది. ఈ ఘటనలో ముఖ్యంగా బాధిత మహిళ రోగుల డేటానే ఎక్కువగా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఆయా రోగులు శస్త్ర చికిత్స, వ్యక్తిగత సమాచారం తోపాటు బ్యాంకు అకౌంట్ల నంబర్లను హ్యాకింగ్ గురయ్యాయి. సదరు ఆస్పత్రి తమ ఆరోగ్య భద్రతను కాపాడటంలో విఫలమైందంటూ బాధితుల నుంచి ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేగాదు సదరు ఆస్పత్ర ప్రజల హెల్త్ కేర్ పేషెంట్ల డేటా ప్రొటెక్షన్కి చట్టాలకు కట్టుబడి లేదంటూ విమర్శలు వచ్చాయి. భాదితమహిళలు తమకు జరిగిన నష్టానికి సదరు ఆస్పత్రి తగిన సమాధానం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రులు రోగుల నమ్మకాలు, భావోద్వేగాలతో ఆడుకుందంటూ మండిపడుతున్నారు. ఆస్పత్రుల డేటాను పర్యవేక్షించడంలో సైబర్ సెక్యూరిటీ విఫలమైందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీని కారణంగా రోగుల హెల్త్ డేటా భద్రత విషయమై క్లినిక్లపై చెరగని మచ్చ ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. ఈ ఇంటర్నెట్ యుగంలో భద్రత అన్నదే కరువైందంటూ సదరు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు కేవలం కంపెనీలు, మనుషుల వ్యక్తి గత డేటానే గాదు ఆస్పత్రుల డేటాపై కూడా సైబర్ దాడి చేయడం బాధకరం. సాధ్యమైనంత వరకు అన్ని విభాగాలకి సంబంధించిన డేటాకి సైబర్ సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ఈ మేరకు లాస్వేగాస్ పోలీసులు ఈ ఘటనపై సత్వరమే దర్యాప్తు చేపట్టారు. ఏదిఏమైనా తస్మాత్ జాగ్రత్త! డేటా అపహరణకు గురికాకుండా ఎవరికివారుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోక తప్పదని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. (చదవండి: 'ప్టోసిస్' గురించి విన్నారా? కంటికి సంబంధించిన వింత వ్యాధి!) -
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్లో ఔట్పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
వారానికి జరిగే సైబర్ అటాక్లు ఎన్నంటే..
భారతదేశంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి వేగంగా పురోగమిస్తుంది. అయితే అందుకు అనువుగా డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పొరుగు దేశాల్లోని శత్రువులు, స్కామర్లు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం..ఇండియాలోని సంస్థలపై సగటున గత ఆరు నెలల్లో వారానికి 2,157 సార్లు సైబర్ దాడులు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో సంస్థపై సగటున 1,139 దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన సింగపూర్ సైబర్ వీక్-2023 సమావేశంలో నిపుణులు మాట్లాడారు. భారతీయ సాంకేతిక నిపుణులు, వ్యాపార కార్యనిర్వాహకులు పరస్పరం సహకారం అందించుకుంటూ డేటా భద్రతపరంగా సమగ్ర వ్యవస్థను రూపొందించాలన్నారు. దేశ పురోగతికి ప్రధాన అంశాలైన ఐటీ పరిశ్రమలతోపాటు ఆరోగ్య సంరక్షణ, విద్య/ పరిశోధన, రిటైల్, హాస్పిటాలిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రవాణా వంటి రంగాలు సైబర్ సెక్యూరిటీ సవాళ్లకు అనువుగా చర్యలు తీసుకోవాలని నిపుణులు తెలిపారు. రోజురోజూ సైబర్ సెక్యూరిటీ చాలా క్లిష్టంగా మారుతుందని ఏపీఏసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ గుల్లపల్లి చెప్పారు. కంపెనీల్లోని ఐటీ విభాగం తరచు సైబర్ సెక్యూరిటీని నిర్వహించాలని ఆయన సూచించారు. సంస్థలో సైబర్ సెక్యూరిటీ వ్యూహాన్ని అమలు చేయడానికి బోర్డులు, మేనేజ్మెంట్ సభ్యులతో కలిసి పని చేయాలన్నారు. -
Cyber Attack: యూట్యూబ్ లైక్ కొడితే రూ.77 లక్షలు దోచుకున్నారు!
ఏటికేటా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ను ఊతంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలవుతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్నా, మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆన్లైన్ జాబ్స్, పార్ట్టైం జాబ్స్ ఆశచూపి తాజాగా 56 ఏళ్ల వ్యక్తి దగ్గర ఏకంగా రూ.77 లక్షలు కొట్టేసిన ఘటన నాగ్పుర్లో చోటుచేసుకుంది. యూట్యూబ్ లైక్ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు నాగ్పుర్కు చెందిన 56 ఏళ్లు సరికొండ రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తమ వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. ఇష్టమైన యూట్యూబ్ ఛానల్ను లైక్చేసి స్క్రీన్ షాట్లు పంపాలని కోరారు. అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని రాజు భావించాడు. తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్ నేరగాళ్లపై ఎలాంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు. ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు. చేసేదేమిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది. ఇటీవల జరిగిన భారత్ పాక్ ప్రపంచ కప్ మ్యాచ్పై బెట్టింగ్ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు. పార్ట్ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఎవరైనా ఆశచూపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారు ఎంత మభ్యపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను పంచుకోకూడదని పోలీసులు తెలిపారు. -
ఆన్లైన్ షాపింగ్లో డబ్బులు పోయాయా? ఇవి పాటిస్తే మేలు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆన్లైన్లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో ధర బేరీజు వేసి ఎక్కడకొనాలో నిర్ణయం తీసుకుంటున్నారు. కావాల్సిన వస్తువును ఇంటికే తెచ్చి ఇస్తుండడంతో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ సౌకర్యంగా భావిస్తున్నారు. రాయితీలు, ఇతర ప్రయోజనాలు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. కొత్త యాప్లు అందుబాటులోకి రావడం కూడా అందుకు దోహదం చేస్తోంది. అయితే, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది డబ్బులు నష్టపోతుంటారు. మరి వీటిని అరికట్టడానికి కొన్ని సులువైన మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 1. బయోమెట్రిక్ ఉత్తమం.. పాస్వర్డ్లను గుర్తుంచుకోవడం కష్టం. పైగా వీటిని సులువుగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. దీంతో తరచూ మార్చాలి. దీనికి బదులు బయోమెట్రిక్స్, ఇ-సిగ్నేచర్స్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటే మేలు. 2. రెండంచెల ధ్రువీకరణ.. ఆన్లైన్లో షాపింగ్లో చెల్లింపులు చేసేటప్పుడు బహుళ అంచెల ధ్రువీకరణ విధానాన్ని పాటించాలి. కేవలం ఒక్క పాస్వర్డ్తోనే కాకుండా బయోమెట్రిక్, ఓటీపీ, మెయిల్, ఎస్ఎంఎస్, మొబైల్ వంటి ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా వివరాల్ని రెండోసారి ధ్రువీకరించే పద్ధతిని అనుసరించాలి. 3. రిమోట్ యాక్సెస్తో నష్టం.. మన కంప్యూటర్ లేదా ఫోన్ను ఒక్కోసారి దూరంగా ఉన్న వ్యక్తికి రిమోట్ యాక్సెస్ ఇస్తుంటాం. కానీ, ఇది అంత శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ ఆన్లైన్ ఖాతాల సమాచారం మొత్తాన్ని ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలన్నీ సులువుగా కనుగొంటారు. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది. 4. ఓటీపీని అసలు షేర్ చేయొద్దు.. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమర్ దగ్గర నమ్మకాన్ని సంపాదించడం కూడా అందులో ఓ భాగం. మిమ్మల్ని మాటల్లో పెట్టి కీలక వివరాలన్నీ తెలుసుకుంటారు. అందువల్ల ఫోన్లోగానీ, ఆన్లైన్లోగానీ ఎవరైనా ఓటీపీ అడిగితే వెంటనే అనుమానించాలి. (లంచాలకు ఉద్యోగాలు.. టీసీఎస్ స్కాం!) 5. పబ్లిక్ వైఫైతో జాగ్రత్త.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు వీలైనంత వరకు పబ్లిక్/ ఓపెన్ వైఫైని వాడకపోవడమే మంచిది. పబ్లిక్ వైఫై ద్వారా మీరు చేస్తున్న లావాదేవీలను కొందరు ఇతర మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు బ్యాంకు లావాదేవీల కోసం సొంత నెట్వర్క్, సొంత డివైజ్నే వాడాలి. ఆన్లైన్ షాపింగ్, లావాదేవీలకు సంబంధించిన అవగాహనను పెంపొందించుకోవాలి. ఎన్ని రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. అపరిచిత వ్యక్తులు, సంస్థలతో మీ సమాచారాన్ని పంచుకోవద్దు. -
ఏంటి.. ఈ యాప్ డౌన్లోడ్ చేశారా !? అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే!
భద్రాద్రి: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. లక్కీ డ్రా వచ్చిందని, విలువైన వాహనాలు, వస్తువులు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ పెట్టి ఓటీపీ నంబరు తెలుసుకుని, అకౌంట్లలో నగదు జమ చేయించుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా యాప్లో పెట్టుబడి పెడితే రోజూ కొంత మొత్తం చొప్పున నిరంతరం తిరిగి డబ్బు జమచేస్తామని నమ్మించారు. సుమారు రూ. 2.5 కోట్లు కాజేశారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పలువురు పాక్స్కాన్ యాప్లో పెట్టి ఆర్థికంగా నష్టపోయారు. బుధవారం ఈ యాప్ అకస్మాత్తుగా క్లోజ్ అవడంతో లబోదిబోమంటున్నారు. స్థానికుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని దమ్మపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా మూడు నెలల క్రితం పాక్స్కాన్ అనే యాప్ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్లే స్టోర్లో అందుబాటులో లేదు. కేవలం లింక్ ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి పంపుకున్నారు. లింక్ ద్వారా యాప్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న పలువురు యువకులు పెట్టుబడి పెట్టారు. రూ.500 నుంచి ప్రారంభమై రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టవచ్చని, రూ.500 పెట్టుబడి పెడితే రోజూ రూ.12.50 చొప్పన తిరిగి వస్తాయని, యాప్ లింక్ను వేరొకరికి పంపి పెట్టుబడి పెట్టిస్తే, అందులో 10 శాతం కమీషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. మొదటిలో పెట్టుబడిన పెట్టిన వారికి రోజూ డబ్బులు తిరిగి పంపించారు. దీంతో నమ్మకం కుదిరి వారు మళ్లీ ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వారిని చూసి మరికొందరు యువత కూడా యాప్లో పెట్టుబడి పెట్టారు. ఇలా 250 మంది వరకు పెట్టుబడి పెట్టి, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు కూడా క్రియేట్ చేసుకున్నారు. కాగా రెండు వారాల క్రితం పెట్టిన పెట్టుబడి మొత్తం 10 రోజుల్లో తిరిగి ఇస్తామని యాప్ ద్వారా ప్రచారం చేయాగా చాలామంది రూ.5 వేల నుంచి రూ. లక్ష చొప్పున రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. పది రోజుల గడిచినా ఎవరికీ తిరిగి రూపాయి ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురయ్యారు. ఇంకా తిరిగి వస్తాయనే ఆశతో ఎదురుచూస్తుండగా మంగళవారం రాత్రి పాక్స్కాన్ యాప్ను ఆన్లైన్లో పూర్తిగా క్లోజ్ చేశారు. టెక్నికల్ సమస్యగా భావించిన పెట్టుబడి దారులు, వేచిచూసి బుధవారం యాప్ను ఒపెన్ చేయడానికి ప్రయత్నించిన సాధ్యం కాలేదు. దీంతో తాము తీవ్రంగా మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. -
ఈ ఒక్క క్లిక్ చేశారో.. మీ ఖాతా ఖాళీ..!
జగిత్యాల: సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరు కోసం వచ్చిన కొత్త యాప్ను క్లిక్ చేయగా.. ఓ వ్యక్తి రూ.1.67 లక్షలు మోసపోయిన సంఘటన పెగ్గెర్లలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడి సెల్ఫోన్ సోషల్ మీడియాలో గృహ రుణం మంజూరుకు సంబంధించి ఓ యాప్ క్లిక్ చేయాలని సందేశం వచ్చింది. ఆ యువకుడు యాప్ను క్లిక్ చేశారు. మొదటగా రూ.1,250 చెల్లించాలని బ్యాంక్ ఖాతా నంబరు పంపించారు. ఆ యువకుడు రూ.1,250 చెల్లించారు. ఇలా రూ.1.67 లక్షలు చెల్లించాక రుణం మంజూరు కాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. -
వ్యక్తిగత డేటా సేఫ్గానే ఉందా?.. తెలియాలంటే..
వ్యక్తిగత డేటా సేఫ్గా ఉండకపోతే స్కామర్ల చేతిలో నష్టపోవాల్సి ఉంటుంది. డేటా దొంగిలించడం అనే కారణంతో ఇటీవల సైబర్మోసాలు పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత డేటాను స్కామర్లు ఏ విధంగా దొంగిలిస్తారు, ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి.. డేటా ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి సాంకేతిక, సంస్థాగత, చట్టపరమైన రక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత డిజటల్ హక్కులలో... యాక్సెస్ పొందే హక్కు, నిర్ధారించే హక్కు, సరిచేసే హక్కు, పోర్టబిలిటీ హక్కు, మర్చిపోవడం, ఆమోదం తెలిపే హక్కు ఉంటాయి. వ్యక్తిగత డేటా సమాచారం వారి ప్రయోజనాల కోసం ఉపయోగపడాలి. వ్యక్తులు, వ్యాపారులు తమకు సంబంధించిన డేటా రక్షణగా ఉంటే ఆర్థిక, పరువు, చట్టపరమైన బాధ్యత వంటి నష్టాలను తగ్గించడంలో సహాపడుతుంది. డేటా ఉల్లంఘనలు, సైబర్ నేరాల సంఘటనలు పెరుగుతున్నందన చట్ట ప్రకారం అవసరమైన జనరల్డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) చర్యలను అమలు చేస్తుంటారు. డేటా దొంగిలించడం జరిగినప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. జీడీపీఆర్ ప్రకారం డేటా ఉల్లంఘన జరిగితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మీ డేటాను వివిధ కంపెనీలు ఎలా తీసుకుంటాయంటే... ఆన్లైన్ షాపింగ్: పేరు, జెండర్, ఇమెయిల్, చిరునామా, డెలివరీ, ఫోన్ నెంబర్, క్రెడిట్కార్డ్ వివరాలు, ప్రొడక్ట్ హిస్టరీ, తరుచూ కొనుగోలు చేసే వస్తువులు, షాపింగ్ విలువ, ఎక్కువ శాతంలో బ్రౌజ్ చేస్తున్న ప్రొడక్ట్స్, మీ ఐపీ అడ్రస్... ఈ వివరాలన్నీ వ్యక్తిగత డేటా జాబితాలోకి వస్తాయి. డేటింగ్ యాప్లు... పేరు, జెండర్, వయసు, సెక్కువల్ ఓరియెంటేషన్, ఫోన్ నెంబర్, ప్రైవేట్ చాట్, పొలిటికల్ వ్యూస్, వ్యక్తిగత ఫొటోలు, ఇష్టాలు, స్వైప్స్, డిజిటల్ డివైజ్ సమాచారం, ఐపీ అడ్రస్.. ఈ యాప్ ద్వారా బహిర్గతం అవుతాయి. సెర్చ్ ఇంజిన్లు.. ఆన్లైన్ సెర్చింగ్, బ్రౌజింగ్ హిస్టరీ, ఆన్లైన్ ఆసక్తులు, షాపింగ్ అలవాట్లు, ఐపీ చిరునామా, ప్లేస్, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డులు, పరికర సమాచారం, డౌన్లోడ్ చేసిన ఫైల్స్, ఉపయోగించే బ్రౌజర్ యాడ్–ఆన్లు.. ద్వారా జరుగుతుంటుంది. సోషల్ మీడియా.. పోస్ట్లు, ఫొటోలు, వీడియోలు, మెసేజ్లు, ఫైల్స్, ఫోన్ పరిచయాలు, పేరు, జెండర్, ఇమెయిల్, ప్లేస్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఫ్రెండ్స్ గ్రూప్, గ్రూప్ చాట్స్, పోస్టులు, ట్యాగ్ చేసిన ఫొటోలు అండ్ వీడియోలు.. సోషల్ మీడియా ద్వారా జరుగుతుంటాయి. గుర్తించదగిన సమాచారం.. మీ పుట్టిన రోజు లేదా ఫోన్ నెంబర్ వంటివి పబ్లిక్ రికార్డ్లో ఉండవచ్చు. ఒకసారి మీ వివరాలు బయటకు వచ్చాక దాడి చేసేవారు ఉండవచ్చు. సోషల్ ఇంజనీరింగ్ మోసాలకు వ్యక్తిగత డేటా సులభంగా ఉపయోగించుకోవచ్చు. సురక్షిత చర్యలు.. చట్టపరమైన ఫ్రేమ్వర్క్పై ఆధారపడి డేటా రక్షణ సూత్రాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. అవి సాధారణంగా కింది అంశాలను కలిగి ఉంటాయి... ∙చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యక్తులకు ప్రయోజనం కలిగేలా ప్రాసెస్ చేయాలి ∙వ్యక్తిగత డేటా విషయంలో కచ్చితత్వం పాటించాలి. అదే విధంగా ఇతరులు యాక్సెస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ∙అనధికార లేదా చట్టవిరుద్ధమైన ప్రాసెసింగ్ ద్వారా నష్టం కలిగితే నియంత్రణ అధికారులకు తెలపాలి. భారతదేశంలో డేటా రక్షణ కోసం చట్టం.. మన దగ్గర ఉన్న ఏకైక డేటా రక్షణ చట్టం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 (ఐటీ చట్టం). దీని ప్రకారం డేటా చౌర్యం జరిగితే రక్షణ కోసం ఉపయోగించే కొన్ని సెక్షన్లు ఎ)సెక్షన్ 69 బి) సెక్షన్ 69ఎ సి) సెక్షన్ 69 బి.. ఉన్నాయి. అయితే, ముందస్తుగా డేటా గోప్యతను రక్షించడానికి చట్టం లేదు. తమ డేటాను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బలమైన పాస్వర్డ్లను ఉపయోగించాలి. అల్ఫాన్యూమరిక్ వర్డ్స్ ఉపయోగించాలి. ప్రత్యేక అక్షరాలను చేర్చాలి ∙రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించాలి ∙ఓటీపీ లేదా అథెంటికేటర్ యాప్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి పేరొందిన సెక్యూరిటీ, యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాప్ట్వేర్ను ఉపయోగించాలి. ఫిషింగ్ స్కామ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి ∙చిన్న లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయరాదు. డేటా కేర్ సాఫ్ట్వేర్/యాప్స్ని చట్టబద్ధమైన మూలాల నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి ∙ మీ బ్రౌజర్ని అప్డేట్ మోడ్లో ఉంచాలి. https//తో ప్రారంభమయ్యే సురక్షిత వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయాలి https://mxtoolbox.com/EmailHeaders.aspx ఉపయోగించి ఇమెయిల్ పూర్తి హెడర్ను చెక్ చేయాలి మీ యాప్లు మీ డేటాను ఎలా యాక్సెస్ చేస్తున్నాయో చెక్ చేయాలి. అందుకు.. https://reports.exodus-privacy.eu.org/en/, https://smsheader.trai.gov.in/ని ఉపయోగించి ఎసెమ్మెస్ సరైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. మీ డేటా చౌర్యం జరిగిందీ లేనిదీ తెలుసుకోవడానికి చెక్ చేయాలంటే.. మీ ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ డేటా ఉల్లంఘనలో భాగమైందో లేదో తనిఖీ చేయడానికి మీరు ఈ వెబ్సైట్ల్లో సెర్చ్ చేయచ్చు. (a) https://amibeingpwned.com (b) https://snusbase.com (c) https://leakcheck.net (d) https://leaked.site (e) https://leakcorp.com/login (f) https://haveibeensold.app. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ (చదవండి: ఒక దేశం రెండు పేర్లు.."భారత్" అనే పేరు ఎలా వచ్చిందంటే..) -
ఓ సైబర్ అపరిచితుడు.. సర్వేయర్లే టార్గెట్గా..!
మహబూబాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులకు జాబ్స్ పేరిట.. లంచాలు తీసుకున్న వారిని ఏసీబీ కేసు నుంచి తప్పిస్తామంటూ టోకరా వేస్తున్నారు. తాజాగా ఇలాంటి మోసానికి ఓ వ్యక్తి పాల్పడగా పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకుంటూ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లోని సర్వేయర్గా పని చేస్తున్న కొందరు ఉద్యోగులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. మోసానికి పాల్పడుతున్న తీరు ఇలా.. కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయాల్లో పని చేస్తున్న సర్వేయర్లతో తనకు తాను ఏసీబీ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మీరు లంచాలు తీసుకున్నారని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐకేపీ సర్వేయర్గా పని చేస్తున్న మల్లయ్యకు ఈ నెల 16న ఓ వ్యక్తి ఫోన్ చేసి తనకు తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు లంచం తీసున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఈ కేసు నుంచి నిన్ను తప్పించేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించాడు. అదే రోజు పర్వతగిరి మండలంలో పని చేస్తున్న సర్వేయర్ శ్యామూల్కు అదే వ్యక్తి ఫోన్ చేసి ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కేసు నమోదు చేస్తామని ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. అలాగే నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని సర్వేయర్లకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంతటితో ఆగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని పలువురు సర్వేయర్లకు ఫోన్లు చేసి ఏసీబీ కేసుల నుంచి మిమ్మలను తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఇందుకోసం గూగుల్పే, ఫోన్పేలో డబ్బులు పంపాలని డిమాండ్ చేశాడు. సందేహం వచ్చిన సదరు ఉద్యోగులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిందితుడితో జరిగిన సంభాషణ, ఫోన్ నంబర్ వివరాలు అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల ముసుగులో సర్వేయర్లను నమ్మించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. సదరు నిందితుడికి డబ్బులు పంపించవద్దని సర్వేయర్లకు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు సమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
టెలిగ్రామ్ లింక్ పేరుతో.. సైబర్ మోసం!
రాజన్న: అత్యాశకు పోయి రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లికి చెందిన యువకుడు రూ.7.67లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు. స్తంభంపల్లికి చెందిన అక్కెనపెల్లి హరీశ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ మెడికల్ బయోటెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్లైన్లో వచ్చిన మెస్సేజ్తో టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేశాడు. మొదట యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలు పంపితే నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పడంతో అలా చేశాడు. కొద్ది రోజులకు యాప్లో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతాయని నమ్మబలకడంతో ఈనెల 9, 10, 11 తేదీలలో ఫోన్పే, గూగూల్పే ద్వారా వారు చెప్పిన నంబర్లకు రూ.7.67లక్షలు పంపించాడు. చివరికి యాప్ ఫేక్ అని తెలుసుకొని 1930 నంబర్కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై మహేందర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. -
9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు
హైదరాబాద్: 91తో కలిపి 9 అంకెల నంబర్తో మీకు ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. ఆ ఫోన్ కాల్స్ సమాధానం ఇస్తున్నారా.. అయితే మీ ఖాతాలు ఖాళీ. కేవలం మహిళలను కలవర పెట్టి, భయం సృష్టించి సైబర్ మోసగాళ్లు లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. నగరంలో నమోదైన 30 ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. నేర ప్రక్రియ ఇలా సాగుతోంది.. ► సైబర్ మోసగాళ్లు తాజాగా voip (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) ద్వారా 91 తో కలిపి 9 అంకెల నంబర్లతో ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఎత్తగానే మేం ముంబై సీబీఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్, మీ పేరు ఇదేనా అని అడుగుతారు. మీరు ముంబై నుంచి తైవాన్కు ఫెడ్ఎక్స్ కొరియర్ ద్వారా పార్శిల్ పంపిస్తున్నారని అందులో డ్రగ్స్ ఉన్నాయని, ఇంకా అనుమానాస్పద పత్రాలు ఇతర దేశాలకు పంపిస్తున్నారని, మీరు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని కొరియర్ ప్రతినిధి చెప్పాడు. మీ మీద ముంబై సీబీఐ కేసు నమోదు చేసిందని.. ఈ సమాచారాన్ని మీ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చామని వారు 20 నిమిషాల్లో మిమ్మల్ని అరెస్టు చేసి మాకు అప్పగిస్తారని వివరిస్తాడు. ఈ మాటలకు భయపడి మా తప్పు లేదు మమ్మల్ని రక్షిచండి అని ప్రాధేయపడగానే లూటీ మొదలు పెడతారు. స్క్రీన్ షేరింగ్ యాప్స్తో అకౌంట్ ఖాళీ అవుతుంది. ► మీరు నిర్దోషి అని తెలియాలంటే మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి. మీకు మొత్తం ఎన్ని ఖాతాలు ఉన్నాయి చెప్పండి అని బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. స్క్రీన్ షేరింగ్ యాప్లను డౌన్లోడ్ చేయిస్తారు. దీంతో మీ ఫోన్ మొత్తం వారి కంట్రోల్కి వెళ్లిపోతుంది. వెంటనే మీ ఖాతా నుంచి మా సీబీఐ ఖాతాకు కొంత డబ్బు పంపమని చెబుతారు. ఈ సమయంలో సైబర్ మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్స్ ద్వారా మీ బ్యాంకు ఖాతా నంబర్, పాస్వర్డ్, యూజర్ నేమ్, పిన్ నంబర్లను తెలుసుకుంటారు. దాదాపు అలా 3 గంటల పాటు మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారు. ► ఇలా హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసానికి గురైన వారి సంఖ్య 30 వరకు చేరింది. ఇందులో 23 మంది మహిళలు బాధితులుగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. అత్యధికంగా ఓ మహిళ రూ.40 లక్షలు పోగుట్టుకుంది. మొత్తం సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.1.5 కోట్లు కాజేశారని నమోదైన ఫిర్యాదులతో వెల్లడైంది. మోసాలకు చెక్ పెట్టాలంటే.. ► మనకు వచ్చే ఫోన్ కాల్స్ 91 తో కలిపి 10 అంకెలు ఉంటాయని గ్రహించాలి. ‘ముంబై టూ తైవాన్ ఫెడ్ ఎక్స్ కొరియర్’ పేరు చెప్పగానే సైబర్ మోసానికి సంబంధించిన కాల్గా అనుమానించాలి. ► సీబీఐ పేరు చెప్పి పోలీసులు వస్తున్నారని మాట్లాడితే సరే పోలీసులు వచ్చిన తర్వాత మాట్లాడుతామని ఫోన్ కట్ చేయాలి. ► స్క్రీన్ షేరింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోమంటే అసలు చేయొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు రెస్పాండ్ అవొద్దు. ► గుర్తు తెలియని వ్యక్తులు సుదీర్ఘంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది సైబర్ మోసగాళ్ల ఫోన్ కాల్గా భావించాలి. ► ఈ 9 అంకెల ఫోన్ కాల్స్ voip ద్వారా వస్తుందడంతో వీటి ఐపీ అడ్రస్లు విదేశాల్లో ఉంటున్నాయి. కొట్టేసిన నగదు కూడా వర్చువల్ కరెన్సీ రూపంలో విదేశాలకు పంపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నయా మోసం నుంచి అప్రమతంగా ఉండాలని సిటీ పోలీసులు సూచిస్తున్నారు.డార్క్ వెబ్ ద్వారా సైబర్ క్రిమినల్స్ పలు కొరియర్ సంస్థల నుంచి డేటా కొట్టేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
యాప్ డౌన్లోడ్ చేయగానే.. తగిలిన బిగ్షాక్..!
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు వైద్యురాలికి 95 వేల రూపాయలు టోకరా వేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 శ్రీనికేతన కాలనీలో నివసించే లక్ష్మి వైద్యురాలు. గత నెల 15న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డు విభాగం నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాడు. ఏదైనా ఫిర్యాదు ఉందా అని అడిగాడు. తాను చేసిన 41,955 రూపాయలకు సంబంధించి ఆన్లైన్ షాపింగ్పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపారు. దీంతో ఫోన్ చేసిన వ్యక్తి కొన్ని వివరాలు అడగగా ఫోన్లో ఇవ్వలేనని నిరాకరించారు. అయితే ఓ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వివరాలు పొందుపరిస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పాడు. ఈ మేరకు లక్ష్మి యాప్ డౌన్లోడ్ చేసి సమాచారం నమోదు చేసిన వెంటనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.95వేలు డ్రా అయినట్టు మెస్సేజ్ వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ మోసాలకు గురైతే..ఇలా రిపోర్ట్ చేయండి..!
డబ్బు పోగొట్టుకోవడం, బెదిరింపులు ఎదుర్కోవడం, వీడియో–ఆడియో సంభాషణల ద్వారా ఇబ్బందులకు లోను అవడం.. ఇవన్నీ ఇటీవల ఆన్లైన్, సోషల్ మీడియా వేదికగా అధికంగా జరుగుతున్న నేరాలు. ఈ–మోసాలకు గురైతే ఏం చేయాలి? ఇంటర్నెట్లో భద్రంగా ఎలా ఉండాలి..? వివరంగా తెలుసుకుని ఆచరిస్తే సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మన దేశంలో సైబర్ నేరాలను అధికారులకు రిపోర్ట్ చేయాలంటే కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. సైబర్ క్రైమ్కు సంబంధించి వీలైనంత ఎక్కువ సాక్ష్యాలను సేకరించాలి. ఇందులో స్క్రీన్ షాట్లు, ఇ–మెయిల్స్, చాట్లాగ్లు, బ్యాంక్లావాదేవీల రికార్డులు, వీడియో అండ్ ఆడియో సంభాషణలు లేదా మీ ఫిర్యాదుకు మద్దతునిచ్చే ఏవైనా ఇతర సంబంధిత సమాచారం అంతా మీ దగ్గర ఉండాలి. 1. సంఘటన ఆధారంగా.. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ మొదలైనవాటిలో మీరు అవతలి వ్యక్తులతో కమ్యూనికేట్ చేసిన విధానం. తేదీ, సమయం, ఏ ప్లాట్ ఫారమ్ (ఇంటర్నెట్, సోషల్ మీడియా... మొదలైనవి) అనే అంశాల్ని చూసుకోవాలి. అలాగే సాక్ష్యాలను అప్లోడ్ చేయాలి (నగదు చెల్లింపులు /బ్యాంక్ స్క్రీన్షాట్లు ఆర్థిక మోసాలకు సంబంధించిన స్టేట్మెంట్లు. వేధింపులకు లేదా ఇతర వాటికి సంబంధించిన స్క్రీన్షాట్లు, ఫొటో, ఆడియో, వీడియో మొదలైనవి ఏమైనా ఉంటే జత చేయాలి). 2. అనుమానితుడి వివరాలు ఏవైనా ఉంటే.. అనుమానితుడి పేరు, గుర్తింపు (మొబైల్, ఇ–మెయిల్, సోషల్ మీడియా యుఆర్ఎల్ మొదలైనవి), ప్లేస్ (ఆఫీస్... మొదలైనవి). 3. కంప్లైంట్స్ వివరాలు బాధితుడి పూర్తి పేరుతో పాటు తండ్రి/జీవిత భాగస్వామి/ సంరక్షకుడు మొదలైనవి నోట్ చేయాలి. ఇ–మెయిల్ ఐడీ /ఫోన్ నెంబర్, చిరునామా, ఐడీ గుర్తింపు (ఆధార్.. మొదలైనవి)తో మీ దగ్గరలోని స్థానిక పోలీస్స్టేషన్ లేదా సంబంధిత పోలీస్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలి. నేరం గురించి, సంఘటన జరిగిన తేదీ, సమయం, మీరు సేకరించిన సాక్ష్యాలతో సహా అన్ని వివరాలతో కూడిన రాతపూర్వక ఫిర్యాదుతో వారికి అందించాలి. మీ ఫిర్యాదుకు ఏవైనా సంబంధిత పత్రాలు లేదా సాక్ష్యాధారాల కాపీలను జత చేయాలి. మీ పట్ల జరిగిన నేరం వరుస పద్ధతిలో సాక్ష్యాలను జాబితా చేయడం మంచిది. మీ కంప్లైంట్ /ఎఫ్ఐఆర్/ పిటిషన్ ఫాలోఅప్ గురించి విచారించాలి. మీ కేసుకు కేటాయించిన దర్యాప్తు అధికారిని క్రమం తప్పకుండా వివరాలను కనుక్కుంటూ ఉండాలి. అధికారి పేరు, సంప్రదింపు వివరాలు, మీకు అందించిన ఏవైనా రిఫరెన్స్ నంబర్ల రికార్డును మెయిన్టెయిన్ చేయాలి. ఇ–మెయిల్, సందేశాలు లేదా ఏదైనా ఇతర డిజిటల్ కంటెంట్తో సహా సైబర్ నేరానికి సంబంధించిన అన్ని సంబంధిత సాక్ష్యాలను భద్రపరిచారని నిర్ధారించుకోవాలి. విచారణ ప్రయోజనాల కోసం సాక్ష్యాలను తారుమారు చేయద్దు. సైబర్క్రైమ్ రిపోర్టింగ్ సంబంధిత పోర్టల్స్: దేశంలో వివిధ రకాల సైబర్ నేరాలను నివేదించడానికి ఉన్న పోర్టల్స్.. పరువు నష్టం, సైబర్ బెదిరింపు, సైబర్ స్టాకింగ్, అశ్లీల కంటెంట్, అశ్లీలత, లైంగిక వేధింపులు, ఫిషింగ్ మోసాలు.. వంటి సైబర్ మోసాలను నివేదించడానికి మీరు https://www. cybercrime.gov.in/ పెట్టుబడి మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్లు, ఇ–కామర్స్ మోసాలు, వర్క్ ఫ్రమ్ హోమ్స్కామ్లు, ఫిషింగ్ మోసాలతో సహా ఆర్థిక సైబర్ మోసాలకు గురైనట్లైతే.. 1930కి కాల్ చేయవచ్చు. సిటిజన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్కామర్ల నిధులను స్తంభింపజేయడానికి ఈ వ్యవస్థ సహాయం చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ టెర్రరిజానికి సంబంధించిన సంఘటలను రిపోర్ట్ చేయడానికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ((CERT-In)) వెబ్సైట్ ద్వారా https://cert-in.org.in లో రిపోర్ట్ చేయవచ్చు. పోగొట్టుకున్న ఫోన్ల గురించి https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jspలో రిపోర్ట్ చేయచ్చు. మీ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రాక్ చేయడానికి ఈ పోర్టల్ మీకు అనుమతిస్తుంది. సరైన సూచనల కోసం పోలీస్స్టేషన్ను కూడా సంప్రదించవచ్చు. ఎవరైనా మీ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్ సేవల కోసం మీ ఆధారాలను ఉపయోగిస్తున్నారని అనుమానం వస్తే.. దానిని https://tafcop. sancharsaathi.gov.in/ telecomUser/ లో రిపోర్ట్ చేయవచ్చు. వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ స్కీమ్ అనేది మీరు యుపీఐని ఉపయోగించి అనుకోకుండా ఇతరులకు డబ్బును బదిలీ చేస్తే, ఫిర్యాదు చేయడానికి అనుమతించే పథకం. సంబంధిత యుపీఐ సర్వీస్ప్రొవైడ్ (పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే మొదలైనవాటిపై ఫిర్యాదు), టోల్ ఫ్రీ నంబర్ 14448కి కాల్ చేయాలి. https://ceir.sancharsaathi.gov.in/ Home/index.jsp పోర్టల్లో రిపోర్ట్ చేయాలి. ప్రత్యామ్నాయంగా CRPC@rbi.org.inకు మెయిల్ చేయవచ్చు. యుపీఐ లావాదేవీకి సంబంధించి https://www.npci.org.in/what-we-do/upi/dispute-redressal-mechanismలో రిపోర్ట్ చేయచ్చు. సైబర్ సెక్యూరిటీకి చిట్కాలు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, ప్రత్యేక అక్షరాలు, సంఖ్యా కలయికతో బలమైన పాస్వర్డ్లను సృష్టించాలి. మీ ఆన్లైన్, సోషల్ మీడియా, ఇ–మెయిల్ ఖాతాల కోసం .. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ని ప్రారంభించాలి. ఎసెమ్మెస్ ద్వారా మీ మొబైల్ పరికరానికి పంపిన ప్రత్యేక కోడ్ని లేదా ప్రత్యేక ప్రమాణీకరణ అప్లికేషన్ను ఉపయోగించవచ్చు. సురక్షిత డేటా ట్రాన్స్మిషన్ కోసం గ్కిఅ2 లేదా గ్కిఅ3 ఎన్క్రిప్షన్తో మీ వైఫై రూటర్ని సెట్ చేయాలి. చట్టబద్ధ్దమైనదని మీకు కచ్చితంగా తెలిస్తే తప్ప పబ్లిక్ ౖÐð ఫైని ఎప్పటికీ ఉపయోగించవద్దు. మీ సోషల్ మీడియా ఖాతాల్లోని సీక్రెట్ సెట్టింగ్లను చెక్ చేస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత వివరాలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవాలి. సాఫ్ట్వేర్ యాప్లు, ఫైల్స్ను రిప్యుటేషన్ ఉన్నవాటి నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయాలి. మీ ముఖ్యమైన డేటా, ఫైల్స్ డేటా, క్లౌడ్ స్టోరేజీ మొత్తాన్ని క్రమం తప్పకుండా బ్యాకప్ చేసుకోవడం మంచిది. డిజిటల్ భద్రత పద్ధతుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. లోతైన పరిష్కారానికి.. సోషల్ మీడియా మోసాలకు సంబంధించి సరైన, సంతృప్తికరమైన పరిష్కారం దొరకలేదు అనుకుంటే జ్టి్టpట://జ్చఛి.జౌఠి.జీn/లో రిపోర్ట్ చేయవచ్చు. ఈ ఎఅఇ కమిటీ డిజిటల్ ప్లాట్ఫారమ్ బాధితుల కంప్లైంట్స్ను అప్పీళ్లతో పరిష్కరిస్తుంది. (చదవండి: పీ ఫర్ పాడ్కాస్ట్.. బీ ఫర్ భార్గవి) -
సైబర్ వార్ఫేర్ను ఎదుర్కొనేలా మన ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశ విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 శాతం పునరుత్పాదక ఇంధనమైన గాలి, నీరు, సౌర విద్యుత్ నుంచే సమకూరుతోంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఈ స్వచ్ఛ ఇంధనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు రాష్ట్రం అనుకూలంగా మారింది. ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో జరిగిన దాదాపు రూ.9.47 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలే దీనికి నిదర్శనం. అయితే, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టులు సైబర్ దాడులకు గురవుతాయనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండేళ్ల క్రితం పవర్ గ్రిడ్ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న విద్యుత్ సరఫరా విడి భాగాలపై మంత్రిత్వ శాఖ సైబర్ భద్రతా చర్యలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచే సింది. మాల్వేర్, ట్రోజన్లు వంటి ఏదైనా సైబర్ బెదిరింపుల కోసం దిగుమతి చేసుకున్న అన్ని విద్యుత్ సరఫరా విడి భాగాలను నేరస్తులు వాడుకునే అవకాశం ఉండటంతో హానికరమైన ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఉందేమో అనే విషయాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఆ పరికరాలు భారతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని చెప్పింది. సైబర్ దాడులు దేశ విద్యుత్ సరఫరా వ్యవస్థకు విఘాతం కలిగించడంతో మొత్తం దేశాన్ని నిర్విర్యం చేయగలవని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన పరీక్షలన్నీ తాము నిర్దేశించిన, ధ్రువీకరించిన ప్రయోగశాలల్లో తప్పనిసరిగా నిర్వహించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎస్ఐఆర్ టీమ్ ఏర్పాటు సైబర్ సెక్యూరిటీలో భాగంగా పవర్ ఐలాండ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. సెంట్రల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (సీఎస్ఐఆర్టీ)ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆధ్వర్యంలో వివిధ ప్రైవేటు సంస్ధల్లో శిక్షణ పొందిన సైబర్ (ఇంటర్నెట్) నిపుణులు ఈ బృందంలో ఉంటారు. మన దేశంలో నార్తరన్, వెస్ట్రన్, సదరన్, ఈస్ట్రన్, నార్త్ ఈస్ట్రన్ అనే ఐదు ప్రాంతీయ పవర్ గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నిటినీ ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్’ కింద సెంట్రల్ గ్రిడ్కు అనుసంధానించారు. ఈ గ్రిడ్లన్నిటి కార్యకలాపాలన్నీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలో జరుగుతుంటాయి. ఇంత పెద్ద గ్రిడ్కు సంబంధించిన సమాచార వ్యవస్థను శత్రువులు చేజిక్కుంచుకుంటే దేశం మొత్తం చీకటైపోతుంది. ఈ నేపథ్యంలో పవర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. గ్రిడ్లో ఏదైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ వ్యవస్థను వెంటనే దాని నుంచి వేరు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీనివల్ల పవర్ గ్రిడ్లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఏపీ ఇంధన శాఖ అనుసరిస్తున్న జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వల్ల ఏపీ ట్రాన్స్కో, డిస్కంల మొత్తం ట్రాన్స్మిషన్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్లను జియో ట్యాగింగ్ చేయడం తేలికైంది. దీంతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్లో భాగమైన సదరన్ రీజినల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ), దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ను పర్యవేక్షించడానికి ఏపీ ట్రాన్స్కో జీఐఎస్ మోడల్ను తీసుకుంది. విద్యుత్ సంస్థల్లో ఎక్కువ మంది సిబ్బంది విద్యుత్ కార్యకలాపాలను తమ సెల్ఫోన్ల ద్వారానే నియంత్రిస్తున్నారు. వారిని మోసగించి వారి ఫోన్లో హానికర సాఫ్ట్వేర్ పంపి విలువైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. -
సుజుకి మోటార్సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి
Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిలిచిపోయిన ఉత్పత్తి.. నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది. దీని గురించి సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!) భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్పుట్లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
చాట్జీపీటీతో సైబర్ దాడులు.. ఒక్కో కంపెనీపై వారంలో 2,108 సార్లు..
న్యూఢిల్లీ: దేశీయంగా కంపెనీలపై సైబర్ దాడులు మరింత పెరిగాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రతీ వారం సగటున ఒక్కో కంపెనీపై 2,108 దాడులు జరిగినట్టు చెక్ పాయింట్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగినట్టు పేర్కొంది. సైబర్ నేరస్థులు తమ దాడుల కోసం చాట్ జీపీటీ వంటి టూల్స్ను దుర్వినియోగం చేస్తున్నారని, కోడ్ జనరేషన్కు వినియోగిస్తున్నారని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే మార్చి త్రైమాసికంలో కంపెనీలపై సైబర్ దాడులు 7 శాతం పెరిగాయి. ఒక్కో వారం సగటున ఒక్కో సంస్థ 1,248 దాడులను ఎదుర్కొన్నది. అంతర్జాతీయంగా విద్య, పరిశోధన రంగాల్లోని కంపెనీలపై ఎక్కువ సైబర్ దాడులు నమోదయ్యాయి. ఒక్కో వారం సగుటన ఒక్కోసంస్థపై 2,507 దాడులు జరిగినట్టు, 15 శాతం పెరిగినట్టు చెక్ పాయింట్ వెల్లడించింది. -
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్కు స్పందించవద్దు’ అని సూచించారు. -
UPI Fraud: దెబ్బకు రూ. 35 లక్షలు గోవింద: ఎక్కడంటే?
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. మోసాలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. యుపిఐ వినియోగంలోకి వచ్చిన తరువాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే కొంతమంది కేటుగాళ్లు ఈ UPIలో కూడా భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. నివేదికల ప్రకారం, ఇటీవల గురుగ్రామ్కు చెందిన పారావియమ్ టెక్నాలజీస్ ఇలాంటి యుపిఐ మోసానికి గురైనట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు కంపెనీ పేమెంట్ గేట్వే సిస్టమ్ను తారుమారు చేసి ఏకంగా రూ. 35 లక్షలు దోచేశారు. కంపెనీ ఉపయోగించుకుంటున్న క్యాష్ఫ్రీ పేమెంట్ గేట్వేని తారుమారు చేసి డబ్బు దోచుకున్నట్లు సంస్థ ఆపరేషన్స్ హెడ్ అంకిత్ రావత్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. నిజానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్లు 95,000 యుపిఐ మోసాలకు పాల్పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కావున తప్పకుండా యుపిఐ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. లేకుంటే భారీ మొత్తంలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. యుపిఐ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా? మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఓటిపి, పిన్ వంటి సమాచారాలను ఎప్పుడు, ఎవరితోనూ పంచుకోకూడదు. అమౌంట్ తీసుకోవడానికి మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే పిన్ అవసరం. డబ్బు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు వారి వివరాలను తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవాలి. యుపిఐ ఉపయోగిస్తున్నప్పుడు పబ్లిక్ నెట్వర్క్లను ఉపయోగించడం మానుకోవాలి. -
సెల్ఫోన్ యూజర్స్కు అలర్ట్.. పొంచి ఉన్న ‘బ్లూబగ్గింగ్’
సాక్షి, విజయవాడ: ఫోన్లో బ్లూటూత్.. వైఫై, హాట్ స్పాట్ ఎప్పుడూ ఆన్ చేసుకుని ఉంటున్నారా.. అయితే జాగ్రత్త పడండి. సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఉంటున్నారు. ఫోన్లోని వ్యక్తిగత సమాచారమంతా దోచేస్తున్నారు. ఆ తర్వాత వేధింపులు, బెదిరింపులతో మానసిక క్షోభకు గురి చేసి.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి బ్లూబగ్గింగ్ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే బ్లూ బగ్గింగ్ నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పది మీటర్ల దూరం నుంచే బ్లూటూత్, హాట్స్పాట్ ద్వారా ‘పెయిర్’ రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఏదో పనిలో ఉండి చూసుకోకుండా ‘ఓకే’ బటన్ క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్ల ఫోన్తో మన ఫోన్ కనెక్టవుతుంది. వెంటనే మాల్వేర్తో పాటు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్ను ఫోన్లోకి పంపిస్తారు. అక్కడి నుంచి మన ఫోన్ ఆపరేటింగ్ పూర్తిగా వారి చేతిలోకి వెళ్లిపోతుంది. ఫోన్లో బ్లూటూత్ ఆపేసినా.. వారు అప్పటికే పంపించిన ప్రోగ్రామింగ్, మాల్వేర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. సాధారణంగా వైఫై వినియోగించే వారికి తప్పనిసరిగా పాస్వర్డ్ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వైఫై ఫ్రీగా లభ్యమవుతోంది. ఫోన్లో వైఫై ఆప్షన్ ఆన్ చేసుకున్న వారికి ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవుతోంది. ఫ్రీగా వైఫై ఇచ్చే ప్రాంతాల్లో తరచూ బ్లూబగ్గింగ్ సైబర్ నేరాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. క్విక్ సపోర్ట్, టీం వ్యూయర్, ఎనీడెస్క్ తదితర యాప్స్ సాయంతో ఫోన్ ఆపరేటింగ్ మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు పసిగడుతుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ముందుగా సొమ్మును దోచేస్తున్నారు. ఫొటోలు, వీడియోలను పూర్తిగా కాపీ చేసుకుని.. వాటిని మారి్ఫంగ్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడి దొరికినంత లాగేస్తున్నారు. మన ఫోన్కు వచ్చే కాల్స్ను సైబర్ నేరగాళ్లు పూర్తిగా వారి మొబైల్కు మళ్లించుకుంటున్న ఘటనలు కూడా జరిగాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా కేసులు ఇప్పటివరకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో 15 వెలుగు చూశాయని పోలీసులు చెప్పారు. అప్రమత్తంగా ఉండాలి బ్లూ బగ్గింగ్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బ్లూటూత్, వైఫై, హాట్స్పాట్లను అవసరమైనప్పుడే ఆన్ చేసుకోవాలి. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించకుండా ఉంటే మంచింది. స్క్రీన్ షేర్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే పెయిర్ రిక్వెస్ట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించొద్దు. – ఎల్.రాజవర్ష, ఎస్ఐ, సైబర్ పోలీస్స్టేషన్ -
సైబర్ దాడుల సన్నద్ధతపై ‘అరెటే’ ఫోకస్
హైదరాబాద్: సైబర్ రిస్క్ నిర్వహణ కంపెనీ ‘అరెటే’.. సైబర్ దాడుల నిరోధానికి, ఒకవేళ సైబర్ దాడులు తలెత్తితే ఆ సమయంలో సన్నద్ధతకు సంబంధించి కొత్తగా ఓ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించింది. చిన్న, మధ్య తరహా సంస్థల కోసం దీన్ని రూపొందించామని, సహజంగా ఈ సంస్థలే ఎక్కువగా దాడులకు గురవుతుంటాయని, పూర్తి స్థాయిలో వ్యవస్థల పునరుద్ధరణకు 6–8 రోజుల సమయం తీసుకుంటున్నట్టు అరెటే తెలిపింది. చిన్న, మధ్య తరహా సంస్థల సిస్టమ్స్లో అప్పటికే హానికాక సాఫ్ట్వేర్లు ఏవైనా ఉన్నాయా? కస్టమర్లకు సంబంధించి సున్నితమైన సమాచారం లీక్ అయిందా గుర్తించడంతోపాటు.. పరిశ్రమలోనే అత్యుత్తమ విధానాలు, రిస్క్ నిర్వహణతో ఇది ఉంటుందని వివరించింది. సంస్థలకు మరింత రక్షణ కలి్పంచి, సైబర్ దాడుల రిస్క్ను తగ్గించడమే తమ లక్ష్యమని అరెటే ప్రకటించింది. -
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్పై సైబర్ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది. ‘ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్లున్న ఢిల్లీ ఎయిమ్స్లో 40 ఫిజికల్గా 60 వర్చువల్గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యకింగ్ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్కు గురైన అయిదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్లో సిస్టమ్స్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
రెచ్చిపోతున్న హ్యాకర్స్.. ‘ఐసీఎంఆర్’పై 6వేల సార్లు సైబర్ దాడి!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రఖ్యాత ఆసుపత్రి ఎయిమ్స్పై సైబర్ దాడి జరిగి సర్వర్లు డౌన్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు వారాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో సర్వర్లు పని చేయటం లేదు. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని అత్యున్నత వైద్య వ్యవస్థలే లక్ష్యంగా దుండగులు సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఎయిమ్స్ తర్వాత భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు హ్యాకర్స్. ఐసీఎంఆర్ వెబ్సైట్పై సుమారు 6వేల సార్లు దాడి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐపీ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో ట్రేస్ చేయగా.. బ్లాక్లిస్ట్లో ఉన్న హాంకాంగ్కు చెందిన ఐపీగా తేలిందన్నారు అధికారులు. అయితే, అప్డేటెడ్ ఫైర్వాల్, పటిష్ఠమైన భద్రతా చర్యలు తీసుకోవటం ద్వారా ఐసీఎంఆర్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురికాలేదని స్పష్టం చేశారు అధికారులు. హ్యాకర్స్ 6వేల సార్లు ప్రయత్నించినా వారి దుశ్చర్య ఫలించలేదన్నారు. మరోవైపు.. ఢిల్లీ ఎయిమ్స్ ముందు ఉన్న సఫ్దార్గంజ్ ఆసుపత్రిపై డిసెంబర్ 4న సైబర్ దాడి జరిగింది. అయితే, ఎయిమ్స్తో పోలిస్తే నష్టం తక్కువేనని అధికారులు తెలిపారు. ఒక రోజంతా తమ సర్వర్ పని చేయలేదని ఆసుపత్రి వైద్యులు బీఎల్ శెర్వాల్ తెలిపారు. ఎన్ఐసీ కొన్ని గంటల్లోనే సేవలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: తమిళనాడు ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5లక్షల మంది రోగుల డేటా విక్రయం! -
మన నిర్లక్ష్యానికి మూల్యమెంత?
కొన్ని సంఘటనలు అంతే... పెనునిద్దర నుంచి పెద్ద మేలుకొలుపుగా పనిచేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన సైబర్దాడి అలాంటిదే. నవంబర్ 23న ఆగంతకులు భారీమొత్తం డిమాండ్ చేస్తూ జరిపిన రాన్సమ్వేర్ దాడితో కుప్పకూలిన సర్వర్లు పన్నెండు రోజులైనా ఇప్పటికీ బాగు కాలేదు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆరోగ్యరక్షణ సంస్థలోని ఈ ఘటన మన దేశ సైబర్ భద్రతా మార్గదర్శకాలను సమగ్రంగా పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. డిజిటల్ ఇండియా పేరిట అన్ని రకాల ప్రభుత్వ విధులనూ, ప్రజా సేవలనూ, నగదు చెల్లింపులనూ ఆన్లైన్లో జరపాలని ప్రోత్సహిస్తున్నవేళ అత్యవసరం వచ్చిపడింది. సైబర్ దాడులు అంటువ్యాధిలా వ్యాపించి, ఎయిమ్స్ ఘటన లాంటివి మరిన్ని జరగక ముందే సురక్షిత వ్యవస్థనూ, ఆపత్సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని తెలిసివచ్చింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. డిసెంబర్ 1న జలశక్తి శాఖ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖపై జరిగిన రెండో పెద్ద సైబర్ దాడి ఇది. నవంబర్లో ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్పైనా సైబర్ దాడి జరిగింది. నిజానికి, ఆరోగ్య రంగంపై సైబర్ దాడుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని సైబర్ భద్రతా నిఘా సంస్థ క్లౌడ్సెక్ లెక్క. ఒక్క 2021లోనే దేశంలోని సైబర్ దాడుల్లో 7.7 శాతం ఆరోగ్య రంగంపై జరిగినవే. గత మూడేళ్ళలో భారత్లో సైబర్ దాడులు 3 రెట్లు పెరిగాయి. సైబర్ ముప్పును ఎదుర్కోవడా నికి ఉద్దేశించిన ప్రధాన సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ–ఇన్) డేటా ప్రకారం 2019లో జరిగిన ఉల్లంఘనలు 3.94 లక్షల చిల్లర. 2020లో అది 11.58 లక్షల పైకి, 2021లో 14.02 లక్షలకూ ఎగబాకింది. ఈ ఏడాదిలో జూన్ నాటికే 6.74 లక్షలయ్యాయి. వెరసి మూడున్నరేళ్ళలో 30 లక్షలకు పైగా కేసులొచ్చాయి. కానీ, సైబర్ భద్రతా నిధుల వినియోగం అర కొరగా సాగింది. రూ. 213 కోట్లు మంజూరైతే, రూ. 98.31 కోట్లే ఖర్చు పెట్టడం నిర్లక్ష్యానికి నిలువు టద్దం. అంతకన్నా దారుణం ఎయిమ్స్లో 30–40 ఏళ్ళుగా కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను మార్చక పోవడం. ఈ ఇక్ష్వాకుల కాలపు సామగ్రి పట్ల ఆందోళన వ్యక్తమైనా పట్టించుకున్న నాధుడు లేడు. పైగా ఐటీ ఓనమాలు తెలీని డాక్టర్ గారే ఇప్పటికీ అక్కడ కంప్యూటర్ విభాగాధిపతి అంటే ఏమనాలి! 2004లో తొలి డిజిటల్ దాడి రికార్డయిన నాటి నుంచి ఇప్పటి దాకా సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. విస్తరించిన ఇంటర్నెట్కు విపరిణామం – ప్రపంచవ్యాప్త సైబర్ భద్రతా ఉల్లంఘనలు. నిజానికి, ప్రపంచంలో అత్యధికంగా డేటా చౌర్యం జరుగుతున్న దేశాల్లో భారత్ది 6వ స్థానం. ప్రతి వంద మంది భారతీయుల్లో 18 మంది డేటా చోరీ అయిందని నెదర్లాండ్స్ సంస్థ సర్ఫ్షార్క్ మాట. మన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఈ ఏటి నివేదికలో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి అంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రశ్న. సైబర్ ముప్పుపై తగిన నియంత్రణ వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్–ఐటీ శాఖ కింద ‘సైబర్ భద్రతా విభాగా’న్ని కేంద్రం నెలకొల్పింది. అది ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలీదు. ఎయిమ్స్ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ఎన్ఐఏ, డీఆర్డీఓ, గూఢచారి విభాగం, సీబీఐ నిపుణులను బరిలోకి దింపాల్సి వచ్చింది. రక్తం చిందని ఈ అభౌతిక, ఆధునిక యుద్ధంతో ఉక్రెయిన్ – ఆస్ట్రేలియాల్లో పవర్ గ్రిడ్లు, నిరుడు మన దేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇరాన్లో అణు సదుపాయాలు, జార్జియాలో టెలికామ్ సేవలు, వివిధ దేశాల్లో ఎయిర్లైన్స్, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. అవన్నీ వాటి పొరుగు శత్రుదేశాల పనే. ఇక, మేధాసంపత్తి హక్కులు, వ్యక్తిగత డేటా చౌర్యాలు లెక్కలేనన్ని. ఐటీ సిస్టమ్స్పై దాడితో డేటాను ఎన్క్రిప్ట్ చేసేసి, సమాచారాన్ని తిరిగి అందుబాటులో ఉంచాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసే రాన్సమ్వేర్ దాడులు ప్రధానంగా మున్సిపిల్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు సహా ఆర్థిక సేవలపై విరుచుకుపడుతున్నాయి. ఇవాళ మన బ్యాంక్ సేవల నుంచి టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్లు, పాస్పోర్ట్ సమాచారం, పౌర విమాన యానం దాకా అంతా డిజటలే! స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటున్న పాలకులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సైబర్ ముప్పుపై దృష్టి పెట్టకుంటే ప్రాథమిక వసతులకూ పెను ప్రమాదమే! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే సమగ్ర సైబర్ భద్రతా విధానం కావాలి. ఘటన జరిగాక హడావిడి కాక ముందుగానే వాటిని నివారించేందుకు సీఈఆర్టీ–ఇన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సంసిద్ధం చేయాలి. డిజిటల్ సేవలు కావాల్సిందే గనక సమాచార నిల్వ, ఆపత్కాలంలో తిరిగి తీసుకొనేలా సమర్థ విధానాలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి. సైబర్ రక్షణ రంగా నికి నిధులిచ్చి, అత్యాధునిక కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్) పరిష్కారాలతో సత్తా సమ కూర్చుకోవాలి. అప్పుడే డిజిటల్ ప్రపంచం సురక్షితమవుతుంది. ఈ కృషిలో నూతన ఆవిష్కరణలం దేలా ఉత్ప్రేరణ కలిగించాల్సింది విధాన రూపకర్తలే. అప్పుడే డిజిటల్ ఇండియా విజయం సాధ్యం! -
‘ఎయిమ్స్’ తరహాలో మరో ఆసుపత్రిపై హ్యాకర్ల పంజా!
చెన్నై: దేశ రాజధానిలోని ఢిల్లీ ఎయిమ్స్పై సైబర్ దాడితో గత 10 రోజులుగా సర్వర్లు పనిచేయడం లేదు. ఢిల్లీ ఎయిమ్స్ విషయం తేలకముందే మరో ఆసుపత్రిపై పంజా విసిరారు హ్యాకర్లు. సుమారు 1.5 లక్షల మంది రోగుల వ్యక్తిగత వివరాలను ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్ సర్వర్లను హ్యాక్ చేసి రోగుల డేటాను పాపులర్ సైబర్ క్రైమ్ ఫోరమ్స్, టెలిగ్రామ్ ఛానళ్లలో అమ్మకానికి పెట్టినట్లు సైబర్ ముప్పుపై విశ్లేషించే సంస్థ ‘క్లౌడ్సెక్’ వెల్లడించింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. క్లౌడ్సెక్ వివరాల ప్రకారం.. ‘థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్’ అనే థర్డ్ పార్టీ వెండర్ ద్వారా 2007 నుంచి 2011 మధ్య నమోదైన రోగుల వివరాలను దొంగిలించినట్లు తేలింది. అయితే, శ్రీ శరణ్ మెడికల్ సెంటర్కు థ్రీక్యూబ్ ఐటీ ల్యాబ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ విధులు నిర్వర్తించటంపై సమాచారం లేదని పేర్కొంది. కొనుగోలుదారులు నమ్మేందుకు నమూనా జాబితాను ఆన్లైన్ ఉంచారు. లీక్ అయిన డేటాలో రోగుల పేర్లు, జన్మదినం, అడ్రస్, సంరక్షకుల పేర్లు, డాక్టర్ల వివరాలు ఉన్నాయి. డాక్టర్ల వివరాలతో ఏ ఆసుపత్రి డేటా హ్యాకింక్గు గురైందనే విషయాన్ని క్లౌడ్సెక్ గుర్తించింది. ఆన్లైన్ అమ్మకానికి ఉంచిన డేటాలోని డాక్లర్లు తమిళనాడులోని శ్రీ శరణ్ మెడికల్ సెంటర్లో పని చేశారని తెలిపింది. ఈ డేటాను 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున అమ్మినట్లు సమాచారం. ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన మరుసటి రోజునే తమిళనాడు శ్రీ శరణ్ ఆసుపత్రి డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు మొరాయించినట్లు గత నెల 23న తొలిసారి గుర్తించారు. హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: 8 రోజులుగా ఎయిమ్స్ సర్వర్ డౌన్.. ఇద్దరిపై వేటు -
సైబరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్
-
సైబరాబాద్లో కొత్త రకం సైబర్ అటాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు సొంత కంపెనీకి చెందిన ఉద్యోగులే దారుణానికి ఒడిగట్టారు. కంపెనీకి చెందిన ఉద్యోగులే సైబర్ దాడులు చేశారు. వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థపై సైబర్ దాడులు జరిగాయి. కంపెనీపై సైబర్ దాడి చేసి కేటుగాళ్లు డేటాను చేజిక్కించుకున్నారు. కాగా, గత కొన్నేళ్లుగా కంపెనీలోని ఉద్యోగులే సైబర్ అటాక్ చేసినట్టు సమాచారం. హాంగర్ కంపెనీ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం, కంపెనీ ఉద్యోగులు విజయ్కుమార్, కరణ్కుమార్, అశ్వంత్కుమార్లను అరెస్ట్ చేశారు. కాగా, నిందితుల నుంచి రివాల్వర్తో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక, అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. -
గతం కంటే తగ్గాయి.. అయినా సైబర్ క్రైం నేరాల్లో ఆ నగరమే టాప్!
అత్యధిక సైబర్ నేరాల కేసులతో దేశంలోని మహానగరాల్లో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. 2021లో రోజుకు సరాసరి 18 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరపు నేరాలపై జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికలో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. 20 లక్షలకంటే ఎక్కువ జనాభా కలిగిన 19 మహానగరాల్లో నమోదైన సైబర్ నేరాలను పరిశీలించగా బెంగళూరు టాప్లో నిలిచింది. బెంగళూరు ఐటీ, బీటీ, ఇతర ప్రముఖ ప్రైవేటు కంపెనీలకు నిలయం. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు నగరంపై గురిపెట్టి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. వరుసగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై సిలికాన్ సిటీ 6,423 కేసులతో దేశంలో మొదటిస్థానం, 3,303 కేసులతో తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండవ స్థానం, ఇక 2,883 సైబర్ నేరాలతో ముంబయి నగరం మూడవ స్థానంలో నిలిచింది. గతం కంటే తగ్గాయి అయితే గతం కంటే బెంగళూరు నగరంలో 2021లో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టడం శుభసూచకమనే చెప్పాలి. 2019లో 10,555 కేసులు, 2020లో 8,982 కేసులు నమోదైనట్లు నివేదికలో ప్రస్తావించారు. సైబర్నేరాల్లో బాధితులకు న్యాయం దొరికేది చాలా తక్కువ. ఇలా ఉండగా మెజారిటీ కేసుల్లో వంచకులను అరెస్ట్ చేయడం పోలీసులకు సాధ్యం కావడం లేదని బెంగళూరువాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు -
వర్క్ ఫ్రమ్హోంలో ఉద్యోగులు..పెరిగిన సైబర్ దాడులు!
గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం కంపెనీల కార్యకలాపాలన్నీ రిమోట్గానే నడిచాయి. దీంతో దేశంలో 45 శాతం సైబర్ క్రైం పెరిగాయని, ఈ ఏడాది 22శాతానికి పెరిగినట్లు వెరిజోన్ మొబైల్ సెక్యూరిటీ ఇండెక్స్-2022 నివేదిచింది. సైబర్ దాడుల కారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ ప్రభావితం అయ్యాయని తెలుస్తోంది. మూడు నుంచి ఐదు కంపెనీల వరకు 61 శాతం దెబ్బతిన్నాయని, 43 శాతం దేశీయ సంస్థలపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేరాలు ముఖ్యంగా ఆర్థిక సేవల్లో 93 శాతం, రిటైల్ 88 శాతం, ఆరోగ్య సంరక్షణ 87 శాతం, ప్రభుత్వ రంగం, విద్య 87 శాతం, తయారీ, నిర్మాణం, రవాణా రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా వెరిజోన్ బిజినెస్ సీఈఓ సంపత్ సౌమ్యనారాయణన్ మాట్లాడుతూ..రిమోట్ వర్క్ కారణంగా సంస్థలు సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా లేవని అన్నారు. కాబట్టే సైబర్ దాడులు పెరిగాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
రష్యా-ఉక్రెయిన్ డిజిటల్ వార్
మాస్కో/కీవ్: రష్యా నుంచి భీకరమైన దాడుల్ని అడ్డుకోవడానికి తమ ముందున్న అన్ని మార్గాలను ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటోంది. సైబర్ యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. ‘‘మాది ఒక రకంగా సైన్యమే, స్వీయ నియంత్రణలో ఉన్న సైన్యం’’ అని డిజిటిల్ ఆర్మీ సభ్యుడైన 37 ఏళ్ల వయసున్న రోమన్ జఖరోవ్ చెప్పారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. రష్యా దాడి చేస్తున్న ప్రాంతాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించడానికి కావాల్సినన్నీ పంపడం వంటివన్నీ ఈ డిజిటల్ ఆర్మీ దగ్గరుండి చూస్తోంది. స్టాండ్ఫర్ఉక్రెయిన్ హ్యాష్ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో అందరి మద్దతు కూడదీస్తోంది. డిజిటల్ ఆర్మీలో చేరడానికి ముందు జఖరోవ్ ఆటోమేషన్ స్టార్టప్ను నడిపేవారు. ఆయన కింద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ఆన్లైన్ యాడ్ బయ్యర్లు పని చేస్తుంటారు. ఇప్పుడు వీరంతా సైబర్ యుద్ధంలో పాలుపంచుకుంటున్నారు. అంతేకాదు రష్యా చేసే సైబర్ దాడుల నుంచి ఆత్మ రక్షణగా తమ ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీడియా నుంచి రైల్వేల వరకు... డిజిటల్ ఆర్మీలోని రోమన్ జఖరోవ్ బృందం ‘‘లిబరేటర్’’ అనే టూల్ని రూపొందించింది. ఈ టూల్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ నుంచైనా రష్యా వెబ్సైట్లపై దాడులు చేయవచ్చు. సైబర్ దాడులకు లోనుకాకుండా రష్యా దగ్గర పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ మీడియా, బ్యాంకులు, టెలిఫోన్లు, రైల్వేలు చాలా రంగాలకు చెందిన వెబ్సైట్లలో మాల్వేర్ జొప్పించి కొద్ది సేపైనా నిలువరించడంలో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ విజయం సాధిస్తోందని సైబర్ సెక్యూరిటీ అధికారి విక్టర్ జోరా చెప్పారు. మరికొందరు ఐటీ నిపుణులు ఐటీ ఆర్మీ అన్న పేరుతో గ్రూప్గా ఏర్పడి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్లో 2,90,000 మంది ఫాలోవర్లు ఉన్న ఈ గ్రూపు ఐటీ రంగంలో నిపుణులైన ఉక్రెయిన్లు ఎక్కడ ఉన్నా తమకు సహకారం అందించాలని పిలుపునిస్తోంది. ఇది సరైన పనేనా? ఇప్పటికే యుద్ధంతో నలిగిపోతున్న ఉక్రెయిన్లో ఇలా ప్రతీ వ్యక్తి సైబర్ యుద్ధానికి దిగడంపై సొంతదేశంలోనే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక ఉక్రెయిన్ సైబర్ సంస్థ రష్యా ఉపగ్రహాలను కూడా అడ్డుకున్నామని ప్రచారం చేస్తోంది. ఉపగ్రహాలపై కూడా కన్నేశామని చెప్పుకోవడం వల్ల ఉక్రెయిన్కి మరింత నష్టం జరుగుతుందని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపగ్రహాలనే టార్గెట్ చేస్తే అంతరిక్ష యుద్ధానికి దారి తీస్తుందని, అదే అసలు సిసలు యుద్ధంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే అంతరిక్ష రంగంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను తాము ప్రోత్సహించడం లేదని ఉక్రెయిన్ ప్రత్యేక కమ్యూనికేషన్ల సర్వీసులకు చెందిన డిప్యూటీ చైర్మన్ జోరా స్పష్టం చేశారు. యూరప్లో ఇంటర్నెట్ సేవలు బంద్ ఉక్రెయిన్ సైబర్ దాడులతో రైల్వే టికెట్ల బుకింగ్, బ్యాంకింగ్, టెలిఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతూ ఉండడంతో రష్యా కూడా తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. దీంతో శుక్రవారం నాడు యూరప్ వ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్, హంగేరి, గ్రీస్, ఇటలీ, పోలండ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. మానవీయ కోణంలో.. రెండు దేశాల మధ్య ఈ పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసలు విలన్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రష్యా నెటిజన్లు చాలా మంది సామాజిక మాధ్యమాల వేదికగా ఉక్రెయిన్కి మద్దతు ప్రకటిస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్కు మతి పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణ రష్యన్ల నుంచి మద్దతు రావడంతో ఉక్రెయిన్ డిజిటల్ ఆర్మీ వారి పట్ల మానవీయ కోణంతో స్పందిస్తోంది. ఉక్రెయిన్ వీధుల్లో తిరుగుతున్న సైనికులు క్షేమ సమాచారాల్ని రష్యాలో వారి తల్లిదండ్రులకు తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ రూపొందించారు. వారి వీడియోలు తీసి ఉంచడం, మరణించిన సైనికులు ఫొటోలు అప్లోడ్ చేయడం, యుద్ధం వద్దంటూ గ్రాఫికల్ డిజైన్స్ సందేశాలు రూపొందించి ప్రచారం చేయడం వంటివి చేస్తున్నారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. క్లిక్ చేస్తే డేంజర్లో పడ్డట్టే!
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్. కరోనా సంక్షోభంలో సైబర్ నేరస్తులు మీకు చెప్పి మరి కష్టపడ్డ సొమ్మును కాజేస్తున్నారని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఇటీవల కాలంలో కేవైసీ పేరుతో సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో నుంచి డబ్బుల్ని ఎలా మోసం చేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తూ బ్యాంక్ ఖాతాదారులకు జాగ్రత్తలు చెప్పింది. కేవైసీ అప్డేట్ చేయండి.. లేదంటే టెక్నాలజీ పెరిగిపోయే కొద్ది ఏది నిజమో, ఏది డూఫ్లికేటో తెలుసుకునేలోపే అనర్ధాలు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ల విషయంలో ఎక్కువగా జరుగుతుందని ఎస్బీఐ తెలిపింది. టెక్నాలజీపై ప్రజల్లో అవగాహాన పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త మార్గాల్ని అన్వేస్తున్నట్లు ఎస్బీఐ ట్వీట్లో పేర్కొంది. అచ్చం ఎస్బీఐ ఎస్ఎంఎస్ను పోలి ఉండే ఓ కేవైసీ డూబ్లికేట్ మెసేజ్ను బ్యాంక్ అకౌంట్ల వినియోగదారులకు సెండ్ చేస్తున్నారు. అందులో మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని, 24 గంటల్లో పూర్తి చేయకుంటే బ్యాంక్ సేవలు నిలిచిపోతాయని హెచ్చరిస్తారు. Here is an example of #YehWrongNumberHai, KYC fraud. Such SMS can lead to a fraud, and you can lose your savings. Do not click on embedded links. Check for the correct short code of SBI on receiving an SMS. Stay alert and stay #SafeWithSBI.#SBI #AmritMahotsav pic.twitter.com/z1goSyhGXq — State Bank of India (@TheOfficialSBI) March 4, 2022 పొరపాటున ఎవరైనా ఆ మెసేజ్లో ఉన్న లింక్ను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేస్తే బ్యాంక్లో ఉన్న మనీ మాయమవుతుందని ఎస్బీఐ సూచించింది. కేవైసీ అంశంలో ఇలాంటి మెసేజ్ల పట్ల అవగాహన లేని ఖాతాదారులు డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ మీ ఫోన్కి మెసేజ్ లేదంటే మెయిల్స్ వచ్చినా వాటిని క్లిక్ చేయకుండా వదిలేయాలని. అలాంటి ఎస్ఎంఎస్లు మళ్లీ మళ్లీ వస్తుంటే.. సైబర్ క్రైమ్ పోలీసులకు తెలపాలని సలహా ఇచ్చింది. చదవండి: బంగారం కొనేవారికి షాక్ !! ఆగమన్నా ఆగడం లేదు.. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయ్ -
సైబర్ దాడుల కలకలం.. ఇంటర్నెట్ ఉన్నా ఉన్నట్లుండి ఆఫ్లైన్!
ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో సైబర్ దాడుల కలకలం కొనసాగుతోంది. భారీగా బ్యాంకింగ్, ప్రభుత్వ ముఖ్యంగా రక్షణ వ్యవస్థకు సంబంధించిన వెబ్సైట్లపై పడుతున్నారు హ్యాకర్లు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం యూరప్ వ్యాప్తంగా వేలమంది ఇంటర్నెట్ యూజర్లకు ఒక్కసారిగా ఆఫ్లైన్ షాక్ తగిలింది. యూరప్లో జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, గ్రీస్, ఇటలీ, పోలాండ్ దేశాల్లోని తమ క్లయింట్లకు ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడిందని, ఈ మేరకు 40వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇదేం సాంకేతిక సమస్యకాదని ఒక ప్రకటన విడుదల చేసింది శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ బిగ్బ్లూ. మరోవైపు ఆరెంజ్ కంపెనీ(నోర్డెంట్) కూడా 9వేల మంది ఫ్రాన్స్ సబ్స్క్రయిబర్లు ఇబ్బంది పడినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. వీటితో పాటు మరో ఆరు ప్రధానమైన ఇంటర్నెట్ సేవల కంపెనీలు సైతం సేవలకు విఘాతం కలిగినట్లు ప్రకటన విడుదల చేశాయి. మరోవైపు బుధవారం కూడా ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇది కచ్చితంగా సైబర్ దాడులేనని యూఎస్కు చెందిన వయాశాట్ ప్రకటించింది. ప్రధానంగా హ్యాకర్లు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపైనే దృష్టి సారిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా.. యుద్ధ పరిస్థితుల్లో ఉక్రెయిన్లో కొత్త డేటా-నాశన వైరస్ని సైబర్ సెక్యూరిటీ కంపెనీలు గుర్తించాయి. అయితే దీని వాస్తవ ప్రభావాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఉక్రెయిన్పై రష్యా సైబర్ ఎటాక్
-
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు.