Five Dead In Huge Explosion At Cuddalore Fireworks Factory In Tamilnadu - Sakshi
Sakshi News home page

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఐదుగురు మృతి

Published Thu, Nov 10 2022 4:14 PM

huge Explosion At Fireworks Factory In Tamilnadu - Sakshi

సాక్షి, తమిళనాడు: మదురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు.

వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి.  ఈ ప్రమాదంలో అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు

Advertisement
 
Advertisement
 
Advertisement