ఆన్‌లైన్‌ రమ్మీ వ్యసనానికి బ్యాంకు ఉద్యోగి బలి | Online Rummy claims life of man in Tamil Nadu | Sakshi

ఆన్‌లైన్‌ రమ్మీ వ్యసనానికి బ్యాంకు ఉద్యోగి బలి

Nov 1 2020 3:40 AM | Updated on Nov 1 2020 3:40 AM

Online Rummy claims life of man in Tamil Nadu - Sakshi

చెన్నై: ఆన్‌లైన్‌ రమ్మీ ఉచ్చులో చిక్కుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు లో ఘటన జరిగింది. కోయంబత్తూరులో నివసించే మదన్‌కుమార్‌ (28) బ్యాంకు ఉద్యోగి. ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసగా మారాడు. తొలుత బాగా డబ్బులు సంపాదించినప్పటికీ తర్వాత నష్టాలు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఒత్తిడి తట్టుకోలేక మదన్‌ మద్యానికి అలవాటు పడ్డాడు. శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement