ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు | TDP Leaders Attacks In Srikakulam District | Sakshi
Sakshi News home page

ఓటు వేయలేదని గునపాలతో దాడి చేశారు

Feb 20 2021 1:23 PM | Updated on Feb 20 2021 2:25 PM

TDP Leaders Attacks In Srikakulam District - Sakshi

తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్థరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు.

సాక్షి, శ్రీకాకుళం: పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం నేతలు రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడుతున్నారు. టీడీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. జిల్లాలోని కింతలి పంచాయతీ ఖాజీపేటలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ మద్దతుదారులకు ఓట్లు వేయలేదని అక్కసుతో గత అర్ధరాత్రి యాదవ వీధిలో కర్రలు, గునపాలతో బీభత్సం సృష్టించారు. కొందరి ఇళ్లపై దాడులు చేసి కరెంటు మీటర్లు, ఇంటి తలుపులు, కిటికీలు, రెండు బైకులను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో నలుగురు గాయలపాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు తమ్మినేని చిరంజీవి నాగ్‌, పప్పల వెంకటరమణ శనివారం పరామర్శించారు.




 


చదవండి: టీడీపీకి పరాభవం: నాటి పాపాలే.. నేటి శాపాలు!
పేదల గూటికి టీడీపీ గండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement