ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి | two cars collided in Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Mon, Aug 17 2020 10:58 AM | Last Updated on Mon, Aug 17 2020 11:08 AM

two cars collided in Gujarat - Sakshi

సాక్షి, నడియాడ్‌ : గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అహ్మదాబాద్-వడోదర 8వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న సంఘటనలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నడియాడ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు అగ్నిమాప‌క‌శాఖ సూప‌రింటెండెంట్ దీక్షిత్ ప‌టేల్‌ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement