ahmedabad
-
సెమీఫైనల్ మ్యాచ్.. లంచ్కు ముందు ఐదుగురు.. తర్వాత ఒక్కడే.. జనాలు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్లో కేవలం ఐదుగురే మ్యాచ్ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్కు దిగిన కేరళ, ఇన్నింగ్స్ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. -
అహ్మదాబాద్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్వుడ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్మన్ గిల్కు జతైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
వారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) సూపర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్’ ఈ ఘనత సాధించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్పూర్లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేన.. కటక్లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.గిల్ సూపర్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే, గత మ్యాచ్లో శతకం(119) బాదిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మాత్రం సెంచరీతో మెరిశాడు.తొలి యాభై ఇన్నింగ్స్లోమొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్గానూ శుబ్మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో మూడో వన్డేలో గిల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది.కోహ్లి కూడా ఫామ్లోకిఇక ఈ మ్యాచ్తో మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఫామ్లోకి వచ్చాడు. అహ్మదాబాద్లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత హాఫ్ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్మన్ గిల్ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో 2587, 1893, 578 పరుగులు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు👉శుబ్మన్ గిల్(ఇండియా)- 2587 పరుగులు👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు👉ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)- 2386 పరుగులు👉ఫఖర్ జమాన్(పాకిస్తాన్)- 2262 పరుగులు👉షాయీ హోప్(వెస్టిండీస్)- 2247 పరుగులుఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు👉ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా)- వాండరర్స్ స్టేడియం, జొహన్నస్బర్గ్👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- నేషనల్ స్టేడియం, కరాచి👉క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- సూపర్స్పోర్ట్ పార్క్, సెంచూరియన్👉శుబ్మన్ గిల్(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డుJubilation as @ShubmanGill gets to a fine CENTURY!Keep at it, young man 🙌🙌Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J— BCCI (@BCCI) February 12, 2025 -
Ind vs Eng 3rd ODI: వరుణ్ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి
Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్తో వరల్డ్కప్ మ్యాచ్ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్ సెకండాఫ్లో బ్యాటింగ్కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.మరోవైపు.. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్.. దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్కు దూరమయ్యాడని తెలిపాడు. వరుణ్ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. నాగ్పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది.తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్స్వీప్ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్.చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
కటక్ నుంచి అహ్మదాబాద్కు టీమిండియా క్రికెటర్ల పయనం (ఫొటోలు)
-
అహ్మదాబాద్లో పెళ్లి: ఫోటోలు షేర్ చేసిన జీత్ అదానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలినీయర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు 'జీత్ అదానీ'తో 'దివా జైమిన్ షా' పెళ్లి అహ్మదాబాద్లోని అదానీ టౌన్షిప్ శాంతిగ్రామ్లో గుజరాతీ సంప్రదాయంలో చాలా సింపుల్గా జరిగింది. పెళ్లి తరువాత మొదటిసారి భార్యతో ఉన్న ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.పెళ్లికి ముందు గౌతమ్ అదానీ 'మంగళ సేవ' అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది కొత్తగా వివాహం చేసుకున్న దివ్యాంగ యువతులకు సాయం అందించే కార్యక్రమం. దీని ద్వారా ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ వధువులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని జీత్ అదానీ, దివా దంపతులు సంకల్పించారు. లాంఛనంగా 21 మంది దివ్యాంగుల వధూవరులను కలిసి జీత్ అదానీ ఈ చొరవను ప్రారంభించారు.Mr. and Mrs. Adani - To infinity and beyond! pic.twitter.com/vy0LAzvYSv— Jeet Adani (@jeet_adani1) February 8, 2025 -
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
HMPV వైరస్ కలకలం.. నాలుగేళ్ల బాలుడికి పాజిటివ్
అహ్మదాబాద్: దేశంలో చైనా వైరస్ హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య క్రమంలో పెరుగుతోంది. తాజాగా గుజరాత్ నాలుగేళ్ల బాలుడు వైరస్ బారినపడ్డాడు. బాలుడికి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) సోకింది. ప్రస్తుతం ఆసుపతత్రిలో బాలుడికి చికిత్స జరుగుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పాజిటివ్ కేసుతో గుజరాత్ హెచ్ఎంపీ బాధితుల సంఖ్య ఎనిమిది చేరింది.వివరాల ప్రకారం.. జనవరి 28న అహ్మదాబాద్లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు. అనంతరం, బాలుడిని ఎస్జీవీపీ ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆ బాలుడికి హెచ్ఎంపీవీ సోకిందని అదే రోజున నిర్ధారించినట్లు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. ఆ బాలుడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించినట్లు చెప్పారు. దీంతో, సదరు బాలుడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గుజరాత్లో ఇప్పటి వరకు ఎనిమిది హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్లో ఏడు, సబర్కాంత జిల్లాలో ఒక కేసు వెలుగుచూశాయి. అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో చేరిన ఆరుగురు రోగులను పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు హెచ్ఎంపీ కేసులు ఇలా ఉన్నాయి. గుజరాత్లో 8, మహారాష్ట్రలో 3, కర్ణాటక 2, తమిళనాడులో 2, అసోంలో ఒక్క కేసు నమోదైంది.అసలేంటీ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్2001లోనే హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) డ్రాగన్ దేశం గుర్తించింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV)తో పాటు న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. చిన్నపిల్లలు, వృద్ధులలో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, వైరస్ తీవ్రత మరింతగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.అనారోగ్యం తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత, వ్యవధి మారవచ్చు. సాధారణ ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 6 రోజులు ఉంటుంది. హెచ్ఎంపీవీ సంక్రమణ లక్షణాలు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియాకు దారితీస్తాయి. ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఇతర వైరస్ల మాదిరిగానే దీని లక్షణాలు ఉంటాయి.హెచ్ఎంపీవీ లక్షణాలుఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. లక్షణాలు మరింత ముదిరితే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)ని అధ్వాన్నంగా మారుస్తుంది. సాధారణ జలుబు మాదిరిగా లక్షణాలు కనిపిస్తాయి.దగ్గుజ్వరంజలుబు,గొంతు నొప్పిఊపిరి ఆడకపోవడంజాగ్రత్తలు ఇలా..హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఇంతవరకూ అభివృద్ధి చేయలేదు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజేషన్, హ్యాండ్ వాష్, సామాజికి దూరం చాలా ముఖ్యం. 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో దూరాన్ని పాటించాలి. వైరస్బారిన పడిన వారు సెల్ఫ్ ఐసోలేషన్ పాటించడం ఉత్తమం. -
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
స్కై స్టార్స్: ఇస్రోలో పనిచేయకుండానే స్పేస్ స్టారప్ కంపెనీ..!
మనసు పెడితే, కష్టపడితే ‘కచ్చితంగా నిజం అవుతాయి’ అని చెప్పడానికి బలమైన ఉదాహరణ కాజల్, హితేంద్రసింగ్. ‘స్పాన్ట్రిక్(SpanTrik)’ స్టార్టప్తో తమ కలను నిజం చేసుకున్నారు... రాకెట్ను ప్రయోగించే ప్రక్రియలో కాలంతో పాటు ఎంతో పురోగతిని చూస్తున్నాం. దీనికి సరికొత్త చేర్పు...స్పాన్ట్రిక్. రీయూజబుల్ రాకెట్ లాంచ్ వెహికిల్స్ కోసం కాజల్ రాజ్జర్, హితేంద్రసింగ్ ‘స్పాన్ట్రిక్’ అనే స్టార్టప్ను ప్రారంభించారు.పునర్వినియోగ రాకెట్(Reusable rockets) లాంచ్ వెహికిల్స్ను స్పాన్ట్రిక్ అభివృద్ధి చేస్తుంది. అంతరిక్ష పరిశోధనలను అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. మేము దీన్ని ఫెడెక్స్ టు స్పేస్ అని పిలవడానికి ఇష్టపడతాం’ అంటున్నారు కాజల్, హితేంద్రసింగ్. ఢిల్లీ(Delhi) కేంద్రంగా మొదలైన ‘స్పాన్ట్రిక్’ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ గ్రాంట్లను పొందింది. ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్ ‘టెక్ 30’ జాబితాలో చోటు సాధించింది.చిన్నప్పుడు పిల్లలు ఏవో కలలు కంటారు. అయితే ఆ కలలు అన్నీ నిజం కాకపోవచ్చు. చిన్న వయసులోనే ‘నేను పెద్దయ్యాక స్పేస్(space) కంపెనీ నడపాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పింది కాజల్. అంతేకాదు ‘సొంతంగా రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేస్తాను’ అని తన డైరీలో కూడా రాసుకుంది. తన లక్ష్యసాధనలో భాగంగా చెన్నైలోని ఎస్ఆర్ఎంలో చేరింది. అక్కడ ఫిజిక్స్ చదువుకున్న కాజల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీని నడిపేది. కొత్త శాస్త్రీయ ఆవిష్కరణల గురించి అందులో రాసేది. ఈ క్రమంలో కాజల్కు అహ్మదాబాద్లో చదువుకుంటున్న హితేంద్ర సింగ్తో పరిచయం అయింది. కాజల్లాగే సింగ్ కూడా చిన్నప్పుడు ఎన్నో కలలు కనేవాడు.సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన కాజల్, హితేంద్రసింగ్లు సైన్స్కు సంబంధించి బోలెడు విషయాలు మాట్లాడుకునేవారు. అలా ‘స్పాన్ట్రిక్’ కోసం స్కెచ్ వేశారు. ఆస్ట్రోఫిజిక్స్, కాస్మోలజీలో మాస్టర్స్ చేయడానికి గుజరాత్లోని ‘చరోతార్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ చేరారు. తమ భవిష్యత్ లక్ష్యమైన ‘స్పాన్ట్రిక్’ కోసం కాలేజీ వదిలి పెట్టారు. కంపెనీ స్థాపించడానికి ముందు మానవ రహిత వైమానిక వాహనాలను (ఏరియల్ వెహికిల్స్) అభివృద్ధి చేయడం నుంచి యువిసి రోవర్ తయారీ వరకు ఎంతో అనుభవ జ్ఞానాన్ని సంపాదించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ‘స్పాన్ట్రిక్’ వడివడిగా అడుగులు వేయడానికి ఉపయోగపడింది. రీసైకిల్ చేయదగిన రాకెట్ల డిమాండ్ను అర్థం చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలు, ఇస్రో సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. నిజానికి పునర్వినియోగ రాకెట్ కాన్సెప్ట్ కొత్త కాదు. రష్యా, అమెరికా, జర్మనీలాంటి దేశాలు దశాబ్దాలుగా ఈ కాన్సెప్ట్పై పనిచేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో ఖర్చు హద్దులు దాటేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఖర్చు కాని, ఎక్కువ సార్లు ఉపయోగించే రాకెట్లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కాజల్–సింగ్ బృందం వర్టికల్ టేకాఫ్ వర్టికల్ ల్యాండింగ్(విటివిఎల్)ను నిర్మిస్తోంది. వ్యవస్థల పునర్వినియోగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది.అయినా సరే...చాలామంది స్పేస్ స్టార్టప్ వ్యవస్థాపకులు ఇస్రోలో పనిచేశారు. లేదా ఏదో ఒక హోదాతో సంస్థతో టచ్లో ఉన్నారు. మేము ‘ఇస్రో’లో పనిచేయలేదు. ‘ఇస్రో’లో పనిచేయని ఫౌండర్లకు సంబంధించిన స్టార్టప్ మాది. కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టాం. ప్రసిద్ధ సంస్థలకు చెందని వ్యక్తులు కూడా సాంకేతిక స్టార్టప్లకు సంబంధించి ముందుకు వెళ్లగలరని నిరూపించాలనుకుంటున్నాం. ఇది ఎంతో మంది ఔత్సాహికులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెబుతోంది కాజల్.(చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు..) -
నెల పాటు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ర్యాపిడో (Rapido) సేవలను 30 రోజుల పాటు నిలిపివేసింది. రిక్షా అసోసియేషన్ల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ర్యాపిడో కంపెనీకి RTO పలుసార్లు నోటీసులు జారీ చేస్తూ.. వస్తున్న ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరింది. కానీ సంస్థ దీనికి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. దాని కార్యకలాపాలలో ఉపయోగించే వాహనాలకు తప్పనిసరి బీమా కూడా అవసరం. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.ర్యాపిడో బైక్ సర్వీస్కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్టీఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో సంస్థ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అహ్మదాబాద్ ఆర్టీవో అధికారి 'జేజే పటేల్' (JJ Patel) మాట్లాడుతూ.. ఆర్టీవో కేవలం ర్యాపిడో త్రీ-వీలర్ ఆటో రిక్షాలకు మాత్రమే అగ్రిగేటర్ లైసెన్స్ను జారీ చేసింది. కానీ వారు తమ ఆన్లైన్ యాప్ ద్వారా నాన్-ట్రాన్స్పోర్ట్ టూ-వీలర్ వాహనాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు. అంతే కాకుండా డాక్యుమెంట్స్ గడువు ముగిసిన తర్వాత కూడా వారు వాహనాలను నడపడం కొనసాగించారు. దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది. కాబట్టి, మేము 30 రోజుల పాటు రాపిడో సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిబంధలనలు ఉల్లంగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.ర్యాపిడో సేవలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా కొన్ని నియమాలను సంస్థ ఉల్లంఘించిందనే కారణంగా ఢిల్లీ హైకోర్టు ర్యాపిడో సేవలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ ఆర్టీవో ర్యాపిడో సేవలను 30 రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.చాలామంది ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పకుండా, నియమాలను పాటించాలి. అప్పుడే ప్రజలకు సురక్షితమైన సేవలను అందించగలుగుతారు. నియమాలను ఉల్లంగిస్తే.. ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ర్యాపిడో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.ర్యాపిడో సర్వీస్ ఉపయోగాలుదేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడో సేవలను మంచి ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. చాలా మంది ర్యాపిడో బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి వాటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్చాలామందికి ఉపాధిర్యాపిడో సర్వీస్ కారణంగా దేశంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కొక్కరు నెలకు వేలల్లో సంపాదించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ బైక్ సర్వీస్ ద్వారానే నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు ఈ మధ్యకాలంలోనే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే బైక్ నడుపుకుంటూనే చాలామంది మంచి ఆదాయం సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. -
10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే!
గుజరాత్లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో జనవరి మూడున ప్రారంభమై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక థీమ్ను రూపొందించారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన పూల శిల్పాలు, కీర్తి స్తంభం, ఒలింపిక్ టార్చ్, గర్బా నృత్యం లాంటి అందమైన దృశ్యాలు సందర్శకులను సమ్మోహనపరుస్తున్నాయి. హల్క్, డోరేమాన్ తదితర కార్టూన్ పాత్రలను పూలతో తయారు చేశారు. ఇవి పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో సందర్శకులతో నిత్యం రద్దీగా ఉంటోంది.ప్రస్తుతం జరుగుతున్న ఫ్లవర్ షో(Flower Show) కోసం రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బడ్జెట్ను వెచ్చించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నైట్ ఫ్లవర్ పార్క్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో 54 లైటింగ్ డిస్ప్లేలు, జంతువుల బొమ్మలతో పాటు ఇతర ఇంటరాక్టివ్ ఫీచర్లున్నాయి. రాత్రిపూట ఈ పార్క్ ఎంతో సమ్మోహనంగా కనిపిస్తోంది.నెల రోజుల పాటు జరిగే ఈ ఫ్లవర్ షో ఉద్దేశ్యం కేవలం వినోదమే కాకుండా పర్యావరణంపై అవగాహన కల్పించడం. పర్యావరణ విషయంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Ahmedabad Municipal Corporation) చూపుతున్న చొరవకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.ఫ్లవర్ షోను ఈసారి ఆరు విభాగాలుగా మలచారు. పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు పూల మధ్య ఆటలాడుకోవచ్చు. ప్రతి పూల బొమ్మకు క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేసి, దానికి సంబంధించిన సమాచారాన్ని వినవచ్చు. ఈ సాంకేతికత సందర్శకులకు మంచి అనుభూతినిస్తుంది.ఈ ప్రదర్శన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కూడా ఆకట్టుకుంటోంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసుగల పిల్లలకు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో ప్రదర్శనను తిలకించేందుకు చిన్నారులు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ ఫ్లవర్ షో అందరినీ అమితంగా ఆకట్టుకుంతోంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడం సందర్శకులకు ఒక మధురానుభూతిగా మిగులుతుందని నిర్వాహకులు అంటున్నారు.అహ్మదాబాద్లోనే కాదు.. తమిళనాడులో కూడా ఫ్లవర్ షో జరుగుతోంది. చెన్నైలోని సెంమొళి పూంగాలో 4వ చెన్నై ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. లక్షలాది పూలతో అందాలను చిందిస్తున్న ఈ ప్రదర్శన జనవరి 11 వరకు కొనసాగనుంది.అహ్మదాబాద్, చెన్నై(Chennai)లలో జరిగే ఈ ప్రదర్శనలు సందర్శకులకు కొత్త లోకాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతిపై ప్రేమను అందరిలో పెంపొందిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఫ్లవర్ షోలను తిలకించేందుకు పలువురు విదేశీయులు కూడా ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడి సుమనోహర దృశ్యాలను చూసి మైమరచిపోతుంటారు. ఇది కూడా చదవండి: భారత్లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం -
స్లో.. & స్టడీ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ట్రెండ్ మారుతోంది. ఉరుకుల పరుగుల ప్రయాణాలకు బదులు స్థిర అన్వేషణల వైపు గమ్యం సాగుతోంది. స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలను సంపూర్ణంగా అర్థం చేసుకునేలా ‘స్లో ట్రావెల్’పేరుతో పర్యాటక ఉద్యమం ఊపందుకుంటోంది. స్లో ట్రావెల్లో పర్యాటక ప్రదేశాల పరిమాణం కంటే.. అందులోని నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గజిబిజి జీవితాలను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకుని ప్రకృతి ఒడిలో మునిగిపోయేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2025 సంవత్సరం ‘స్లో ట్రావెల్’ఇయర్గా మారుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రైళ్లకు జై కొడుతున్నారు2024లో 81శాతం మంది విశ్రాంతి కోసం, రోజువారీ ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు స్లో వెకేషన్లకు వెళ్లినట్టు ‘ట్రావెల్ అండ్ టూర్ వరల్డ్’పేర్కొంది. ఇందులో మూడొంతుల మంది సాంస్కృతిక, చారిత్రక అన్వేషణ, వారసత్వ ప్రదేశాల సందర్శనలకు విలువ ఇస్తున్నట్టు గుర్తించింది. స్లో ట్రావెల్లో భాగంగా అధిక శాతం మంది రైలు ప్రయాణాలకు జైకొడుతున్నట్టు తేలింది. సుదూర గమ్యస్థానాలకు విమాన, కారు ప్రయాణాలకు ఖర్చుతో కూడుకోవడం, ఒక్కోసారి రిమోట్ గమ్యస్థానాలను చేరుకోలేకపోవడంతో రైలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత సైక్లింగ్, బైక్ రైడ్లలో సోలోగా స్లో ట్రావెల్కు వెళ్తున్నారు. ఇటీవల కాలం నదీ అందాలను ఆస్వాదించేందకు క్రూయిజ్ల ప్రయాణాలను ఎంపికలు పెరిగాయి. అహ్మదాబాద్.. అగ్రస్థానంభారతదేశంలో అహ్మదా బాద్ నగరం సుదీర్ఘ సందర్శనలలో పాల్గొనే వారికి అగ్ర ఎంపికగా ఉద్భవించింది. గోవా, అయోధ్య తరువాత ఈ ప్రాంతంలో ఎక్కువగా గడిపేందుకు ప్రసిద్ధి చెందింది. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు ముఖ్యంగా ఆసియాలో థాయ్లాండ్లోని ఖావో లాక్, జపాన్లోని టోక్యో, దక్షిణ కొరియాలోని సియో ల్, మలేషియాలోని పెర్హెన్షియన్ దీవులు, వియత్నాంలోని హోచిమిన్ సిటీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు డిజిటల్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అగోడా ప్రకటించింది.భారత్లో 10% వృద్ధి అంచనానిత్యం పని జీవితంలో ఒత్తిళ్లు తారస్థాయికి చేరుకోవడంతో సెలవులు తీసుకోవడం గతంతో పోలిస్తే విలువైనది మారింది. ఆఫ్బీచ్ వెకేషన్లు, కొత్త అన్వేషణల గమ్యస్థానాలకు ప్రయాణించడం మానసిక చికిత్సగా భావిస్తున్నారు. 2025లో అత్యధికులు ‘స్లో ట్రావెల్’కు జైకొడుతున్నారు. ఇది 2025లో 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని ట్రావెల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. చాలామంది పర్యాటకులు గమ్యస్థానాలను పూర్తిగా అస్వాదించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావడం కంటే స్థానిక సంస్కృతిలో లీనమవ్వడం, మరింత అర్థవంతంగా ప్రయాణాన్ని మార్చుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజలు నిత్యం పిల్లలను పెంచడం, ఆఫీస్ సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలంటూ బిజీ షెడ్యూల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి తరుణంలో మానసిక విశ్రాంతి, ఆహ్లాదాన్ని పొందేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త ఆహారాన్ని రుచి చూడటం, కొత్త దృశ్యాలను కళ్లతో బంధిస్తూ విశ్రాంతిని పొందే ప్రదేశాలను కోరుకుంటున్నట్టు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. -
మోతీ షాహీ మహల్ : ఐరన్ మ్యాన్ మెమోరియల్
మోతీ షాహీ మహల్... చారిత్రక నిర్మాణం. అహ్మదాబాద్ నగరంలో షాహీభాగ్లో ఉంది. ఇప్పుడది సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితానికి దర్పణం. వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను వివరించే డిజిటల్ స్టూడియో అద్భుతం. డిజిటల్ స్టూడియో జైలు గదుల రూపంలో విభజించి ఉంటుంది. గదులకు ఉన్న ఊచలను పట్టుకుంటే ఒక్కొక్క ఘట్టం ఆడియోలో వినిపిస్తుంది. జాతీయోద్యమంలో భాగంగా పటేల్ జైలు జీవితం గడిపిన సంఘటనలతో పాటు ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో వినవచ్చు. వీటన్నింటినీ లేజర్ షోలో చూడవచ్చు. ఇక మ్యూజియంలో ఒక్కో గది ఒక్కో రకమైన వస్తువులతో అలరిస్తుంది. వర్తమానం, ఆహ్వానపత్రాలను పంపించిన ట్యూబ్లాంటి వెండి పెట్టెలున్నాయి. ఐరన్ మ్యాన్ చేతుల మీదుగా శంఖుస్థాపన చేయించుకోవడానికి సిద్ధం చేసిన వెండితాపీలు లెక్కలేనన్ని ఉన్నాయి. మెమోరియల్ మ్యూజియం అంటే ఆ వ్యక్తి ఉపయోగించిన చెప్పులు, పెన్నులు, భోజనం చేసిన ప్లేట్లు, దుస్తులను మాత్రమే చూస్తుంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్లో భారత జాతీయోద్యమం కనిపిస్తుంది. గాంధీ, నెహ్రూలతో పటేల్ కలసి ఉన్న ఫొటోలతోపాటు ఆయా సందర్భాల వివరణ కూడా ఉంటుంది. పటేల్ జీవితంలో ఉపయోగించిన వస్తువులు ఏయే సందర్భంగా ఉపయోగించారనే వివరాలు ఉండడంతో ఫ్రీడమ్ మూవ్మెంట్ క్షణక్షణమూ గుర్తుకు వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు పదిహేడేళ్ల వయసులో కొంత కాలం ఈ మహల్లో బస చేశాడు.ఇదీ చదవండి: వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన షాజహాన్ విడిది వల్లభాయ్ పటేల్ మెమోరియల్ ఉన్న భవనం మోతీ షాహీ మహల్... మొఘలుల నిర్మాణాలను తలపిస్తుంది. ఈ షాహీ మహల్ని 17వ శతాబ్దంలో షాజహాన్ కట్టించాడు. షాజహాన్ యువరాజుగా ఈ ప్రదేశానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు దీనిని నిర్మించాడు, రాజ్యపర్యటనకు వచ్చినప్పుడు అతడి విడిది కూడా ఇందులోనే. ఆ తర్వాత బ్రిటిష్ ఉన్నతాధికారుల నివాసమైంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ భవనం రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్. గవర్నర్ నివాసానికి కొత్త భవనం కట్టిన తర్వాత 1978లో ఈ భవనాన్ని పటేల్ మొమోరియల్గా మార్చారు. నరేంద్రమోదీ గుజరాత్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో ఈ మెమోరియల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటలైజ్ అయింది. మ్యూజియం అంతా తిరిగి చూసిన తర్వాత అదే ప్రాంగణంలో ఉన్న పటేల్ విగ్రహం దగ్గరకు వచ్చినప్పుడు ‘ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియా’ అనే ఆత్మీయ ప్రశంసను గుర్తు చేసుకుంటూ ఓ నమస్కారం పెడతాం.ఆదివారం ఆటవిడుపుమోతీ షాహీ మహల్ చుట్టూ అందమైన గార్డెన్ మొఘలుల చార్భాగ్ నమూనాలో ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి. రంగురంగుల వాటర్ఫౌంటెయిన్ పిల్లలను అలరిస్తుంది. అహ్మదాబాద్ వాసులకు వీకెండ్ పిక్నిక్ ప్లేస్ ఇది. దాదాపుగా నగరంలోని స్కూళ్లన్నీ విద్యార్థులను ఏటా ఈ మ్యూజియం సందర్శనకు తీసుకువస్తుంటాయి. అహ్మదాబాద్ పర్యటనలో మిస్ కాకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. ఈ మెమోరియల్ భవనం లోపల మాత్రమే కాదు భవనం బయట పరిసరాలను కూడా ఆస్వాదించాలి. పచ్చటి ఉద్యానవనంలోని చెట్ల కొమ్మల మీద నెమళ్లు సేదదీరుతుంటాయి. చెట్ల మధ్య విహరిస్తూ తినుబండారాలను రుచి చూడాలంటే అనుమతించరు. చాటుగా తినే ప్రయత్నం చేసినా కోతులు ఊరుకోవు. మెరుపువేగంతో వచ్చి లాక్కెళ్తాయి. మ్యూజియం పర్యటనకు అనువైన కాలం అని ప్రత్యేకంగా అక్కరలేదు, కానీ అహ్మదాబాద్లో పర్యటించడానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనువుగా ఉంటుంది. కాబట్టి క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్లాన్ చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్΄ోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్కు దూరం ఐదు కిలోమీటర్లు మాత్రమే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మీ సేవలతో దేశానికే గుర్తింపు
అహ్మదాబాద్: బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బాప్స్) స్వచ్ఛంద సేవకుల సేవాగుణం, కృషి వల్ల భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అహ్మదాబాద్లోని మోదీ మైదా నంలో శనివారం జరిగిన బాప్స్ వలంటీర్ల ‘కార్యకార్ సువర్ణ మహోత్సవ్’ను ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. ‘‘స్వా మి నారాయణ్ బోధలను బాప్స్ సేవకులు కోట్లాది మంది అణగారిన వర్గాలకు చేరువ చేసి వారి బతుకులను బాగుచేశారు. బాప్స్ సేవలు దేశానికీ శక్తినిచ్చాయి. సేవ పరమో ధర్మః అన్నది మన జీవన విధానం. కోవిడ్ సంక్షోభం, కేరళ, ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయాల్లో బాప్స్ వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి ఆదుకున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలండ్కు వస్తున్న భారతీయులకు సాయపడాలని అర్ధరాత్రి వేళ బాప్స్ గురువులను కోరా. తక్షణం యూరప్వ్యాప్తంగా ఉన్న వలంటీర్లను పోలండ్ రప్పించి సాయపడ్డారు’’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘బాప్స్ సేవకులు 28 దేశాల్లో 1,800కు పైగా స్వామి నారాయణ్ ఆలయాలు నిర్మించారు. 21,000కి పైగా ఆధ్యాతి్మక కేంద్రాలు నెలకొల్పారు. ఎన్నో రంగాల్లో సేవలందిస్తున్నారు’’ అని కొనియాడారు. -
సీరియల్ కిల్లర్.. ఎట్టకేలకు చిక్కాడు!
ఇదో ఇంట్రస్టింగ్ కేసు. దొంగలను పట్టుకోవడానికి హీరో దొంగగా మారి వారి ఆట కట్టించడం మనం సినిమాల్లో చూశాం. ఇదే తరహాలో సీరియల్ కిల్లర్ని పోలీసులకు పట్టించాడో ఓ వ్యక్తి. మరింత మంది ప్రాణాలు పోకుండా కాపాడాడు. తన సోదరుడి చావుకు కారణమైన దుర్మార్గుడిని చట్టం ముందు నిలబెట్టాడు. మూడేళ్లు పాటు శ్రమించి హంతకుడిని ఆధారాలతో సహా పట్టించాడు. ఆసక్తి కలిగించే ఈ కేసులో వివరాలేంటో చూద్దాం.అసలేం జరిగింది?2021 ఆగస్టులో గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలోని కమోద్ గ్రామంలో వివేక్ గోహిల్ అనే యువకుడు బైక్ ప్రమాదంలో చనిపోయాడు. అతడు యాక్సిడెంట్లోనే చనిపోయాడని పోలీసులతో అందరూ అనుకున్నారు. కానీ అతడి సోదరుడు జిగానీ గోహిల్(24) మాత్రం నమ్మలేదు. తన సోదరుడిది ముమ్మూటికీ హత్యేనని అనుమానించాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాడు. వివేక్పై విషప్రయోగం చేశారని అతడు తెలుసుకున్నాడు. తన సోదరుడు చనిపోవడానికి ముందు నవల్సిన్హ్ చావ్డా అనే మంత్రగాడితో టచ్లో ఉన్నట్టు గుర్తించాడు.నైట్ ట్యాక్సీ డ్రైవర్ అవతారంతన సోదరుడిని హత్య చేసిన దుండగుడిని పట్టుకునేందుకు జిగానీ గోహిల్ నైట్ షిప్ట్ ట్యాక్సీ డ్రైవర్గా మారాడు. యూట్యూర్ కూడా అయిన నవల్సిన్హ్కు కారు ఉంది. ఉదయం అతడు కారు నడిపేవాడు. రాత్రిపూట జిగానీ కారు నడుపుతూ నవల్సిన్హ్కు దగ్గరయి, అతడి విశ్వాసం సంపాందించాడు. అతడికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకున్నాడు. అభిజీత్ సింగ్ రాజ్పుత్ అనే మరో వ్యక్తిని హత్య చేయడానికి నవల్సిన్హ్ ప్లాన్ చేశాడు. తనకు సహకరిస్తే వచ్చే డబ్బులో 25 శాతం వాటా ఇస్తానని ఆశచూపించాడు. జిగానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించడంతో నవల్సిన్హ్ కటకటాల పాలయ్యాడు.ముగ్గురిపై విషప్రయోగంప్రత్యేక పూజలు చేసి ధనవంతుడిని చేస్తానని సనంద్ ప్రాంతానికి చెందిన అభిజీత్ సింగ్ (29)ను నవల్సిన్హ్ నమ్మించాడు. నీళ్లలో విషపదార్థం కలిపి అతడిని అంతం చేసి.. డబ్బు లాగాలని పథకం వేశాడు. జిగానీ ఇచ్చిన సమాచారంలో రంగంలోకి దిగిన సక్రెజ్ ప్రాంత పోలీసులు మమత్పురాలో నవల్సిన్హ్ను అరెస్ట్ చేశారు. 2023లోనూ ముగ్గురిని ఇలాగే అతడు చంపినట్టు పోలీసులు అనుమానిస్తునారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై విషప్రయోగం చేసి చంపేసి, వారి మృతదేహాలను దుద్రేజ్ కాలువలో పడేశారు. వారు ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని అందరినీ నమ్మించడంతో నవల్సిన్హ్ తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోవడంతో పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. చదవండి: రాంగ్ కాల్ ఫలితం.. యువతి వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్యనరబలి ఆరోపణలునవల్సిన్హ్ను చట్టానికి పట్టించడంలో జిగానీ పెద్ద సాహసమే చేశాడు. ట్యాక్సి డ్రైవర్గా అతడికి దగ్గరయి ఆధారాలు సంపాదించాడు. సరైన సమయంలో హంతకుడిని పోలీసులకు పట్టించాడు. నవల్సిన్హ్ కారు నుంచి పూజాసామాగ్రి, విషపదార్థంగా అనుమానిస్తున్న వైట్ పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాంత్రిక పూజలతో అమాయకులను నమ్మించి హత్య చేసిన అతడిపై సెక్షన్ 55, 318(1), (2) కింద కేసు నమోదు చేశారు. అయితే నరబలి ఇచ్చాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ నరబలి వ్యతిరేక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. -
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
దస్తన్ ఆటో వరల్డ్ కార్ల మ్యూజియం
రోల్స్రాయిస్, జాగ్వార్, బెంట్లీ, లాగోండా, క్యాడిలాక్, ఆస్టిన్, మెర్సిడెస్, ఆంబుమ్స్, హెచ్జె ముల్లినర్, అర్థర్ ముల్లినర్, విండోవర్స్, పార్క్ వార్డ్... ఈ కార్లన్నింటినీ ఒకే చోట చూడాలంటే దస్తన్ ఆటోవరల్డ్ వింటేజ్ మ్యూజియానికి వెళ్లాలి. మన హైదరాబాద్లో నిజాం నవాబు సేకరించిన కార్లను చౌమొహల్లా ΄్యాలెస్లో చూడవచ్చు. ఈ కలెక్షన్కు పదింతలు పెద్ద కలెక్షన్ అహ్మదాబాద్లోని ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలో ఉంది. రెండువేల రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియంలో మూడు వందలకు పైగా మోటారు వాహనాలుంటాయి. గాంధీ సినిమాలో ఉపయోగించిన మేబాష్ కారును కూడా చూడవచ్చు. అలాగే 1923 రోల్స్ 20 మోడల్ కూడా ఉంది. అహ్మదాబాద్ నగర శివారులో సర్దార్ పటేల్ రింగ్రోడ్, కత్వారాలో ఉన్న ఓ ఉన్న ఈ మ్యూజియం గిన్నిస్ రికార్డ్స్లో నమోదైంది. ప్రియమైన ప్రయాణం!ఈ మ్యూజియంలో ఉన్న బైక్లు, గుర్రపు బగ్గీలు, కార్లను సేకరించిన వ్యక్తి పేరు ప్రణ్లాల్ భోగిలాల్. రకరకాల కార్ల మీద ఆయనకున్న మోజు ఇలా మ్యూజియం రూపంలో కొలువుతీరింది. ఈ కార్లతో ఫొటో తీసుకోవాలనే సరదా కలిగితే ఒక్కో ఫొటోలకి వంద రూపాయలిచ్చి ఫొటో తీసుకోవచ్చు. వింటేజ్ కారులో ప్రయాణించాలనే సరదా కలిగితే అదీ సాధ్యమే. అయితే అత్యంత ప్రియమైన ప్రయాణమనే చెప్పాలి. ట్రిప్కి వెయ్యి రూపాయల వుతుంది. బరువైన బాడీ, పాత మోటర్లు కావడంతో నాలుగు లీటర్ల పెట్రోలు పోస్తే కిలోమీటరు ప్రయాణిస్తాయి. టూరిస్టులను మ్యూజియం బయటకు రెండు–మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకువస్తారు. కారు ఎక్కేటప్పుడు ఒకరు వచ్చి డోర్ తీస్తారు, కూర్చోగానే డోర్ వేసేసి సెల్యూట్ చేస్తారు. తల΄ాగా చుట్టుకున్న డ్రైవర్ మన ఫోన్ తీసుకుని ఒక ఫొటో తీసిచ్చి ఆ తర్వాత కారు నడుపుతాడు. గంట కొట్టే కారుమ్యూజియం ఉద్యోగులు మేబాష్ కారును చూపిస్తూ ‘ఇది మేబాష్ తొలి కారు. ఈ కారును డిజైన్ చేసిన వ్యక్తి మనుమడు జర్మనీ నుంచి వచ్చి చెందిన 6 సిలిండర్ మేబాష్ కారును తనకు అమ్మవలసిందిగా కోరాడని, తన ఆటో ట్రెజరీ నుంచి అంత విలువైన కారును వదులుకోవడానికి ప్రాణ్లాల్ మనసు అంగీకరించలేదని చెబుతారు. ఈ మ్యూజియం అంతటినీ తిరిగి చూడాలంటే ఐదారు గంటలు పడుతుంది. సుడిగాలి పర్యటనలా చుట్టిరావాలన్నా కూడా మూడు గంటల సమయం పడుతుంది. గంట కొడుతూ ప్రయాణించే కారు చిన్న పిల్లలను ఆకట్టుకుంటుంది. ఇంజన్ మోడల్, చాసిటీ వంటి వివరాలు యువతను కట్టిపడేస్తాయి. ఇక్కడ పర్యటిస్తే ప్రపంచంలో మోటారు రంగం ఆవిర్భావం నుంచి నేటి వరకు పరిణామక్రమం అవగతమవుతుంది. దస్తన్ ఆటో వరల్డ్ వింటేజ్ మ్యూజియంలోకి ఎంట్రీ టికెట్ వంద రూపాయలు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో కాంప్లిమెంటరీ టీ ఇస్తారు. అహ్మదాబాద్ వెళ్లినప్పుడు గాంధీ ఆశ్రమం, సయ్యద్ సిద్ధిఖీ జాలీలతోపాటు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
అతి తెలివి.. నకిలీ కోర్టు పెట్టి కలెక్టర్ కే షాక్
-
సంస్కర్త స్మారకం: అక్షర్ధామ్
అక్షర్ధామ్.... ఆధ్యాత్మికతకు అర్థం చెప్పిన స్వామి నారాయణుడి ఆలయం. సమాజాన్ని ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, తాత్వికత వైపు నడిపించిన సంఘసంస్కర్త స్మారక మందిరమే అక్షర్ధామ్. స్వామి నారాయణుడు 18–19 శతాబ్దాల్లో సమాజంలో కరడుగట్టి ఉన్న సామాజిక దురాచారాలను పరిహరించడం కోసం పని చేశాడు. మనదేశం అప్పుడు స్థానికంగా హిందూ, ముస్లిం పాలకుల పాలనలో ఉంది. ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్ పాలన కింద మనుగడ సాగించాయి. ఈ సమ్మేళన సంస్కృతి ప్రభావం సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. అనేక మూఢ నమ్మకాలు, సామాజిక దురాచారాలు పెచ్చరిల్లిన నేపథ్యంలో మహిళలు ఆంక్షల వలయంలో చిక్కుకుపోయారు. భద్రత, మత విశ్వాసాల నిబంధనల కింద పేదవాళ్లు మహిళలు మగ్గిపోతున్న సమయంలో సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నతుడు స్వామి నారాయణుడు. ఆడపిల్లలను పురిట్లోనే ప్రాణాలు తీస్తున్న రోజుల్లో స్వామి నారాయణుడు సతి దురాచారాన్ని నియంత్రించడంతో΄ాటు మహిళలకు చదువు అవసరాన్ని చెప్పాడు. వివక్ష రహిత, హింస రహిత సమాజాన్ని స్థాపించడం కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాడు. ఒక సంఘ సంస్కర్త గౌరవార్థం నిర్మించిన క్షేత్రం కావడంతో ఇక్కడ వైదిక క్రతువులు ఉండవు. ఏకకాలంలో ఈ ఆవరణంలో వేలాదిమంది ఉన్నప్పటికీ రణగొణధ్వనులుండవు. నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అక్షర్థామ్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఆర్ట్, సైన్స్, కల్చర్, స్పిరిచువాలిటీల సమ్మేళనం. ఇది ఎక్కడుంది! గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉంది అక్షర్ధామ్. అహ్మదాబాద్ నుంచి 40 కి.మీ.లు ఉంటుంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఈ పింక్ సాండ్స్టోన్ నిర్మాణం... అందమైన శిల్పసౌందర్యానికి నిలయం. చక్కటి గార్డెన్లు, స్వామి నారాయణ్ జీవిత చరిత్ర, ఆయన తీసుకువచ్చిన సంస్కరణల ఇతివృత్తంలో సాగే చిత్ర ప్రదర్శన, పెయింటింగ్స్, శిల్పాలను చూసి తీరాల్సిందే. ఈ ఆలయంలో ప్రతి అంగుళం అత్యాధునికమైన సాంకేతికతను, ఆధ్యాత్మిక భావనను, క్రమశిక్షణను ప్రతిబింబిస్తుంది. అక్షర్ధామ్ను ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయాణ సమయం కాకుండా కనీసం మూడు గంటల సమయాన్ని కేటాయించుకోవాలి. అక్షర్ధామ్కి ఎంట్రీ ఫీజ్ లేదు కానీ ఎగ్జిబిషన్లు, వాటర్ షోలకు టికెట్ ఉంటుంది. వాటర్ షో ‘సత్ చిత్ ఆనంద్’ కథనం కఠోపనిషత్తు ఆధారంగా హిందీలో సాగుతుంది నెరేషన్. నచికేతుడికి యముడు వరాలివ్వడం వంటి ఉపనిషత్ సారాంశాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ మల్టీ కలర్ లేజర్స్, ఫైర్బాల్స్, అండర్ వాటర్ ఫ్లేమ్స్లో టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు. ఫొటో పాయింట్ అక్షర్ధామ్ లోపలికి మన కెమెరాలను అనుమతించరు, కానీ ఈ ఆవరణలో ఫొటో పాయింట్ దగ్గర కెమెరాతో ఒక ఫొటోగ్రాఫర్ ఉంటాడు. పర్యటనకు గుర్తుగా అక్షర్ధామ్ గోపురం కనిపించేటట్లు ఫొటో తీయించుకోవచ్చు. సావనీర్ షాప్లో పుస్తకాలు, ఫొటోలు, వీడియో సీడీలతోపాటు అక్షర్ధామ్ టీ షర్టులుంటాయి. ఫొటోలతో ఇంటిని నింపడం కంటే టీ షర్టు కొనుక్కోవడం మంచి ఆప్షన్. అక్షర్ధామ్ ఆవరణ మొత్తం తిరిగి చూసిన తర్వాత ఆశ్యర్యంగా అనిపించేదేమిటంటే... స్వామి నారాయణుడి జీవనశైలి అత్యంత నిరాడంబరంగా సాగింది. ఆయన స్మారక మందిరం మాత్రం సంపన్నతకు ప్రతిరూపంగా ఉంది. అభిషేకం చేయవచ్చు! అక్షర్ధామ్లో పర్యాటకులు అందరూ స్వామి నారాయణ్కి అభిషేకం చేయవచ్చు. అభిషేక మండపంలో పూలు, ఆకులతో నీటి చెంబులను వరుసగా పేర్చి ఉంటారు. టికెట్ తీసుకుని మౌనంగా క్యూలో వెళ్లి అభిషేకం చేయాలి. ఇక్కడ నియమాలు చాలా కచ్చితంగా ఉంటాయి. కానీ హ్యూమన్ ఫ్రెండ్లీగానే ఉంటాయి. డ్రెస్ కోడ్ విషయంలో ఇండియన్, వెస్ట్రన్ అనే నియమాలేవీ ఉండవు. కానీ భుజాలు, ఛాతీ, నాభి, భుజాల నుంచి మోచేతుల వరకు, మోకాళ్ల కింది వరకు కవర్ అయ్యే డ్రెస్లను మాత్రమే అనుమతిస్తారు. మనం ధరించిన డ్రస్ వాళ్ల నియమాలకు లోబడి లేకపోతే మూడు వందల రూపాయలు డిపాజిట్ చేయించుకుని సరోంగ్ అనే డ్రస్ను ఇస్తారు. మన దుస్తుల మీద దానిని ధరించాలి. డ్రస్ వెనక్కి ఇచ్చినప్పుడు మన డబ్బు ఇచ్చేస్తారు. ఫోన్లు, కెమెరాలు, పెన్డ్రైవ్లు, మ్యూజిక్ డివైజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, ఆయుధాలు, ఆటబొమ్మలు, లగేజ్, పెట్లు, ఆహార పానీయాలు, పొగాకు ఆల్కహాల్ ఇతర నిషేధిత డ్రగ్స్కు అనుమతి ఉండదు. చంటి పిల్లలతో వెళ్లే వాళ్లకు పాలు, ఆహారం, నీళ్ల సీసాలను అనుమతిస్తారు. వికలాంగులకు, వృద్ధులకు వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. -
22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు
భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు రూట్లలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్, కాచిగూడ-యశ్వంత్పూర్-కాచిగూడ, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు సైతం రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.తాజాగా వందే భారత్ రైళ్లకు తోడు వందే భారత్ మెట్రో రైళ్లు, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16వ తేదీన తొలి వందే భారత్ మెట్రో రైలు పట్టాలు ఎక్కనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి భుజ్ మధ్య ప్రయాణించనున్న తొలి వందే భారత్ మెట్రో రైలును..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.ఈ రైలు దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండగా.. వాటి కంటే సుదూర ప్రయాణాలకు ఉపయోగించనున్నారు. అహ్మదాబాద్-భుజ్ మధ్య 334 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 45 నిమిషాల్లోనే ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణించనుంది. భుజ్ రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున 5.50 గంటలకు ప్రారంభమై.. ఉదయం 10.50 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుకోనుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు అహ్మదాబాద్లో ప్రారంభమై.. రాత్రి 11.10 గంటలకు భుజ్ చేరుకోనుంది. వారంలో 6 రోజులు ఈ వందే భారత్ మెట్రో రైలు ప్రయాణం చేయనుంది. ఇక భుజ్-అహ్మదాబాద్ మార్గంలో ఈ రైలుకు 9 స్టాప్లు ఉండగా.. ప్రతీ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుందని భారతీయ రైల్వే తెలిపింది.వందే భారత్ మెట్రో అనేది సెమీ-హై-స్పీడ్ రైలు. ఇది గంటకు 100 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది. వందే భారత్ రైలు లాగానే ఈ రైలు కూడా పూర్తిగా ఎయిర్ కండీషన్ కలిగి ఉంటుంది. మొదట 12 కోచ్లతో ప్రారంభం కానున్న ఈ వందే భారత్ మెట్రో రైలుకు.. ప్రయాణికుల రద్దీ దృష్టా వాటిని 16 కోచ్లకు పెంచనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ రైళ్లకు ప్రత్యేకమైన కోచ్ కాన్ఫిగరేషన్ ఉండనుండగా.. నాలుగు కోచ్లు ఒక యూనిట్గా ఉంటాయి. ఇందులో మన మెట్రో రైలు లాగా ఆటోమేటిక్ డోర్లు ఉండటం మరో ప్రత్యేకత. ఈ వందే భారత్ మెట్రో రైలును గంటకు 100 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా రూపొందించారు.ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో రైలు డ్రైవర్తో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి కోచ్లో మంటలు, పొగ వంటి ప్రమాదాన్ని వెంటనే గుర్తించేలా మొత్తం 14 సెన్సార్లతో కూడిన సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. దివ్యాంగుల కోసం కోచ్లలో వీల్చైర్ యాక్సెస్ కలిగిన టాయిలెట్లు ఏర్పాటు చేశారు. -
రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్
భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్.. యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్సెట్టర్గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.#WATCH | Kerala: On investment in India, Chairman & Managing Director of Lulu Group International, Yusuffali M. A. says, "...I am very happy to give employment to my fellow citizens...India's biggest shopping mall is in Ahmedabad...I am getting full support from the central… pic.twitter.com/PFsxwVRRu3— ANI (@ANI) September 8, 2024 -
ఫైనల్లో దబంగ్ ఢిల్లీ
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఢిల్లీ 8–6తో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్పై విజయం సాధించింది. శనివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్తో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. తొలి పురుషుల సింగిల్స్లో సత్యన్ జ్ఞానశేఖరన్ 1–2 (4–11, 11–5, 5–11)తో లిలియాన్ బార్డెట్ చేతిలో ఓడిపోగా, మహిళల సింగిల్స్లో ఒరవన్ పరనగ్ 3–0 (11–7, 11–9, 11–9)తో బెర్నడెట్ సాక్స్పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో ఒరవన్–సత్యన్ జోడీ 0–3 (9–11, 7–11, 9–11)తో బెర్నడెట్ సాక్స్–మానుశ్ షా ద్వయం చేతిలో ఓడింది. రెండో పురుషుల సింగిల్స్లో అండ్రియస్ లెవెంకొ 2–1 (11–8, 10–11, 11–8)తో మానుశ్ షాపై గెలుపొందాడు. గేమ్ల పరంగా ఇరుజట్ల స్కోరు 6–6తో సమం కాగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్లోకి దిగిన ఢిల్లీ ప్లేయర్ దియా చిటాలే వరుస గేమ్లు గెలిచి జట్టును గెలిపించింది. ఆమె 2–0 (11–8, 11–4)తో రీత్ రిష్యాపై నెగ్గడంతో దబంగ్ ఢిల్లీ విజయం ఖాయమైంది. -
ఇక్కడ ఇళ్లు కొనడం సాధ్యమే!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల ఇళ్లకు చిరునామాగా చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా నగరాలు నిలుస్తున్నాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), ఢిల్లీ నగరాలు మాత్రం ఇళ్ల కొనుగోలు పరంగా ఖరీదైనవని ప్రాప్టెక్ సంస్థ మ్యాజిక్బ్రిక్స్ వెల్లడించింది. ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరల తీరుపై ఒక నివేదిక విడుదల చేసింది. ఓ ఇంటి వార్షిక ఆదాయం నుంచి ఇంటి ధర (పీఐ రేషియో) నిష్పత్తి 2020లో ఉన్న 6.6 శాతం నుంచి 2024లో 7.5 శాతానికి పెరిగింది. అంటే ఓ ఇంటి వారందరూ ఏడున్నరేళ్లు కష్టపడి సంపాదించినంతా వెచ్చిస్తే కానీ ఇల్లు సమకూర్చుకోలేని పరిస్థితి. పీఐ రేషియో చెన్నై, అహ్మదాబాద్, కోల్కతాలో 5 చొప్పున ఉంది. అందుకే ఇక్కడి ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఎంఎంఆర్లో 14.3గా ఉంటే, ఢిల్లీలో 10.1గా ఉంది. అంటే ఇక్కడ ఇళ్ల ధరలు ఖరీదుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈఎంఐ – నెలవారీ ఆదాయం రేషియో 2020లో ఉన్న 46 శాతం నుంచి 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. అంటే నెలవారీ వేతనంలో ఈఎంఐ వాటా 61 శాతానికి చేరింది. ఇళ్ల కొనుగోలుదారులపై పెరిగిన ఈఎంఐ భారాన్ని ఇది సూచిస్తోంది. నెలవారీ ఆదాయంలో ఈఎంఐ రేషియో ఢిల్లీలో 82 శాతం, ఎంఎంఆర్లో 116 శాతంగా ఉంది. హైదరాబాద్, గురుగ్రామ్లో 61 శాతం చొప్పున ఉంది. అహ్మదాబాద్, చెన్నైలో 41 శాతంగా, కోల్కతాలో 47 శాతంగా ఉంది. అసాధారణంగా పెరిగిన ధరలు 2021 ద్వితీయ ఆరు నెలలతోపాటు 2022లోనూ ఇళ్ల ధరలు ఎంతో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, గృహ ఆదాయాలు తిరిగి పుంజుకోవడంతో ఈ కాలంలో ఇళ్ల ధరలు తిరిగి పుంజుకున్నాయి. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. దీంతో ఇళ్ల ధరలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. దీంతో అందుబాటు ధరల ఇళ్ల కొనుగోలు పరంగా సవాళ్లను తీసుకొచి్చంది’’అని మ్యాజిక్బ్రిక్స్ సీఈవో సు«దీర్ పాయ్ పేర్కొన్నారు. -
డెలివరీ ఏజెంట్కు సర్ప్రైజ్
బంధువులతో కలిసి పార్టీ.. ఆత్మ బంధువుల బర్త్డే.. వేడుక ఏదైనా మనకు టైమ్కు ఫుడ్ డెలివరీ చేసి మన సంతోషంలో భాగస్వాములవుతారు డెలివరీ ఏజెంట్. వాళ్ల కష్టాన్ని చాలాసార్లు గుర్తించం. కానీ.. తమకోసం ఫుడ్ తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసి అతని సంతోషాన్ని రెట్టింపు చేశారు కొందరు యువకులు. వారం కిందట అహ్మదాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నగరానికి చెందిన యశ్ షా జొమాటోలో ఫుడ్ ఆర్డర్చేశాడు. ఆర్డర్ డీటెయిల్స్ చూస్తుండగా.. భారీ వర్షం వల్ల డెలివరీ లేట్ అవుతుందని ఉంది. దాంతో పాటు.. డెలివరీ బాయ్ అయిన షేక్ ఆకిబ్ బర్త్డే అని కూడా కనిపించింది. డెలివరీ ఏజెంట్ తన బర్త్డే రోజు వర్షంలో తడుస్తూ పనిచేస్తున్నాడని గ్రహించి, ఏజెంట్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. ఆర్డర్తో వచ్చిన అతడికి ఫ్రెండ్స్తో కలిసి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ విష్ చేశారు. అంతేకాదు చిన్న కానుకను కూడా అందజేశారు. ఊహించని ఈ వేడుకకు డెలివరీ ఏజెంట్ చలించిపోయాడు. చిరునవ్వుతో వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ దృశ్యం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన యశ్.. ‘మీకు చేతనైనంత వరకు ఆనందాన్ని పంచండి. మాకు అవకాశం ఇచ్చినందుకు జొమాటోకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూస్, లెక్కలేనన్ని లైక్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, డెలివరీ ఏజెంట్ షేక్ ఆకిబ్ కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపారు. – అహ్మదాబాద్ -
UTT 2024: అహ్మదాబాద్కు రెండో విజయం
చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్లో కొత్త జట్టు అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ రెండో విజయం అందుకుంది. యు ముంబా టీటీ జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో అహ్మదాబాద్ జట్టు 9-6 పాయింట్ల తేడాతో గెలిచింది. తొలి మ్యాచ్లో మనుశ్ షా (అహ్మదాబాద్) 2-11, 9-11, 11-8తో మానవ్ ఠక్కర్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్లో రీత్ రిష్యా (అహ్మదాబాద్) 5-11, 11-8, 11-7తో సుతీర్థ ముఖర్జీపై నెగ్గింది. మూడో మ్యాచ్లో మనుశ్-బెర్నాడెట్ జాక్స్ ద్వయం 11-4, 11-8, 11-8తో మానవ్-మరియా జియో జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్లో లిలియన్ బార్డెట్ (అహ్మదాబాద్) 5-11, 11-9, 9-11తో ఖాద్రీ అరునా చేతిలో ఓటమి చవిచూశాడు. ఐదో మ్యాచ్లో బెర్నాడెట్ జాక్స్ 9-11, 11-4, 11-6తో మరియా జియోపై గెలిచి అహ్మదాబాద్కు విజయాన్ని ఖరారు చేశాడు. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో ప్రస్తుతం అహ్మదాబాద్ జట్టు 24 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. -
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్లోని రామ్గఢ్కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
20 కోచ్ల వందేభారత్.. ట్రయల్ రన్ విజయవంతం
అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్ రైలు పేరొందింది. ఇప్పుడు మరో వందేభారత్ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్కు అదనంగా నాలుగు కోచ్లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్ రైలు పరుగులు తీయనుంది. శుక్రవారం నాడు అహ్మదాబాద్- ముంబై మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్కు చేరుకుంది.తిరిగి మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి. -
ఇంటి కొనుగోలు భారం ఇక్కడ తక్కువ...! హైదరాబాద్ టాప్ సెకెండ్
దేశంలో ఎక్కడ ఇళ్ల కొనుగోలు భారం (అఫర్డబులిటీ) తక్కువ అనేదానిపై నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. 2024 ప్రథమార్ధంలో అగ్రశ్రేణి ఎనిమిది నగరాల్లో అఫర్డబులిటీ స్థిరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. 2023 చివరి నుంచి స్థిరంగా ఉన్న వడ్డీ రేట్ల ఆధారంగా ఈ అఫర్డబులిటీని నిర్ధారించారు.ఎనిమిది నగరాల్లో కుటుంబాలు తమ ఆదాయంలో ఇంటి ఈఎంఐ కోసం ఎంత శాతం వెచ్చిస్తున్నారన్న దాని ఆధారంగా నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ను రూపొందించింది. ఇది ఈఎంఐ-టు-ఇన్కమ్ నిష్పత్తిని సూచిస్తుంది.ఇందులో అహ్మదాబాద్ 21% నిష్పత్తితో అత్యంత సరసమైన హౌసింగ్ మార్కెట్గా ఉద్భవించింది. పుణె, కోల్కతా 24% నిష్పత్తితో దగ్గరగా ఉన్నాయి. మరోవైపు ముంబై 51% నిష్పత్తితో అతి తక్కువ సరసమైన నగరంగా నిలిచింది. దీని తర్వాత 51% నిష్పత్తితో హైదరాబాద్ అతి తక్కువ సరసమైన నగరంగా ఉంది. ఒక నగరంలో నైట్ ఫ్రాంక్ అఫర్డబులిటీ సూచిక స్థాయి 40% అంటే, సగటున ఆ నగరంలోని కుటుంబాలు గృహ రుణ ఈఎంఐ కోసం వారి ఆదాయంలో 40% ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది 50% కంటే ఎక్కువ ఉంటే భరించలేనిదిగా పరిగణిస్తారు.2019 నుంచి అన్ని మార్కెట్లలో మొత్తం అఫర్డబులిటీ మెరుగుపడింది. అయితే అహ్మదాబాద్లో 5% నుంచి హైదరాబాద్లో 26% వరకు మొదటి ఎనిమిది మార్కెట్లలో ధరలు పెరిగాయి. 2019 నుంచి అఫర్డబులిటీ 15 శాతం పాయింట్ల మేర కోలుకోవడంతో ముంబై అఫర్డబులిటీలో గణనీయ పెరుగుదలను నమోదు చేసింది.కోల్కతా మార్కెట్ స్థోమత 2019లో 32% నుండి H1 2024లో 24%కి మెరుగుపడింది. ఎన్సిఆర్ మరియు బెంగళూరులో స్థోమత స్థాయిలు అదే కాలంలో 6 శాతం పాయింట్లు పెరిగాయి. -
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో అమెరికా, కెనడా, థాయ్లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్లు, క్యాండీ విటమిన్లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్?!
ఐపీఎల్-2024 ఆరంభంలో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఊహించని విజయాలతో ప్లే ఆఫ్స్నకు దూసుకువచ్చింది. లీగ్ దశలో వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిన తర్వాత కూడా ఏమాత్రం డీలాపడకుండా.. పట్టుదలగా పోరాడి టాప్-4లో స్థానం సంపాదించింది.ఆరు మ్యాచ్లలో వరుసగా గెలుపొంది రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఉగ్ర ముప్పు పొంచి ఉందనే సందేహాల నడుమ విరాట్ కోహ్లి భద్రతా కారణాల దృష్ట్యా ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ బజార్ పత్రిక, హిందుస్థాన్ టైమ్స్ కథనం వెల్లడించింది. అహ్మదాబాద్లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.అతడు జాతీయ నిధిఈ మేరకు.. ‘‘అహ్మదాబాద్ చేరుకోగానే ఈ విషయం గురించి విరాట్ కోహ్లికి తెలిసింది. అతడు జాతీయ నిధి. అతడి భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం. ఆర్సీబీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.వాళ్లకు ఈ విషయం చెప్పిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసుకున్నట్లు తెలిపింది. రాజస్తాన్ రాయల్స్కు కూడా ఈ విషయం గురించి తెలిసింది. అయితే, వాళ్లు యథాతథంగా ప్రాక్టీస్ చేశారు’’ అని పోలీస్ అధికారి విజయ్ సంఘా పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.ఈ క్రమంలోనే గుజరాత్ కాలేజీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్సీబీ తమ ప్రాక్టీస్ సెషన్తో పాటు ప్రీ- ప్రెస్మీట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందుకు ఉగ్ర ముప్పు కారణం కాదని తెలుస్తోంది.భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు.. కారణం అదే‘‘భద్రతకు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. అంతగా సమస్య ఉందనుకుంటే ఇండోర్లో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించుకోవచ్చని వాళ్లకు చెప్పాము. అయితే, వేడిమి తట్టుకోలేకమంటూ వాళ్లు సెషన్ రద్దు చేసుకున్నారు’’ అని అహ్మదాబాద్ స్టేడియం వద్ద పనిచేసే సిబ్బంది తెలిపినట్లు ఇండియా టుడే వెల్లడించింది. కారణాలు ఏమైనా మొత్తానికి కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ చేయలేదన్నది స్పష్టమైంది. ఒక రకంగా ఇది ఎదురుదెబ్బ లాంటిదే!చదవండి: RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం -
మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ‘పారిపోయిన’ ధోని! వైరల్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి మిస్టర్ కూల్ అని నిరూపించుకున్నాడు. మ్యాచ్ మధ్యలో మైదానంలోకి దూసుకువచ్చిన అభిమానిని ఆలింగనం చేసుకుని సాదరంగా వీడ్కోలు పలికాడు.గుజరాత్ టైటాన్స్- సీఎస్కే మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ రేసు ఆశలను సజీవం చేసుకునే క్రమంలో ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడ్డాయి.సొంతమైదానంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఓపెనర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.శతకాల మోతసాయి సుదర్శన్(103), శుబ్మన్ గిల్(104) శతకాల మోతతో నరేంద్ర మోదీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టాపార్డర్ కుప్పకూలగా.. మిడిలార్డర్ ఆదుకుంది. కానీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు మాత్రమే చేసిన చెన్నై జట్టు టైటాన్స్ ముందు తలవంచింది. 35 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోని 11 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్ తొలి రెండు బంతుల్లో సిక్సర్లు బాది ధోని జోరు మీద ఉండగా... మూడో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీలు చేసింది ప్రత్యర్థి జట్టు. కానీ బాల్ వికెట్స్ మిస్ చేసినట్లుగా తేలడంతో ధోని నాటౌట్గా నిలిచాడు.పాదాలకు నమస్కరించగానేఅయితే, ఇదే సమయంలో ఓ యువకుడు మైదానంలోకి దూసుకువచ్చాడు. అతడి రాకను గమనించిన ధోని తొలుత దూరంగా పారిపోతున్నట్లు నటించాడు. అతడు వచ్చి పాదాలకు నమస్కరించగానే భుజం తట్టిలేపి ఆలింగనం చేసుకుని ఇక వెళ్లు అన్నట్లుగా కూల్గా డీల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తలా క్రేజ్, ఫ్యాన్స్ పట్ల అతడు వ్యవహరించే తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.చదవండి: కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా! పాపం..Best moments of IPL 🥹💛That Hug and That smile Mahi The Man The Myth The Legend 🥰 Demi God for Millions of Indians 🇮🇳 Ms Dhoni 🐐 #DHONI𓃵#ChennaiSuperKings#CSKvGT #Ahmedabad #TATAIPL2024 #T20WorldCup2024 pic.twitter.com/m8MA8YdKzh— Srinivas Mallya🇮🇳 (@SrinivasMallya2) May 11, 2024Ms Dhoni knows exactly how to make the stadium roar with his mass entry 🥹🔥🔥#CSKvsGT | #DHONI𓃵pic.twitter.com/U5DA5meNaw— 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) May 10, 2024The Helicopter Shot 🚁A maximum from #CSK's Number 7️⃣💥Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvCSK pic.twitter.com/2QAN3jPjTb— IndianPremierLeague (@IPL) May 10, 2024 -
అహ్మదాబాద్లో స్కూళ్లకు బాంబు బెదిరింపులు
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సోమవారం పలు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు కలకాలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు యాత్రాంగం, బాంబ్ స్క్వాడ్స్ బెదిరింపులు వచ్చిన అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాయి. అయితే ఎటువంటి బాంబులు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. సియా గురుకుల పాఠశాల, థాల్తేజ్లోని ఆనంద్ నికేతన్, డీసీఎస్ బోపాల్, మెమ్నగర్లోని హెచ్బీకే పాఠశాల, థాల్తేజ్లోని జెబార్ పాఠశాల, ఎస్జీ రోడ్డులోని కాస్మోస్ క్యాజిల్ ఇంటర్నేషనల్ స్కూల్, చంద్ఖేడా, షాహిబాగ్ కంటోన్మెంట్లోని రెండు కేంద్రీయ విద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులను ఖాళీ చేయించాయి.ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసు కమినిషనర్ జీఎస్ మాలిక్ మాట్లాడుతూ.. రష్యన్ సర్వర్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. అరబిక్లో భాషా పదాలలో బాంబు బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపు మెయిల్స్పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గుజరాత్లో ఎన్నికల పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఇటీవల ఢిల్లీ పరిధిలోని దాదాపు 200 స్కూళ్లకు బాంబు బెదిరింపు మియిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్ వేపై నిలిపి ఉంచిన ట్రక్కుపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. ఖేడా జిల్లాలోని నదియాడ్ పట్టణం సమీపంలో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. అతివేగం కారణంగా మారుతీ సుజుకి ఎర్టిగా కారు అదుపుతప్పి ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. బాధితులు వడోదర నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో 93 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్వేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చదవండి: ‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్నాథ్ ఫైర్ -
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
IPL 2024: ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారు
ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియాన్ని వేదిగా నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లు అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్కు వేదిక కాదని తేలిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుందని తెలుస్తుంది. మరో ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లు చెన్నైలో జరుగనున్నట్లు సమాచారం. ఫైనల్ మ్యాచ్ తేదీపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఫైనల్ తేదీ, వేదికలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోం గ్రౌండ్లోనే ఆరంభ మరియు ఫైనల్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఇదే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ సీజన్కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం భారత్లోనే అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం కావడంతో ఇక్కడ ఫైనల్ జరిగితే బాగుంటుందని కొందరు పెద్దలు అభిప్రాయపడినప్పటికీ.. గవర్నింగ్ బాడీ అంతిమంగా చెన్నైనే ఫైనల్ చేసినట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇవాళ (మార్చి 24) మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్, లక్నో జట్లు (జైపూర్) తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్, ముంబై ఇండియన్స్ (అహ్మదాబాద్) ఢీకొట్టనున్నాయి. -
గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి.. ఇద్దరు అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులపై కొందరు దాడికి దిగారు. క్యాంపస్లోని ఎ–బ్లాక్ హాస్టల్లో విదేశీ విద్యార్థులు కొందరు శనివారం రాత్రి నమాజ్ చేస్తుండగా ముగ్గురు విద్యార్థులు అడ్డుకున్నారు. వారికి మరో 200 మంది తోడై విధ్వంసం సృష్టించారు. రాళ్లు రువ్వడంతో శ్రీలంక, తజికిస్తాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసులు పెట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పునరావృతం కానివ్వబోమని వీసీ నీరజా అరుణ్ గుప్తా స్పష్టం చేశారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ పేర్కొంది. -
రైలు పట్టాలపై జీవితం ఆరంభించా: ప్రధాని మోదీ
అహ్మదాబాద్/పోఖ్రాన్: రైలు పట్టాలపైనే తన జీవితాన్ని ప్రారంభించానని, రైల్వే శాఖకు సంబంధించిన కష్టాలు, ప్రయాణికుల ఇబ్బందులన్నీ తనకు తెలుసని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నరకం లాంటి పరిస్థితి నుంచి రైల్వేలను బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రైల్వే రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వాలు రైల్వేశాఖ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని, సొంత రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాయని విమర్శించారు. 21వ శతాబ్దంలో రైల్వేల ప్రగతిని దృష్టిని పెట్టుకొని రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్లో విలీనం చేశామని వెల్లడించారు. తద్వారా రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించారు. సబర్మతి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.1,06,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.85,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. పది నూతన వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్–విశాఖపట్నం, పూరీ–విశాఖపట్నం వందేభారత్ రైళ్లు కూడా ఉన్నాయి. తిరుపతి–కొల్లాం స్టేషన్ల మధ్య కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాదు 2004–2014తో పోలిస్తే గత పదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 6 రెట్లు అధికంగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి అన్నారు. గతంలో రైళ్లు ఆలస్యంగా నడవడం అనేది సాధారణ వ్యవహారంగా ఉండేదన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 35 శాతం రైల్వే లైన్లు విద్యుదీకరణకు నోచుకున్నాయని గుర్తుచేశారు. రైళ్లలో ప్రయాణానికి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టంగా ఉండేదని, టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిల్చునేవారని, ఏజెంట్లు కమీషన్లు వసూలు చేసేవారని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. దేశ ప్రగతి అనే మిషన్లో భాగంగానే అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు చేపడుతున్నామని, అంతేతప్ప కొందరు ఆరోపిస్తున్నట్లు ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతమాత్రం కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారసత్వ సంపదను కాపాడుకోవాలి సొంత వారసత్వ సంపదను కాపాడుకోని దేశానికి భవిష్యత్తు ఉండదని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. మన దేశ వారసత్వ సంపదను కాపాడే విషయంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం నిబద్ధత చూపలేదని విమర్శించారు. మంగళవారం అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో దండి యాత్ర వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. రూ.1,200 కోట్లతో అమలు చేయనున్న గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ మాస్టర్ప్లాన్ను ప్రారంభించారు. ఆధునీకరించిన కోచ్రాబ్ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఆరంభించిన సబర్మతి ఆశ్రమం కేవలం మన దేశానికే కాదు, మొత్తం మానవాళికే వారసత్వ సంపద అని తేల్చిచెప్పారు. పోఖ్రాన్లో అబ్బురపర్చిన ‘భారత్ శక్తి’ భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి పోఖ్రాన్ ఒక ఘనమైన సాక్షి అని ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు. రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రాన్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం భారత త్రివిధ దళాలు ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ విన్యాసాలను మోదీ ప్రత్యక్షంగా తిలకించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, రక్షణ పరికరాల విన్యాసాలు చూపరులను అబ్బురపర్చాయి. తేజస్, ఏఎల్ఎస్ ఎంకే–4 యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు అర్జున్, కె–9 వజ్ర, ధనుష్ వంటివి ఆకట్టుకున్నాయి. పినాకా ఉపగ్రహ వ్యవస్థతోపాటు డ్రోన్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఆకాశంలో మన యుద్ధ విమానాల గర్జనలు, నేలపై మన జవాన్ల సాహసాలు నవ భారత్(న్యూ ఇండియా)కు ఆహ్వానం పలుకుతున్నామని మోదీ పేర్కొన్నారు. -
స్ట్రీట్ కేఫ్లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్లు ఉన్న పరికరంతో కాన్వాస్పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్వీర్సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్వీర్సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన కత్రికి ఇన్స్టాగ్రామ్లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
రెయిలింగ్ను ఢీకొని బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి!
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు రోడ్డుపైనున్న రెయిలింగ్ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందనున్న ప్రదేశంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై ప్రయాణీకులతో వెళుతున్న ఒక బస్సు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొని, 25 అడుగులు కిందికి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎస్పీ సహా పోలీసు సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ రాజేష్ గధియా మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన బస్సు అహ్మదాబాద్ నుంచి పూణె వెళుతోందని తెలిపారు. బస్సులో దాదాపు 23 మంది ప్రయాణికులు ఉన్నారు. హైవేపై అకస్మాత్తుగా ఎడమవైపు నుంచి వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు అదుపు తప్పి, రెయిలింగ్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామన్నారు. #WATCH | Nadiad: SP Rajesh Gadhiya says, "...The bus was going from Ahmedabad to Pune in which there were about 23 passengers. The driver of a cement tanker suddenly turned left and hit the bus...Two people have died & several people have been injured...A case will be filed… https://t.co/B9DKPMKTf5 pic.twitter.com/LrSFa3AepN — ANI (@ANI) February 23, 2024 -
INDA Vs ENGA: భారత జట్టులో తిలక్, రింకూలకు చోటు: బీసీసీఐ ప్రకటన
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్తో ఆఖరి రెండు మ్యాచ్లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్తో పోటీ పడనున్న ఈ టీమ్లో తిలక్ వర్మ, రింకూ సింగ్లకు కూడా చోటు దక్కింది. కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది. ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్లలో ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. తిలక్ రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్లన్నీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ లయన్స్తో రెండో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. ఇంగ్లండ్ లయన్స్తో మూడో మ్యాచ్కు భారత్- 'ఏ' జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్దీప్ సింగ్, తుషార్ దేశ్పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్. చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం? -
అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ..
రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు. అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేశారు. తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని, ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని, వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది. దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలతో సమావేశమవుతారని విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాన గ్లోబల్ కార్పొరేషన్ల సీఈవోలతో ప్రధాని భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ‘గిఫ్ట్ సిటీ’ని సందర్శించనున్నారు. గ్లోబల్ ఫిన్టెక్ లీడర్షిప్ ఫోరమ్లో వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్ గాంధీనగర్లో 2024, జనవరి 10 నుండి 12 వరకు జరగనున్నదని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తెలియజేసింది. ఈ కార్యక్రమం థీమ్ ‘గేట్వే టు ది ఫ్యూచర్’. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు పాల్గొననున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 9న ఉదయం 9:30 గంటలకు గాంధీనగర్లోని మహాత్మా మందిరానికి చేరుకుంటారు. అక్కడ ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. దీని తర్వాత గ్లోబల్ టాప్ కంపెనీల సీఈవోలతో సమావేశమవుతారు. Landed in Ahmedabad a short while ago. Over the next two days, will be taking part in the Vibrant Gujarat Summit and related programmes. It is a matter of immense joy that various world leaders will be joining us during this Summit. The coming of my brother, HH @MohamedBinZayed… pic.twitter.com/Ygaajg4TfM — Narendra Modi (@narendramodi) January 8, 2024 -
అహ్మదాబాద్ : ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ (ఫొటోలు)
-
వన్డే వరల్డ్కప్ ఫైనల్ పిచ్కు ఐసీసీ రేటింగ్.. ఎంతంటే?
వన్డే ప్రపంచకప్-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో భారత్ను ఓడించి ఆరోసారి విశ్వవిజేతగా ఆసీస్ నిలిచింది. ఈ మెగా టోర్నీలో వరుసగా పది మ్యాచ్లు గెలిచిన టీమిండియా.. ఆఖరి మొట్టుపై బోల్తా పడింది. ఇక ఇది ఇలా ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ఫైనల్, సెమీఫైనల్ కు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు రేటింగ్ ఇచ్చింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా పిచ్ కు యావరేజ్ రేటింగ్ పాయింట్లు ఇచ్చింది. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. కాగా ఫైనల్ మ్యాచ్ పిచ్పై టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండడంతో ఆసీస్కు బ్యాటింగ్ సులభమైంది. ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్ పిచ్ కు గుడ్ రేటింగ్ దక్కింది. ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ రేటింగ్ ఇచ్చారు. అయితే రెండో సెమీఫైనల్కు వేదికైన ఈడెన్ గార్డెన్స్ పిచ్కు కూడా ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. లో స్కోరింగ్ థ్రిల్లర్లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. వరల్డ్ కప్ 2023లో టీమిండియా ఆడిన 11 మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ వచ్చింది. చదవండి: IPL 2024-Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు షమీ గుడ్బై..? -
అయోధ్య ధ్వజ స్థంభాల నిర్మాణం జరుగుతోందిలా..
నూతన సంవత్సరం రాకకు మరికొద్ది రోజులే మిగిలివున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే రోజు ఎంతో దూరంలో లేదు. 2024, జనవరి 22.. దేశప్రజలకు ప్రత్యేకమైన రోజు. నాడు జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం, రాముని విగ్రహ ప్రతిష్ణాపన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్లోని అహ్మదాబాద్లో రామమందిరం కోసం ఏడు ధ్వజ స్తంభాల నిర్మాణం జరుగుతోంది. వీటికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అయోధ్యలోని రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల నిర్మాణ పనులను అహ్మదాబాద్లోని అంబికా ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి అప్పగించారు. ఈ ఏడు ధ్వజ స్తంభాల బరువు సుమారు 5,500 కిలోలు. కంపెనీ ఎండీ భరత్ మేవాడ మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలోని నూతన రామాలయం కోసం వినియోగించే ధ్వజ స్తంభాల తయారీ పని తమకు అప్పగించారని, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. వీటిలో 5,500 కిలోల బరువున్న ఒక ప్రధాన ధ్వజ స్తంభంతో సహా ఏడు ఇతర ధ్వజ స్తంభాలు ఉన్నాయని భరత్ తెలిపారు. మరోవైపు రామమందిరం చుట్టూ 800 మీటర్ల పొడవున నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చివరి దశలో ఉంది. ఆలయ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ప్రాకారాలలో నుంచే కాకుండా రింగ్రోడ్డు మార్గం నుంచి కూడా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఆలయంలోని నేలను పాలరాతితో తీర్చిదిద్దుతున్నారు. 60 శాతం మేరకు ఫ్లోర్లో మార్బుల్ను అమర్చారు. అలాగే ఆలయ నృత్య మండపంతోపాటు రంగ మండపానికి సంబంధించిన శిఖరం సిద్ధమైంది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి #WATCH | Gujarat: Construction of 7 flag poles for the Ram temple in Ayodhya is underway in Ahmedabad. (04.12) pic.twitter.com/GkPCQudVoq — ANI (@ANI) December 5, 2023 -
వరల్డ్కప్ ఓటమిపై వివరణ అడిగిన బీసీసీఐ.. ద్రవిడ్ ఆన్సర్ ఇదే!?
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ నియంత్రణ మండలికి వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా ద్రవిడ్ అహ్మదాబాద్ పిచ్ తయారు చేసిన విధానం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచకప్ ఫైనల్లో పరాజయంతో రోహిత్ సేనతో పాటు కోట్లాది అభిమానుల హృదయాలు ముక్కలైన విషయం తెలిసిందే. లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది గెలిచి.. సెమీస్లోనూ సత్తా చాటిన భారత జట్టు తుదిపోరులో మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగుదూరంలో నిలిచిపోయింది. సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత ట్రోఫీ గెలుస్తుందని ధీమాగా ఉన్న రోహిత్ సేనకు షాకిచ్చిన ఆసీస్ ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆసీస్తో ఫైనల్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ రాహుల్ ద్రవిడ్, రోహిత శర్మను వివరణ అడిగినట్లు దైనిక్ జాగరణ్ తాజాగా కథనం వెలువరించింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం.. బీసీసీఐ సమావేశానికి రాహుల్ ద్రవిడ్ ప్రతక్ష్యంగా హాజరు కాగా.. కుటుంబంతో పాటు లండన్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ వీడియో కాల్ ద్వారా అటెండ్ అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి రాజీవ్ శేఖర్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో.. టీమిండియా వైఫల్యం గురించి ద్రవిడ్, రోహిత్ శర్మను వివరణ కోరారు. ఇందుకు బదులుగా.. నరేంద్ర మోదీ స్టేడియంలో తయారు చేసిన స్లో ట్రాక్ తమ అవకాశాలను దెబ్బకొట్టిందని ద్రవిడ్ సమాధానమిచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ ఊహించినట్లుగా పిచ్ నుంచి సహకారం అందలేదని.. బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడం ప్రభావం చూపిందని ద్రవిడ్ తెలిపాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్ మాయాజాలంతో తిప్పలు పెట్టాలన్న వ్యూహాలు ఫలించలేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా మోదీ స్టేడియంలో నవంబరు 19న టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లి 54, కేఎల్ రాహుల్ 66 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ను ఓపెనర్ ట్రవిస్ హెడ్ 137 పరుగులతో రాణించి విజయతీరాలకు చేర్చాడు. తద్వారా కంగారూ జట్టు మరోసారి వన్డే వరల్డ్కప్ చాంపియన్గా నిలిచింది. చదవండి: Ind vs Pak: మెగా క్రికెట్ టోర్నీ షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే -
చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై
ప్రపంచంలో తక్కువ ఖర్చుతో బతుకు వెళ్లదీయగల పెద్ద నగరాల్లో మన దేశానికి చెందిన రెండు సిటీలు అహ్మదాబాద్, చెన్నైలకు చోటు దక్కింది. ప్రఖ్యాత ‘ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల్లోని పెద్ద నగరాలను ఎంపిక చేసి, సర్వే నిర్వహించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాల్లో నిత్యావసరాల నుంచి ఇంటి అద్దెల దాకా వివిధ ధరలను పరిశీలించి.. జీవించడానికి అయ్యే ఖర్చును తేల్చామని పేర్కొంది. ఇందులో సింగపూర్, స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరాలు అత్యధిక జీవన వ్యయంలో టాప్లో నిలిచాయి. నిత్యావసరాలు, వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం గణనీయంగా ఉండటంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లోని నగరాల్లో జీవన వ్యయం పెరుగుతోందని తెలిపింది. ఇక తక్కువ వ్యయం ఉండే నగరాల్లో ఆసియా ఖండానికి చెందినవే ఎక్కువగా ఉన్నా యని నివేదిక వెల్లడించింది. – సాక్షి సెంట్రల్డెస్క్ -
'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది!
లక్నో: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే టీమ్ ఇండియా గెలిచి ఉండేదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే, టీమిండియాకు విష్ణువు, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆశీస్సులు లభించేవని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్నోలోని క్రికెట్ స్టేడియానికి సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. విష్ణువు అనేక పేర్లలో ఏకనా ఒకటి. ఆ తర్వాత యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పేరును ఖరారు చేశారు. అహ్మదాబాద్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్ తలపడ్డాయి. ఇందులో ఆసిస్ 6 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరిన భారత జట్టు క్రిడాకారులు నిరాశలో మునిగిపోయారు. మ్యాచ్కు హాజరైన ప్రధాని మోదీ వారిని ఓదార్చారు. ఇదీ చదవండి: Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే.. -
ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ని వీక్షించారు. క్రికెట్ వరల్డ్కప్లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. 10 వికెట్లు కోల్పోయి 240 పరుగులు సాధించింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట్లో కాస్త తడబడింది. కానీ లబుషేన్, రాబిన్ హెడ్లు నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను విజయానికి చేరువ చేశారు. లబుషేన్ అర్ధసెంచరీ, రాబిన్ హెడ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం.. ఫ్రీ-పాలస్తీనా టీషర్ట్తో మైదానంలోకి దూసుకొచ్చిన వ్యక్తి -
అహ్మదాబాద్లో పర్యాటకుల రద్దీ
ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్వెల్ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. కంకారియా సరస్సు అహ్మదాబాద్లో కంకారియా సరస్సు అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి. భద్ర కోట అహ్మదాబాద్లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. లా గార్డెన్ నైట్ మార్కెట్ లా గార్డెన్కు చెందిన నైట్ మార్కెట్ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి. ఇది కూడా చదవండి: భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు -
Hyd: షమీ మెరుపులు.. కోహ్లి, గిల్, రోహిత్ హిట్టింగ్ చూడాలని ఆశ
పుష్కర కాలంగా ఎదురుచూస్తున్న ఉద్విగ్న ఘట్టానికి టీమ్ ఇండియా ఒక్క అడుగు దూరంలోనే ఉంది. భారత క్రికెట్ చరిత్రలో ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటానికి మరో అద్భుతమైన అవకాశం మన ముంగిట్లోకొచ్చింది. లీగ్ దశలో పరాజయమే లేకుండా విజయ పరంపరతో దూసుకెళుతున్న భారత జట్టు.. అదే దూకుడుతో ఫైనల్ మ్యాచ్లోనూ వీర విజృంభణతో దూసుకెళ్లి.. గెలుపు తీరాలను చేరుకుంటుందని నగర వాసులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న నేపథ్యంలో సిటీలో క్రికెట్ అభిమానులు క్షణ.. క్షణం ఊపిరి సలపని వీక్షణంలో మునిగిపోనున్నారు. వరల్డ్ కప్ మనదేననే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంటే.. సంబరాలకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరో అహ్మదాబాద్ వేదికగా నేటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ఉద్యోగులూ, వ్యాపారులూ, సెలబ్రెటీలు తదితర క్రికెట్ క్రీడాభిమానులంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా రిసార్ట్స్, బార్లు, రెస్టారెంట్లతో పాటు పలు పబ్లిక్ ప్లేస్లలో భారీ లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు పెళ్లి చేసుకోబోతున్న ఓ నూతన జంట తమ వివాహ మంటపంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నామని సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం. విల్లాలు, పలు గ్రేటెడ్ కమ్యూనిటీల్లోనూ సామూహిక విక్షణకు ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి యువకులు దూరంగా ఉన్నారని ఓ రాజకీయ నాయకుడు చెప్పారు. దీపావళి మళ్లీ జరుగుతుందా అనేంతలా బాణాసంచాలు అమ్ముడుపోయాయని నగరానికి చెందిన ఓ టపాసుల వ్యాపారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈసారి వేరే లెవెల్.. వరల్డ్కప్లో గతంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లు వేరు. ఈ రోజు జరగనున్న మ్చాచ్ వేరే లెవెల్. ఈసారి భారత బృందం ఆటతీరు అందరి మనసులను గెలుచుకుంది. అలాగే కప్ నెగ్గి మరోసారి భారత క్రికెట్ క్రీడా శక్తిని ప్రపంచానికి చూపించనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ కనిపించని అద్భుత శక్తిని తలపిస్తుంది. దానికి తగ్గట్టుగా క్రీడాకారుల పోరాట పటిమ ప్రతీ భారతీయుడికి గర్వకారణంగా నిలుస్తుంది. – సంతోష్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ 2011 విజయం పునరావృతం.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణాలు నిజం కానున్నాయి. ఒక భారత క్రీడాభిమానిగా భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని సెల్యూట్ కొట్టడానికి ఎదురుచూస్తున్నాను. మరోసారి మహ్మద్ షమీ బౌలింగ్ మెరుపులు, కోహ్లీ, గిల్, రోహిత్, అయ్యర్ హిట్టింగ్ చూడాలని ఆశగా ఉన్నాను. ధోనీ ఆధ్వర్యంలోని 2011 విజయం మళ్లీ రోహిత్ శర్మ వ్యూహాలతో పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాను. – రాం రెడ్డి, క్రికెట్ అభిమాని, అల్వాల్ -
CWC 2023 Final: చక్ దే ఇండియా... ఇప్పుడు జట్టు బలం అదే! ఒక్క అడుగు..
రోహిత్ మెరుపు ప్రదర్శనలు... కోహ్లి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు... శ్రేయస్, రాహుల్ దూకుడు... షమీ వికెట్ల వరద... జడేజా ఆల్రౌండ్ ప్రదర్శన... గత పది మ్యాచ్లలో ఇవన్నీ అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయాయి... ఇప్పుడు మరొక్కసారి ఇలాంటి ఆట కావాలి... టోర్నీ ఆసాంతం చూపించిన ఎదురులేని ప్రదర్శనను ఇంకోసారి చూపించి మరెప్పటికీ మరచిపోలేని చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగల్చాలి. ఏకంగా పది విజయాలు... ప్రపంచకప్ లీగ్ దశలో తొమ్మిది మంది ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం... సెమీఫైనల్లోనూ అదే జోరు... ఇంత అసాధారణ ఆటతో టీమిండియా ఫైనల్ చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ రోహిత్ శర్మ బృందం దానిని చేసి చూపించింది. ఒక్క ఓటమి లేకపోవడమే కాదు...అసలు లోపమే లేని దుర్బేధ్యమైన ఈ జట్టు విశ్వ విజేతగా నిలవాలి. ఒకరు, ఇద్దరో కాదు... భారత జట్టులో ఒకరికి తీసిపోని విధంగా మరొకరి ప్రదర్శన కొనసాగింది. ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధార పడకుండా సమష్టితత్వంతో జట్టు విజయాలు అందుకుంది... అదే ఇప్పుడు జట్టు బలం... ఎవరూ విఫలమైనా నేనున్నానంటూ జట్టు కోసం తర్వాతి ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఇదే ఆట ఇప్పుడు ప్రపంచకప్ గెలిపించాలి... కోట్లాది అభిమానుల ఆశలను నిజం చేయాలి. అయితే ఎదురుగా ఉన్నది మామూలు జట్టు కాదు... ఐదుసార్లు విశ్వవిజేతగా నిలవడం మాత్రమే కాదు... అంగుళం అవకాశం లేని చోట నుంచి కూడా అవకాశాలు సృష్టించుకొని ప్రత్యర్థిని పడగొట్టగల నైపుణ్యం ఉన్న ఆస్ట్రేలియా... ఈ టోర్నీలోనూ ఆరంభంలో తడబడిన ఆ జట్టు తర్వాత తనేంటో చూపించింది... ఒత్తిడి అనే పదానికి అర్థం తెలియని కంగారూలను భారత్ అడ్డుకోవాలి. చివరగా... ప్రతీకారం అనే మాటకు క్రికెట్ భాషలో అర్థం తీసుకుంటే అదే ప్రత్యర్థిని అదే తరహా వేదికపై అదే స్థాయిలో ఓడించాలి... అలా చూస్తే 2003లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్కు 20 ఏళ్ల తర్వాత దక్కిన అవకాశమిది... ఆసీస్ను పడగొట్టి మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవాలని, మైదానంలో లక్ష మంది అభిమానుల సమక్షంలో రోహిత్ శర్మ జట్టు ప్రపంచకప్ను సగర్వంగా ఎత్తుకోవాలని యావత్ భారతం ఆశిస్తోంది. అహ్మదాబాద్: వన్డే వరల్డ్ కప్–2023 ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. 45 రోజుల్లో 48 మ్యాచ్ల తర్వాత ఇప్పుడు జగజ్జేతను తేల్చే తుది పోరుకు సమయం వచ్చేసింది. సొంతగడ్డపై అసంఖ్యాక అభిమానుల ఆశల పల్లకిని మోస్తూ మూడో టైటిల్పై దృష్టి పెట్టిన భారత జట్టు ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఫేవరెట్లలో ఒకటిగా భావించిన మరో టాప్ జట్టు ఆ్రస్టేలియాతో భారత్ తలపడనుంది.బలాబలాలు, ఫామ్ దృష్ట్యా సహజంగానే భారత్ వైపే మొగ్గు కనిపిస్తుండగా... నాకౌట్ మ్యాచ్లలో తమ ఆటను రెట్టింపు స్థాయికి తీసుకెళ్లే ఆసీస్ కూడా సర్వసన్నద్దమైంది. ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయంతో పైచేయి సాధించినా... ఆరంభ దశలో ఆసీస్ కూడా పదునైన బౌలింగ్తో ఆధిపత్యం చూపించగలిగిందనేది వాస్తవం. అన్ని రకాలుగా హోరాహోరీగా సాగే అవకాశం ఉన్న ఈ పోరును గెలిచే వరల్డ్ చాంపియన్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు భారీ భద్రత.. వేల మందితో బందోబస్తు
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 6,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యే ముఖ్య వ్యక్తులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో జీఎస్ మాలిక్ మాట్లాడుతూ మ్యాచ్ చూడటానికి లక్ష మందికి పైగా ప్రేక్షకులు, అనేక మంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ , హోంగార్డులు, ఇతర సిబ్బందితో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ‘ఈ మెగా ఈవెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూసేందుకు 6,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నాం. వీరిలో దాదాపు 3,000 మంది స్టేడియం లోపల ఉంటారు. మరికొందరు ఆటగాళ్లు, ప్రముఖులు బస చేస్తున్న హోటళ్లు, ఇతర కీలక ప్రదేశాలలో బందోబస్తు నిర్వహిస్తారు’ అని జీఎస్ మాలిక్ వివరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒక కంపెనీ స్టేడియం లోపల, మరొకటి స్టేడియం వెలుపల మోహరించి ఉంటుందని, నగర పోలీసుల ఆధ్వర్యంలో స్టేడియం లోపల తాత్కాలిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐజీ, డీఐజీ ర్యాంకుకు చెందిన నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు 23 మంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు మ్యాచ్ రోజు సిబ్బందిని పర్యవేక్షిస్తారని జీఎస్ మాలిక్ పేర్కొన్నారు. వీరికి 39 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 92 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లు సహాయం చేస్తారని వివరించారు. మ్యాచ్లో ఏదైనా రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (CBRN) అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించడానికి, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలను కూడా నగరంలో మోహరిస్తామని తెలిపారు. బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్కు చెందిన 10 బృందాలతో పాటు రెండు బృందాలు చేతక్ కమాండోస్, ఒక ఎలైట్ యూనిట్ను స్టేడియం సమీపంలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బాంబ్ బెదిరింపులపై స్పందిస్తూ.. ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని ఆకతాయిగా చేసే బెదిరింపులను మీడియా హైలైట్ చేయొద్దని జీఎస్ మాలిక్ కోరారు. -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్వెల్ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్పై అదాలజ్ స్టెప్వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్ఫారమ్లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
ఈ సారి వరల్డ్కప్ టీమిండియాదే.. ఎలా అంటే?
మూడో వన్డే ప్రపంచకప్ టైటిల్కు టీమిండియా మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. 20 ఏళ్ల తర్వాత ఆసీస్-భారత్ జట్లు వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. తుదిపోరులో ఆసీస్ను చిత్తు చేసి.. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన వరల్డ్కప్ ఫీవరే కన్పిస్తోంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి అభిమానులు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్కప్ నేపథ్యంలో ఓ పాత సెంటిమెంట్ను అభిమానులు తెరపైకి తెచ్చారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే? ఫైనల్ మ్యాచ్కు ముందు భారత్-ఆస్ట్రేలియా కెపెన్లు రోహిత్ శర్మ, కమ్మిన్స్ అహ్మాదాబాద్లోని ప్రఖ్యాత అదాలజ్ స్టెప్వెల్ వద్ద ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో ట్రోఫీకి కుడివైపు రోహిత్ శర్మ ఉండటంతో.. టీమిండియాదే వరల్డ్కప్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే.. గత మూడు వరల్డ్కప్ టోర్నీల్లో కూడా ఈ విధంగా కూడివైపు ఉన్న కెప్టెన్లే తమ జట్టును విజేతగా నిలిపారు. 2011 వరల్డ్కప్ ఫైనల్కు ముందు కూడా ట్రోఫీతో కెప్టెన్లు ఫోటోలు దిగినప్పుడు భారత సారథి ఎంఎస్ ధోని.. ట్రోఫీకి కుడి వైపే నిలుచుని ఉన్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం 2015 ప్రపంచకప్లో కూడా అచ్చెం ఇదే పరిస్థితి. ట్రోఫీతో ఫోజులిచ్చేటప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా కుడివైపే ఉన్నాడు. ఆ వరల్డ్కప్లో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత చివరగా 2019 వరల్డ్కప్ ఫైనల్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ట్రోఫీకి కుడివైపే ఉన్నాడు. 2019 ప్రపంచకప్ను ఇంగ్లీష్ జట్టు ఎగరేసుకుపోయింది. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ట్రోఫీకి కుడివైపే ఉండడంతో భారత జట్టు కప్పు కొడుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చదవండి: World Cup 2023 Final: ఆసీస్తో ఫైనల్ పోరు.. సిరాజ్కు నో ఛాన్స్!? జట్టులోకి సీనియర్ ఆటగాడు pic.twitter.com/OAmLbfmhgU — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2023 pic.twitter.com/kyoETUOS6z — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2023 -
వరల్డ్కప్ ముగింపు.. ప్రత్యేక కార్యక్రమాలు! బీసీసీఐ ప్రకటన విడుదల
ICC CWC 2023 Closing Ceremony: వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఘనంగా ముగింపు పలకనుంది. ఇందుకోసం.. అహ్మదాబాద్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం టైటిల్ పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఎయిర్ షోతో మొదలు ఈ క్రమంలో మధ్యాహ్నం 1:35 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకు.. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ షోతో అలరించనుంది. ఇన్నింగ్స్ ఆరంభమైన తర్వాత మొదటి డ్రింక్స్ బ్రేక్లో ప్రముఖ గాయకుడు, పాటల రచయిత ఆదిత్య గాధ్వి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. జోనితా గాంధీ, అజీజ్ తదితరులతో ఇక మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ విరామ సమయంలో మ్యుజీషియన్ ప్రీతం చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్ అజీజ్, అమిత్ మిశ్రా, ఆకాశ సింగ్, తుషార్ జోషీ తమ గాత్రంతో అలరించనున్నారు. అదే విధంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేక లేజర్ లైట్ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ముగింపు వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శనివారం విడుదల చేసింది. కాగా ప్రపంచంలోని క్రికెట్ మైదానాల్లో పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబరు 19న టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్ అయిన కంగారూ జట్టు.. సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత జట్టును ఓడించడం కష్టమే అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. విజేత జట్ల కెప్టెన్లకు ఆహ్వానం ఇప్పటి వరకు జరిగిన 12 వన్డే ప్రపంచకప్ టోర్నీ లలో విజేత జట్లకు కెప్టెన్లకు వ్యవహరించిన వారికి ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆహ్వానించనుంది. క్లయివ్ లాయిడ్ (వెస్టిండీస్; 1975, 1979), కపిల్ దేవ్ (భారత్; 1983), అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా; 1987), ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్; 1992), అర్జున రణతుంగ (శ్రీలంక; 1996), స్టీవ్ వా (ఆస్ట్రేలియా; 1999), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా; 2003, 2007), ధోని (భారత్; 2011), మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా; 2015), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్; 2019) ఈ జాబితాలో ఉన్నారు. కాగా జైలులో ఉన్న పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఈ ఈవెంట్కు హాజరయ్యే అవకాశమే లేదు. తెర వెనుక నుంచి శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని బీసీసీఐ కార్యదర్శి జై షాపై విమర్శలు గుప్పించిన శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ కూడా ఫైనల్కు రావడం అనుమానమే. మ్యాచ్కు భారత ప్రధాని, ఆసీస్ ఉప ప్రధాని ఫైనల్ను చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విచ్చేయనున్నారు. వీరితో పాటు బడా పారిశ్రామిక దిగ్గజాలు, పలు రంగాలకు చెందిన దిగ్గజాలు, భారతీయ సినీ రంగ ప్రముఖులంతా హాజరు కానున్న నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం గాందీనగర్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అతిరథ మహారథులతో పాటు సాధారణ ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. విశ్వవిజేతగా నిలిచే జట్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేసే అవకాశముంది. చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి! -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు
అహ్మదాబాద్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు బెదిరింపులకు పాల్పడ్డాడు. క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటూ మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ అభిప్రాయాన్ని కూడా ప్రశ్నించాడు. అమెరికా ఆధారిత నిషేధిత సంస్థ సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు గురుపత్వంత్ సింగ్ నాయకునిగా ఉన్నాడు. భారత్కు వ్యతిరేకంగా ఈయన హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రధాని నరేంద్ర మోదీపై హెచ్చరికలు చేస్తూ గత నెలలో కూడా ఓ వీడియోను విడుదల చేశాడు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలని పేర్కొన్నాడు. ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు. సెప్టెంబరులో భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇరుదేశాల మధ్య శత్రుత్వాన్ని పోత్రహించే చర్యలకు పాల్పడినందుకు ఆయనపై కేసు కూడా నమోదైంది. అహ్మదాబాద్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మొతేరా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కి దేశ విదేశాల నుంచి ప్రముఖులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరవనున్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రధాని మోదీ
అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్ వైదికైంది. ఈ మ్యాచ్ను చూడటానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరు కానున్నారు. మ్యాచ్ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు రానున్న నేపథ్యంంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. మ్యాచ్ సందర్భంగా మొత్తం 4,500 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలగకుండా నరేంద్ర మోదీ స్టేడియం వైపు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహించనున్నారు. మిడ్-ఇన్నింగ్స్లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్లు నిర్వహించనున్నారు. వింగ్ కమాండర్ సిదేశ్ కార్తిక్ నేతృత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన తొమ్మిది విమానాలు వైమానిక ప్రదర్శన నిర్వహిస్తాయి. మ్యాచ్ టాస్ వేసిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం పైన ఎయిర్ షో ప్రదర్శిస్తాయి. ఇప్పటివరకు ప్రపంచ వరల్డ్కప్లలో విజయం సాధించిన జట్ల కెప్టెన్లందర్ని బీసీసీఐ సత్కరించనుంది. సంగీత స్వరకర్త ప్రీతమ్ లైవ్ షో నిర్వహించనున్నారు. 500 కంటే ఎక్కువ మంది డ్యాన్సర్లతో ఈ ప్రదర్శన జరగనుంది. మ్యాచ్ సందర్భంగా స్డేడియం విద్యుత్ వెలుగులతో మెరిసిపోనుంది. ఇందుకోసం యూకే నుంచి ప్రత్యేక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇదీ చదవండి: జై షాకు క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం.. -
CWC 2023: అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్కు విమానంలో అయితే అర లక్ష!
యువర్ అటెన్షన్ ప్లీజ్! అహ్మదాబాద్ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయం. తినాలనుకుంటే రేట్లు చూసిన వెంటనే కడుపు నిండిపోయే ‘మెనూ’లున్నాయి. బస చేయాలంటే సాధారణ హోటళ్లలోనే వేల రూపాయలు, స్టార్ హోటళ్లలో రూ. లక్షలు... ఫైనల్ ఆట కంటే ముందే ‘హాట్ హాట్’ టాపిక్లయ్యాయి. అహ్మదాబాద్: తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కానీ యావత్ దేశం మాత్రం భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ టైటిల్ పోరాటాన్ని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ప్రయాణ టికెట్లు వేలకు వేలైనా ... తినుబండారాలు ఖరీదైనా... హోటల్ గదులు ఎన్ని వేల రూపాయలైనా సరే భారత అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు. లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూసే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్ కోసం ఖర్చులు బారెడైనా... కళ్లు కాయలు కట్టుకొని మరీ చూసేందుకు ఎదురు చూస్తున్నారు.ఆ్రస్టేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా... 2003 ఫైనల్ బూచీ వెంబడిస్తున్నా... టీమిండియా అజేయ జైత్రయాత్రపైనే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం న్యూజిలాండ్ జట్టుపై గత ప్రపంచ కప్ సెమీఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకున్న భారత్... 20 ఏళ్ల క్రితం ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమి ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటుందని సగటు అభిమానులంతా ఆశిస్తున్నారు. విమానం ఎక్కితే... అహ్మదాబాద్ వెళ్లే విమానం ఎక్కితే దేశంలో ఎక్కడి నుంచైనా దాదాపు రూ. 5 వేల నుంచి 9 వేల లోపే ఉంటుంది. నెలముందు బుక్ చేసుకుంటే సగం రూ. 3 వేల లోపే అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థ ప్రొమో కోడ్లతో 500 వందలైనా తగ్గేవి. కానీ అలా చూసుకుంటే రూ. 2500 టిక్కెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 25 నుంచి 35 వేల మధ్యకు పెరిగింది. ఇది నిన్నటి (శుక్రవారం) ధరలు. శనివారం బుక్ చేసుకుంటే మాత్రం అర లక్షయినా ఆశ్చర్యం కలుగక మానదు. పలు విమానయాన సంస్థలు ఆ రూట్లో ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటు లో పెడుతున్నా అవేవీ ప్రయాణికుల రద్దీని తట్టుకో లేకపోతున్నాయని టికెట్ ఏజెంట్స్ చెబుతున్నారు. విన్యాసాలకు రిహార్సల్స్ భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఫైనల్కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోతో కనువిందు చేయనుంది. ఇందుకోసం శుక్రవారం ఈ టీమ్ స్టేడియంపై వైమానిక విన్యాసాలను రిహార్సల్స్ చేసింది. -
ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. అహ్మదాబాద్కు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్-2023 ట్రోఫీని ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. తుది పోరులో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ముచ్చటగా మూడో సారి టైటిల్ను సొంతం చేసుకోవాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్లో అడుగుపెట్టింది. గురువారం రాత్రి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు చేరకుకుంది. అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. జట్టు బస చేయనున్న హోటల్ సిబ్బంది భారత ఆటగాళ్లకు నుదుట తిలకం దిద్ది మరీ స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు.. ఆల్ ది బెస్ట్ టీమిండియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం సాయంత్రం తమ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. చదవండి: ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టాం.. మాకూ విజయావకాశాలు వచ్చాయి: సౌతాఫ్రికా కెప్టెన్ A beautiful welcome of team India in Ahmedabad. pic.twitter.com/Qh4lGHHp5c — Mufaddal Vohra (@mufaddal_vohra) November 16, 2023 -
IND vs AUS: అంతిమ సమరం కోసం అహ్మదాబాద్కు భారత్ జట్టు (ఫోటోలు)
-
ICC World Cup 2023: అంతిమ సమరం కోసం...
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పోటీపడేందుకు భారత క్రికెట్ జట్టు గురువారం అహ్మదాబాద్ నగరానికి చేరుకుంది. విమానాశ్రయంలో భారత జట్టుకు ఘనస్వాగతం లభించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. ఫైనల్ వేదికపై ఎయిర్ షో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథ మహారథులు, లక్ష మంది ప్రేక్షకులు విచ్చేసే మ్యాచ్ వేదికపై ఐఏఎఫ్కు చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్’ ఎయిర్ షోతో మ్యాచ్కు ముందే కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన రిహార్సల్స్ను నేడు, రేపు స్టేడియంపై చేస్తారని గుజరాత్కు చెందిన డిఫెన్స్ ప్రొ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వైమానిక విన్యాసాలతో అలరించడం సూర్యకిరణ్ టీమ్కు కొత్తేం కాదు. దేశవ్యాప్తంగా ఎయిర్ షోలు ఈ జట్టే చేస్తుంది. మొత్తం తొమ్మిది ఎయిర్క్రాఫ్ట్లు నింగిలో తమ వైమానిక విన్యాసంతో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేస్తాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ మంచి మనసు.. నిరాశ్రయులకు నగదు సాయం! వీడియో వైరల్
అఫ్గానిస్తాన్ స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్.. ఆఫ్ది ఫీల్డ్ కూడా తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. ఆదివారం అహ్మదాబాద్లో ఫుట్పాత్పై నిద్రిస్తున్న నిరాశ్రయులకు గుర్బాజ్ నగదు సాయం చేశాడు. అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో గుర్బాజ్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "నిజంగా నీవు రియల్ హీరో అన్న, దీపావళి పండగ రోజు వారి ముఖాల్లో సంతోషాన్ని నింపావు" అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా ఈ మెగా టోర్నీలో అఫ్గానిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. తొమ్మిది మ్యాచ్ల్లో 4 విజయాలతో అఫ్గానిస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో నిలిచింది. గుర్భాజ్ కూడా తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు. 9 మ్యాచ్ల్లో 280 పరుగులు చేశాడు. చదవండి: చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్ ఆజం Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali. - A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023 -
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణాలొద్దు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరిగే నవంబర్ 19వ తేదీన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయాన్ని మూసివేయాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. అదే రోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని కూడా పేర్కొన్నాడు. ఈ మేరకు çపన్నూ హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ‘నవంబర్ 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించరాదని సిక్కులను కోరుతున్నాం. ఆరోజు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి’అని పేర్కొన్నాడు. ‘19న ఐజీఐ విమానాశ్రయాన్ని మూసివేయాలి, విమానాశ్రయం పేరును మార్చాలి’ అని కూడా డిమాండ్ చేశాడు. ఆ రోజున వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లో జరగనున్న విషయాన్ని కూడా అతడు ప్రస్తావించడం గమనార్హం. ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధం నుంచి పాఠం నేర్చుకోవాలని, లేకుంటే భారత్ కూడా అదే ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ప్రధాని మోదీని హెచ్చరిస్తూ అక్టోబర్ 10న పన్నున్ వీడియో విడుదల చేశాడు. హింసకు హింసే సమాధానం. అక్రమంగా ఆక్రమించుకుంటే పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు ప్రజల సమాధానం ఇలాగే ఉంటుందని అందులో పేర్కొన్నాడు. పంజాబ్తోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్ర చర్యలకు ఊతమిస్తున్న పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గత ఏడాది ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించింది. అతడిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. If this guy was a Palestinian who operated in Canada & was targeting a Western or Israeli airport, Justin Trudeau would have arrested him & banned his organisation But Khalistani terrorists can say & do what they like in Trudeau’s Canada as long as they only target India https://t.co/4ZfZyDzeOr — vir sanghvi (@virsanghvi) November 4, 2023 -
‘శ్రీవారి’ కోసం.. వేల కిలోమీటర్లు కాలినడకన..
తాడిపత్రి: ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే సంకల్పం ఆ వృద్ధ దంపతులను వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు. తాడిపత్రి ప్రాంతానికి చేరుకున్న ఆ వృద్ధ దంపతులను ‘సాక్షి’ పలకరించగా.. ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి.. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్ ఆర్.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్ పూర్తి చేశారు. ఉపాధ్యాయ తల్లి మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేసేవారు. ఆమె కొన్నేళ్ల క్రితం కేన్సర్తో చనిపోయారు. ఆమెకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండేది. కేన్సర్ కారణంగా శరీరం సహకరించక పోవడంతో ఆమె కోరిక నెరవేరలేదు. కానీ అత్త బాధను అర్థం చేసుకున్న కోడలు సరోజినీ తన భర్త ఉపాధ్యాయతో కలసి కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపు 70 రోజుల క్రితం సుమారు 2,150 కిలోమీటర్ల దూరంలోని తిరుమలకు తోపుడు బండి (లగేజీ కోసం) తీసుకుని కాలినడకన బయలు దేరారు. స్వామి సన్నిధికి చేరుకునేందుకు 59 రోజులు పట్టింది. వెంకన్న దర్శనానంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి పయనమయ్యారు. కాగా, ఏడు కొండల వాడి దర్శనానికి బయలుదేరే ముందు తన భార్యకు కాళ్లవాపుతో పాటు ఆయాసం ఉండేదని, తనకూ గ్లకోమా వ్యాధి ఉండేదని ఉపాధ్యాయ చెప్పారు. స్వామిపైన భారం వేసి యాత్ర మొదలుపెట్టామని, ఇప్పుడంతా బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తన భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని కొంతదూరం తోసుకుంటూ వెళ్తున్నట్లు ఉపాధ్యాయ చెప్పారు. వారి సంకల్పాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు. -
ఫోన్ ఇచ్చేస్తా అంటూ ఊర్వశి రౌతేలాకు కండీషన్ పెట్టిన అజ్ఞాతవాసి
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా పేరు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాలలో ప్రత్యేక సాంగ్తో అలరించిన ఈ మ్యూటీ తెలుగువారికి బాగా దగ్గరైంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటా ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'లో బిగ్బాస్-7 బ్యూటీ.. ఏకంగా మంత్రిగానే కీ రోల్) దీంతో పోలీస్స్టేషన్లో కూడ ఫిర్యాదు చేసింది. కానీ తన ప్రయత్నంగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. ఊర్వశి రౌతేలా చేసిన ట్వీట్కు ఫలితం దక్కింది. ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్ వచ్చింది. 'మీ ఫోన్ నా దగ్గరే ఉంది. అది మీకు దక్కాలంటే క్యాన్సర్తో బాధపడుతున్న నా సోదరుడిని కాపాడుకోవడంలో సాయం చేయండి.' అని ఆ వ్యక్తి కండీషన్ పెట్టాడు. దీంతో ఊర్వశి రౌతేలా కూడా సరే అనేలా థంబ్స్ అప్ గుర్తు పెట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మరీ ఒప్పందం ప్రకారం ఆ అజ్ఞాతవాసి ఆమెకు ఫోన్ తెచ్చి ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్లోనూ ప్రత్యేక సాంగ్తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్లోనూ కొనసాగింది. ఫేవరెట్గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్లు) దూకుడైన బ్యాటింగ్తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం పుణేలో బంగ్లాదేశ్తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్లో శుబ్మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్లో కూడా పాక్ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
హై వోల్టేజ్ మ్యాచ్..ఇండియా వర్సెస్ పాకిస్థాన్
-
పాకిస్తాన్తో మ్యాచ్.. గుడ్న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ! ఇషాన్ అవుట్.. కానీ!
Rohit Sharma shares crucial update on Shubman Gill: వన్డే వరల్డ్కప్-2023లో మెగా ఫైట్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త చెప్పాడు. స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలిపాడు. అయితే, అదే సమయంలో ఓ మెలిక కూడా పెట్టి ఫ్యాన్స్ను సందిగ్దంలోకి నెట్టేశాడు. కాగా అక్టోబరు 14న దాయాదులు భారత్- పాకిస్తాన్ ప్రపంచకప్ ఈవెంట్లో తలపడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు పోటీకి దిగనున్నాయి. క్రికెట్ ప్రపంచంలో భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్గా చరిత్రకెక్కిన చిరకాల ప్రత్యర్థుల పోరుకు లక్ష సీట్ల సామర్థ్యం గల మోదీ స్టేడియం కిక్కిరిసిపోవడం లాంఛనమే! డెంగ్యూ బారిన పడి.. రెండు మ్యాచ్లకు దూరమై ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందు సూపర్ ఫామ్లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్.. డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్తో మ్యాచ్లకు అతడు దూరం కాగా ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నాడు అయితే, గిల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. శుబ్మన్ గిల్ మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నాడని మీడియాకు తెలిపాడు. కానీ.. అతడిని పాక్తో మ్యాచ్లో ఆడించాలా లేదా అన్నది శనివారమే నిర్ణయిస్తామని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘శుబ్మన్ గిల్ 99 శాతం మ్యాచ్కు అందుబాటులోనే ఉంటాడు. అయితే, ఈ విషయం గురించి రేపటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇషాన్ను తప్పించక తప్పదా? ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో అభిమానుల మద్దతు తమకు దండిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని హిట్మ్యాన్ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గిల్ ప్రస్తుతం అహ్మదాబాద్లోనే ఉన్నాడు. జట్టుతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేసినట్లు సమాచారం. ఇక గిల్ రాకతో ఇషాన్పై వేటు పడటం ఖాయమే అనిపిస్తోంది. అహ్మదాబాద్లో అద్భుతమైన రికార్డు ఉన్న గిల్ను ఆడిస్తారా లేదంటే ఆసియా వన్డే కప్-2023లో పాకిస్తాన్పై 82 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కిషాన్ వైపు మొగ్గు చూపుతారా శనివారం తేలనుంది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ -
WC: క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను.. డెంగ్యూ వల్ల గిల్..: యువీ
ICC WC 2023- Ind Vs Pak- Yuvraj Singh- Shubman Gill: క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో తొలిసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబరు 14(శనివారం) దాయాదుల పోరుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి కూడా! అహ్మదాబాద్లో ఆడితే చూడాలని ఇక ఈ హైవోల్టేజీ మ్యాచ్తో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తనకిష్టమైన అహ్మదాబాద్ పిచ్పై పాకిస్తాన్ బౌలింగ్లో గిల్ పరుగుల వరద పారిస్తే చూడాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడో లేదో భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చేసిన శుబ్మన్ గిల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్యాన్సర్తో పోరాడుతూ వరల్డ్కప్ ఆడాను ‘‘ధైర్యంగా ఉండాలని శుబ్మన్ గిల్కు చెప్పాను. క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో నేను వరల్డ్కప్ మ్యాచ్లు ఆడానని చెప్పాను. వ్యాధితో పోరాడుతూనే ధైర్యం కూడదీసుకుని జట్టులోకి వచ్చానని తనతో అన్నాను. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నాటికి గిల్ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. నిజమే.. డెంగ్యూ బారిన పడి తీవ్రమైన జ్వరంతో ఉన్నపుడు క్రికెట్ ఆడటం కష్టం. గిల్ తప్పక ఆడతాడనే నమ్మకం ఇలాంటివి నాకు అనుభవమే. అయితే, గిల్ కోలుకుని ఫిట్గా ఉంటే మాత్రం తప్పక మ్యాచ్ ఆడతాడు’’ అని యువీ వార్తాసంస్థ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా 2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ క్యాన్సర్ బారిన పడిన విషయం వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా అద్భుత ఆట తీరుతో సొంతగడ్డపై భారత్ జగజ్జేతగా అవతరించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్కప్ హీరో.. గిల్ మెంటార్ యువీ.. 2011 నాటి ఎడిషన్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్లలో 362 పరుగులు సాధించడంతో పాటు.. 15 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విజేతగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. డెంగ్యూ ఫీవర్ కారణంగా శుబ్మన్ గిల్ వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. కాగా పంజాబీ బ్యాటర్ శుబ్మన్ గిల్కు యువీ మెంటార్. అంతర్జాతీయ క్రికెటర్గా గిల్ ఎదగడంలో ఈ మాజీ ఆల్రౌండర్ పాత్ర ఉంది. చదవండి: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా? We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN — BCCI (@BCCI) October 12, 2023 -
WC 2023: పాక్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్న్యూస్!
ICC WC 2023- Ind Vs Pak- Update On Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్కప్-2023కు ముందు సూపర్ ఫామ్లో ఉన్న గిల్.. డెంగ్యూ బారిన పడి ఆరంభ మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. జ్వరం కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్లతో టీమిండియా మ్యాచ్లకు ఈ యువ బ్యాటర్ అందుబాటులో లేకుండా పోయాడు. జట్టుతో పాటే ప్రయాణం చేసినా వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్న శుబ్మన్ గిల్ పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. గంటపాటు ప్రాక్టీస్ చేసిన గిల్! పాకిస్తాన్తో మ్యాచ్ కోసం.. ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న అతడు నెట్ సెషన్లో పాల్గొన్నట్లు దైనిక్ జాగరణ్ కథనం వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. గంట పాటు గిల్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. కాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబరు 14(శనివారం)న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిస్క్ తీసుకుంటారా? అయితే, గిల్ డెంగ్యూ నుంచి కోలుకున్నప్పటికీ పాక్తో మ్యాచ్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. తీవ్రమైన జ్వరం కారణంగా నీరసపడిపోయిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ను హైవోల్టేజీ మ్యాచ్తో బరిలోకి దించి బీసీసీఐ రిస్క్ తీసుకోదని విశ్లేషకులు అంటున్నారు. మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని.. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నపుడే అతడు మైదానంలో దిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇషాన్ కిషన్ మరోసారి! కాగా ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచకప్ టోర్నీలో శుభారంభం చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ రెండు మ్యాచ్లలో శుబ్మన్ గిల్ స్థానంలో మరో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ రోహిత్ శర్మకు జోడీగా బరిలోకి దిగాడు. చెన్నైలో ఆసీస్తో మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఢిల్లీలో అఫ్గన్పై 47 పరుగులు సాధించాడు. పాక్తో మ్యాచ్కు కూడా గిల్ దూరమైతే ఇషాన్కు మరోసారి లక్కీ ఛాన్స్ దక్కనుంది. ఇదిలా ఉంటే.. దాయాది పాకిస్తాన్తో మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకుంది. చదవండి: WC 2011లో నేనే కెప్టెన్ అయి ఉంటే అతడిని తప్పక తీసుకునేవాడిని.. కానీ! Updates on Shubman Gill: (To PTI) - He practiced today at Motera nets. - He practiced batting for 1 Hour. - He went 11.30 AM today in nets. - He had an extensive session. - The Prince Shubman Gill is getting ready to Grand Comeback...!!! pic.twitter.com/mA9q9pO21O — CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023 Shubman Gill has started the batting practice. - Great news for Team India. pic.twitter.com/lkfcNgEi1F — Johns. (@CricCrazyJohns) October 12, 2023 Arrival of Shubman Gill in Ahmedabad. (Vipul Kashyap). - Hope we get to see Gill soon in action...!!!pic.twitter.com/j5DDZpYlHj — Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023 We are here in Ahmedabad! 👋#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/dVuOaynYRN — BCCI (@BCCI) October 12, 2023 -
WC 2023: టీమిండియాతో పోరుకు సిద్ధం.. అహ్మదాబాద్ చేరుకున్న పాక్ జట్టు
ICC ODI WOrld Cup 2023 Ind Vs Pak: వన్డే వరల్డ్కప్-2023లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసలు సిసలు పోరుకు సమయం ఆసన్నమైంది. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబరు 14న దాయాదులు పరస్పరం ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్కు చేరుకుంది. మరోవైపు.. టీమిండియా ఢిల్లీలో ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్ ముగించుకున్న తర్వాత మ్యాచ్ జరిగే వేదికకు పయనం కానుంది. కాగా భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్-2023లో బాబర్ ఆజం బృందం శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా ఆడిన రెండు మ్యాచ్లలో జయకేతనం ఎగురవేసింది. తొలుత నెదర్లాండ్స్పై 81 పరుగులతో గెలుపొందిన పాక్.. మలి మ్యాచ్లో శ్రీలంక విధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. సంచలన విజయం అనంతరం టీమిండియాతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు.. రోహిత్ సేన ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్లో తడ‘బ్యా’టుకు లోనై విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) అద్భుత భాగస్వామ్యం కారణంగా గట్టెక్కింది. ఇక ఆసీస్పై భారత్ విజయం సాధించినా.. టాపార్డర్ దారుణంగా విఫలం కావడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు కూడా అహ్మదాబాద్లో అడుగుపెట్టనుంది. చదవండి: 'అయ్యో షమీ.. రోహిత్ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు' Pakistan team reached Ahmedabad for the clash against India....!!! - The Greatest battle in Cricket. pic.twitter.com/Qjx2oPcFju — Johns. (@CricCrazyJohns) October 11, 2023 -
ODI WC 2023: అహ్మదాబాద్కు చేరుకున్న ఇంగ్లండ్-కివీస్ జట్లు
వన్డే ప్రపంచకప్-2023కు మరో 24 గంటల్లో తేరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్, కివీస్ జట్లు మంగళవారం అహ్మదాబాద్కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ జట్టు నేరుగా తిరువనంతపురం నుంచి అహ్మదాబాద్కు చేరుకుగా.. ఇంగ్లీష్ జట్టు గువహటి నుంచి వచ్చింది. కాగా కివీస్ వామప్ మ్యాచ్ల్లో అదరగొట్టింది. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఘనవిజయం సాధించింది. అదే విధంగా ఇంగ్లండ్కు కూడా మంచి ప్రాక్టీస్ లభించింది. భారత్తో వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో బట్లర్ సేన జూలు విదిలించింది. ఇక అహ్మదాబాద్కు చేరుకున్న ఇరు జట్లు బుధవారం ఒక్క రోజు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గోనున్నాయి. కాగా ఈ రెండు జట్లు హాట్ ఫేవరేట్లగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగుతున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ను ఇంగ్లండ్ సొంతం చేసుకోగా.. కివీస్ రన్నరప్గా నిలిచింది. వరల్డ్కప్కు ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. వరల్డ్కప్కు న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. చదవండి: WC 2023: శ్రీలంకకు షాకిచ్చిన ఆఫ్గానిస్తాన్.. 6 వికెట్ల తేడాతో ఘన విజయం