20 కోచ్‌ల వందేభారత్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం | 20 Coach Vande Bharat Train Reached Mumbai from Ahmedabad | Sakshi
Sakshi News home page

20 కోచ్‌ల వందేభారత్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

Published Sat, Aug 10 2024 7:01 AM | Last Updated on Sat, Aug 10 2024 9:10 AM

20 Coach Vande Bharat Train Reached Mumbai from Ahmedabad

అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణానికి వందేభారత్‌ రైలు పేరొందింది. ఇప్పుడు మరో వందేభారత్‌ రైలు పట్టాలపై పరుగులు తీయనుంది. పశ్చిమ రైల్వే  తాజాగా అదనపు బోగీలతో కూడిన వందేభారత్ రైలును పరీక్షించింది. ఈ రైలు ఐదు గంటల 21 నిమిషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకుంది.

కొత్తగా పట్టాలెక్కిన ఈ కాషారంగు వందేభారత్‌కు అదనంగా నాలుగు కోచ్‌లను జతచేర్చారు. దీంతో మొత్తం 20 బోగీలతో ఈ నూతన వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. శుక్రవారం నాడు అహ్మదాబాద్- ముంబై మధ్య గంటకు 130 కి.మీ. వేగంతో ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారి తెలిపారు. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్‌లో బయలుదేరిన రైలు మధ్యాహ్నం 12:21 గంటలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంది.

తిరిగి మధ్యాహ్నం  ఒంటిగంటకు ఈ రైలు ముంబై సెంట్రల్ నుండి అహ్మదాబాద్‌కు తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతీయ రైల్వే 2024, జూలై 29 నుంచి దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైలు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లతో సహా 50కి పైగా రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement