రూ.10 లక్షల విలువైన రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల విలువైన రేషన్‌ బియ్యం పట్టివేత

Apr 8 2025 7:19 AM | Updated on Apr 8 2025 7:19 AM

రూ.10 లక్షల విలువైన రేషన్‌ బియ్యం పట్టివేత

రూ.10 లక్షల విలువైన రేషన్‌ బియ్యం పట్టివేత

రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు విలువ చేసే రేషన్‌ బియ్యాన్ని సోమవా రం పట్టుకున్నామని స్థానిక డిప్యూటీ తహసీల్దారు (పౌరసరఫరా లు) గొలుగూరి బాపి రాజు తెలిపారు. మూడు వాహనాలలో తరలిస్తున్న ఈ బియ్యాన్ని వాహనాలతో సహా స్వాధీన పర్చుకుని, కేసులు నమోదు చేసేందుకు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గొల్లప్రోలుకు చెందిన ఆకుల స్వామి, పె ద్దాపురం మండలం గోరంట్లకు చెందిన కోన బాలరాజు, కోరుకొండ అచ్చిరాజు తమ వాహనాలలో ఈ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కూడా కేసు లు నమోదు చేయడంతోపాటు ఈ అక్రమ దందాకు ప్రధాన కారకులు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.10 లక్షలు కాగా, వాహనాల విలువ రూ.20 లక్షలు పైబడి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement