
పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్తో గట్టి బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్తో ఉగ్రమూకల్ని, వారి స్థావరాల్ని, మౌలిక సదుపాయాలను నేలమట్టం చేసింది. అంతేగాదు ఈ చర్యతో భారత్ ఉగ్రవాదాన్ని సహించేదే లేదని పాక్కి గట్టి సంకేతాలనే పంపించింది. ఇక ఆపరేషన్ అత్యంత కీలకపాత్ర పోషించింది భారత ఎయిర్ఫోర్స్. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా కలిసి మరీ వారిని అభినందించారు. అయితే ఈ వైమానిక దాడుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి. ఆయనే వైమానిక దాడుల గురించి మీడియాకు వివరించారు. ముఖ్యంగా ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తరుణంలో మరీంతగా హాట్టాపిక్గా మారారు ఎయిర్ మార్షల్ భారతీ. అలాగే ఆయన తల్లిదండ్రులు సైతం ప్రతిష్టాత్మకమన ఈ ఆపరేషన్లో తమ కొడుకు భాగం అయ్యినందు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎవరు..? ఆ ఆపరేషన్ ఆయన పాత్ర ఏంటి తదితరాలు గురించి సవివరంగా చూద్దాం.
వైమానిక దాడుల విరమణ అనంతరం..వాటి గురించి మీడియాకు వివరిస్తూ వార్తల్లో నిలిచారు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అవదేష్ కుమార్ భారతి. ఆయన ఇతర సాయుధ సైనికులతో కలిసి నిర్వహించిన దాడుల గురించి సవివరంగా వివరించారు. ఈ ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడులలో కీలకపాత్ర పోషించారాయన. చిన్నప్పటి నుంచి భారతి తెలివైన విద్యార్థి అని చెబుతున్నారు తల్లిదండ్రులు.
ఆయన తండ్రి నీటిపారుదల శాఖలో గుమస్తా కాగా, తల్లి గృహిణి. ఎయిర్ మార్షల్ భారతికి ఎడ్యుకేషన్ పరంగా మంచి రికార్డు ఉంది. ఆయన జార్ఖండ్లోని తిలైయాలోని సైనిక్ స్కూల్లో విద్యను అభ్యసించాడు. తల్లి ఊర్మిళ మాట్లాడుతూ..చిన్నప్పటి నుంచి భారతి నిరాడంబరంగా ఉండేవాడని, ఇప్పటికీ అలానే ఉంటాడని అన్నారు. చిన్నతనంలో ఎక్కువగా సాయుధ దళాల్లో చేరాలని చెబుతూ ఉండేవాడని, చివరికి దాన్ని సాధించాడని అన్నారు.
వరించిన పదొన్నతులు..
ఎయిర్ మార్షల్ భారతి 1987లో భారత వైమానిక దళం ఫైటర్ స్ట్రీమ్లో చేరారు. 2008లో రాష్ట్రపతి వైమానిక దళ పతకాన్ని పొందారు. 2023లో ఎయిర్ మార్షల్గా పదోన్నతి పొందారు. ఆయన సుఖోయ్-30 స్క్వాడ్రన్కు కమాండింగ్ ఆఫీసర్గా కూడా పని చేశారు. దీనికంటే ముందు ప్రయాగ్రాజ్లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్లో సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ (SASO)గా నియమించారు. అంతేగాదు ఇటీవలే ఆయనను రాష్ట్రపతి దౌప్రతి ముర్ము సత్కరించారు కూడా.
పూర్ణిమ చంద్రుడిలా వెలుగులోకి..
తల్లిదండ్రులు మాట్లాడుతూ..ఈ ఆపరేషన్ సిందూర్ కారణంగా తమ కొడుకు పూర్ణిమ చంద్రుడి మాదిరిగా వెలుగులోకి వచ్చాడని అన్నారు. అతన ఉద్యోగంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తన పిల్లలను కూడా అలానే ఉన్నతంగా తీర్చిదిద్దాడు. భారతి కశ్మీర్కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. తమ కొడుకుని చూసి తామెంతో గర్వపడుతున్నామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ప్రపంచానికి తెలుస్తుందన్నారు.
(చదవండి: 1971 Bhuj Airbase Story: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..! ఎలాంటి రక్షణ ఆయుధాలు, శిక్షణ లేకుండానే..)