Air Force
-
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
తుర్కియే వైమానిక సంస్థపై ఉగ్ర దాడి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నగర శివారులోని ఒక వైమానిక, రక్షణ రంగ సంస్థపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తుర్కియే అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. 14 మంది గాయపడ్డారు. అయితే ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు? అనే వివరాలను బయటపెట్టలేదు. టుటాస్ అనే సంస్థ ప్రాంగణంలో దాడి జరిగినట్లు మంత్రి అలీ యెర్లికాయా చెప్పారు. తుర్కియేలో గతంలో కుర్ద్ మిలిటెంట్లు, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, వామపక్ష ఉగ్రవాదులు దాడులు జరిపారు. సంస్థలో భద్రతా సిబ్బంది షిఫ్ట్ మారే సమయంలో కొందరు ఆగంతకులు హఠాత్తుగా వచ్చి బాంబులు వేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ప్రైవేట్ ఎన్టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది. అయితే ఆగంతకులు పారిపోలేదని లోపలి సిబ్బందిని బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నారని, ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తొలుత కేవలం బాంబు పేలుడు జరిగినట్లు వార్తలొచ్చాయి. సంస్థలోని సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని హబర్టర్క్ టెలివిజన్ పేర్కొంది. -
శుభాన్షు శుక్లా... ఎంటర్ ద ‘డ్రాగన్’
ప్రతిష్టాత్మక ఆక్సియం స్పేస్ ఏఎక్స్–4 మిషన్కు ఎంపికైన భారత వ్యోమగామి, వైమానిక దళ గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా తాము ప్రయాణించబోయే అత్యాధునిక డ్రాగన్ వ్యోమనౌకను తొలిసారి సందర్శించారు. అమెరికాలో హూస్టన్లోని స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగతా ముగ్గురు సిబ్బందిని ముఖాముఖి కలుసుకున్నారు. వారంతా కలిసి వ్యోమనౌకలో కాసేపు గడిపారు. స్పేస్సూట్కు కొలతలివ్వడంతో పాటు ప్రెజరైజేషన్ తదితర తప్పనిసరి పరీక్షల్లో వారంతా పాల్గొన్నారు. దీంతో వారందరికీ శిక్షణ ప్రక్రియ లాంఛనంగా మొదలైనట్టయింది. ఈ మిషన్కు నాసా వ్యోమగామి పెగీ వాట్సన్ సారథ్యం వహించనున్నారు. ఇందులో భాగంగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 10 రోజుల పాటు పలు ప్రయోగాలు, పరిశోధనల్లో గడుపుతారు. ప్రైవేట్ వ్యక్తులు, పరిశోధకులకు ఐఎస్ఎస్ సందర్శనకు వీలు కలి్పచేందుకు స్పేస్ ఎక్స్ తలపెట్టిన నవతరం వాణిజ్య అంతరిక్ష యాత్రల్లో ఆక్సియం స్పేస్ మిషన్ నాలుగోది. ఆక్సియం స్పేస్, స్పేస్ ఎక్స్, నాసా భాగస్వామ్యంతో ఈ ప్రయోగం జరుగుతోంది. -
15 వేల అడుగుల ఎత్తు నుంచి.. పోర్టబుల్ ఆస్పత్రి పారా–డ్రాప్
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, వైమానిక దళం కలిసి అరుదైన ఘనతను సాధించాయి. పోర్టబుల్ ఆస్పత్రి ‘ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్’ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా లక్షిత ప్రాంతంలో నేలపైకి దింపాయి. అత్యంత ఎత్తులో నుంచి విజయవంతంగా పూర్తి చేసిన ఈ పారా–డ్రాప్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్టమొదటిదని రక్షణ శాఖ తెలిపింది. ఇందులోని క్రిటికల్ ట్రామాకేర్ క్యూబ్లను భీష్మ(భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి)ప్రాజెక్టులో భాగంగా దేశీయంగానే రూపొందించినట్లు వెల్లడించింది. మారుమూల, అటవీ కొండ ప్రాంతాల్లో వరదలు వంటి ప్రకృతి విపత్తులు, అత్యవసర సమయాల్లో బాధితులకు అత్యంత వేగంగా, సమర్థమైన వైద్యసేవలను అందించే లక్ష్యంతో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పోర్టబుల్ ఆస్పత్రికి రూపకల్పన జరిగిందని వివరించింది. ఇందులోనున్న వసతులతో 200 మందికి వైద్య సేవలందించొచ్చని తెలిపింది. ఈ క్యూబ్ను అధునాతన రవాణా విమానం సీ–130జే సూపర్ హెర్క్యులస్ ద్వారా అనుకున్న చోట అనుకున్న విధంగా నేలపైకి సురక్షితంగా పారాడ్రాప్ చేసినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆర్మీ ఇందుకోసం అత్యాధునిక ప్రెసిషన్ డ్రాప్ సాంకేతికతను వినియోగించుకుందని తెలిపింది. -
భారత్ ‘తరంగ్ శక్తి’ యుద్ధవిన్యాసాలు (ఫోటోలు)
-
ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ‘తరంగ్ శక్తి’
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ‘తరంగ్ శక్తి 2024’ మొదటిదశ యుద్ధవిన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు ‘తరంగ్ శక్తి’ మంచి వేదికని మంగళవారం డీఆర్డీఓ ఛైర్పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్(స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్) డిజైన్ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్లను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి’ అని అన్నారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్లోని జోధ్పూర్లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్కు చెందిన సీ–130, ఫ్రాన్స్కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్కు చెందిన ఎఫ్–16, స్పెయిన్కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
Telangana: రెండు రోజులు వర్షాలే.. వర్షాలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఉదయం వాయుగుండం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి గురువారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ రెడ్అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ... మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచి్చంది. శుక్రవారం రాష్ట్రంలో సగటున 2.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్లో శుక్రవారం నాటికి రాష్ట్రంలో సగటున 25.76 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 31.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో ఒకరి గల్లంతు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం తానిçపర్తికి చెందిన బానారి రాజు (45) గోదావరిలో గల్లంతయ్యాడు. చేపల వేటకని గురువారం వెళ్లిన రాజు శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మహదేవపూర్ మండలం అన్నారం వైపు నుంచి దామెరకుంట వైపుగా ట్రాలీ ఆటో గుండ్రాత్పల్లి సమీపంలో గల అలుగువాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తమై ఆటో ఎక్కి అరవడంతో గమనించిన స్థానికులు రక్షించారు. -
ఆకాశమే హద్దుగా..
దేవరకొండ : శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుందన్న మాటను వంట బట్టిచ్చుకున్నాడు ఆ యువకుడు. అందరిలా కాకుండా తాను తనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పుడే తన తండ్రి దూరమైనా ఏ మాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా 24 ఏళ్ల వయస్సులోనే లెఫ్టినెంట్ పైలెట్ హోదా దక్కించుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవరకొండ మండలం ఉమ్మడి ముదిగొండ గ్రామం సీతారాంతండాకు చెందిన కొర్ర కుమార్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు అరవింద్ చౌహాన్. శనివారం హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ఫ్లయింగ్ ఆఫీసర్ల పాసింగ్ ఔట్ పరేడ్లో అరవింద్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ విఆర్.చౌదరి చేతుల మీదుగా ఆయన లెఫ్టినెంట్ పైలెట్ హోదా పొందారు. దీంతో గ్రామస్తులు అరవింద్ను అభినందిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..అరవింద్ చౌహాన్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు దేవరకొండలో పూర్తి చేశారు. 2013లో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీటు సంపాదించాడు. 2016లో యూపీఎస్సీ ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీయే) పరీక్షలో 175వ ర్యాంకు సాధించాడు. అనంతరం మూడేళ్లు పూణేలో శిక్షణ పొందుతూనే బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం నావల్ అకాడమీలో శిక్షణ తీసుకొని 2021మేలో ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యాడు. అనంతరం ఇటీవల ఇండియన్ ఏవియేషన్ బ్రాంచిలో నిర్వహించిన పరీక్షలో ఆయన పైలెట్గా ఎంపికై లెఫ్టినెంట్ హోదా పొందారు. అరవింద్కు 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి దూరమైనా తల్లి అన్నీ తానై చదివించింది. వారికి కుటుంబ సభ్యులైన బాబాయి విజయ్, మేనమామలు నేనావత్ రంగానాయక్, నేనావత్ జైపాల్ తోడ్పాటు అందించారు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుయువత పట్టుదలతో సాధించలేనిది ఏమిలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నేడు నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఇందుకు నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎనలేనిది. దేవరకొండ ప్రాంతానికి చెందిన యువత ఇండియన్ ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలపై దృష్టి సారించాలి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తలంపుతో యువత ముందుకు రావాలి. – అరవింద్ చౌహాన్ -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ (ఫొటోలు)
-
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
త్రివిధ దళాల హోలీ వేడుకలు.. (ఫోటోలు)
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
-
kargil: ఇండియన్ ఎయిర్ఫోర్స్ సరికొత్త రికార్డు
లడాఖ్: ఇండియన్ ఎయిర్ఫోర్స్(ఐఏఎఫ్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్పై సి-130జె విమానాన్ని ఎయిర్ఫోర్స్ తొలిసారిగా నైట్ల్యాండింగ్ చేసింది. ‘ఇటీవలే ఐఏఎఫ్ సి-130ని కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో తొలిసారి విజయవంతంగా రాత్రివేళ ల్యాండ్ చేశాం’అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ ప్రత్యేక బలగాల యూనిట్ ద గార్డ్స్ శిక్షణను కూడా ఈ ఫీట్లో భాగంగా ఐఏఎఫ్ కలిపి నిర్వహించడం విశేషం. నైట్ ల్యాండింగ్కు సంబంధించి మరిన్ని వివరాలను ఐఏఎఫ్ వెల్లడించలేదు. హిమాలయాల్లో 8800 మీటర్ల ఎత్తులో ఉన్న కార్గిల్ ఎయిర్ స్ట్రిప్లో విమానాలను ల్యాండ్ చేయడం పైలట్లకు సవాళ్లతో కూడుకున్న టాస్క్.అత్యంత ఎత్తుతో పాటు ప్రతికూల వాతావరణంలో విమానాలను ల్యాండ్ చేయాలంటే పైలట్లకు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాల్సిందే. గత ఏడాది నవంబర్లోనూ ఐఏఎఫ్ ఉత్తరాఖండ్లో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్పై లాక్హిడ్ మార్టిన్కు చెందిన సూపర్ హెర్క్యులస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా నైట్ ల్యాడింగ్ చేసింది. ఉత్తర కాశీ టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకుగాను ఈ విమానాలు భారీ ఇంజినీరింగ్ పరికరాలను మోసుకెళ్లాయి. ఇదీచదవండి.. ప్రతి శ్రీరామనవమికి అయోధ్యలో అద్భుతం -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్ఫోర్స్లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో నావిగేషన్ బ్రాంచ్లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్ఫోర్స్కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్ఫోర్స్కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
సాయుధ దళాలు.. వినూత్నంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సాయుధ దళాలలో సంప్రదాయ పద్ధతులకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే.. కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలు తేవాల్సిన అవసరం ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పారు. కొత్త ఆలోచనలు చేయకుండా చాలా కాలం ఒకే తరహా సంప్రదాయాలను అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. యువ అధికారులు తమలో నూతనత్వానికి, వినూత్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు పదునుపెట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ( ఇఎ్క) జరిగింది. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 213 ఫ్లైట్ కేడెట్లు (వీరిలో 25 మంది మహిళలు) పాల్గొన్నారు. గౌరవ వందనం స్వీకరించి.. పరేడ్కు సమీక్ష అధికారిగా రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొని యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యువ కేడెట్లు భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లో విధుల్లోకి చేరడానికి సూచికగా వారందరికీ అధికారిక హోదా కల్పిస్తూ రాష్ట్రపతి కమిషన్ (అధికారిక బ్యాడ్జ్లను)ను ప్రదానం చేశారు. తర్వాత రాజ్నాథ్సింగ్ ప్రసంగించారు. ‘‘నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సంప్రదాయాలు, ఆవిష్కర ణల మధ్య సమతుల్యత సాధించండి. సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే.. మనం ఎండిపోయిన సరస్సులా మారిపోతాం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. ఇందుకు సంప్రదాయంతోపాటు కొత్తదనాన్ని తీసుకురావాలి. వాయుసేన అధికారులుగా మీరు ఆకాశంలో ఎగురుతూ ఉండండి. ఎక్కు వ ఎత్తును తాకండి, కానీ నేలతో మీ సంబంధాన్ని కొనసాగించండి’’అని పిలుపునిచ్చారు. అకాడమీలో భారత వాయుసేనకు చెందిన అధికారులతోపాటు నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నుంచి 9 మంది, స్నేహపూర్వక దేశమైన వియత్నాం నుంచి ఇద్దరు అధికారులు కూడా ఫ్లయింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసి.. రక్షణ మంత్రి రాజ్నాథ్ నుంచి అవార్డులు అందుకున్నారు. శిక్షణలో టాపర్గా నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ రాష్ట్రపతి ఫలకాన్ని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ను రాజ్నాథ్ చేతులమీదుగా అందుకున్నారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్లలో మెరిట్లో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అమరీందర్ జీత్ సింగ్కు రాష్ట్రపతి ఫలకం లభించింది. అంతకుముందు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, యువ కేడెట్లతో ప్రమాణం చేయించారు. ఆకట్టుకున్న కవాతు శిక్షణలో ప్రథమస్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ అతుల్ ప్రకాశ్ ఆదివారం నాటి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా యువ ఫ్లయింగ్ కేడెట్లు చేసిన కవాతు ఆకట్టుకుంది. పరేడ్ అనంతరం భారత వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన అలరించింది. సారంగ్ హెలికాప్టర్ బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృంద విన్యాసాలు, సుఖోయ్–30 ఎంకేఐ గగనతల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎయిర్ఫోర్స్ అధికారులతోపాటు యువ ఫ్లయింగ్ ఆఫీసర్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. -
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్
-
మత్స్యకారులకు దొరికిన వాయుసేన మిస్సైల్
వేటపాలెం: మత్స్యకారుల వలకు మిలిటరీ వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది. ఈ ఘటన శుక్రవారం బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. దాన్ని మత్స్యకారులు బోటులో ఒడ్డుకు తీసుకొచ్చారు. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు బాపట్ల సూర్యలంకకు చెందిన ఎయిర్ఫోర్సు మిలిటరీ అధికారులకు సమాచారం అందించారు. ఏం జరిగిందంటే... సూర్యలంకకు చెందిన మిలటరీ అధికారులు ఏటా ఎయిర్ఫోర్సుకు చెందిన రిహార్సల్స్ నిర్వహిస్తుంటారు. ఈనెల 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సముద్ర గగనతలంలో అడ్వాన్స్డ్ మిస్సైల్ సిస్టంపై రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. చిన్నపాటి యుద్ధ మిస్సైల్ను ప్రయోగించి అది లక్ష్యం చేరుకోక ముందే సూర్యలంక కేంద్రం నుంచి పేట్రియాట్ మిస్సైల్తో దాన్ని పేల్చివేసే రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీన్లో భాగంగా ప్రయోగించిన ఈ మిస్సైల్ సముద్రంలో మత్స్యకారులకు దొరికింది. దాన్ని మెరైన్ అధికారుల సమక్షంలో ఎయిర్ఫోర్సు అధికారులకు అప్పగించారు. -
ఇంఫాల్ గగనతలంలో కలకలం.. రంగంలోకి రఫెల్
ఇంఫాల్: ఇంఫాల్ ఎయిర్పోర్టుపై గుర్తు తెలియని వస్తువు(యూఎఫ్ఓ)ను గాలించేందుకు భారత వాయుసేన రఫెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. హసిమారా నుంచి రెండు రఫెల్ విమానాలను ప్రయోగించింది. కానీ రఫెల్ విమానాలు ఆ అనుమానిత వస్తువును గుర్తించలేకపోయాయి. ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో తిరిగొచ్చాయని అధికారులు తెలిపారు. గగనతలంలో గుర్తుతెలియని వస్తువులు ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం సృష్టించాయి. రెండు గుర్తు తెలియని వస్తువులు మధ్యాహ్నం 2.30 నుంచి నాలుగింటి దాకా రన్వే పరిసరాల్లో ఎగురుతూ కనిపించినట్టు అధికారులు తెలిపారు. దాంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాన్ని మూసేశారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ మెకానిజంను యాక్టివేట్ చేసినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈస్టర్న్ కమాండ్ తెలిపింది. ఈ పరిణామాల తర్వాత ఆ వస్తువు కనిపించకుండా పోయిందని తెలిపారు. గుర్తు తెలియని వస్తువులను పసిగట్టడానికి వాయు సేన హషిమార నుంచి రఫెల్ యుద్ధ విమానాన్ని పంపించింది. అత్యాధునిక సెన్సార్లు కలిగిన ఈ విమానం అత్యంత ఎత్తులో గాలించినప్పటికీ ఎలాంటి వస్తువు కనిపించకపోవడంతో వెనక్కి వచ్చింది. కాసేపటికీ మరో రఫెల్ను అధికారులు పంపించారు. అప్పుడు కూడా ఎలాంటి వస్తువు కనిపించకలేదని అధికారులు తెలిపారు. యూఎఫ్వో కారణంగా మూడు గంటల పాటు విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు -
హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతం? అక్టోబరు 7 దాడుల మాస్టర్మైండ్?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 22వ రోజున ఇజ్రాయెల్ సైన్యం తాము భారీ విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబాను సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి రకాబా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, దాని అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఒక పోస్ట్ చేస్తూ, హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబా హత్యను ధృవీకరించింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండను ప్లాన్ చేయడంలో రకాబా కీలక పాత్ర పోషించాడని, అతను పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్లోకి చొరబడి, ఉగ్రవాదులకు ఆజ్ఞలు జారీ చేశాడని, డ్రోన్ దాడులకు బాధ్యుడని ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లోకి ప్రవేశించి, హమాస్ స్థానాలపై దాడి చేస్తూ వస్తోంది. హమాస్ను పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ హమాస్ను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్! Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 -
యుద్ధ విమాన పైలెట్గా కంగనా.. ట్రైలర్ అదిరిపోయింది!
ఇటీవలే చంద్రముఖి-2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం తేజస్. వైమానిక దళం పైలట్గా ఈ చిత్రంలో కంగనా కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తాజాగా తేజస్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇవాళ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. (ఇది చదవండి: యుద్ధ విమానం నడిపే పైలెట్గా కంగనా.. ‘తేజస్’ వచ్చేస్తుంది!) ట్రైలర్ చూస్తే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్లో కంగనా రనౌత్ని శక్తివంతమైన వైమానిక దళ పైలట్గా కనిపించారు. ఈ చిత్రంలో దేశం కోసం పోరాడుతూ వైమానిక దళంలో పని చేస్తున్న కంగనా వైమానిక యుద్ధ విన్యాసాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదంపై పోరాడే కథనే సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఈ చిత్రాన్ని సర్వేశ్ మెవారా దర్శకత్వంలో రూపొందించగా.. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర, ఆశిష్ విద్యార్థి, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 27, 2023న థియేటర్లలో సందడి చేయనుంది. -
President Draupadi Murmu: కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
సవాళ్లు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: భూమి, సముద్రం, గగనతల రక్షణలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ దళాలకు చెందిన ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. భారత వాయుసేనలో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఫైటర్ జెట్ పైలట్లలోనూ మహిళలు ఉండటం సంతోషకరమన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్’కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీ, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ కేడెట్లు, నేవీ, కోస్ట్గార్డ్కు చెందిన మరో ఎనిమిది మంది అధికారులు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు ఈ పరేడ్లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో రాష్ట్రపతి రివ్యూయింగ్ ఆఫీసర్గా పాల్గొనడం వాయుసేన చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కేడెట్ల నుంచి రాష్ట్రపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారిని అవార్డులతో సత్కరించారు. వైమానిక దళం ఎంతో సేవ చేసింది భారత వాయుసేనలో ఉద్యోగ జీవితం సవాళ్లతో కూడుకోవడంతోపాటు ఎంతో గౌరవప్రదమైందని రాష్ట్రపతి చెప్పారు. దేశ సేవకోసం తమ పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, కేడెట్లను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన అకాడమీ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సుఖోయ్ యుద్ధ విమానంలో భూమి నుంచి 2 కిలోమీటర్ల ఎత్తులో, గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘1948, 1965, 1971లలో జరిగిన యుద్ధాల్లో దేశాన్ని రక్షించడంలో భారత వైమానిక దళానికి చెందిన వీరులు పోషించిన గొప్ప పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. కార్గిల్ పోరాటంలో, బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాన్ని నాశనం చేయడంలో అదే సంకల్పాన్ని, నైపుణ్యాన్ని చూపారు. అందుకే భారత వైమానిక దళానికి వృత్తి నైపుణ్యం, అంకితభావానికి మారుపేరన్న ఖ్యాతి ఉంది. విపత్తుల సమయంలో మానవత్వంతో సాయం చేయడంలోనూ భారత వాయుసేనకు గొప్ప పేరుంది’ అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. భవిష్యత్ యుద్ధరంగంలో అత్యాధునిక సాంకేతికత ముఖ్య భూమిక పోషిస్తుందని. ఈ నేపథ్యంలో రఫెల్ యుద్ధ విమానాలు, చినోక్ హెవీ లిఫ్ట్ చాపర్ల వంటి సాధన సంపత్తిని వాయుసేన సమకూర్చుకుంటోందని చెప్పారు. ఆకట్టుకున్న ఎయిర్ షో పరేడ్ అనంతరం నిర్వహించిన ఎయిర్షో ఆకట్టుకుంది. పిలాటస్ పీసీ–7 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ ఎస్యూ–30, సారంగ్ హెలికాప్టర్లు, సూర్యకిరణ్ ఎరోబాటిక్ బృందాల గగనతల ప్రదర్శనలు అలరించాయి. గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. -
నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: రాష్ట్రపతి ముర్ము
సాక్షి, హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రామానికి రివ్యూయింగ్ ఆఫీసర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. గ్రాడ్యుయేట్స్ నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్లో సుఖాయ్ జెట్లో ప్రయణించడం తనకు చాలా గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందన్నారు. చదవండి: అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ -
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్
-
సొంత నగరంపైనే రష్యా బాంబింగ్
మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న వేళ రష్యా వైమానిక దళం పొరపాటున సరిహద్దుల్లోని సొంత నగరంపైనే భారీ బాంబు వేసింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని బెల్గొరొడ్ నగరంలోని అపార్టుమెంట్కు సమీపంలో తమ బాంబర్లు అనుకోకుండా ఒక బాంబు వేసినట్లు రష్యా మిలటరీ ధ్రువీకరించింది. ఈ ఘటనతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సుమారు 500 కిలోల బరువైన శక్తివంతమైన బాంబు పేలి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా ఒక వ్యక్తి హైబీపీతో ఆస్పత్రి పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
అమెరికా ఎయిర్ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా చౌధరి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ ఫ్లైట్ టెస్ట్ ఇంజినీర్ రవి చౌధరి చరిత్ర సృష్టించారు. అమెరికా రక్షణ శాఖలో ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయ అమెరికన్ ఈయనే. రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్లోని ఈ అత్యున్నత పదవికి రవి చౌధరిని నామినేట్ చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన సిఫారసును సెనేట్ 65–29 ఓట్ల తేడాతో బుధవారం ఆమోదించింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన డజనుకు పైగా సభ్యులు సైతం రవి చౌధరికి మద్దతివ్వడం విశేషం. రవి అమెరికా ఎయిర్ ఫోర్స్లో 1993–2015 నుంచి 22 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఆపరేషనల్, ఇంజినీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్మెంట్లు వంటి వైవిధ్యమైన అంశాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ)లోని అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి డైరెక్టర్ కూడా వ్యవహరించారు. సి–17 పైలట్గా అఫ్గానిస్తాన్, ఇరాక్ యుద్ధ విధుల్లో పాలుపంచుకున్నారు. సిస్టమ్స్ ఇంజినీర్ కూడా అయిన చౌధరి నాసాలోనూ పనిచేశారు. -
రాజా చారికి బ్రిగేడియర్ జనరల్ హోదా
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యోమగామి, కల్నల్ రాజా జె.చారి(45) ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ఎంపికయ్యారు. ఈ హోదాకు ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ నియమాకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అధ్యక్షుడు జరిపే అన్ని పౌర, సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజా చారి టెక్సాస్లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ–3 కమాండర్, ఆస్ట్రోనాట్గా ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసా చారి తెలంగాణకు చెందిన వారు. ఆయన హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదివి అమెరికాకు చేరుకున్నారు. వాటర్లూలోని జాన్ డీర్ సంస్థలో పనిచేశారు. రాజా చారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ, మేరీల్యాండ్లోని యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్గా, ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్కు డైరెక్టర్గాను వ్యవహరించారు. రాజా చారి తన కెరీర్లో 2,500 గంటలకు పైగా ఫ్టైట్ టైంను సాధించారు. అమెరికా ఎయిర్ఫోర్స్లో బ్రిగేడియర్ జనరల్(బీడీ) ఒన్ స్టార్ జనరల్ ఆఫీసర్ స్థాయి. ఇది కల్నల్కు ఎక్కువ, మేజర్ జనరల్ స్థాయికి తక్కువ. -
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైదరాబాద్ చేరుకున్న ‘ఫ్లయింగ్ రాబిట్స్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 11వ ఆర్మీ సర్వీస్ కార్ప్స్ రీయూనియన్ వేడుకల్లో భాగంగా నవంబర్ 30న గయలో ప్రారంభమైన ఆర్మీ మైక్రోలైట్ ఎక్స్పెడిషన్ బృందం ఆదివారం హకీంపేట్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరింది. ఈ బృందం 17 రోజుల్లో 5000 కి.మీ ప్రయాణించనుంది. సాహసయాత్రలను చేపట్టే ‘ఫ్లయింగ్ రాబిట్స్’బృందంతో గయలోని నోడల్ సెంటర్ (మైక్రోలైట్) ఆర్మీ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను ప్రారంభించారు. ఇందులోభాగంగా తక్కువ బరువున్న నాలుగు విమానాలు బిహార్, ఉత్తరప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మైదాన ప్రాంతాల మీదుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ పయనిస్తాయి. హైదరాబాద్కు చేరిన ఫ్లయింగ్ రాబిట్స్ బృందానికి ఆర్మీ ఆధ్యర్యంలో ఘనస్వాగతం పలికారు. -
అమెరికా-దక్షిణ కొరియాల స్ట్రాంగ్ కౌంటర్! ఉత్తరకొరియా ఫైర్
ఉత్తరకొరియా గతవారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా దక్షిణ కొరియాలు తమ ఉమ్మడి వైమానిక దళ విన్యాసాలతో ఉత్తర కొరియాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాయి. ఈ విషయమై ఉత్తర కొరియా చాలా గట్టిగా ప్రతి స్పందించింది. దీన్ని ఉత్తర కొరియా ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించి. అంతేగాదు తమను లక్ష్యంగా చేసుకుని ఇలా దూకుడుగా విన్యాసాలు చేపట్టిందని మండిపడింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఇలా చేస్తుందంటూ సీరియస్ అయ్యింది. ఈ విన్యాసాల వల్ల ప్రంపచానికి ఎలాంటి ముప్పు ఉండదంటూ ఉత్తర కొరియా వ్యాఖ్యలను కొట్టిపారేసింది అమెరికా. వైమానిక దళ స్థావరాలపై దాడుల జరిపే బాలిస్టిక్ క్షిపణులతో సహా శత్రు విమానాలను ధ్వంసం చేసే విన్యాసాలను కూడా ప్రాక్టీస్ చేసినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ విషయమై సుమారు 500 విమానాలతో ఉత్తర కొరియా ఒక భారీ కంబాట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది. అంతేగాదు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేసింది. విజిలెంట్ స్టార్మ్ వంటి వైమానికి విన్యాసాలను ఉత్తర కొరియా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే వైమానిక దళం పరంగా ఉత్తర కొరియా చాలా బలహీనంగా ఉంటుంది. వాస్తవానికి ఉత్తర కొరియా వద్ద ఉన్న యుద్ధ విమానాల కంటే యూఎస్ దక్షిణ కొరియాల వద్ద ఉన్న విజిలెంట్ స్టార్మ్ ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్లతో సహా అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. అందువల్లే ఈ వైమానికి విన్యాసాల విషయంలో ఉత్తరకొరియా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. అదీగాక ఉత్తర కొరియ గతవారం వరుస క్షిపణి ప్రయోగాల దృష్ట్యా యూఎస్ దక్షిణ కొరియాలు ఈ విన్యాసాలను ఒకరోజు పొడిగించారు. దీంతో ఉత్తర కొరియా దీన్ని వార్ రిహార్సిల్స్ అంటూ గగ్గోలు పెడుతోంది. అదీగాక దక్షిణ కొరియా కంప్యూటర్ ఆధారిత మిలటరీ విన్యాసాన్ని కూడా సోమవారమే ప్రారంభించింది. ఉత్తర కొరియా బెదిరింపులకు తలొగ్గకుండా ఉండేలా తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది దక్షిణ కొరియా. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ నటనలో షారుక్, సల్మాన్లను మించిపోయారు) -
అట్టహాసంగా 90వ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు
-
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం ప్రస్తుతం ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఛత్తీస్గడ్ వైపు కదులుతూ వచ్చే కొద్దిగంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. మంగళవారం కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
త్రివిధ దళాల్లో అగ్నిపథ్ నియామకాలు
-
దేశీయంగా 100 యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా దాదాపు 100 అత్యాధునిక యుద్ధ విమానాలను దేశీయంగా తయారు చేసే దిశగా వాయుసేన భారీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలతో చర్చిస్తోంది. ఈ ప్రాజెక్టులో 70 శాతం భారత కరెన్సీనే వాడేలా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల మేకిన్ ఇండియా ప్రాజెక్టు మరింత బలోపేతం కానుందన్నాయి. ‘‘భారత్లో 96 యుద్ధ విమానాల తయారీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 36 విమానాల తయారీకి మన కరెన్సీతో పాటు విదేశీ మారక ద్రవ్యమూ చెల్లిస్తాం. 60 విమానాల చెల్లింపులకు పూర్తిగా భారత్ కరెన్సీనే వాడతాం’’ అన్నాయి. -
‘10 టన్నుల’ హెలికాప్టర్లపై దృష్టి పెట్టాలి
కంటోన్మెంట్(హైదరాబాద్): దేశ రక్షణ, భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అన్నారు. హకీంపేట ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ‘చేతక్’హెలికాప్టర్ డైమండ్ జూబ్లీ కాన్క్లేవ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేతక్.. దేశానికి సేవలందించిన గొప్ప యుద్ధవిమానం. రాణాప్రతాప్ గుర్రాన్ని గుర్తు చేసుకునేలా ఈ హెలికాప్టర్కు ‘చేతక్’అనే నామకరణం చేశారు. ఇది ఎప్పటికప్పుడూ రూపాంతరం చెందుతూ నేటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్.. ఐదు టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల డిజైన్, డెవలప్మెంట్, ఆపరేషన్లతో సత్తా చాటింది. ఇక 10 టన్నుల సామర్థ్యం కలిగిన హెలికాప్టర్ల రూపకల్పనపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ‘ఆత్మ నిర్భరత’ను సాధించాల్సిన అవసరం ఉంది. దేశీయ ఆయుధ సంపత్తి, సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ మేరకు రక్షణ దళాలు, శాస్త్రవేత్తలు, రక్షణ ఉత్పత్తిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దేశీయ పరిశ్రమలకు సైతం డీఆర్డీఓ ద్వారా శాస్త్ర, సాంకేతిక సహకారం అందించనుంది. ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. భారత్ ఏనాడూ అధికారం, ఆక్రమణ, ఆధిపత్యం కోసం యుద్ధం చేయలేదు. ప్రజాస్వామ్యం, మానవత్వ పరిరక్షణ కోసమే యుద్ధం చేసింది. ఈ కాన్క్లేవ్ దేశ సేవలో అమరులైన వారికి ఘన నివాళి వంటింది’అని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సహా త్రివిధ దళాల హెలికాప్టర్ విభాగం ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, హెచ్ఏఎల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ ఫొటోలు
-
అమెరికాకూ మన ‘రెక్కలు’
ఇబ్రహీంపట్నం రూరల్: అమెరికాకు చెందిన ఎఫ్–16 రకం యుద్ధవిమానాలు మేడిన్ హైదరాబాద్, మేడిన్ ఇండియా రెక్కలు (ఫైటర్ వింగ్స్) తొడుక్కోనుండటం గర్వకారణమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. ఈ రెక్కల తయారీలో ఉపయోగించే పరికరాల్లో 70 శాతం భారత్వే కావడం విశేషమన్నారు. ఫైటర్ వింగ్స్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధించడం అభినందనీయమన్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఏరోస్పేస్ సంస్థ లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్ భారత్లో తమ అనుబంధ సంస్థ టాటా–లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్)ను ఎఫ్–16 యుద్ధవిమానాల రెక్కల తయారీ సహ భాగస్వామిగా లాంఛనంగా గుర్తించింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న టీఎల్ఎంఏఎల్ కేంద్రం తమ మొట్టమొదటి నమూనా యుద్ధవిమాన రెక్కను తయారు చేసి లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్కు అప్పగించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఈ రంగం ఐదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించిందన్నారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానం ద్వారా తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఏరోస్పేస్ రంగంలో 2020లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఎండీ సీఈఓ సుకరణ్సింగ్ మాట్లాడుతూ తమ భాగస్వామ్యంలో విజయవంతంగా ఫైటర్ వింగ్ను తయారు చేయగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో లాక్హీడ్ మార్టిన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ బ్లెయిర్, వైస్ ప్రెసిడెంట్ కంబాట్ ఎయిర్, ఇంటిగ్రేటెడ్ పైటర్ గ్రూప్ ఐమీ బర్నెట్, యుఎస్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్ ) జోయెల్ రీఫ్మాన్లు పాల్గొన్నారు. -
afghanistan Crisis: తాలిబన్లు ఎలా గెలిచారంటే!
ఇరవైఏళ్ల పాటు ఆధునిక పాశ్చాత్య బలగా ల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకు పైగా బలగం.. ఇన్ని ఉన్నా కనీస ప్రతిఘటన లేకుండా అఫ్గాన్ సేన తాలిబన్లకు తలొగ్గింది. తమ బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు వశం చేసుకోవచ్చన్న అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 10 రోజుల్లో అఫ్గాన్ సైన్యం లొంగిపోయిన తీరు అందరినీ నివ్వెర పరుస్తోంది. ఎందుకిలా జరిగిందనే ప్రశ్నకు ముందుగా వినిపిస్తోన్న సమాధానం.. అవినీతి! ఇరవైఏళ్లుగా అఫ్గాన్ సైన్యంలో అవినీతి తారాపథానికి చేరింది. సామాన్య సైనికుడి నుంచి అత్యున్నత అధికారి వరకు అంతా లంచాలు మరిగారు. ప్రపంచ దేశాలు ఇచ్చిన నిధులన్నీ అధికారులు దిగమింగి కూర్చున్నారు. దీంతో కీలక సమయంలో సైన్యమంతా చేతులెత్తేసింది. రెండు దశాబ్దాలు అఫ్గాన్లో ఉన్న పాశ్చాత్య సేనలు అఫ్గాన్లో అవినీతి చూసి విస్తుపోయారంటే అతిశయోక్తి కాదు. స్వయంగా ఆదేశ ఇనస్పెక్టర్ జనరలే తమ దేశ బలగాలకు లంచమనే కేన్సర్ రోగం పట్టిందని చెప్పినట్లు యూఎస్ కాంగ్రెస్ నివేదిక చెబుతోంది. అఫ్గాన్ సెక్యూరిటీకి దాదాపు 880 కోట్ల డాలర్లను యూఎస్, నాటో దళాలు వెచ్చించాయి. కానీ చివరకు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కీలక సమయంలో సాయం చేస్తుందనుకున్న అఫ్గాన్ ఎయిర్ఫోర్స్ కూడా చేతులెత్తింది. అఫ్గాన్ వైమానిక దళంలో దాదాపు 211 విమానాలున్నాయి. కానీ వీటిని నడిపేందుకు అవసర సిబ్బంది, వీరిని ప్రేరేపించే నాయకులు లేకుండా పోయారు. అందువల్ల కాబూల్లోకి తాలిబన్లు వస్తున్నా ఒక్క యుద్దవిమానం కూడా ఎదిరించలేదు. అవినీతితో పాటు అఫ్గాన్ సేనల్లో పిరికితనం పాలు ఎక్కువైందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా తాలిబన్లతో జరిపిన పోరాటాల్లో చాలామంది గాయపడడం, వీరి స్థానంలో సరిపడ కొత్త సైన్యం భర్తీ కాకపోవడం కూడా ఓటమికి మరో కారణంగా చెప్పారు. బయటి మద్దతు కేవలం అఫ్గాన్ సేనల్లో అవినీతి మాత్రమే తాలిబన్ల విజయానికి కారణం కాదన్నది నిపుణుల మాట. ఒకప్పుడు తాలిబన్లను గట్టిగా వ్యతిరేకించిన స్థానిక తెగల నాయకులు, ప్రజలు ఈ దఫా తాలిబన్లకు సహకారం అందించారు. 2 దశాబ్దాలు అమెరికా ఆధ్వర్యంలో పాలన జరగడం చాలా తెగలకు నచ్చలేదు. దీంతో వీరిని తాలిబన్లు తమవైపునకు తిప్పుకున్నారు. అందుకే చాలా ప్రాంతాల్లో తాలిబన్లు గట్టిగా పోరాడకముందే విజయం లభించింది. తాలిబన్లకు పాక్ మద్దతుంది.. వీటికి యూఏఈ, ఖతార్, సౌదీ నుంచి వచ్చిన విరాళాలు, రష్యా, చైనాల పరోక్ష సహకారం, ఓపియం పంటతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగడం తదితర కారణాలు తాలిబన్లకు గెలుపునందించాయి. పాకిస్తాన్ గతంలోలా పీఓకే గుండా ఉగ్రతండాలను తాలిబన్ సహకారంతో భారత్లోకి పంపిస్తుందన్న ఆందోళనలు పెరిగాయి. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఆక్సిజన్ కోసం సీ-17 ఎయిర్క్రాఫ్ట్ ఒడిశాకు పంపిన తెలంగాణ ప్రభుత్వం
-
సీఎంలతో సమావేశం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అవసరమైన ప్రాణవాయువు (ఆక్సిజన్) రవాణాలో వేగం పెంచామని, ఇందులో భాగంగా వైమానిక దళం, రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ కొరతపై ముఖ్యమంత్రుల విజ్ఞప్తులను మోదీ ఆలకించారు. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే వనరుల కొరత అనే మాటే ఉండదని తేల్చిచెప్పారు. పారిశ్రామిక ఆక్సిజన్ను కూడా తక్షణ అవసరాలకు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్గా మార్చి, ఆసుపత్రులకు పంపిస్తున్నట్లు గుర్తుచేశారు. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, సమన్వయం చేసుకోవాలని ప్రధాని కోరారు. ఆక్సిజన్, అత్యవసర ఔషధాల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్కడా ఆగిపోకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరా తీరును పరిశీలించేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆక్సిజన్ ట్యాంకర్ల ప్రయాణ సమయాన్ని, ఖాళీ ట్యాంకర్లు వెనక్కి వచ్చే సమయాన్ని తగ్గించడానికి అన్ని అవకాశాలను పరిశీలించి, అమలు చేస్తున్నామన్నారు. ఏమీ చేయలేకపోతున్నా: కేజ్రీవాల్ ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా కల్లోలాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రధానికి నివేదించారు. ‘‘పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రజలను వారి చావుకు వారిని వదిలేయలేం. ఢిల్లీ ప్రజల తరపున చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. వెంటనే తగిన చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి మరింత విషమిస్తుంది. కొన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ రావాల్సి ఉండగా.. ఆ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాల్లో ఆపేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలకు ఒక్క ఫోన్ చేయండి.ఆ వాహనాలను ఆపొద్దని చెప్పండి. ముఖ్యమంత్రి అయి ఉండీ ఏం చేయలేకపోతున్నా. కరోనా నుంచి దేశాన్ని కాపాడేందుకు ఒక జాతీయ ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళికలో అన్ని ఆక్సిజన్ ప్లాంట్లను ఆర్మీ రక్షణలో ఉంచాలి’’ అని కోరారు. అయితే, ఈ సమావేశానికి సంబంధించి కేజ్రీవాల్ ప్రసంగాన్ని ఢిల్లీ ప్రభుత్వం మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి. గతంలో కూడా సమావేశాలు ప్రసారమయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తుచేసింది. ఒకవేళ ఇబ్బంది కలిగించి ఉంటే అందుకు విచారం వ్యక్తంచేస్తున్నామని పేర్కొంది. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం చాలా ఉందని ప్రధాని మోదీ చెప్పారు. డిమాండ్ను తీర్చడానికి పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయాలని ఆక్సిజన్ ఉత్పత్తిదారులకు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సవాళ్లతో కూడిన ఈ సమయంలో తగిన పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. ప్రభుత్వం, ఆక్సిజన్ ఉత్పత్తిదారుల మధ్య సమన్వయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వైద్య అవసరాలను తీర్చడానికి పారిశ్రామిక ఆక్సిజన్ను మళ్లించడం గొప్ప పని అని కొనియాడారు. ఆక్సిజన్ సరఫరా కోసం ఇతర వాయువులను రవాణా చేయడానికి ఉద్దేశించిన ట్యాంకర్లను ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్ చేరవేతకు రైల్వేలు, వైమానిక దళం సేవలను ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని గుర్తుచేశారు. ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమలు, రవాణాదారులు, అన్ని ఆస్పత్రులు ఏకతాటి పైకి వచ్చి కలిసి పని చేయాలన్నారు. -
తెలంగాణ ఆదర్శం: వాయువేగాన ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటం, పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో బాధితులు చనిపోతుండటం నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆస్ప త్రుల్లో ఆక్సిజన్ కొరత లేకపోయినా.. మున్ముందు పరిస్థితులు విషమిస్తే ఎలాగన్న ఆలోచనతో చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒడిశాలోని ప్లాంట్ల నుంచి మన రాష్ట్రానికి కేటాయించిన లిక్విడ్ ఆక్సిజన్ను ఎయిర్ఫోర్స్ సహాయంతో వేగంగా దిగుమతి చేసుకుంటోంది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 ఎయిర్క్రాఫ్ట్లలో తొమ్మిది ఆక్సిజన్ ట్యాంకర్లను హైదరాబాద్ నుంచి ఒడిశాకు పంపారు. అవి అక్కడ ఆక్సిజన్ నింపుకొని ఈ నెల 27వ తేదీలోగా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి ట్యాంకర్లను ఒడిశాకు పంపే ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసుకున్నామని, ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొరత రాలేదని మంత్రి ఈటల చెప్పారు. భవిష్యత్తులో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు అధిక విలువ ఇస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పారు. కాగా.. రాష్ట్రానికి దాదాపు 400 టన్నుల ఆక్సిజన్ కావాల్సి ఉండగా.. కేంద్రం 250-270 టన్నుల మేర ఆక్సిజన్ కేటాయించిందని అధికారవర్గాలు తెలిపాయి. ఖాళీ ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి రావడానికి వారం, పది రోజులకుపైగా పడుతుందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ రాగానే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన మేరకు సరఫరా చేయనున్నారు. వైమానిక దళం వింగ్ కమాండర్ చైతన్య నిఝవాన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ట్యాంకర్ల తరలింపు పని చేపడుతున్నారు. ఎయిర్ఫోర్స్ విమానాల ద్వారా ఆక్సిజన్ రప్పించేందుకు రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, సర్ఫరాజ్ అహ్మద్, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతీ మీనా కృషి చేశారని ప్రభుత్వం వివరించింది. సచివాలయ సందర్శకులపై ఆంక్షలు రాష్ట్ర సచివాలయంలో కరోనా బారినపడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడంతో.. ప్రభుత్వం సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తాత్కాలిక పాసులు, రోజువారీ పాసులు తీసుకుని సచివాలయంలోకి వచ్చే సందర్శకులను ఇకపై అనుమతించరు. ఆ పాసులను సస్పెండ్ చేశారు. సచివాలయంలోకి రావాలనుకునేవారు ముందుగా సంబంధిత అధికారి అనుమతి తీసుకుని, ఆ అధికారి వద్దకు మాత్రమే వచ్చి వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సచివాలయంలోని ఇతర సెక్షన్లు, అధికారుల దగ్గర వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్లైన్లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్కు సంబంధించి షార్ట్ ట్రిక్స్ను ఉపయో గించి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లో జాబ్స్ -
అది ఎయిర్ఫోర్స్ మిస్సైల్ శకలం
విడవలూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పెదపాళెం తీరంలో శనివారం బయటపడింది జెట్ విమాన శకలం కాదని, ఎయిర్ఫోర్స్ మిస్సైల్ అని మెరైన్ అధికారులు నిర్థారించారు. ఇస్కపల్లి మెరైన్ సీఐ పెంచలరెడ్డి, ఎస్ఐలు రసూల్ సాహెబ్, మహేంద్రలు ఆదివారం శకలాలను పరిశీలించారు. సీఐ పెంచలరెడ్డి మాట్లాడుతూ..‘ఇది గుంటూరు జిల్లా సూర్యలంక తీరం నుంచి గతంలో ఎయిర్ఫోర్స్ అధికారులు ప్రయోగించిన మిస్సైల్’ అని చెప్పారు. దీన్ని సముద్రంపై ఎంత ఎత్తులో గాలి ఉంటుందో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. ఇలాంటివి 3 ప్రయోగించగా, ఇప్పటికి 2 లభించాయని, తాజాగా విడవలూరు మండల తీర ప్రాంతంలో మరొకటి లభించిందన్నారు. దీన్ని ఇస్కపల్లి మెరైన్ పోలీస్స్టేషన్కు తరలించి మెరైన్ అధికారులకు సమాచారమిచ్చామని, త్వరలోనే వారు దీనిని తీసుకువెళతారని చెప్పారు. -
హ్యాపీ ల్యాండింగ్ : రఫేల్ జెట్స్ వచ్చేశాయ్!
-
భారత్కు బయల్దేరిన రఫేల్ విమానాలు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలు జూలై 29న భారత్ చేరనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరినట్లు ఫ్రాన్స్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు. ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరనున్నాయి. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్బేస్లో ఫ్రాన్స్ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. #WATCH Rafale jets taking off from France to join the Indian Air Force fleet in Ambala in Haryana on July 29th. (Video source: Embassy of India in France) pic.twitter.com/UVRd3OL7gZ — ANI (@ANI) July 27, 2020 ఇక భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లేతో ఫోన్లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్నాథ్కు పార్లే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచనుంది. -
ఎయిర్ఫోర్స్ అధికారికి కరోనా.. ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగి ఒకరు ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నాగేంద్ర ఎయిర్ఫోర్స్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతడికి కరోనా పాజిటివ్గా తేలింది. దాంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం నాగేంద్ర ఆస్పత్రి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో చెట్ల మీద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన సిబ్బంది నాగేంద్రను ఆస్పత్రిలోకి తీసుకెళ్లి చికిత్స చేశారు. వైద్యం పొందుతూ అతడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (సొంతూరికెళ్లి...వీధులన్నీ తిరిగి) -
త్రివిధ దళాలకు మోదీ సూచనలు: రావత్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్మీ, నేవీ, వైమానిక దళాలకు తగు సూచనలిస్తున్నారని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేబినెట్ కార్యదర్శులు చర్చలు జరుపుతున్నారని, దీనికి అనుగుణంగా ప్రధాని నరేంద్రమోదీ సైతం ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు అనుసరించిన వ్యూహాలపై సలహాలు, సూచనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రక్షణ మంత్రి త్రివిధ దళాల చీఫ్ కమాండర్తో సమీక్ష నిర్వహిస్తూ సైన్యం సంసిద్ధత గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు. మరోవైపు సరిహద్దులో ఉన్న ఆర్మీ, నేవీ, వైమానిక అధికారులకు కరోనా సోకలేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ త్రివిధ దళాల సర్వీసుల శిక్షణ బాగానే జరుగుతోందన్నారు. అయితే వీటికి అవసరమయ్యే ఆయుధాలు, సామాగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని రావత్ వెలిబుచ్చారు. దీనికోసం రానున్న కాలంలో మేక్ ఇన్ ఇండియా నినాదంతో, ఐఐటీలు, ప్రైవేటు పరిశ్రమలు, త్రివిధ దళాలతో కలిసి పని చేయాలన్నారు. తద్వారా దిగుమతులు తగ్గుముఖం పట్టి, రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కరోనా పోరాటంలో తమ కంపెనీలు ముందుకొచ్చి సాయం చేస్తున్నాయని, అందులో భాగంగా కొన్ని కంపెనీలు వెంటిలేటర్లను అందించగా డీఆర్డీఓ ఎన్99 మాస్కులను రూపొందించిందని తెలిపారు. (అమెరికా తరహా వ్యూహాలను అమలుపరచాలి: రావత్) -
సీడీఎస్ గరిష్ట వయో పరిమితి 65 ఏళ్లు
న్యూఢిల్లీ: రక్షణ బలగాల అధిపతి(సీడీఎస్) బాధ్యతలు చేపట్టే వ్యక్తి గరిష్ట వయో పరిమితిని కేంద్రం 65 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు సైనిక, నేవీ, వైమానిక దళం నిబంధనలు–1954లో మార్పులు చేస్తూ రక్షణ శాఖ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులను నియమించిన సందర్భాల్లో ఈ నిబంధన వర్తిస్తుంది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ప్రధాన సలహాదారుగా సీడీఎస్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేబినెట్ భేటీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రివిధ దళాల అధిపతులు గరిష్టంగా మూడేళ్లపాటు, లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. కాగా, దేశ మొట్టమొదటి సీడీఎస్గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ను ప్రభుత్వం మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కాగా, సీడీఎస్గా చేపట్టే వ్యక్తే చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్ పర్సన్గానూ కొనసాగుతారు. -
వాయుసేన చీఫ్కు తప్పిన ముప్పు
హోనోలులు: అమెరికా పర్యటనలో ఉన్న భారత్ ఎయిర్చీఫ్ మార్షల్ రాకేష్ భదౌరియాకు ముప్పు తప్పింది. హవాయి దీవుల్లోని పెరల్ హార్బర్లో బుధవారం ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో భద్రతపై వివిధ దేశాల వైమానిక దళ మార్షల్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అదే సమయంలో ఒక నావికుడు పెరల్ హార్బర్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందారు. కాల్పులు జరిపాక ఆ నావికుడు తనను షూట్చేసుకుని చనిపోయాడు. కాగా, భదౌరియా సురక్షితంగా ఉన్నారని భారత వైమానిక దళం వెల్లడించింది. పెరల్ హార్బర్లో అమెరికా వైమానిక దళ కేంద్రంలో ఈ సదస్సు జరిగే సమయంలో దగ్గర్లోని నావికాదళ కేంద్రంలో కాల్పుల ఘటన జరిగిందని వాయుసేన అధికారి చెప్పారు. కాల్పులకు కారణాలు తెలియాల్సి ఉందని హవాయి ప్రాంత నావికా దళ కమాండర్ అడ్మిన్ రాబర్ట్ చెప్పారు. 1941 డిసెంబర్ 7న జపాన్ పెరల్ హార్బర్పై జరిపిన దాడికి 78ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అక్కడ నివాళులరి్పంచడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ కాల్పుల ఘటన జరగడంతో అమెరికాలోనూ కలకలం రేగింది. -
పాక్ మ్యూజియంలో అభినందన్ బొమ్మ
కరాచీ: భారత్పై విషప్రచారం చేయడంలో ఏ అవకాశాన్నీ వదులుకోని పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. కరాచీలోని పాకిస్తాన్ వైమానికదళ యుద్ధ మ్యూజియంలో భారత వైమానికదళ వింగ్కమాండర్ వర్ధమాన్ బొమ్మను ప్రదర్శించింది. వర్ధమాన్ చుట్టూ పాక్సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచింది. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో అతను నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది. అతను సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల అనంతరం అభినందన్ను తిరిగి భారత్కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్లోధీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘అభినందన్ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్ పాకిస్తాన్ అదుపులో ఉన్నప్పుడు పాక్ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కోస్తా తీరంలో త్రివిధ దళాల కసరత్తు
సాక్షి, కాకినాడ : సాగరతీరంలో త్రివిధ దళాల విన్యాసాల కసరత్తు నిర్వహించేందుకు ఆర్మీ, నేవీ సిబ్బంది కోస్తా తీరాన్ని తమ ఆధీనంలో తీసుకున్నారు. మంగళవారం కాకినాడ సూర్యారావుపేట బీచ్లో యుద్ధట్యాంకర్లతో సైనికులు ట్రైల్రన్లు, గస్తీలు నిర్వహిస్తున్నారు. కాకినాడ బీచ్లో నేవెల్ ఎన్క్లేవ్ వద్ద ఈనెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఇండో–అమెరికా త్రివిధ దళాల విన్యాసాల కోసం రెండు రోజులుగా కసరత్తులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ఆస్తి, ప్రాణనష్టం నివారణ కోసం, దేశరక్షణ, యుద్ధ సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ దళాల ఆధ్వర్యంలో నిర్వహించే విన్యాసాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం విశాఖ నేవెల్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘర్మోడే ఆధ్వర్యంలో స్కై డ్రైవింగ్ చేసిన ఎనిమిది మంది కమాండోలు పారాచూట్లతో సాగరతీరంలో దిగారు. యుద్ధనౌకలు ఇన్షోర్, ఆఫ్షోర్, కేజీ బేసిన్ వంటి ఆయిల్ క్షేత్రాల రక్షణ కల్పించడంలో ఆర్మీ సిబ్బంది చేసిన కసరత్తు ఆకట్టుకుంది. యుద్ధ సమయంలో శత్రుదేశాలకు చెందిన యుద్ధ నౌకలు, ఆయిల్ రిగ్లను నాశనం చేసేందుకు జెమినీ బోట్లలో వచ్చిన కమాండోలను సివరింగ్ ఆపరేషన్ ద్వారా సమర్థంగా తిప్పికొటిన ఆపరేషన్, సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు హెలికాఫ్టర్ ద్వారా చేసిన ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు, నేవీ క్రాస్ డెకింగ్, ఆర్మీ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కసరత్తులో త్రివిధ దళాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐఏఎఫ్ అధికారులకు కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ: సొంత క్షిపణి దాడి కారణంగా భారత వైమానిక దళ చాపర్ కూలిపోయిన ఘటనలో ఇద్దరు ఎయిర్ఫోర్స్ అధికారులు కోర్టు మార్షల్ ఎదుర్కోనున్నారు. పీఓకేలోని బాలకోట్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపిన తరువాత, ఫిబ్రవరి 27న పొరపాటున చేసిన క్షిపణి దాడిలో ఐఏఎఫ్ ఎంఐ 17 చాపర్ ఒకటి కశ్మీర్లోని బుద్గాంలో కూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, ఐఏఎఫ్ అధికారుల మధ్య సమాచార లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి ఒక గ్రూప్ కెప్టెన్, మరో వింగ్ కమాండర్ కోర్టు మార్షల్ను ఎదుర్కొంటారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇద్దరు ఎయిర్ కమాండర్లు, ఇద్దరు ఫ్లైట్ లెఫ్ట్నెంట్లపైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వెల్లడించాయి. -
ఎయిర్ఫోర్స్ డే వేడుకలు
-
వాయుసేనకు శుభకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
-
అభినందన్ మనోధైర్యానికి మరో గుర్తింపు
న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత, ప్రతీకార ధోరణిలో పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న భారత్పై వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కుప్పకూల్చడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ టీమ్ మొత్తానికి 51వ స్క్వాడ్రన్కు యూనిట్ సైటేషన్ అవార్డు దక్కింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అక్టోబర్ 8న జరిగే ఎయిర్ఫోర్స్ డే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా అవార్డును అందించనున్నారు. పాక్ విమానాల సమాచారాన్ని ముందుగానే గ్రహించి భారత వాయుసేన బృందాన్ని అప్రమత్తం చేసిన మింటీ అగర్వాల్ నాయకత్వంలోని 601 సిగ్నల్ యూనిట్కి కూడా ఈ అవార్డు అందించనున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు అతనిపై దేశరహస్యాల కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అభినందన్ వాటిని బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ, ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని కూడా అందజేశారు. -
విధుల్లో చేరిన వింగ్ కమాండర్ అభినందన్
-
ఉద్యోగమూ లేదు..డబ్బులు రావు
సాక్షి, శ్రీకాకుళం : ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు వేయిస్తానని నమ్మించి ఐదుగురు నిరుద్యోగుల నుంచి రూ.9.38 లక్షలు వసూలు చేసిన ఉదంతం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో సంచలనంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేట గ్రామానికి చెందిన కీలు సందీప్ తన తల్లిదండ్రులతో కలిసి ఎయిర్ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి నగదు కాజేశాడు. తల్లిదండ్రులు పరారవుతూ సోమవారం కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. సందీప్ పరారీలో ఉన్నాడు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో చదవుతున్నప్పుడు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకునిగా ప్రచారం చేసుకుని విద్యార్థులతో పరిచయాలు పెంచుకున్నాడు. అందరి ఫోన్ నంబర్లు సంపాదించాడు. ఎయిర్ఫోర్స్కు దరఖాస్తులు చేసి వాటి హాల్టిక్కెట్ను చూపించి త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించాడు. హాల్టిక్కెట్ను కాస్త ఉద్యోగం వచ్చినట్లు తర్జుమా చేసి యువకులను మోసగించాడు. ఖరీదైన కారును అద్దెకు తీసుకుని దానిలో యువకులను తిప్పుతూ ఉద్యోగం వచ్చిందని అందరికీ పార్టీలు ఇచ్చి సందడి చేశాడు. వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించడంతో (డమ్మీ హాల్టిక్కెటు చూపించి) కాశీబుగ్గకు చెందిన పసార మహేష్బాబు రూ.1.47లక్షలు, పలాస శివాజీనగర్కు చెందిన బమ్మిడి కుమార్ రూ.3.50లక్షలు, మెళియాపుట్టి మండలం పరుశురాంపురం(మురికింటిపద్ర) గ్రామానికి చెందినటువంటి ఉప్పాడ మహేష్ వద్ద రూ.2లక్షలు, వీరితోపాటుగా సాహు రూ.3లక్షలు, లక్ష్మణ్ పాసర రూ.1లక్షా 47వేలు సందీప్ తల్లిదండ్రులు కీలు ధనలక్ష్మి, గోపాలరావు ఖాతాల్లో వేశారు. ఉద్యోగమూ లేదు..డబ్బులు లేవు.. డబ్బులు ఇచ్చి ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు రాలేదు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సందీప్ను బాధితులు అడిగారు. అదుగోఇదుగో అంటూ చెప్పి తప్పించుకున్నాడు. తీరా సెల్ఫోన్ స్వీచ్ఆఫ్ రావడంతో సందీప్ను, తల్లిదండ్రులను నిరుద్యోగులంతా వెతకడం ప్రారంభించారు. సందీప్ స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేటకు వెళ్లగా అక్కడ ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 16వ వార్డులోని మహేశ్వరమ్మ దేవాలయం వెనుకభాగంలో ఉన్న రోడ్డులో అద్దె ఇంట్లో రహస్యంగా నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అక్కడకి వెళ్లగా ఆ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం తేరపల్లి గ్రామంలో బంధువులు ఇంటి వద్ద ఉన్నారని తెలుసుకుని తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. వీరిపై సందీప్ తల్లిదండ్రులు దాడి చేశారు. మళ్లీ కాశీబుగ్గలోని అద్దెంటికి సందీప్ తల్లిదండ్రులు వచ్చారని బాధితులు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అక్కడ నుంచి పరారయ్యేందుకు సందీప్ తల్లిదండ్రులు ప్రయత్నించారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి నుంచి పరారవుతున్న సందీప్ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగించారు. విజయనగరం జిల్లా ఎస్కోటలో విజయ అనే యువతి వద్ద రూ.4లక్షలు తీసుకున్నట్లు ఎస్కోట పోలీస్ స్టేషన్లో కేసు సైతం నమోదైనట్లు సమాచారం. బాధితులు సోమవారం కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించి సీఐ వేణుగోపాలరావు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అనేకమందిని మోసగించిన సోమ్ముతో సొంత గ్రామంలో ఇంటిని అందంగా నిర్మించుకున్నాని బాధితులు సీఐకు తెలియజేశారు. -
డిఫెన్స్ డీలర్పై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ : డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారిపై కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ 'పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుమారు రూ.339 కోట్ల మేర లంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలపై బండారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. శుక్రవారం ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన సోదాల్లో ఆయన ఇంట్లో లభ్యమైన విలువైన ఆస్తులన్ని ముడుపుల రూపంలో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్లో ఉన్న సంజయ్ బండారికి చెందిన ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక రాబర్ట్ వ్యాపారవేత్త, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంజయ్ బినామీ అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. లండన్లో ఉన్న వాద్రా ఇంటికి బండారి బినామిగా ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా సంజయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. సంజయ్తో పాటు కొంతమంది వైమానిక దళ, రక్షణ అధికారులకు కూడా ఈ ముడుపులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్లను ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణనిస్తారు. స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్టీపీ - 32 విమానాల్లో తరచుగా వైఫల్యాలు తలెత్తడంతో పిలాటస్ పీసీ- 7 ఎంకే - II ను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా యూపీఏ-2 నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2012లో 75 శిక్షణ విమానాల కోసం రూ. 2,896 కోట్లతో పిలాటస్తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. -
సంగ్రామంలో సగం
ఆడపిల్ల నిచ్చెన ఎక్కబోతేనే నివారించే సమాజం ఆమె ఆకాశంలో ఎగురుతానంటే సరే అంటుందా?ఆడపిల్ల తుపాకీ బొమ్మ పట్టుకుంటేనే వద్దనే సమాజం ఆమె యుద్ధ క్షేత్రంలో అడుగు పెడతానంటే సరే అంటుందా?ఆడపిల్ల గట్టిగా మాట్లాడితేనే నిరోధించే సమాజం ఆమె శత్రువు మీద తుపాకీ గురిపెడతానంటే సరేనంటుందా?చదువులో సగం అంటే అతి కష్టం మీద సరే అంది సమాజం.ఉద్యోగాల్లో సగం అంటే అతి కష్టం మీద సరే అంటోంది సమాజం. కాని సంగ్రామంలో సగం అంటే మాత్రం కొంచెం కంగారు పడుతోంది.కాని గుంజన్ సక్సేనా వంటి పైలట్లు మాత్రం యుద్ధ క్షేత్రాల్లో లోహ విహంగాలు ఎగరేసి మేమూ చేయగలం అని నిరూపించారు.ఆమె స్ఫూర్తితో జాన్వీ కపూర్ నటిస్తున్న సినిమా ‘కార్గిల్ గర్ల్’ ఇప్పుడు సెట్స్ మీద ఉంది. నేడు జాన్వి పుట్టినరోజు.గుంజన్ సక్సేనా, జాన్వి.. లాంటి ఈ తరం ప్రతినిధుల స్ఫూర్తి కొనసాగుతూ ఉంటుంది. యుద్ధంలో విమానాలు, హెలికాప్టర్లు ఎంత ముఖ్యమో వాటిని నడిపే పైలట్లు కూడా అంతే ముఖ్యం.పైలట్లు లేని విమానాలు ఒట్టి ఆటబొమ్మలు.ఈ ప్రపంచంలో మగవారిది పైచేయిగా ఉన్నట్టే త్రివిధ దళాలలో కూడా మగవారిదే పైచేయి. ముఖ్యంగా ఎయిర్ఫోర్స్లో స్త్రీలు ‘ఫైటర్ పైలట్’లుగా ఉండటానికి నిన్న మొన్నటి వరకూ అనుమతి లేదు.అటువంటి దశలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొదటిసారి ‘ఫిమేల్ ట్రైనీ పైలట్స్’ను భర్తీ చేయ తలపెట్టింది. ఢిల్లీలో చదువుకుంటున్న గుంజన్ సక్సేనా ఏ మాత్రం ఆలోచించకుండా ఆ అవకాశాన్ని దక్కించుకోవాలనుకుంది. ఎందుకంటే అప్పటికే ఆమె తల్లి, తండ్రి సైన్యంలో పని చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సైనిక వాతావరణం ఆమెను ఫైటర్ పైలట్ కమ్మని ప్రోత్సహించింది. అయితే ట్రైనింగ్ సమయంలో, ఆమె ‘ఫ్లయిట్ ఆఫీసర్‘ అయినప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఏదోలే ఉన్నారులే అనే ధోరణినే మహిళా ఫైటర్ పైలట్ల పట్ల వ్యక్తపరిచేవారు. ఎందుకంటే వొత్తిడి సమయంలో ఆకాశంలో లోహ మరను కంట్రోల్ చేయడం స్త్రీలకు సాధ్యమవుతుందా అని సందేహం. గుంజన్ సక్సేనాకు ఇది కొంచెం నిరుత్సాహం కలిగించేది. తనను తాను నిరూపించే అవకాశం రావాలని పట్టుదలగా ఉండేది. ఆమె ఎదురుచూపుకు తగినట్టే వచ్చిన అవకాశం 1999 కార్గిల్ యుద్ధం. చీటా హెలికాప్టర్లో.. కార్గిల్ యుద్ధం మొదలైంది. ఎయిర్ ఫోర్స్ అందులో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశ పహారాలో మగ ఫైటర్ పైలట్లు ఉన్నారు. కాని యుద్ధంలో క్షతగాత్రులను తరలించడానికి, ముఖ్యమైన సామాగ్రి తరలించడానికి పైలట్లు కావాల్సి వచ్చింది. అప్పుడు అవకాశం గుంజన్ సక్సేనాకు దక్కింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ దగ్గర ఉన్న చీటా హెలికాప్టర్ను గుంజన్కు ఇచ్చి కార్గిల్ ఎయిర్స్ట్రిప్కు వెళ్లి తిరిగి బేస్ క్యాంప్కు వచ్చే పని అప్పజెప్పారు. ఈ పని చేయడం అంటే శత్రువు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి రావడమే. అయినప్పటికీ గుంజన్ భయపడలేదు. ధైర్యంగా అనేకసార్లు కార్గిల్ వార్లో అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. ఆమెకు తెలుసు.. ఏ క్షణాన్నైనా ఈ హెలికాప్టర్ను శత్రువు కూల్చవచ్చని. అందుకని తన దగ్గర ఒక అసాల్ట్ రైఫిల్, ఒక రివాల్వర్ పెట్టుకుని ఆకాశంలో ఎగిరేది. ఎందరో క్షతగాత్రులను ఆమె బేస్ క్యాంప్కు తెచ్చి ప్రాణాలు కాపాడింది. ఒకసారి కార్గిల్ స్ట్రిప్ మీద ఆమె హెలికాప్టర్ టేకాఫ్ అవుతూ ఉండగా ఆమెను లక్ష్యం చేసి పేల్చిన రాకెట్ లాంచర్ కొంచెంలో తప్పి పక్కన ఉన్న కొండ చరియకు తాకింది. అయినప్పటికీ చెక్కు చెదరక గుంజన్ విధులు నిర్వర్తించింది. ఈ ధైర్యం, తెగువ వృధా పోలేదు. యుద్ధం ముగిసి మనం గెలిచాక ఆమెకు ‘కార్గిల్ గర్ల్’ అని పాపులర్ బిరుదు వచ్చింది. ప్రభుత్వం ‘శౌర్య చక్ర’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఇప్పుడు ఆ కథ సినిమాగా రాబోతుంది. జాన్వియే సరైన ఎంపిక... గుంజన్ యుద్ధ క్షేత్రంలో తెగువ ప్రదర్శించి ఉండొచ్చు. కాని జాన్వి నిజజీవితంలో తెగువ ప్రదర్శించింది. ఆమె తల్లి నటి శ్రీదేవి మరణించి మొన్నటి ఫిబ్రవరికి ఒక సంవత్సరం. తల్లి ఎన్నో కలలు కనగా తాను నటించిన తొలి సినిమా ‘ధడక్’ రిలీజ్ను చూడకనే ఆమె మరణించడం జాన్వికి తీరని లోటు. ఇంకా పూర్తిగా జీవితంలో స్థిరపడక మునుపే తల్లి లేని పిల్ల కావడం చాలా పెద్ద దెబ్బ. అయినప్పటికీ నిబ్బరంగా ఆమె ‘ధడక్’ పూర్తి చేసింది. రిలీజయ్యాక జాన్వి ఒట్టి అందాల బొమ్మ కాదని, తల్లికి మల్లే మంచి నటి అని జనం గ్రహించారు. మెచ్చుకున్నారు. అందుకే జాన్వికి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ‘కార్గిల్ గర్ల్’లో గుంజన్ సక్సేనా పాత్రను పోషించే అవకాశం రావడం చాలా మంచి విషయం. ఈ సినిమా కాకుండా కరణ్ జోహర్ తీస్తున్న మల్టీస్టారర్ ‘తఖ్త్’లో జాన్వి ఒక పాత్ర పోషి స్తోంది. కరీనా కపూర్, అనిల్ కపూర్, ఆలియా భట్ ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇది కాకుండా రాజ్కుమార్ రావ్కు ఒక సినిమాలో జోడీ కట్టనుంది. పిత్రోత్సాహం తండ్రి కూతురిని చూసి పొంగిపోతే ‘పుత్రికోత్సాహం’. కూతురు తండ్రిని చూసి పొంగిపోతే ‘పిత్రోత్సాహం’. జాన్వి ప్రస్తుతం పిత్రోత్సాహంలో ఉంది. ఎందుకంటే హిందీలో హిట్ అయిన ‘పింక్’ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలనేది శ్రీదేవి కోరిక. అందుకే తాను దక్షిణాదిలో మొదటిసారి నిర్మాతగా ‘పింక్’ను ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేయనున్నారు బోనీ కపూర్. హిందీలో అమితాబ్ చేసిన పాత్రను తమిళంలో అజిత్ చేయడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యింది. దానిని చూసిన జాన్వి ‘నాన్న తొలి తమిళ సినిమా. కాన్ట్ వెయిట్’ అని ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించింది. కూడుతున్న కుటుంబం జాన్వి తల్లి లేని లోటు నుంచి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోందనే చెప్పవచ్చు. చెల్లెలు ఖుషీ కపూర్తో, సవతి సోదరుడు అర్జున్ కపూర్తో, సవతి సోదరి అన్షులా కపూర్తో ప్రేమానుబంధాలు బలపడ్డాయి. ఇంకా అనిల్ కపూర్ సంతానం సోనమ్ కపూర్, రియా కపూర్ కూడా ఆమెకు బాసటగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా మగవారిదే పైచేయి. వారితో సమానంగా నిలిచే సంగ్రామంలో జాన్వి విజయవంతం అవుతుందని ఆశిద్దాం. -
క్రాస్బౌ–18 విజయవంతం
విశాఖ సిటీ: క్రాస్బౌ–2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 3 నుంచి క్రాస్ బౌ విన్యాసాలు మొదలయ్యాయి. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి బీరేందర్ సింగ్ ధనోవా, సదరన్ ఎయిర్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయిర్ మార్షన్ బి.సురేష్ పాల్గొన్నారు. ఉపరితలంపై నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా–ఎక్–ఎం, ఐజీఎల్ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా విన్యాసాల్లో పరీక్షించారు. భూ ఉపరితలం నుంచి గాలిలో ఉన్న శత్రు లక్ష్యాల్ని ఛేదించే ప్రయోగం విజయవంతమయ్యింది. రాత్రి సమయంలో ప్రత్యక్ష ఫైరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్.యూ–30 ఫైటర్ జెట్ ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ సామర్థ్యాలను పరీక్షించారు. -
వాయుసేన వార్షికోత్సవం @ 86 సందడి
-
రాఫెల్ డీల్ భారత్కు లాభదాయకం
న్యూఢిల్లీ: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న వేళ వాయుసేన(ఐఏఎఫ్) అధిపతి బీఎస్ ధనోవా ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఫ్రాన్స్తో 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం భారత్కు చాలా లాభదాయకమన్నారు. రాఫెల్ కొనుగోలుతో ఉపఖండంలో బలాబలాలు, సమీకరణాలు మారిపోతాయని ధనోవా అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత వాయుసేనలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతున్న వేళ అత్యవసరంగా 36 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తన భారతీయ భాగస్వామి రిలయన్స్ డిఫెన్స్ను ఫ్రెంచ్ కంపెనీ డసో ఏవియేషన్ స్వచ్ఛందంగా ఎంచుకుంది. దీంట్లో కేంద్రం లేదా ఐఏఎఫ్ జోక్యం ఎంతమాత్రం లేదు. ఈ వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఎస్–400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి. ఎస్–400కు తోడు రాఫెల్ ఫైటర్ జెట్లతో భారత గగనతలం శత్రు దుర్భేద్యం అవుతుంది. సుఖోయ్–30, సుఖోయ్–25 యుద్ధవిమానాల అందజేతలో మూడేళ్లు, జాగ్వార్ అందజేతలో ఆరేళ్లు హాల్ వెనుకపడి ఉందని ధనోవా పేర్కొన్నారు. -
‘రాఫెల్’ను నడిపిన ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది. -
ఎగిరిపోనూవచ్చు..!
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలో ఎయిర్ఫోర్సు శిక్షణ కేంద్రం ఏర్పాటుపై ఎన్నో సంవత్సరాలు ఆదిలాబాద్ ప్రజలు కన్న కలలు ఫలించకపోయినా.. ఎట్టకేలకు మినీ ఏరోడ్రామ్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మరోసారి ఆశలు చిగురించాయి. జిల్లా కేంద్రంలో 362 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విమానాశ్రయ మైదానాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మినీ ఏరోడ్రామ్ ఏర్పాట్లు త్వరగా ప్రారంభిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఎయిర్ఫోర్సు ఏర్పాటు చేసేందుకు 2014లో ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కోరింది. కానీ నాలుగేళ్ల నుంచి దీని ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా కేసీఆర్ ఎయిర్ఫోర్సు సాధ్యం కాదని.. ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో రానున్న రోజుల్లో విమానం ఎక్కుతామనే ఆశలు ప్రజల్లో చిగురించాయి. అభివృద్ధికి ఊతం.. ఏరోస్ట్రిప్ ఏర్పాటు ద్వారా చిన్న విమానాల రాకపోకలు సాగిస్తాయి. డొమెస్ట్రిక్ ఫ్లయిట్లు ఇక్కడ ల్యాండింగ్ అవుతాయి. దీనిద్వారా ఆదిలాబాద్ పట్టణంలో మార్కెట్ పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించిన అనుమతి తీసుకున్న తర్వాతే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వయంగా కేసీఆర్ దీనిపై ప్రకటన చేయడంతో కేంద్రాన్ని ఒప్పిస్తారని జిల్లా మంత్రులు చెబుతున్నారు. విమానాశ్రయ మైదానానికి 362 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ ఎయిర్ఫోర్సు ఏర్పాటుకు మరికొంత స్థలం కోసం 2015లోనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని గుర్తించారు. దీనికి చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి కలిపి 1652.25 ఎకరాలు గుర్తించారు. మొత్తం 1924.25 ఎకరాల స్థలం శిక్షణ కేంద్రం కోసమని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనలు ఇంతవరకు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ఫోర్సుకు సంబంధించిన 362 ఎకరాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటనతో ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోనుంది. ఏరోస్ట్రిప్తో అభివృద్ధి ఆదిలాబాద్ పట్టణంలోని విమానాశ్రయ మైదానంలో ఏరోస్ట్రిప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుంది. ఎయిర్ఫోర్సు కేంద్రం పరిధిలో ఉంటుంది, ఏరోస్ట్రిప్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు సాగుతాయి. ఏరోస్ట్రిప్ ఏర్పాటుతో ఇక్కడ అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆదిలాబాద్ ప్రజల కల నెరవేరనుంది. – జోగు రామన్న, రాష్ట్ర మంత్రి -
‘మా జోలికొస్తే.. ఎవరినీ వదిలిపెట్టం’
జెరూసలేం : ఇరాన్ దుందుడుకు చర్యలకు దిగితే.. ప్రతిఘటించేందుకు ఇజ్రాయల్ సిద్ధంగానే ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ కలిగిన దేశాల్లో ఇజ్రాయిల్ ఒకటి ఆయన చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రాంతాన్ని అయినా.. ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేధించగల సత్తా ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్కు ఉందని ఆయన ఇరాన్ను పరోక్షంగా హెచ్చరించారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, శక్తివంతమైన ఎయిర్క్రాఫ్టులు, దాడులు చేయడం, స్వీయరక్షనలో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్కు తిరుగులేని సామర్థ్యమందున్న విషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాలని ఆయన అన్నారు. ఇరాన్ సాయుధ దళాలు సిరియాలోని ఇజ్రాయీలీలపై దాడులుకు దిగితే.. పరిస్థితులు తీవ్రంగా మారతాయన్నారు. గతంలో కూడా సిరియాలో ఇరాన్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది.. ఇటువంటి ప్రయత్నాలను ఇజ్రాయిల్ ఏ మాత్రం అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. గాజాలోని స్థానిక ప్రజలు శాంతియుత జీవనానికి ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అయితే బయటి శక్తులు.. గాజా శాంతియుత జీవనంపై ప్రభావం చూపితే.. ఇజ్రాయిల్ సైనికచర్యతోనే సమాధానం చెబుతుందని నెతన్యాహూ పేర్కొన్నారు. -
వాయుసేన అమ్ములపొదిలోకి కొత్త అస్త్రం!
-
చరిత్ర సృష్టించిన బ్రహ్మోస్
న్యూఢిల్లీ: వాయు సేనలో సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను ప్రవేశపెట్టేందుకు గొప్ప ముందడుగు పడింది. ఇది వరకే భూ ఉపరితలం, సముద్రం నుంచి పరీక్షించిన ఈ క్షిపణిని బుధవారం యుద్ధ విమానం సుఖోయ్–30 నుంచి తొలిసారి విజయవంతంగా ప్రయోగించారు. దీంతో బ్రహ్మోస్ త్రివిధ దళాల్లో పనిచేసేందుకు తన సమర్థతను చాటుకున్నట్లయింది. ఈ పరిణామంపై రక్షణ శాఖ, ఐఏఎఫ్ హర్షం వ్యక్తం చేశాయి. పరీక్ష జరిగిన తీరును రక్షణ శాఖ వివరిస్తూ...గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని సుఖోయ్–30 నుంచి బ్రహ్మోస్ను ప్రయోగించగా, క్షిపణి ఇంజిన్ రెండు దశల్లో మండి నేరుగా లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. సుఖోయ్లో బ్రహ్మోస్ను అమర్చడం సవాలుతో కూడుకున్న పని అని ఐఏఎఫ్ వెల్లడించింది. ఇందుకోసం సుఖోయ్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ పరంగా పలు మార్పులు చేశామని పేర్కొంది. వాయుసేనకు అమూల్యం.... తాజాగా బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని బ్రహ్మోస్ ఛేదించడం... ఆకాశం నుంచి ఆ క్షిపణిని ప్రయోగించే వాయుసేన సామర్థ్యాన్ని తేటతెల్లం చేస్తోందని రక్షణ శాఖ పేర్కొంది. ఈ తరగతికి చెందిన క్షిపణిని ప్రయోగించిన తొలి వాయుసేన తమదేనని ఐఏఎఫ్ ప్రకటించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో సముద్రం లేదా నేలపై ఉన్న సుదూర లక్ష్యాలను చాలా కచ్చితత్వంతో ఛేదించేందుకు బ్రహ్మోస్ తమకు ఎంతో దోహదపడుతుందని తెలిపింది. బ్రహ్మోస్, సుఖోయ్–30ల కాంబినేషన్ వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూర్చుతుందని పేర్కొంది. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ చరిత్ర సృష్టించింది. తొలిసారి సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయాణించి బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది’ అని రక్షణ శాఖ ప్రకటన జారీచేసింది. చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని హర్షం... సుఖోయ్ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని ట్వీట్ చేశారు. బ్రహ్మోస్ ప్రత్యేకతలు... ► 290 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వనివేగం కంటే మూడురెట్ల అధిక వేగంతో కచ్చితంగా ఛేదించగలదు. ► ఆర్మీ, నౌకాదళం ఉపయోగించే బ్రహ్మోస్ క్షిపణి బరువు 3 టన్నులు కాగా, వాయుసేన ప్రయోగించే క్షిపణి మాత్రం 2.5 టన్నులే ఉంటుంది. అయినా సుఖోయ్–30 యుద్ధ విమానం మోసే అత్యధిక బరువున్న క్షిపణి ఇదే. ► సుఖోయ్ యుద్ధవిమానం ఒకసారికి ఒక క్షిపణినే తీసుకెళ్లగలదు. ► బ్రహ్మోస్ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి యుద్ధనౌకలు క్షిపణులను ప్రయోగించేలోగానే బ్రహ్మోస్ ఆ నౌకలను ధ్వంసం చేస్తుంది. ► క్షిపణిని ప్రయోగించిన వెంటనే సుఖోయ్ విమానం తిరుగు ప్రయాణమవుతుంది. ► ప్రస్తుతం ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ బ్రహ్మోస్ వేగాన్ని అధిగమించగల క్షిపణులు లేవు. ► ప్రస్తుతం 290 కిలో మీటర్లుగా ఉన్న లక్షిత దూరాన్ని 450 కిలోమీటర్లకు పెంచేందుకు బ్రహ్మోస్ క్షిపణుల రూపురేఖలు, సాంకేతికతలో మార్పులు చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు. ► క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లోకి భారత్ ప్రవేశంతో ఈ క్షిపణుల పరిధిని పెంచడం సులువు కానుంది. ► మరో 40 సుఖోయ్–30 యుద్ధ విమానాలు బ్రహ్మోస్ను మోసుకెళ్లగలిగేలా వాటికి అవసరమైన మార్పులు చేయడంతోపాటు ఇంకో 272 విమానాలు సమకూర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారత్కు బ్రహ్మస్త్రమే భూమిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన...ఇలా త్రివిధ దళాల్లో ఎవరైనా, ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువుగా ఉండే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ అందుబాటులోకి వచ్చింది. మూడు చోట్ల నుంచి ప్రయోగానికి అనువుగా ఉండేలా హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ క్షిపణిలో మార్పులు చేసింది. రష్యాకు చెందిన పీ–700 ఒనిక్ సూపర్సోనిక్ క్షిపణి ఆధారంగా మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)–రష్యా ఎన్పీఓఎంలు సంయుక్తంగా బ్రహ్మోస్ను అభివృద్ధిచేశాయి. భారత్ లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కో నదుల పేర్లను కలిపి ఈ క్షిపణికి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తక్కువ వ్యవధిలోనే యుద్ధానికి సిద్ధం
హిండోన్(యూపీ): యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఆదేశాలు అందిన అతి తక్కువ వ్యవధిలోనే సమరానికి తాము సిద్ధంగా ఉంటామని వాయుసేన అధిపతి ఎయిర్చీఫ్ మార్షల్ బీరేంద్ర సింగ్ ధనోవా ఆదివారం వెల్లడించారు. వాయుసేన 85వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని హిండోన్లో ఉన్న వైమానిక స్థావరాన్ని ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్తో కలసి సందర్శించారు. దేశానికి భద్రత పరంగా ఎదురయ్యే ఏ సవాల్నైనా ఎదుర్కొని దీటుగా సమాధానమిచ్చేందుకు వాయుసేన సంసిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక–రాజకీయ వాతావరణం చూస్తోంటే స్వల్పకాలిక యుద్ధం రావొచ్చని తనకు అనిపిస్తోందని ధనోవా వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో డోక్లాంలో చైనా దుందుడుకుగా వ్యవహరించడం, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ధనోవా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో శుక్రవారం వాయుసేనకు చెందిన ఎంఐ–17 హెలికాప్టర్ కూలిపోయి ఏడుగురు సిబ్బంది మరణించడం తెలిసిందే. ఈ ప్రమాదానికి హెలికాప్టర్ వెనుకభాగంలో ఉండే ఫ్యాన్ తొలగిపోవడమే కారణమని భావిస్తున్నట్లు ధనోవా వెల్లడించారు. హెలికాప్టర్ ఇంజిన్ బాగా పనిచేస్తోందనీ, వెనుక ఫ్యాన్ హెలికాప్టర్ నుంచి విడిపోయిందని ఆయన పేర్కొన్నారు. -
కుప్పకూలిన శిక్షణ విమానం
కీసర: ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిన సంఘటన గురు వారం మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. హకీంపేట లోని రక్షణశాఖ వైమా నిక శిక్షణ కేంద్రం నుంచి కిరణ్ ఎంకే–2 శిక్షణ విమానం మధ్యాహ్నం 12 గంటల సమయం లో బయలుదేరింది. అయితే కొద్ది సేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ అమన్పాండే ఆ విషయాన్ని గుర్తించి వెంటనే పారాచూట్ సాయంతో కిందకు దూకేశారు. అనంతరం కొద్ది సెకన్లలోనే ఆ విమానం శ్రీ లక్ష్మీ క్రషర్ మిషన్ సమీపంలో కుప్పకూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందు కున్న వెంట నే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే విమానం చాలావరకు దగ్ధమైంది. మరోవైపు విమానం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రం అధికారులు హుటాహుటిన 2 హెలికాప్టర్లలో అక్కడకు చేరుకున్నారు. ప్రమా దంలో స్వల్పగాయాలతో బయట పడ్డ పైలట్ ను ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించా రు. కీసర ఆర్డీఓ హనుమంతరెడ్డి, తహసీల్దార్ ఉపేందర్రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని సంద ర్శించి వివరాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ. రెడ్డికి తెలియజేశారు. విమానం కుప్పకూలిన ప్రదే శానికి సమీపంలోనే క్రషర్ మిషన్ కార్మికుల ఆవాసాలున్నాయి. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్రషర్ యజమాని వెల్లడించారు. -
గేదె ఢీకొని ‘ఎయిర్ఫోర్స్’ కుమారుడి దుర్మరణం
కోదాడరూరల్ : గేదె ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల పరిధి మొగలాయికోటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎయిర్ఫోర్స్ వెంకటర్రెడ్డి కుమారుడు, స్థానిక రేషన్డీలర్ సింగారెడ్డి జితేందర్రెడ్డి(41) రాత్రి బుల్లెట్పై కోదాడకు వస్తుండగా గ్రామశివారులో గేదెను ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆటోలు కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోని ఖానాపురం వద్ద మృతిచెందాడు. మృతదేహాన్ని బుధవారం కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రెడ్డి కుటుంబంలో విషాదం ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వెంకట్రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ యన కు ఇద్దరు కుమారులు,కుమార్తె. 25ఏళ్ల క్రితం ఓ కుమారు డు కేన్సర్తో, ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో మరో కు మారుడు మృతిచెందడంతో విషాదం అలుముకుంది. -
ఆ విమానం కూలిపోయింది
గువాహటి: నాలుగు రోజుల క్రితమైన అదృశ్యమైన భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం కూలిపోయినట్టు గుర్తించారు. అరుణాచల్ప్రదేశ్లోని దండకారణ్యంలో విమాన శకలాలను కనుగొన్నట్టు వైమానిక దళం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడికి చేరుకోవడం ఆలస్యమవుతుందని వెల్లడించింది. విమానంలోని ఇద్దరు పైలట్లు చనిపోయివుంటారని భావిస్తున్నారు. చైనా సరిహద్దు సమీపంలో గస్తీ నిర్వహించే ఈ విమానం అసోంలోని తేజ్పూర్కు సమీపంలో మంగళవారం ఉదయం మిస్సయింది. దీని ఆచూకీ కనిపెట్టేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రెండు ఐఏఎఫ్, ఐదు సైనిక బృందాలతో పాటు రెండు రాష్ట్రాల సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఎలెక్ట్రో పెలోడ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్హెచ్) ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో గాలించారు. తేజ్పూర్కు ఉత్తర దిక్కులో 60 కిలో మీటర్ల దూరంలో చివరిసారిగా దీని జాడలు రికార్డయ్యాయి. అననుకూల వాతావరణం కారణంగానే విమానం కూలిపోయినట్టు భావిస్తున్నారు. -
ముగిసిన ఎయిర్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
10 జిల్లాల నుంచి కేవలం 33 మందికి అర్హత కరీంనగర్ సిటీ: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిర్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ బుధవారంతో ముగిసిం ది. ఈ నెల 1న హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం కొత్త జిల్లా పరిధి నుంచి 500 మంది నిరుద్యోగ అభ్యర్థులు రాగా రాత పరీక్షతోపాటు మిగిలిన అర్హత పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురు మాత్రమే మెడికల్ పరీక్షకు అర్హత సాధించారు. బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలోని 1,200 మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు తరలివచ్చారు. అందులో అర్హత సర్టిఫికెట్లు, స్థానికత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి 900 మందిని రాత పరీక్షకు అనుమతించారు. మిగిలిన 300కి పైగా అభ్యర్థులను సర్టిఫికెట్లు లేవని వెనక్కి పంపించారు. ఇంగ్లిష్, రీజనింగ్లో నిర్వహించిన రాత పరీక్షలో కేవలం 57 మంది మాత్రమే పాసయ్యారు. ఫిజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కర్షన్లో 27 మంది క్వాలిఫైతో మెడికల్కు అర్హత సాధించారు. ఆ పరీక్షను హైదరాబాద్లో నిర్వహించిన అనంతరం అక్టోబర్లో ఆల్ ఇండియా లెవల్లో ఎయిర్ఫోర్స్ ఢిల్లీ ప్రతినిధులు మెరిట్ జాబితాను వెలువరించనున్నారు. ఎంపికైన వారికి ఖాళీలను బట్టి కాల్లెటర్లు అందించనున్నట్లు ఎయిర్ఫోర్స్కు చెందిన అధికారి తెలిపారు. -
గఘనం
► అబ్బురపరిచిన విన్యాసాలు ► రాష్ట్రపతి ప్రశంసల జల్లు ► అవార్డుల పరంపర చెన్నై లోని తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు చెందిన వైమానిక దళాలు ఆకాశంలో అద్భుతాలను సృష్టించాయి. సైనిక వీరులు వివిధ రకాల విన్యాసాలతో ఆహూతులను అబ్బురపరిచారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: భారత వైమానిక దళంలో భాగవైున తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్ సాధించిన కీర్తికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అండ్ కలర్స్ అవార్డును బహూకరించేందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం వచ్చారు. 125 హెలికాప్టర్ స్వాకడ్రన్ గ్రూపు కెప్టెన్ వీడీ బదోనీ విశిష్టసేవా మెడల్, మెకానికల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (ఎంటీఐ) గ్రూపు కెప్టెన్ ఏ అరుణాచలేశ్వరన్ ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అండ్ కలర్స్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. తాంబరం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో హెలికాప్టర్ విభాగం, మెకానికల్ తదితర ఆరు విభాగాలకు చెందిన సైనికులకు శిక్షణనిస్తారు. ప్రస్తుతం ఈ శిక్షణ కేంద్రంలో 3,500 మంది సైనికులు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 20 మంది విదేశీ సైనికులు ఉన్నారు. వైమానిక దళంలో ఉంటూ దేశానికి విశేషవైున సేవలు అందించే వారిని అవారు్డలకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పఠాన్ కోట్ విమాన స్థావరానికి చెందిన 125 హెలికాప్టర్ దళ విభాగానికి చెనై్నలో రాష్ట్రపతి అవారు్డలను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం రాత్రే చెనైకి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ రాజ్భవన్ లో బస చేశారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఎయిర్ఫోర్స్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికారు. వైమానికదళాల ఫొటో ప్రదర్శనను రాష్ట్రపతి తిలకించారు. అనంతరం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. ఆ తరువాత సైనిక వీరులు తుపాకులతో చేసిన విన్యాసాలు గుండెలను గుబిల్లుమనేలా చేశాయి. కత్తులను అమర్చిన తుపాకులను గాలో్లకి వేసి పట్టుకోవడం, కతు్తలు తిప్పుతుండగా వాటి మధ్య నుంచి ఒక సైనిక వీరుడు నడుచుకుంటూ ముందుకు రావడం చూపరులను గగుర్పాటుకు గురి చేసింది. ఆ తరువాత రెండు జతలుగా పన్నెండు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతూ ఆకర్షించాయి. జాతీయ పతాకాన్ని అలంకరించుకున్న మూడు హెలికాప్టర్లు ఆకాశంలో విహరించి ఆహూతులను అలరించాయి. చెన్నై ఎయిర్ఫోర్స్ పనితీరుపై రాష్ట్రపతి ప్రణబ్ తన ప్రసంగంలో ప్రశంసల జల్లు కురిపించారు. గవర్నర్ విద్యాసాగర్రావు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
గగనతలంలో తప్పిన పెను ప్రమాదం
-
వాయుసేన పైలెట్లకు ద్రవాహారం!
సాక్షి, బెంగళూరు: అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాల పైలట్లు ఎక్కువసేపు ఆకాశంలోనే విధులు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు వారిని నిర్జలీకరణం (డీహైడ్రేషన్ ) తదితర సమస్యలు వేధిస్తుంటాయి. వాటిని అధిగమించేందుకు వారికి ద్రవరూపంలో ఉండే ఆహారాన్ని ఇవ్వడానికి మైసూరులోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(డీఎఫ్ఆర్ఎల్) కృషి చేస్తోంది. ఇప్పటికే ద్రవరూప ఆహారాన్ని తయారు చేసిన సంస్థ.. దాన్ని పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి ఈ ఆహారం భారత వాయుసేనకు చెందిన విమానాల కాక్పీట్లలో చేరే అవకాశం ఉంది. డీఎఫ్ఆర్ఎల్ ప్రయోగాత్మకంగా తయారు చేసిన ద్రవరూప ఆహార పదార్థాలను బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా–17లో ప్రదర్శనకు ఉంచారు. ద్రవరూప ఆహారం తీసుకున్న వారికి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆకలి వేయదు. మూత్రం కూడా ఉత్పత్తి కాదు. ఈ పద్ధతిలో చపాతి, చిప్స్, వెజ్ పలావ్, దాల్ కిచిడీల వంటి 110 రకాల ఆహార పదార్థాలను ద్రవ రూపంలోకి మార్చి పైలట్లకు అందజేస్తారు. ద్రవరూపంలోకి మార్చి ప్యాకింగ్ చేశాక మూడేళ్ల పాటు ఇవి నిల్వ ఉంటాయి. పరీక్షలు తుదిదశలో ఉన్నందున సానుకూల ఫలితాలొచ్చాక, సాంకేతికతను కోరుతున్న 400 కంపెనీలకు అందించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. విపత్తుల సమయంలో సైనికులు తీసుకెళ్లే లగేజీ బరువును తగ్గించడంలో భాగంగా తినగలిగిన చెంచాలు, గరిటెలు, పళ్లేలను డీఎఫ్ఆర్ఎల్ తయారు చేసింది. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి వీటిని రూపొందించింది. ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన రక్షణ మంత్రి పరీకర్ వైమానిక రంగ నిపుణులకు ఈ తినే ప్లేట్లలోనే ఆహారాన్ని వడ్డించారు. -
త్రివిధ దళాల వల్లే దేశంలో ప్రశాంతత
ముఖ్యమంత్రి చంద్రబాబు ముగిసిన నౌకాదళ విన్యాసాలు భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశ రక్షణలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాత్ర కీలకమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు సైనికులతో తలపడి విజయం సాధించడం వల్లే ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా విజయవాడ పున్నమి ఘాట్లో మూడు రోజులపాటు నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు శనివారం ముగిశాయి. దాదాపు గంటన్నర సేపు జరిగిన విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. భవిష్యత్లో ఇండియన్ నేవీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందన్నారు. ఈస్ట్రన్ నావెల్ వైస్ అడ్మిరల్ బిస్త్ మాట్లాడుతూ నౌకాదళంపై యువతకు ఆసక్తి కలిగేలా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కు మంచి స్పందన లభించిందని తెలిపారు. -
కొందరి చేతికే ఎలా?
కొత్తనోట్లపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ► రూ.24వేల విత్డ్రాయల్పై నోటిఫికేషన్ కు కట్టుబడి ఉండాలని సూచన ► డీసీసీబీలపై రెండ్రోజుల్లో నిర్ణయమన్న అటార్నీ జనరల్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లరద్దు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో కొత్తనోట్లు పట్టుబడటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు అందుబాటులో నోట్లు లేక ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కడుతుంటే.. దేశవ్యాప్తంగా సోదాలు, దాడుల్లో వందల కోట్ల విలువైన కొత్తనోట్లు బయటపడటంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘కొత్త కరెన్సీ కొందరికి మాత్రమే పెద్ద సంఖ్యలో దొరుకుతోంది. ఎలా కొందరు ఇంత పెద్దమొత్తాన్ని సంపాదిస్తున్నారు?’అని కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం సీజేఐ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే.. ‘కొందరు బ్యాంకు ఉద్యోగులు మోసపూరితంగా డబ్బులను బయటకు తరలించినట్లు తెలియటంతో వారిని అరెస్టు చేశారు. లెక్క తేలని ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి’అని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. కాగా, వారానికి రూ. 24వేల విత్డ్రాయల్ పరిమితికి కేంద్రం కట్టుబడి ఉండాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘పాతనోట్లను డిపాజిట్ చేస్తున్న వారికి మీరు డబ్బులివ్వాలి. కానీ అది జరగటం లేదు. మీ దగ్గర డబ్బులేదనే విషయాన్ని మేం అర్థం చేసుకున్నాం. ఎప్పటిలోగా ప్రజలు చేసుకున్న డిపాజిట్లకు సరైన మొత్తాన్ని చెల్లిస్తారో చెప్పండి. మీకూ కొన్ని నిబంధనలుండాలి కదా’అని ధర్మాసనం.. రోహత్గీని ప్రశ్నించింది. నోట్లరద్దు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు నోట్లరద్దు తర్వాత మూడు రోజుల పాటు రూ.8వేల కోట్లు సేకరించినా.. తర్వాత ఈ బ్యాంకుల ద్వారా డబ్బులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వలేద’ని వాదించారు. దీనికి రోహత్గీ స్పందిస్తూ.. ‘సహకార బ్యాంకుల ద్వారా కొత్త నోట్ల పంపిణీపై రెండ్రోజుల్లో తాజా నోటిఫికేషన్ ఇస్తాం’అని తెలిపారు. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రానందునే సహకార బ్యాంకులకు కొత్తనోట్ల పంపిణీ అవకాశం ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కొత్త కరెన్సీలో రూ.5లక్షల కోట్ల వరకు చెలామణిలోకి వచ్చిందని.. దీంతోపాటు రూ. 2.5లక్షల కోట్ల కరెన్సీ రూ.100, రూ.50 నోట్ల రూపంలో మార్కెట్లో ఉందని కోర్టుకు విన్నవించారు. నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో వేస్తున్న పిటిషన్లను విచారించవద్దని రోహత్గీ కోరగా.. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఆదేశాలిస్తామని ధర్మాసనం వెల్లడించింది. గడ్డం క్రమశిక్షణకు అడ్డమే! వాయుసేన ఉద్యోగి పిటిషన్ పై సుప్రీం కీలక తీర్పు న్యూఢిల్లీ: వాయుసేనలో పనిచేసే వ్యక్తులు మత సంబంధ కారణాలతో క్రమశిక్షణను ఉల్లంఘించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. వాయుసేన (ఐఏఎఫ్) ఉద్యోగి అన్సారీ పొడవైన గడ్డంతో విధులకు హాజరవుతుండటాన్ని తప్పుపడుతూ ఐఏఎఫ్ 2003లో అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై అన్సారీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిక్కులు తలపాగా ధరిస్తారని, వారిలాగే తనకూ మతపరమైన సమానత్వం కల్పించాలని కోరారు. సాయుధ దళాల నిబంధనలు క్రమశిక్షణను, ఏకరూపతను పాటించేలా చేయడానికి ఉద్దేశించినవంటూ ఐఏఎఫ్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆ ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది. -
చైనా కొత్త యుద్ధ విమానం గుట్టు రట్టు!
-
డ్రగ్స్ కేసులో ఎయిర్ఫోర్స్ కమాండర్ అరెస్టు
14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల ముఠాకు సహకరించిన ఎయిర్ఫోర్స్ అధికారి జి.రాజశేఖర్రెడ్డిని నార్కొటిక్ బ్యూరో అధికారులు బుధవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మూతపడిన పరిశ్రమల్లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను మంగళవారం నార్కొటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలో ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్రెడ్డి డ్రగ్స్ ముఠాకు సహకరించినట్లు విచారణలో తేలడంతో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.10 లక్షలు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. డబ్బుకు ఆశపడి ముఠాకు సహకరిం చానని రాజశేఖర్ ఒప్పుకున్నట్లు కోర్టులో రిపోర్టు దాఖలు చేశారు. చిన్ననాటి స్నేహితుడు శాస్త్రవేత్త వెంకటరామారావు వల్లే డ్రగ్స్ రవాణాకు సహకరించానన్నారు. రాజశేఖర్కు హైదరాబాద్తో పాటు పలుచోట్ల స్థిరాస్తులున్నట్లు నార్కొటిక్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు ముఠాసభ్యులను బెంగళూరులో అరెస్టు చేశారు.