రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Published Mon, Mar 3 2025 2:11 AM | Last Updated on Mon, Mar 3 2025 2:10 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబసభ్యులు ఐదుగురు కలసి కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. అనంతరం శనివారం రాత్రి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చారు. ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణ కాలికి గాయాలయ్యాయి. రామకృష్ణ నాయనమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబసభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. దెందులూరు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్‌న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శివాజీ తెలిపారు. డ్రైవరు నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 
1
1/4

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 
2
2/4

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 
3
3/4

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 
4
4/4

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement