మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడానికి గ్రేటర్ వరంగల్ పరిధిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోటలోని స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవస్థానం, ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయం, వరంగల్ కాశిబుగ్గలోని శ్రీకాశీవిశ్వేశ్వర శ్రీరంగనాథస్వామి తదితర ఆలయాల్లో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి
అసౌకర్యం కలుగకుండా జిల్లా యంత్రాంగం, దేవాదాయశాఖ, నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బారికేడ్లు, మంచినీటి వసతి, చలువ పందిళ్లు తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. – హన్మకొండ కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment