లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి

Apr 8 2025 11:11 AM | Updated on Apr 8 2025 11:11 AM

లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి

లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలి

కాజీపేట రూరల్‌ : రైల్వే లోకోపైలెట్ల సమస్యలు పరిష్కరించాలని రైల్వేమజ్దూర్‌ యూనియన్‌ లోకో రన్నింగ్‌ బ్రాంచ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మే రకు సోమవారం కాజీపేట రైల్వే క్రూ లాబీ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే రన్నింగ్‌ స్టాప్‌ సమస్యలపై రైల్వే బోర్డుతో చర్చలు జరిగాయన్నారు. ఇందుకు రైల్వే బోర్డు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే ఆ కమిటీ ఈ నెల 4వ తేదీ న బోర్డుకు సమర్పించిన నివేదిక రన్నింగ్‌స్టాప్‌కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఆ రిపోర్టును అమలు చేయొద్దని డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా అన్ని క్రూ లాబీల వద్ద చేస్తున్న నిరసనలో భాగంగా కాజీపేట లాబీ వద్ద కూడా నిరసన చేపట్టామని తెలిపారు. బ్రాంచ్‌ చైర్మన్‌ సంగ రమేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ సెక్రటరీ సాయికుమార్‌, రమేశ్‌, ఎన్‌.కుమారస్వామి, ఎ.కుమారస్వామి, ఎం. ప్రవీణ్‌, ధనరాజ్‌, వలీఅహ్మద్‌, ఎన్‌.శ్రీనివాస్‌, వి.ప్రసాద్‌, భరత్‌లోకోశ్‌, రమణాచారి, ఆంజనేయులు, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement